calender_icon.png 20 December, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_30334463.webp
ప్రభుత్వం మారింది కానీ.. గ్రామాల దుస్థితి మారలేదు

13-12-2025

చేర్యాల: మద్దూరు మండలంలోని గ్రామాల్లో శనివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజే శ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా జరగలేదని చిన్న మురుగు కాలువలు,మట్టి రోడ్లు వేయ కపోవడం,వీధి దీపాలు వెలగకపోవడం,చెట్లకు నీళ్లు పోయకపోవడం,ట్రాక్టర్లు పనిచేయకపోవడం,మోరీలు తీయకపోవడం వంటి సమస్యలు గ్రామాలను వెంటాడుతున్నాయని అలాగే గ్రామీణ ప్రజానీకానికి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదని కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం,పెంచుతామని చెప్పిన పింఛన్లు పెంచకపోవడం, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇవ్వకపోవడం,కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం,రైతు బంధు రూ.15 వేల వరకు పెంచుతామని చెప్పి అమలు చేయలేకపోవడం భీమా పథకాన్ని ఆపేయడం,యూరియా కొరత వడ్ల కొనుగోళ్లలో సమస్యలు రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఇలా అన్ని కారణాలతో గ్రామీణ ప్రజానీకం అల్లాడుతుంది అని అన్నారు.

article_72925776.webp
ఏయూలో ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ సైబర్‌క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన

12-12-2025

ఘట్‌కేసర్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : జిహెచ్‌ఎంసి పోచారం సర్కిల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో ఏ-బ్లాక్ సెమినార్ హాల్లో గురువారం రాచకొండ కమిషనరేట్కు చెందిన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సిఐ బి. రాజు, ఎస్‌ఐ జి. భాస్కర్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొని విద్యార్థులకు సైబర్ క్ర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, యూనిట్2 ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. చిన్న శ్రీనివాస్ రావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్ రావు, అలాగే ఎన్‌ఎస్‌ఎస్ ట్రెయినీలు సౌరభ్, నవీన్ హాజరయ్యారు.