ఏయూలో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’ సైబర్క్రైమ్పై విద్యార్థులకు అవగాహన
12-12-2025
ఘట్కేసర్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : జిహెచ్ఎంసి పోచారం సర్కిల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో ఏ-బ్లాక్ సెమినార్ హాల్లో గురువారం రాచకొండ కమిషనరేట్కు చెందిన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సిఐ బి. రాజు, ఎస్ఐ జి. భాస్కర్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొని విద్యార్థులకు సైబర్ క్ర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ సెల్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, యూనిట్2 ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. చిన్న శ్రీనివాస్ రావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్ రావు, అలాగే ఎన్ఎస్ఎస్ ట్రెయినీలు సౌరభ్, నవీన్ హాజరయ్యారు.