అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే పల్లాకు ఘనస్వాగతం..
05-06-2025
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration)లో పాల్గొని తిరిగి గురువారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అడుగు పెట్టగానే, జనగామ నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్బంగా అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ విశేష స్పందన తెచ్చుకుందన్నారు.