దెబ్బతిన్న ప్రతి పంటను సర్వే చేయాలి
04-11-2025
జనగామ, నవంబర్ 3 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకి దెబ్బతిన్న పంటలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కొడకండ్ల మండలం నర్సింగ పురం, ఏడు నూతల, పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో దెబ్బతిన్న వరి, పత్తి, టమాట పంటలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ఆదుకునేలా క్షేత్రస్థాయిలో అధికారులు పని చేయాలన్నారు.