ప్రభుత్వం మారింది కానీ.. గ్రామాల దుస్థితి మారలేదు
13-12-2025
చేర్యాల: మద్దూరు మండలంలోని గ్రామాల్లో శనివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజే శ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా జరగలేదని చిన్న మురుగు కాలువలు,మట్టి రోడ్లు వేయ కపోవడం,వీధి దీపాలు వెలగకపోవడం,చెట్లకు నీళ్లు పోయకపోవడం,ట్రాక్టర్లు పనిచేయకపోవడం,మోరీలు తీయకపోవడం వంటి సమస్యలు గ్రామాలను వెంటాడుతున్నాయని అలాగే గ్రామీణ ప్రజానీకానికి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదని కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం,పెంచుతామని చెప్పిన పింఛన్లు పెంచకపోవడం, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇవ్వకపోవడం,కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం,రైతు బంధు రూ.15 వేల వరకు పెంచుతామని చెప్పి అమలు చేయలేకపోవడం భీమా పథకాన్ని ఆపేయడం,యూరియా కొరత వడ్ల కొనుగోళ్లలో సమస్యలు రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఇలా అన్ని కారణాలతో గ్రామీణ ప్రజానీకం అల్లాడుతుంది అని అన్నారు.