calender_icon.png 28 November, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_79731015.webp
మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలి

24-11-2025

తరిగొప్పుల (విజయక్రాంతి): సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తరిగొప్పుల మండలంలో పలు తనిఖీలను నిర్వహించి, ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న చీరల పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించి.. ప్రతీ మహిళకి చీర అందాలని పంచాయతీ సెక్రటరికి కలెక్టర్ పలు సూచనలు చేసారు. అనంతరం అబ్దుల్ నాగారంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, పలు రిజిస్టర్ లను పరిశీలించారు. ఏ రోజుకి ఆ రోజు వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలని.. ఎక్కువ రోజులు కేంద్రాలలో పెట్టుకొని రైతులకు ఇబ్బంది కలగజేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

article_80474280.webp
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో మీడియా పాత్ర కీలకం

22-11-2025

జనగామ, నవంబరు 21 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి నిరుపేదకి అందించే ప్రక్రియ లో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా కి వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయి లో అవార్డులు వచ్చిన నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్న జిల్లా మీడియాకు అభినందన కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, డి పిఆర్ ఓ పల్లవి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.