calender_icon.png 17 September, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_60193807.webp
జర్నలిస్టుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తా

17-09-2025

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah)ను తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా అధ్యక్షుడు భూష రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కలవడం జరిగింది. బిర్లా ఐలయ్యకు, యూనియన్ సభ్యులు జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలు, ఉన్న ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు.

article_85765268.webp
ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా

15-09-2025

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జనగామ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో సురక్ష హాస్పిటల్, సమీపంలో నిత్యం ప్రజలు ప్రయాణించే రోడ్డు మార్గంలో, డివైడర్ వర్క్ జరుగుతున్న సమయంలో భారీ గుంత తీసి అసంపూర్తిగా పూర్తిచేసి వదిలివేయడం జరిగింది. దీనివలన జిల్లా కేంద్రంలో హైదరాబాద్ ప్రధాన రహదారి మరియు నిత్యం జనావాసాలు, తిరిగే ప్రదేశం కాబట్టి డివైడర్ చూడకుండా సడన్గా వాహనదారులు యూటర్న్ తీసుకుంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు రోడ్డు, భవనాలు రహదారుల శాఖ, మున్సిపల్ శాఖ, కనీసం పోలీస్ శాఖ అయిన ఎటువంటి హెచ్చరిక గుర్తులను ఏర్పరచలేదు, ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం, ఎందుకని వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకొని డివైడర్ వర్క్ ను ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

article_21755379.webp
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

11-09-2025

జనగామ (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జనగామ జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్ లో 8500 వేల కోట్లు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుంటుపల్లి కార్తీక్(District Convener Guntupalli Karthik) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావలసినటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు, విడుదల చేయకపోవడంతో వారు చదువులకు దూరమవుతున్నారు. పై తరగతిలకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్ కళాశాల యజమాన్యాలు ఇవ్వకపోవడంతో ఆందోళన గురవుతున్నారు. విద్యార్థులు, ఇబ్బందులు పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులను, పట్టించుకోకుండా విద్యార్థి, వ్యతిరేక విధానాలతో ముందుకుపోతుంది.