calender_icon.png 24 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_83102621.webp
కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు

11-10-2025

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభమైన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, పతక ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై వీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పల్ల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన. ఈ పథకాలు రైతులకు ఎటువంటి ఉపయోగం లేవని అన్నారు. కొత్తగా ఏ పథకం ఉన్న పథకాలకు, నిధులు కలిపి చూపిస్తున్నారని విమర్శించారు. ఈ పథకానికి 24 వేల కోట్ల రూపాయలు, కేటాయింపు ఉందని చెప్తున్నారు. కానీ అది కొత్తగా కేటాయించింది కాదు అని అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో ఇప్పటివరకు 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని, కేంద్రం చెబుతున్న రైతుల, జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు అన్నారు.