4 August, 2026 | 5:05 AM

Districts - Jangaon

article_54901963.webp
మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని ప్రత్యేక పూజలు

జనగామ, (చిల్పూర్),జూలై27 (విజయక్రాంతి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని చిల్పూర్ దేవస్థానంలో బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి,మాజీ ఎమ్మెల్యే పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల అభిమానం పొందిన నాయకుడని,ఆయన త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇల్లందుల సుదర్శన్, జనగామ యాదగిరి, రంగు హరీష్ గౌడ్,ఉప సర్పంచ్ సంతోష్, నారాగోని రాజు, గుంటి బీములు,తాళ్లపల్లి జగన్నదాం, నోముల మల్లారెడ్డి, క్రాంతి ఎడ్ల రాజేష్ ,ఇల్లందుల సారయ్య, రాజి రెడ్డి, హర్షా,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

27-07-2026

article_60028224.webp
పోచన్నపేటలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామ రైతులు

బచ్చన్నపేట: జులై 23 విజయక్రాంతి: మండల పరిధిలోని పోచన్నపేట గ్రామంలో ఇసుక మాఫియా రవాణాపై గురువారం భారీ ఉద్రిక్తత నెలకొంది. ఆన్‌లైన్ స్లాట్స్ బుకింగ్ పేరుతో పెద్దవాగు నుంచి ఇసుకను తరలించడానికి వచ్చిన అన్ని ట్రాక్టర్లను గ్రామ రైతులు, స్థానికులు తీవ్ర ఆగ్రహంతో అడ్డుకుని వెనక్కి పంపించారు. పోచన్నపేట పెద్దవాగు నుండి నిరంతరాయంగా ఇసుకను తోడేయడం వల్ల గ్రామంలో భూగర్భ జలమట్టం పడిపోతోందని, వ్యవసాయ బోరుబావులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ. ప్రభుత్వ పనులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తక్కువ సంఖ్యలో పర్మిట్లు తీసుకుని, వాటి మాటున కమర్షియల్ అవసరాలకు వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని రైతులు.ధ్వజమెత్తారు ఉదయాన్నే వాగులోకి వరుసగా వచ్చిన ట్రాక్టర్లను చూసి ఆగ్రహించిన రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. స్లాట్స్ బుక్ చేసుకున్నామంటూ వచ్చిన డ్రైవర్లతో వాగ్వాదానికి దిగి, ఒక్క ట్రాక్టర్‌ను కూడా ఇసుక తీసుకెళ్లనివ్వకుండా అన్నింటినీ వెనక్కి పంపించేశారు.

24-07-2026