calender_icon.png 1 February, 2026 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_10189068.webp
కలెక్టర్‌తో ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భేటీ

31-01-2026

జనగామ, జనవరి 30 (విజయక్రాంతి): మున్సపిల్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్ల పై వివరించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ అబ్జర్వర్గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహరెడ్డి (ఐ.ఏ.ఎస్.,) శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తన ఛాంబర్లో భేటి అయ్యరు, పూల బోకేను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జనగామ మున్సిపాలిటీ 30 వార్డులు, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలలో 18 వార్డుల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లపై సాధారణ అబ్జర్వర్కు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వివరించారు.

article_36584308.webp
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

30-01-2026

జనగామ, జనవరి 29 (విజయక్రాంతి): జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా జరుపుటకు పకడ్బం దీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. గురువారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అభ్యర్దుల దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను, సంబంధిత రిజిష్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే నామినేషన్ పత్రాలకు జతచేవల్సిన దృవపత్రా లు సరిగా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ స జావుగా జరుగుతుందని తెలిపారు.

article_30217137.webp
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముత్త సాంబరాజు

22-01-2026

తరిగొప్పుల, జనవరి 22 (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముత్తా సాంబరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నీల రాజు, యూత్ అధ్యక్షులుగా, నీల సంపత్, ఉపాధ్యక్షులుగా బండారి ప్రశాంత్, ఎన్ ఎస్ ఐ అధ్యక్షులుగా మండల రాజు, బీసీ సెల్ అధ్యక్షులుగా బాలగోని శీను ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.తమ పై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీ, మండల కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అర్జుల పోసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పింగిలి ఇంద్రారెడ్డి, భీమ నాయక్, సర్పంచ్ కావటి సుధాకర్, భాష బోయిన రమేష్, సూర్య నాయక్, కాసాని గాలయ్య, భాష బోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.