calender_icon.png 7 July, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_60458164.webp
మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

03-07-2025

ఘట్ కేసర్, జూలై 2 : మనుషుల అక్రమ రవాణా నిర్ములనలో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని అల్వాల్ సీడీపీఓ స్వాతి అ న్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అల్వాల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోచారం మున్సిపల్ అన్నోజిగూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సీడీపీఓ స్వాతి హాజరై జ్యోతి ప్ర జ్వలన చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అన్నారు.

article_34678080.webp
డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి..

26-06-2025

గురువారం జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం(Anti-Drug Day) పురస్కరించుకొని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీసీపీ రాజమహేంద్ర నాయక్(DCP Rajamahendra Naik) ఏఎస్పీ పండరి నితిన్ చేతన్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా బస్టాండ్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నెహ్రూ చౌక్ మీదుగా కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది.

article_33439828.webp
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

26-06-2025

జనగామ పట్టణంకి బతుకమ్మ కుంట స్పెషల్ అట్రాక్షన్ గా కనపడేలా అభివృద్ధి పనులు జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Shaik) తెలిపారు. గురువారం పట్టణంలో కేంద్రంలో గల బతుకమ్మ కుంటను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్(Additional Collector Pinkesh Kumar)తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ. కోటి 50 లక్షలతో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ మేరకు బతుకమ్మ కుంటను పంచతంత్ర థీమ్ తో అభివృద్ధి చేయాలనీ, సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, గజిబోలు, వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆటస్థలం, ఆడుకునేందుకు పరికరాలు, చిన్న పార్కు ఏర్పాటుకు ప్రారంభించిన పనులను వేగవంతం చేసి, నెల రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

article_14681020.webp
నీరు వృధా కాకుండా ప్రత్యేక చర్యలు..

25-06-2025

వివిధ శాఖల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకై విస్తృతంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రిజ్వం బాషా షేక్(District Collector Rizwan Basha Shaik) తెలిపారు. జలశక్తి అభియాన్ క్రింద నేషనల్ వాటర్ అవార్డ్స్-2024 కొరకు కేంద్రం నుండి అధ్యయన కమిటీ సభ్యులు కేంద్ర భూగర్భజల శాఖ సైంటిస్ట్ డాక్టర్ ఎమ్ సుధీర్ కుమార్, భూగర్భజల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ బుధవారం జిల్లాకి విచ్చేసారు. ఈ సందర్బంగా కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలో భూగర్భ జలవనరుల సంరక్షణకి తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

article_40049947.webp
అబ్దుల్ నాగారంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

24-06-2025

మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Mallareddy Narayana Super Speciality Hospital) హైదరాబాద్ వారు మంగళవారం మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో అర్జుల సంపత్ రెడ్డి అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో ప్రత్యేకమైన ఏడు రకాల వైద్య సేవలు ఏర్పాటు చేసి అందులో సాధారణ చికిత్స, పిల్లలకు సంబంధించిన చికిత్స, చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులు, మానసిక వ్యాధులు, ఛాతి వ్యాధులు, ఎముకలకు, కీళ్లకు, గర్భిణీ స్త్రీల గురించి, కంటి వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, వ్యాధుల గురించి చికిత్సలు అందించి అవసరం ఉన్నవారికి ఆపరేషన్ కోసం గ్రామం నుండి ప్రత్యేకంగా ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఆపరేషన్ చికిత్సలు చేసిన అనంతరం తిరిగి ఇంటికి పంపించడం జరుగుతుందని క్యాంప్ ఇన్చార్జిలు వినేష్, వెంకట్, ఓబుల్ రెడ్డిలు తెలిపారు.