బీసీ బిడ్డ మహేష్ పై దాడి సిగ్గుమాలిన చర్య
19-08-2025
చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీసీ బిడ్డ పంచిక మహేష్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై, అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జి రవి(JAC District Incharge Ravi) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15 న కొందరు వ్యక్తులు మహేష్ భార్య,పిల్లలు ఆయన మామ, ఇతరులపై దాడి చేశారని, బిసి పొలిటికల్ జేఏసీనీ కలవడం జరిగిందన్నారు. ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగ టార్గెట్ చేసి కొట్టడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.