సరస్వతీ పుష్కరాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
29-04-2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరంలో మే 15 నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అన్నారు. మంగళవారం విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం ఏర్పాటు, టెంట్ సిటి ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, జాయ్ రైడ్, సత్రం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలను పరిశీలించారు.