నూతన మార్కెట్ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డు నందు కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో నూతన మార్కెట్ కార్యాలయ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. గురువారం చిట్యాల మార్కెట్ యార్డ్ నందు నూతన మార్కెట్ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ లో రూ.1 కోటి వ్యయంతో మార్కెట్ కార్యాలయం, 65 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, నిన్నటి వరకు చిట్యాల మండలంలోని 11 గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉండేవని, ఇక నుండి ఆ 11 గ్రామాలను చిట్యాల మార్కెట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆయన తెలిపారు.
09-04-2026