రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి
03-12-2025
కాటారం (మల్హర్) (విజయక్రాంతి): రైతులకు అవసరమైన సదుపాయాలు పీపీఎసీల వద్ద తాగునీరు, నీడ, కొలతల యంత్రాలు, పారదర్శక తూకం పరికరాలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం మల్హార్రావు మండల పరిధిలోని రుద్రారం, యడ్లపల్లి, కొయ్యూరు, కొండంపేట్, వల్లంకుంట, తాడిచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.