calender_icon.png 14 December, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_19171673.webp
కరెన్సీ నోట్లను కాదు..పేదోడిని గెలిపించండి.

12-12-2025

చిట్యాల(విజయక్రాంతి): కరెన్సీ నోట్ల కట్టలను కాదు పేదోడిని,అధికార పార్టీని గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని చిట్యాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కట్కూరి పద్మ నరేందర్ అన్నారు.శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కట్కూరి పద్మా నరేందర్ ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, యువకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్కూరి పద్మ నరేందర్ మాట్లాడుతూ రామాలయం నిర్మాణం గురించి ప్రతిపక్షానికి చెందిన కొందరు రాజకీయాలు చేస్తున్నారు.

article_33851411.webp
చిట్యాలలో వ్యూహానికి ప్రతి వ్యూహం

10-12-2025

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సర్పంచ్ స్థానానికి తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వ్యూహానికి బిఆర్ఎస్ అభ్యర్థి ప్రతి వ్యూహాన్ని రచిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ బలంతో ముందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థి యువకులు,అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.వెంకట్రావుపల్లి(సీ) నుంచి వన్ సైడ్ గా ఓట్ల కోసం కృషి చేస్తున్నట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా మరోవైపు ఇద్దరు అభ్యర్థులు ఉదయం నుంచే డీ అంటే డీ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరి వైపు గ్రాఫ్ సమానంగా నడుస్తుండగా ఎక్కడికక్కడే యువకులకు, ప్రజలకు సెటిల్మెంట్లు,విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియవస్తోంది.ఇద్దరు అభ్యర్థులు గెలుపు నాదంటే నాది అంటూ బయట చర్చించుకోవడం ప్రస్తుతానికి చర్చనీ అంశంగా మారుతుండగా గెలుపు డంకా ఎవరు మోగిస్తారో వేచి చూడాల్సి ఉంది.

article_16271738.webp
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో సత్తాచాటిన ఆదర్శ విద్యార్థులు

07-12-2025

కాటారం (విజయక్రాంతి): జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు వివిధ విభాగాల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచారు. సైన్స్ సెమినార్ లో సృజన అనే విద్యార్థిని ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. సీనియర్ కేటగిరీలో అస్వద్, అబ్దుల్ రెహన్ అనే విద్యార్థులు నీటి సంరక్షణ, నిర్వాహణపై వాటర్ వైస్ ప్యూచర్ బ్రైట్ అనే వినూత్న ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్ట్ ద్వితీయ బహుమతి సాధించింది. జూనియర్ కేటగిరీలో గ్రీష్మవేద, జష్మిత ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో రూపొందించిన ఆటో డ్రైన్ గేట్ ప్రాజెక్ట్ ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది.

article_50793934.webp
పలిమెలలో పంచాయతీ ఎన్నికల పరిశీలకుల పర్యటన

03-12-2025

కాటారం (పలిమెల) (విజయక్రాంతి): రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ రాష్ట్ర పరిశీలకులు ఫణీంద్ర రెడ్డి బుధవారం పలిమెల మండల కేంద్రంలోని సర్వాయిపేటలో నామినేషన్లు పరిశీలన, మహదేవపూర్ మండలంలోని అంబటపల్లి, ఎల్కేస్వరంలలో నామినేషన్లు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, వాహనాలను నిశిత పరిశీలన చేయాలని సూచించారు.