calender_icon.png 18 June, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_46617879.webp
99,837 మంది రైతులకు భరోసా

18-06-2025

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో ఇప్పటివరకు 90,837 మంది రైతులకు 72 కోట్ల 30 లక్షల 42 వేల 624 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న రైతులకు రైతు భరోసా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 282 గ్రామాల్లో 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారని, ఇందుకు 143,99,06,145 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

article_55062427.webp
ఉలిక్కి పడిన వెలిశాల...

18-06-2025

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న ఆ గ్రామ ముద్దుబిడ్డ, అజ్ఞాత వైపు అడుగులు వేసి ఏనాడు వెనుదిరిగి చూడలేదు. పోరుబాటలోనే అంచెలంచెలుగా ఎదిగి, చివరికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగాడు. మావోయిస్టు అగ్ర నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్.. గాజర్ల రవి మృతి చెందాడన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు..

article_25020340.webp
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకి లాల్

14-06-2025

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని ఎలికేశ్వరం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్ పరిశీలించారు. లోకి లాల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 400 సీట్ల నుండి 600 ఫీట్ల వరకు నిర్మాణం చేపట్టాలని అన్నారు. భూమి ఇసిక స్వభావం ఉన్నట్లయితే కచ్చితంగా బేస్మెంట్ లెవెల్ వరకు పిల్లర్లు వేసుకోవాలని తెలుపుతూ లబ్ధిదారులకు పలు సూచనలు తెలియజేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో 4 విడతలలో డబ్బులు జమవుతాయని మొదటగా బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష లేంటల్ లెవెల్ లో రూ.లక్ష స్లాబు లెవల్లో రూ.రెండు లక్షలు ప్లాస్టింగ్ రూ. లక్ష ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నారు.

article_49323342.webp
బీఆర్ఎస్ బానిసలము కాదు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము

13-06-2025

బీఆర్ఎస్ పార్టీలో లాగా బానిసలను కాదు... దేశ స్వతంత్రం సాధించుటలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. బిఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు పుట్ట మధుకర్ మంథినిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు పదవులు రావడంలేదని పేర్లు పెట్టి ఆరోపించారు. ఈ ఆరోపణలపై మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు మాట్లాడుతూ... తాను కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ స్థాయికి చేరానని కాంగ్రెస్ పార్టీ తనను ఎప్పుడు విస్మరించలేదని పార్టీలో తనకు అత్యున్నత స్థానంతో పాటు సరైన గుర్తింపును ఇచ్చిందని అన్నారు.