calender_icon.png 22 June, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_58498130.webp
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

21-06-2025

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, వ్యాధులు ప్రబలితే అత్యవసర వైద్య సేవలు అందించుట, డ్రై డే అమలు, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య, పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

article_57567289.webp
కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల సన్నాహాక సమావేశం

19-06-2025

జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, జిల్లా సంస్థ గత ఎన్నికల పరిశీలకులు కూడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాసంపల్లి లింగాజీ, పాల్గొని మాట్లాడుతూ... కష్టపడి పనిచేసే వారికే పార్టీ పదవులల్లో ప్రాధాన్యత ఇస్తామని, పార్టీని బలోపేతం చేయడానికి గ్రామస్థాయి నుండి బ్లాక్ స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని మొదటగా గ్రామస్థాయి కమిటీలను ఎన్నిక చేసిన తర్వాత మండల స్థాయి కమిటీలు ఎంపిక చేస్తామని తద్వారా మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు పార్టీకి సమయం కేటాయించి పనిచేసే వారిని ఎన్నికల ప్రవర్తన నియామావళి మేరకు సజావుగా కమిటీలు నియామకం పూర్తి చేస్తామని తెలిపారు.

article_46617879.webp
99,837 మంది రైతులకు భరోసా

18-06-2025

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో ఇప్పటివరకు 90,837 మంది రైతులకు 72 కోట్ల 30 లక్షల 42 వేల 624 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న రైతులకు రైతు భరోసా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 282 గ్రామాల్లో 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారని, ఇందుకు 143,99,06,145 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

article_55062427.webp
ఉలిక్కి పడిన వెలిశాల...

18-06-2025

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న ఆ గ్రామ ముద్దుబిడ్డ, అజ్ఞాత వైపు అడుగులు వేసి ఏనాడు వెనుదిరిగి చూడలేదు. పోరుబాటలోనే అంచెలంచెలుగా ఎదిగి, చివరికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగాడు. మావోయిస్టు అగ్ర నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్.. గాజర్ల రవి మృతి చెందాడన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు..