calender_icon.png 18 June, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_16806900.webp
యోగ దశాబ్ది ఉత్సవాలు..

18-06-2025

యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర గురుకుల మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్(Telangana State Gurukul Minority School and College)లో కామన్ యోగ ప్రోటోకాల్ బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి ఆయుర్వేద డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థినులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆ తర్వాత యోగ ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకు యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసి, వారి చేత సూక్ష్మ వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, ప్రాణాయామలు, ధ్యానము చేపించారు.

article_60399276.webp
పేద విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహక పురస్కారాలు

18-06-2025

ప్రభుత్వ పాఠశాలలో చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంచిర్యాల పాపులర్ షూ మార్ట్ నిర్వహుకులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. బుధవారం ప్రాఫిట్ షూ కంపెనీ(Profit Shoe Company) షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంచిర్యాల ఉమెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్(సిఐ) నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రాఫిట్ షూ కంపెనీ సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచి పరిణామం. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లా స్థాయిలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థిని విద్యార్థులను, ప్రధాన ఉపాధ్యాయులను గుర్తించి ఆత్మీయంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతులు అందించడం శుభ పరిణామం అన్నారు.

article_70792595.webp
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా రాణించాలి

18-06-2025

పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజాలింగు(Municipal Commissioner Thungapindi Rajalingu) కోరారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ప్రదర్శనను బుదవారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రారంభించి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వినూత్న వ్యాపారాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని, అంతే కాకుండా పలువురికి ఉపాధి కల్పించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకార్లు రుణాలను అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని సూచించారు.

article_30348366.webp
కన్నెపల్లి మండలంలో తాగు నీరు కలుషితం..?

18-06-2025

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): రక్షిత మంచినీటి పథకం మిషన్ భగీరథ నీరు(Mission Bhagiratha Water) కలుషితం ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది. పైప్ లైన్ లీకేజీలు, గేట్వాల్ పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పడకేసింది. దీంతో ప్రజలకి కలుషిత తాగునీరే దిక్కయింది. బెల్లంపల్లి నియోజవర్గం లోని కన్నెపల్లి మండలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా తీరు పై ప్రజలు ఆందోళన పడుతున్నారు. కన్నెపల్లి మండలంలోని సూర్జాపూర్, బావాపూర్, జంగంపల్లి గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

article_51514340.webp
బెల్లంపల్లిలో భూవివాదం కలకలం

18-06-2025

బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం భూవివాదoలో తలెత్తిన ఘర్షణ కలకలం రేపింది. ఈ సంఘటనలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురు మహిళలతో పాటు ఇద్దరికీ గాయలయ్యాయి. తాళ్ల గురజాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆకనపల్లి శివారులో సర్వే నెంబర్ 64 లోని భూమి విషయంలో పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన పనస గణేష్, సిoగతి హైమావతి కుటుంబీకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఆకనపల్లి శివారులో భూమిని గణేశ్ దున్ను తున్నాడు. ఈ విషయంలో సిoగతి హైమవతి కుటుంబ సభ్యులు వెళ్ళి గణేష్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు రోడ్డు పైనే తీవ్రస్థాయిలో ఒకరినొకరు దూషించుకున్నాను. అంతటితో ఆగకుండా భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువురు ఒకరిపై ఒకరు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇరు కుటుంబ సభ్యులు పైన తాళ్ల గురజాల పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

article_21155229.webp
నకిలీ పత్తి విత్తనాల విక్రేత అరెస్ట్

17-06-2025

మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి శివారులో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్(CI Afzaluddin) తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చయ్యపల్లి గ్రామ శివారులో 25 కేజీల Glycolic Cotton Seeds(Spurious Seeds) పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు బుచ్చయ్యపల్లి గ్రామ శివారులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాడని సమాచారం మేరకు బెల్లంపల్లి వ్యవసాయ అదికారి సుద్దాల ప్రేమ్ కుమార్ తో పోలీసులు కలిసి రైడ్ చేయగా పెద్ద దుబ్బు శివారులో మాకినేని వెంకట నారాయణ పట్టుపడ్డాడు.