calender_icon.png 12 December, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_66232183.webp
జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

11-12-2025

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 90 గ్రామ పంచాయతీలుండగా ఆరు జీపీలు ఏకగ్రీవం కావడం, మూడు జీపీలకు నామినేషన్ లు వేడకపోవడంతో 81 గ్రామ పంచాయతీలకు గురు వారం మెదటి విడుత పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మంచిర్యాల నియోజక వర్గంలోని హాజీపూర్ మండలంలోని 12 జీపీలకు, లక్షెట్టిపేటలోని 18 జీపీలకు, దండేపల్లిలోని 31 జీపీలలో కొండాపూర్, కొత్తమామిడిపల్లి, పాత మామిడిపల్లి, ముత్యంపేట జీపీలు ఏకగ్రీవం కాగా నెల్కి వెంకటాపూర్, గూడెం జీపీలు ఎస్టీలకు కేటాయించగా ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు.

article_19273001.webp
ప్రశాంతంగా పోలింగ్

11-12-2025

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని(Mancherial district) హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో గురువారం జరుగుతున్న మెదటి విడుత పంచాయితీ ఎన్నికలు(Gram Panchayat first phase polling) ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. నాలుగు మండలాల్లో 1,24,019 మంది ఓటర్లుండగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఓటర్లు నెమ్మదిగా రావడంతో ఉదయం తొమ్మిది గంటల వరకు కేవలం 20,576 (16.59 శాతం) ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది గంటల తర్వాత ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలిరావడంతో ఉదయం 11 గంటల వరకు 60,606 (48.87 శాతం) ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ కు సమయం ఉండగా అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పోటీపడుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఆటోలను ఉపయోగిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని ఓటర్లను తీసుకువచ్చేందుకు వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కార్లను సైతం సమకూర్చి తీసుకువస్తున్నారు. జిల్లాలో పోలింగ్ ఇలా సాగుతుంది...