14 June, 2026 | 7:18 AM

Districts - Mancherial

article_54058795.webp
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (MANCHERIAL DISTRICT COLLECTOR KUMAR DEEPAK) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో తాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మూత్రశాలలు, తదితర పూర్తి సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో విద్యార్థినీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

13-06-2026

article_49682676.webp
విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలో విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే వసతి గృహ నిర్మాణానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, మండల తహసిల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మహాత్మ జ్యోతిబాపూలే ఆర్సీఓ బాల భాస్కర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

12-06-2026