ఆర్వోఆర్పై అవగాహన ఉండాలి
01-05-2025
మంచిర్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంను, ఇందులో పొందుపరిచిన అంశాలను రైతు లు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ (షాదిఖాన)లో భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డిఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత, తహసీల్దార్ రఫతుల్లా లతో కలిసి హాజరయ్యారు.