calender_icon.png 7 February, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_57354675.webp
మహిళల భద్రతకు భరోసా అండగా

05-02-2026

మంచిర్యాల,(విజయక్రాంతి): మహిళలు ఇబ్బంది సమయంలో ఒక ఫోన్ కాల్ చేయండి… లేదా ఒక మెసేజ్ పంపండి... మీకు అండగా షీ టీమ్స్ అందుబాటులోకి వస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురు వారం వెల్లడించారు. మహిళలు, యువతులు, బాలికలు భయం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, మీ భద్రతకు భరోసాగా షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయన్నారు. పోలీస్ శాఖపై, షీ టీమ్స్‌పై నమ్మకం, భరోసాతో మహిళలు, బాలికలు తమపై జరుగుతున్న వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు.

article_59403044.webp
తీవ్ర ఉత్కంఠ మధ్య తుది జాబితాలు

04-02-2026

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎట్టకేలకు అభ్యర్థుల జాబితాలు విడుదల చేశారు. నామినేషన్ల ఉపసహరణ ప్రక్రియ దృష్ట్యా మంగళవారం సాయంత్రం వరకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ అభ్యర్థుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ రఘునాథరెడ్డి ప్రకటించగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అలాగే బీజేపీ, సీపీఐలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ 34 వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ 20, సీపీఐ 6 వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ మేరకు ఆయా పార్టీలు తమ అభ్యర్థుల బి ఫారాలను ఎన్నికల అధికారులకు మూడు గంటలకు ముందే అందజేశారు.

article_81276164.webp
ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

03-02-2026

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 2: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 20 (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు) కళాశాలల్లో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 1279 (జనరల్ 604, ఒకేషనల్ 675) మంది విద్యార్థులకు 1161 (జనరల్ 589, ఒకేషనల్ 572) మంది హాజరు కాగా 118 (జనరల్ 15, ఒకేషనల్ 118) మంది గైర్హాజరయ్యారని, రెండవ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలకు 1099 (జనరల్ 537, ఒకేషనల్ 562) మంది విద్యార్థులకు 1047 (జనరల్ 516, ఒకేషనల్ 531) మంది హాజరు కాగా 52 (జనరల్ 21, ఒకేషనల్ 31) మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, పరీక్షల కన్వీనర్ అంజయ్య వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు.