యోగ దశాబ్ది ఉత్సవాలు..
18-06-2025
యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర గురుకుల మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్(Telangana State Gurukul Minority School and College)లో కామన్ యోగ ప్రోటోకాల్ బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి ఆయుర్వేద డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థినులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆ తర్వాత యోగ ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకు యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసి, వారి చేత సూక్ష్మ వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, ప్రాణాయామలు, ధ్యానము చేపించారు.