4 August, 2026 | 11:38 AM

Districts - Mancherial

article_41188597.webp
ఇందన్ పల్లి ఎఫ్ఆర్ఓను ఉద్యోగం నుంచి తొలగించాలి

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం(Jannaram Mandal) ఇందన్ పల్లి అమాయక ఆదివాసి నాయక్ పోడు తెగకు సంబంధించిన ఐదుగురు యువకులపై దౌర్జన్యంగా దాడి చేసి, విచక్షణ రహితంగా కొట్టి హింసించి నిర్బంధించిన ఇందన్ పల్లి ఎఫ్ ఆర్ ఓ లక్ష్మీనారాయణను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ సోమవారం డిమాండ్ చేశారు. అమాయక ఆదివాసి నాయక్ పోడు తెగకు చెందిన ఐదుగురు యువకులను పట్టుకొని వేటకు వచ్చారనే నేపంతో అదివారం విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసి వివిధ ప్రాంతాలలో తిప్పి నిర్బంధించిన లక్ష్మి నారాయణను తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు.

03-08-2026

article_28861609.webp
వన మహోత్సవంలో పాల్గొన్న ఎంఎల్ ఏ

మంచిర్యాల టౌన్ , (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో గల రాముని చెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

03-08-2026

article_21357477.webp
సామాజిక సామరస్యతకు ప్రతీక సంత్ గురు రవిదాస్ మహారాజ్

భీమిని, (విజయక్రాంతి): సామాజిక సామరస్యతకు ప్రతీక సంత్ గురు రవిదాస్ మహారాజ్ అని బిజెపి ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిజెపి కార్యకర్త నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంత్ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా దేశవ్యాప్తంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. అందులో భాగంగానే వారి జన్మస్థలం కాశి దగ్గరలోని సీర్ గోవర్ధనపూర్ నుంచి మట్టిని సేకరించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మండలాలకు రథయాత్ర ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వం, భక్తి మార్గాలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు సంత్ గురు రవిదాస్ మహారాజ్ అని అన్నారు.

03-08-2026