యావపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు..
17-06-2025
మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు నిర్వహించినారు. రైతుల నుండి వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అధికారులు స్వీకరించడం జరిగింది. ఈ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ఎంజాలస్వామి, చెట్లపల్లి రామస్వామి, ఎంజాల కుమార్, యంజాల బిక్షపతి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, సెక్రటరీ నవీన్, ఎరుకల నరసింహులు, మర్రి స్వామి, నర్సింగరావు, తదితరులు ఉన్నారు.