calender_icon.png 21 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_78109983.webp
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు

21-01-2026

మెదక్, జనవరి 20 (విజయక్రాంతి): రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లావ్యాప్తంగా పంప్ సెట్లు, పనిచేస్తున్న బోర్వెల్ల పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. మైనర్ రిపేర్ల కోసం చెక్లిస్ట్ తయారు చేసి గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.

article_49940886.webp
వీబీ- జీ రామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాడుతాం

21-01-2026

మెదక్, జనవరి 20 (విజయక్రాంతి): వీబీ-జీరామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని మెదక్ ఎమ్మెల్యేడాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు. పేదలకు ఉపా ధి కల్పించాలనే మంచి ఉద్దేశ్యం తో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపిఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని కల్పిస్తే దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని విమ ర్శించారు. స్కీమ్ ను మార్చడమంటే పేదల పొట్టకొట్టడమేనని విమర్శించారు. వీబీ-జీరామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో దీక్ష చేపట్టారు.

article_28556798.webp
ప్రజావాణికి పోరు.. కార్యాలయాలకు రారు

20-01-2026

పాపన్నపేట, జనవరి 19: ప్రభుత్వ కార్యాలయానికి ఒకరిద్దరు ఉద్యోగులు ఆలస్యంగా వచ్చారంటే ఏవేవో బలమైన కారణాలు ఉండొచ్చు అనుకుంటారు. మెదక్ జిల్లా పా పన్నపేట మండల ప్రభుత్వ కార్యాలయాల లో మండల స్థాయి అధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులందరూ ఉదయం 11:30 గంటలు దాటినా కార్యాలయానికి రాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. సిబ్బంది వివిధ సమయాల్లో రావడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 దాటినా అగ్రికల్చర్ కార్యాలయంలో ఏఓ, సిబ్బంది రాకపోవడం గమనార్హం.