ధూప దీపా నైవేద్యానికి, వితంతువులకు ఆసరా అందిస్తున్న మొహమ్మద్ రఫీ
చేగుంట ఆగస్టు 03,విజయక్రాంతి: చేగుంట మండల, పట్టణ ప్రజలకు, నిరుపేద కుటుంబాలకు, దేవాలయాల అభివృద్ధికి, ఎల్లప్పుడూ ముందుండి ఆర్థిక సహాయం అందిస్తూ, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న,చేగుంట పట్టణ ఉపసర్పంచ్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ రఫీ. సమాజంలో మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో, ముందుకు సాగుతున్న ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఆరు నెలలుగా నిరంతరంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
03-08-2026