ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు సఫలం
03-09-2025
హైదరాబాద్, సెప్టెంబర్2 (విజయక్రాంతి): ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యో గ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (తెలంగాణ ఉద్యోగుల జేఏసీ) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ డి మాండ్లను పరిష్కరించాలని 20 నెలలుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకో కపోవడంతో సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు జిల్లాల బస్సు యాత్ర, అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్ ఉద్యమ కార్యాచరణను గత నెలలో ఉద్యోగుల జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే.