రూ.1.16 కోట్లతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలో లక్ష్మీనగర్, కృష్ణానగర్, తిరుమలనగర్ కాలనీలలో రూ.1.16 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
04-08-2026