నేడు బీసీల ధర్మ పోరాట దీక్ష
13-11-2025
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువా రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించనున్నట్టు వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్, మీడియా కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ తెలిపారు. ఇందిరపార్క్ ధర్నా చౌక్ వద్ద ఊదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీల నేతలు బండారు దత్తా త్రేయ, వీ హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సి మధుసూదన్చారి, వీ శ్రీనివాస్గౌ డ్, ప్రొ.కోదండరాం, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అద్దంకి దయాకర్, సీపీఐ కార్యదర్శి జాన్ వెస్లీ, ఇబ్రహిం శేఖర్, ప్రొ. గాలి వినోద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.