calender_icon.png 13 November, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_42951533.webp
అభ్యర్థులకు సీఎం అభినందనలు

13-11-2025

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ర్టం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవం త్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. రాష్ర్టం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద సింగరేణి సంస్థ అధ్వర్యంలో మెయిన్స్‌కు వెళ్లిన 202 మందికి గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధం అయ్యేందుకు మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం ప్రభు త్వం అందించనుంది.

article_23711923.webp
నేడు బీసీల ధర్మ పోరాట దీక్ష

13-11-2025

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువా రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించనున్నట్టు వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, మీడియా కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ తెలిపారు. ఇందిరపార్క్ ధర్నా చౌక్ వద్ద ఊదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీల నేతలు బండారు దత్తా త్రేయ, వీ హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సి మధుసూదన్‌చారి, వీ శ్రీనివాస్‌గౌ డ్, ప్రొ.కోదండరాం, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అద్దంకి దయాకర్, సీపీఐ కార్యదర్శి జాన్ వెస్లీ, ఇబ్రహిం శేఖర్, ప్రొ. గాలి వినోద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.