లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపించాలి
10-06-2025
చిగురుమామిడి, జూన్ 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ డిమాండ్ చేసింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి, నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు.