4 August, 2026 | 12:04 PM

Districts - Rajanna Sircilla

article_56628283.webp
పాత బకాయిల కోసం తాగునీటి బోరు స్టార్టర్ తొలగింపు..

కోనరావుపేట, ఆగస్టు 3 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో గ్రామపంచాయతీ చెల్లించాల్సిన సుమారు రూ.1.30 లక్షల బకాయిలు అందకపోవడంతో 5వ వార్డు బస్టాండ్ సమీపంలోని తాగునీటి బోరు స్టార్టర్‌ను మాజీ సర్పంచ్ జింక పోషవ్వ కుమారుడు శ్రీనివాస్ తొలగించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సొంత నిధులతో బోర్లు వేయించానని తెలిపారు.అయితే ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడంతో పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిరసనగా బోరు స్టార్టర్‌ను తొలగించినట్లు చెప్పారు.ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం తనకు లేదని, గ్రామపంచాయతీ తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు చర్చనీయాంశంగా మారింది.

03-08-2026

article_18003829.webp
అంకుసాపూర్ శ్రీ సిద్ధి వినాయక యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

తంగళ్ళపల్లి ఆగస్టు 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడిగా మామిడి శెట్టి దినేష్, ఉపాధ్యక్షుడిగా రేగుల రాజు, కోశాధికారిగా బోనుగాని ప్రవీణ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు గ్రామ పెద్దలు, యువకులు మరియు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు, యువత సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సురేందర్,భానుచందర్, సాయి రెడ్డి, వెంకటేష్ రాజు, తుమ్మల రాజు అజయ్ ఐలేష్, వంశీ, సంజీవ్ సభ్యులు పాల్గొన్నారు .

02-08-2026