calender_icon.png 6 December, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_39117655.webp
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ ఎస్‌ఐ జునైద్

06-12-2025

బోయినపల్లి (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమం భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని రూసో కళశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జునైద్ మాట్లాడుతూ... సైబర్ నేరాల నుంచి రక్షించుకోవాలంటే అవగాహన తప్పని సరి అని డిజిటల్ జాగ్రత్తలు పెరగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు అని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోటోలను ఇతరులతో పంచుకోకూడదు అని సూచించారు.

article_20688976.webp
శాంతి, ప్రజా భద్రతలో హోంగార్డు అధికారుల పాత్ర కీలకం

06-12-2025

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకల సందర్బంగా హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.