9 March, 2026 | 11:34 PM

Districts

article_32233266.webp
కల్లుగీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ ఒక నెల క్రితం తాడి చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో ప్రమాదవశాత్తు మోకుజారి చెట్టుపై నుంచి పడిపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని ఈరోజు మధ్యాహ్నం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్, మాట్ల మధు, స్థానిక నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

09-03-2026

article_78264175.webp
గర్భిణీలు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ, సహాయక నూతన కమిటీని 11 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూక్య తిరుపతి నాయక్ అధ్యక్షత వహించి కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఈ కమిటీ ఎంతో దోహదపడుతుందన్నారు.

09-03-2026