తైక్వాండోతో ఆత్మస్థైర్యం పెంపొందించుకోవచ్చు
08-12-2025
కోనరావుపేట (విజయక్రాంతి): తైక్వాండోతో విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పాటు క్రమశిక్షణ పెంపొందించుకోవచ్చని కనగర్తి జడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో వీర కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీల్లో మండలంలోని కనగర్తి జడ్పి ఉన్నత పాఠశాలకు చెందిన శరణ్య, పల్లవి, వైష్ణవి, రుచిత, వర్ష, నిత్య, రేష్మ, వైష్ణవి, నక్షత్ర, రచన విద్యార్థులు కుమిటే విభాగంలో 10 బంగారు పతకాలు సాధించారన్నారు.