కల్లుగీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ ఒక నెల క్రితం తాడి చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో ప్రమాదవశాత్తు మోకుజారి చెట్టుపై నుంచి పడిపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని ఈరోజు మధ్యాహ్నం మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్, మాట్ల మధు, స్థానిక నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
09-03-2026