18 June, 2026 | 3:20 PM

Breaking News

తెలంగాణ డిజిటల్ క్యాబినెట్   •   అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్ లను పంపిణీ చేశాం: ఎంఈఓ   •   ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముట్టడి   •   పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మద్ది చంద్రకాంత్ రెడ్డి   •   సీఎం క్యాంప్ ఆఫిస్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రతి గ్రామంలో డ్వాక్రా భవనాల నిర్మాణం పూర్తి చేయండి: ఎంపీడీవో   •   క్రమశిక్షణతో కృషి చేస్తే లక్ష్యాలు సాధ్యం - గజ్వేల్ సీఐ రవికుమార్   •   అక్రిడేషన్‌తో పాటు సంక్షేమ భరోసా   •   బోరు బావుల వద్ద చినుకులు గుంతల నిర్మాణం తప్పనిసరి: ఎంపీడీవో   •   శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో హుండీ ధ్వంసం   •  

Districts - Rajanna Sircilla

article_15280794.webp
వై జంక్షన్ వద్ద హైమాస్ట్ ఫ్లడ్ లైట్ ఏర్పాటు

కోనరావుపేట జూన్ 17 (విజయక్రాంతి): గ్రామ ప్రజల సౌకర్యార్థం, రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు కల్పించాలనే ఉద్దేశంతో జై సేవాలాల్ భూక్యా రెడ్డి పరిధిలోని గ్రామంలోని వై జంక్షన్ వద్ద హైమాస్ట్ ఫ్లడ్ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా సుమారు రూ.1 లక్ష మంజూరు కావడంతో ఈ హైమాస్ట్ లైట్ ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు.గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

17-06-2026

article_77040416.webp
చినలింగాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

తంగళ్ళపల్లి,జూన్17(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చినలింగాపూర్ గ్రామానికి చెందిన లావణ్య–ఆంజనేయులు దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్,మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.గతంలో సొంత ఇల్లు అనేది చాలా మంది పేద కుటుంబాలకు కలగానే ఉండేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ కలలు నిజమవుతున్నాయని వారు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు.

17-06-2026