calender_icon.png 1 May, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_12635557.webp
ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

30-04-2025

సిరిసిల్ల, ఏప్రిల్ 29(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి సీజన్లో ధాన్యం సేకరణ తరలింపు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయం మంగళవారం సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి సమీక్షించారు. ముందుగా జిల్లాలోని ఆయా మండలాల వారిగా ఎంత ధాన్యం ఉత్పత్తి అయిందో వ్యవసాయ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఐకెపి, పిఎసిఎస్, డిసిఎంఎస్ తదితర కేంద్రాల ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు .

article_75664969.webp
భూసేకరణ సర్వే సకాలంలో పూర్తి చేయాలి

30-04-2025

సిరిసిల్ల, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): ఆలయ రోడ్డు విస్తరణ భూసేకరణ నిమిత్తం సర్వే సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ రొడ్డు విస్తరణ, భూ సేకరణ పనుల పై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు తొలగించాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను 4 టీం ల ద్వారా సర్వే చేసి అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు

article_11449657.webp
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి

26-04-2025

సిరిసిల్ల, ఏప్రిల్-25(విజయక్రాంతి): మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.

article_17792456.webp
జల దృశ్యం నుంచి ఎల్కతుర్తి దాకా

23-04-2025

సిరిసిల్ల, ఏప్రిల్22 (విజయక్రాంతి): జల దృశ్యం నుంచి ఎల్కతుర్తి దాకా... గులాబీ జెండా పోరు బాట,అభివృద్ధి మాట. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించేది గులాబీ జెండా పార్టీ మాత్రమే అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికేళ్ళ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల వచ్చిన సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. గులాబీ జెండా భారీ బహిరంగ సభ కోసం జనం స్వచ్చందంగా తరలి వస్తున్నారని, ఎవరిని తరలించడం లేదని తెలిపారు.

article_73475414.webp
సైబర్ నిందితుడు దాసరి మురళి అరెస్ట్

22-04-2025

సిరిసిల్ల, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): ఆన్‌లైన సెంటర్లే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడు తున్న ప్రధాన నిందితుడు దాసరి మురళి ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు.