సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తెలంగాణ జాగృతి యువ నాయకుడు పూసల వినయ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి మేడ్చల్ జిల్లా వరకు దాదాపు 150 మందితో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వర్ధ సతీష్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 20 సంవత్సరాల క్రితం సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు.
21-04-2026