బావుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ
కోనరావుపేట జూన్ 17 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని,బావుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా, ఉపసర్పంచ్ తిక్కల నవీన్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీధర్, రవి తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
17-06-2026