అర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు
16-04-2025
నారాయణపేట. ఏప్రిల్ 15(విజయక్రాంతి) : అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నియోజక వర్గానికి ఓ ప్రత్యేక అధికారినీ నియమించడం జరుగుతుందని, ఆ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలనీ ,అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటట్లు చూడాలన్నా రు.