23 July, 2026 | 5:34 AM

Districts - Vikarabad

article_34770190.webp
కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి నిరసన

కొడంగల్: ఢిల్లీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi arrest), ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth rally) కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. లక్షలాది విద్యార్థుల జీవితాలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) చెలగాటం ఆడారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రాలను(NEET question papers) పల్లీబటానీల్లా కోట్ల రూపాయాలకు అమ్ముకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోప్రశ్నాపత్రాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత ఆందోళన చేపట్టిందని గుర్తుచేశారు.

22-07-2026

article_72037110.webp
ఓటు లేని మనిషి చచ్చిపోయినవారితో సమానం

కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్(CM Revanth Reddy Kodangal Tour) లో పర్యటిస్తున్నారు. కొడంగల్ లో స్థానిక నాయకులు, BLA లతో SIR ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్ఏలను( BLAS Meeting) ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంతకు ముందు ఎస్ఐఆర్ ఫామ్ నింపి సీఎం అధికారులకు అందజేశారు. ఓటు లేని మనిషి చనిపోయినవారితో సమానమని పేర్కొన్నారు. అంతా ఎస్ఐఆర్ నింపి ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వాళ్ల తప్పులు ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరుకావొచ్చు.. వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే అన్నారు. తనను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

22-07-2026

article_88601616.webp
రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి, నిర్మాణాల కోసం 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.

18-07-2026

article_81178421.webp
సన్న బియ్యం ఉత్తి మాటే.. మక్క పట్టిన దొడ్డు బియ్యమే దిక్కు

తాండూరు, జూలై 14, (విజయ క్రాంతి): పేదలకు రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పేర్కొంటుండగా కొన్ని గ్రామాల్లో సన్న బియ్యానికి బదులుగా ముక్క పట్టిన దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఓంలా నాయక్ తండా రేషన్ దుకాణం లో మక్క పట్టిన దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో తినేందుకు పనికిరాకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపిటిసి గేమ్యా నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని . . పాలకులు, అధికారులు చెబుతున్నది ఒకటని. .క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అని.. జిల్లా ఉన్నతాధికారుల స్పందించి నాణ్యమైన సన్న బియ్యం సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

14-07-2026