లారీ, బైకు ఢీ.. తండ్రికొడుకు మృతి
03-02-2026
వికారాబాద్, ఫిబ్రవరి-2: ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొనడంతో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన సోమవారం వికారాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సుమారు 07:40 గంటల సమయంలో, వికారాబాద్ పట్టణ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చకాలి లలయ్య (వయస్సు: 35 సం., వృత్తి: కూలీ) తన కుమారుడు చకాలి రిథిక్ (వయస్సు: 6 సం.) తో కలిసి మోటార్ సైకిల్ నంబర్ TS 34 6577 పై వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు.