calender_icon.png 24 November, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_47974775.webp
పెళ్లింట విషాదం

23-11-2025

తాండూరు (విజయక్రాంతి): తెల్లారితే కూతురు పెళ్లి.. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట్ వేశారు. బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. అంతలోనే అందిన ఓ విషాద వార్త అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్దులో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అండాల అనంతప్ప(46)కు వ్యవసాయమే జీవనాధారం. ఇతని మొదటి భార్య శాకమ్మకు ఓ కూతురు, కొడుకు సంతానం. పది హేనేళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకోగా, ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు.