calender_icon.png 21 December, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29230661.webp
సర్పంచ్ భర్తపై హత్యాయత్నం

19-12-2025

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రానికి నూతనంగా ఎన్నిక అయిన సర్పంచ్ భర్తపై హత్యాయత్నం జరిగింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందిన జంగం సంగయ్య స్వామి భార్య జంగం బసమ్మ సర్పంచ్ గా గెలుపొందారు. అయితే గత రాత్రి 10:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే వికారాబాద్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు సంగయ్య పై దాడి చేసిన వ్యక్తులను కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

article_55121127.webp
డైరీ పేరుతో వసూల్..!

17-12-2025

తాండూరు (విజయక్రాంతి): ప్రతి ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ఆయా శాఖలల్లోని ఉద్యోగ సంఘాలు కొత్త డైరీలను ఆవిష్కరించుకోవడం పరిపాటి. అందుకు అవసరమైన యాడ్స్ నిధులను ఆయా సంఘాల వారే స్వతగా సమకూర్చుకోవడం చూస్తుంటాం. కానీ వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్తరకం వసూళ్లకు రెవెన్యూ అధికారులు తెరలేపారు. నూతన సంవత్సరం డైరీలో యాడ్స్ ఇవ్వాలని జిల్లాలోని ఓ తహసిల్దార్ వ్యాపారస్తులను ఆశ్రయించడం విమర్శలకు తావిస్తోంది. పెద్దముల్ మండల తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ తాను తహసిల్దార్ సంక్షేమ సంఘం ప్రతినిధినని నూతన సంవత్సర డైరీ ముద్రించడం కోసం యాడ్ వేసేందుకు 30 వేల రూపాయలను ఇవ్వండి అంటూ... డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో కలిసి వెళ్లి వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.