calender_icon.png 1 May, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_53488624.webp
ప్రైవేటు పాఠశాలల సంఘం పట్టణ అధ్యక్షుడిగా చేవెళ్ల చంద్రశేఖర్

29-04-2025

వికారాబాద్, ఏప్రిల్ -28: ప్రైవేటు పాఠశాలల హక్కులు కాపాడేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని ప్రైవేటు పాఠశాలల సంఘం ( ట్రస్మా) వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు చేవెళ్ల చంద్రశేఖర్ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని వైష్ణవి హైస్కూల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ( ట్రస్మా ) సాధారణ సమావేశం నిర్వహించారు. గత కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో నూతనంగా ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా చేవెళ్ల చంద్రశేఖర్ ( న్యూ గీతాంజలి విద్యాలయం వికారాబాద్ ) ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్( నారాయణ స్కూల్ వికారాబాద్) కోశాధికారిగా సి. సుధీర్( స్కాలర్ స్కూల్ వికారాబాద్ ) ఉపాధ్యక్షులుగా మద్దూర్ పాషా, సంయుక్త కార్యదర్శిగా యాదయ్య, ఎన్నికయ్యారు.

article_44962133.webp
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత...

23-04-2025

అనంతగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత ఏర్పడుతుందని, దీంతో సకాలంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు విక్రయించలేకపోతున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలలో హమాలీలకు కూలి రేట్లు పెంచకపోవడంతో వారు మధ్య దళారుల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, మధ్య దళారులు హమాలీలకు ఎక్కువ మొత్తంలో కూలీ చెల్లిస్తున్నారని దీంతో వారు అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలు ధాన్యం నిలవ ఉండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. అంతేకాకుండా మిల్లులు వద్ద తరుగు పేరుతో కోత విధిస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇబ్బందికి గురి చేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

article_47717463.webp
ధాన్యం అక్రమంగా తరలిస్తే చర్యలు

13-04-2025

అనంతగిరి: అంతర్ రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో రైస్ మిల్లులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పండిన ప్రతి గింజ రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అందజేస్తుందని తెలిపారు అంతర్ రాష్ట్రాల నుండి అక్రమంగా వరి ధాన్యం తరలించకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టీములు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని తెలిపారు సన్న వడ్లకు లావు వడ్లకు వేరువేరుగా దాన్యం కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఎండల తీవ్రత దృష్ట్యా రైతులకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు