గొల్ల చెరువు అన్యాక్రాంతం.. ఎన్జీటీలో ఫిర్యాదు
18-09-2025
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు అన్యాక్రాంతంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై(ఎన్జీటీ)లో ఫిర్యాదు దాఖలు అయింది. తాండూరు సిటీజన్స్ వెల్ఫేర్ సోసైటీ(టీసీడబ్ల్యూఎస్) అధ్యక్షులు, సామాజికవేత్త రాజ్ గోపాల్ సార్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు. గొల్ల చెరువు అన్యాక్రాంతం... కుంచించుకుపోతున్న అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం ముఖ్య కార్యదర్శి, తాండూరు సబ్ కలెక్టర్, ఇరిగేషన్, తహసీల్దార్లు, పురపాలక సంఘం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు రాజ్ గోపాల్ సార్డా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.