నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ తాగునీరు బంద్
తాండూరు, (విజయక్రాంతి): గురువారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు మిషన్ భగీరథ(Mission Bhagiratha) త్రాగునీటి సరఫరా నిలిపి వేయనున్నట్టు డీఈ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తాండూర్, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల,ధరూర్ మండలాల పరిధిలో అన్ని గ్రామలు ,తాండూరు మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాలో నాలుగు రోజుల పాటు నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు.
12-03-2026