calender_icon.png 1 November, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18621645.webp
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

29-10-2025

తాండూరు (విజయక్రాంతి): రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన కురువ లక్ష్మణ్@ లక్కీ(24) నేడు గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ హిందూ ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగిన ముందుండేవాడని గ్రామస్తులతో.. యువకులతో కలిసిమెలిసి అందరితో కలివిడిగా ఉండేవాడని.. అతడి మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

article_13598219.webp
గోదామును తలపించేలా అక్రమ రేషన్ బియ్యం నిల్వలు

27-10-2025

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరంపై యాలాల పోలీసులు, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడిలో సంయుక్తంగా చేసిన రైడ్ లో దాదాపు 300 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి బాణాపూర్ తండాకు చెందిన మహేష్ అనే వ్యక్తి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోదామును తలపించేలా భారీ ఎత్తున క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యం ఎలా పోగు చేశాడో... ఎలా రవాణా చేశాడో... ఎలా స్థావరానికి చేర్చాడో.. అంటూ స్థానికులు అధికారుల పనితీరుపై నోరెళ్ళ పెడుతున్నారు.

article_49588765.webp
రాత్రి వేళల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు..

26-10-2025

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాత్రి వేళల్లో డ్రోన్ కెమెరాలతో చక్కర్లు కొడుతున్నారు. డ్రోన్ కెమెరాలు చక్కర్లు ఎందుకు పడుతున్నాయో తెలియక ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. పెద్దముల్ మండలం నాగులపల్లి, నర్సాపూర్, రుద్రారం, తాండూర్ పట్టణంలో గత రెండు రోజుల నుండి రాత్రి వేళల్లో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు డ్రోన్ కెమెరాతో ఏవైనా రహస్య వివరాలు సేకరిస్తున్నారా? ఇంకా మరి ఏదైనా కారణం ఉందా తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. లాడ్జింగ్, హోటల్లో, ఫామ్ హౌస్ లలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు డ్రోన్ కెమెరాలతో తిష్ట వేశారా? అనే కోణంలో సోదాలు చేపట్టారు.