ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
09-12-2025
వికారాబాద్, డిసెంబర్ 8: ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతమైన వాతావర ణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యం గా పని చేయాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐ.పి.ఎస్ స్వయంగా పాల్గొన్నారు. ఈ మార్చ్లో పోలీసు బలగాలు, క్విక్ రియాక్షన్ టీమ్లు (QRT), ఇతర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.