శ్రీ జగన్మాత రేణుక ఎల్లమ్మ తిరుణాల జాతర ఉత్సవాలు..
17-12-2025
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట్ లో వెలసిన శ్రీ జగన్మాత రేణుక ఎల్లమ్మ తల్లి తిరుణాల జాతర ఉత్సవాలు రేపటి నుండి (గురువారం) ప్రారంభం కానున్నాయి. అందుకుగాను గ్రామ పెద్దలు, యువకులు, నిర్వాహకులు అమ్మవారి దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు వివిధ రకాల పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని... అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.