27 February, 2026 | 8:47 AM

Districts

article_68046869.webp
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు నియామకం

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీప నర్సింలను నియమిస్తూ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. గురువారం రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల్లో అవగాహన ఉన్న తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ దీప నర్సింలు నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ..నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కౌన్సిల్లో కౌన్సిలర్లు అంతా ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, రాజు గౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్, సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను , అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత , రూప తదితరులు పాల్గొన్నారు.

26-02-2026

article_46865741.webp
కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి

తాండూరు, ఫిబ్రవరి 24,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో అగ్రకులాల అహంకారంతో బీసీ రజక కుటుంబానికి చెందిన గణేష్–చంద్రకళ కుటుంబంపై జరిగిన అమానుష దాడి కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై హత్య కేసు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కేసుకు సంబంధం ఉన్న వారందరిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

24-02-2026