భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, విద్యాబోధన ఎస్ఎన్జీజీఎస్ లక్ష్యం..
28-01-2026
తాండూరు, జనవరి 27 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు భారతీయ సంస్కృతి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ,దేశభక్తి పెంపొందించడమే తమ లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉన్న ప్రముఖ శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ ప్రవేటు పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వారోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, త్యాగాలు, దేశభక్తిని ప్రతిబింబించే ప్రసంగాలు, నాటికలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు.