అందరి చరిత్ర బుక్కులో రాస్తున్నాం
30-12-2025
వికారాబాద్, డిసెంబర్-29: వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై, బీఆర్ఎస్ సర్పంచులపై, అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాటులను వెంటనే అరికట్టాలని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అతి ఉత్సాహం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.