తాండూరు గడ్డమీద కాషాయ జెండా ఎగురవేస్తాం.. బిజెపి నేతలు
03-01-2026
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయ డంకా మ్రోగించి కాషాయ జెండా ఎగురవేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. శనివారం పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు ఉప్పరి రమేష్, మనోహర్ రావు, బాలేశ్వర గుప్తా, విజయ్ కుమార్, కృష్ణ ముదిరాజ్, అంతారం లలిత సాహూ శ్రీలత, సుదర్శన్ గౌడ్, భద్రేశ్వర్, బాలప్ప, మరియు బీజేవైఎం నాయకులు పాల్గొని మాట్లాడారు.