calender_icon.png 21 November, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_25208795.webp
నేషనల్ స్పోర్ట్స్ మీట్ కు యాలాల జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులు ఎంపిక

17-11-2025

తాండూరు (విజయక్రాంతి): జాతీయస్థాయిలో డిసెంబర్ నెలలో జరిగే క్రీడా పోటీలకు వికారాబాద్ జిల్లా యాలాల జడ్పిహెచ్ఎస్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్టు ప్రధాన ఉపాధ్యాయులు సిద్రామేశ్వర్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో డిస్కస్ త్రో విభాగం మొదటి స్థానంలో నిలిచిన 9వ తరగతి విద్యార్థి వి.శివ కుమార్ జాతీయస్థాయి పోటీకి ఎంపిక కాగా 3000 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానంలో నిలిచిన పదవ తరగతి విద్యార్థి సాయికిరణ్ జాతీయస్థాయి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో జరిగే స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటారని తెలిపారు.

article_28529168.webp
విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలి

17-11-2025

తాండూర్, (విజయక్రాంతి): విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకొని ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని మండల విద్యాధికారి మల్లేశం, మాదారం ఎస్సై సౌజన్యలు అన్నారు. సోమవారం మండల స్థాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని వ్యాసరచన ఉపన్యాస పోటీలను నారీ యువశక్తి ఫోరం ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఝాన్సీ లక్ష్మీబాయిని విద్యార్థినులందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

article_51526584.webp
కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయం

14-11-2025

మర్పల్లి, (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు తో కలిసి టపాకాయలు కాల్చి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో బిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత బట్టబయలు అయిందని ఇకనుండి అయిన అసత్య ఆరోపణలు మానేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో పాలన సాఫీగా సాగుతుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదేవిధంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీనీ సమాధి చేయడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్, బీసీ సెల్ ప్రెసిడెంట్ సర్వేశ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, వడ్ల వెంకటేశం, శేఖర్ యాదవ్, దివాకర్, నర్సింలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి,పాండు నాయక్, గోపాల్ నాయక్, తక్కలి శేఖర్, మన్నె సురేష్, ధరమ్ సింగ్, వినోద్ శర్మ, మహేష్, ముజ్జు, భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు