నకిలీ నోట్ల తయారీ స్థావరంపై సౌత్ జోన్ పోలీసుల పంజా
13-11-2025
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహైల్, మొహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ ఉన్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరి కె.రామేశ్వరి సహాయంతో తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్ల ముద్రణ యంత్రాంన్ని ఏర్పాటు చేసుకున్నాడు.