calender_icon.png 31 January, 2026 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_74114571.webp
మున్సిపల్ పీఠం నీదా.. నాదా!

31-01-2026

వికారాబాద్, జనవరి30: మున్సిపల్ పీఠం నీదా నాదా అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభిం చాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కాంగ్రెస్,బీఆర్‌ఎస్ పార్టీల నుండి కౌన్సిలర్ పోటీ చేసేందుకు అభ్యర్థుల నుండి పెద్ద మొత్తంలో డిమాండ్ ఉండటంతో ఈ రెండు పార్టీలు టికెట్లు కేటాయించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసిన కూడా ఇంకా ఎవరికీ అధికారికంగా టికెట్లు కేటాయిస్తునట్లు చెప్పలేదు. కొన్ని చోట్ల మాత్రం ప్రచారం ప్రారంభించుకోవాలని ఆశావాహులకు సూచిస్తున్నారు.

article_33406117.webp
పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ

30-01-2026

తాండూరు, జనవరి29 (విజయ క్రాంతి): జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

article_37854227.webp
నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

29-01-2026

తాండూరు,(విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని . ..నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

article_72619179.webp
భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, విద్యాబోధన ఎస్‌ఎన్‌జీజీఎస్ లక్ష్యం..

28-01-2026

తాండూరు, జనవరి 27 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు భారతీయ సంస్కృతి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ,దేశభక్తి పెంపొందించడమే తమ లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉన్న ప్రముఖ శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ ప్రవేటు పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వారోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, త్యాగాలు, దేశభక్తిని ప్రతిబింబించే ప్రసంగాలు, నాటికలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు.