28 February, 2026 | 12:17 PM

Districts

article_27646593.webp
నావంగిలో హుబ్లీ ట్రైన్ నిలుపుదల.. ప్రయాణికుల సమయం, డబ్బు ఆదా

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా నవాంద్గీ రైల్వే స్టేషన్ లో హుబ్లీ ట్రైన్ నిలుపుదలతో ప్రయాణికులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి హుబ్లీ రైలు బషీరాబాద్ లో నిలుపుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, స్థానిక ప్రజలందరి చిరకాల కోరిక హుబ్లీ ట్రైన్ బషీరాబాద్ లో నిలువాలని ఉండేదని నేటితో వారి కల నెరవేరిందని అన్నారు.

27-02-2026

article_68046869.webp
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు నియామకం

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీప నర్సింలను నియమిస్తూ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. గురువారం రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల్లో అవగాహన ఉన్న తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ దీప నర్సింలు నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ..నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కౌన్సిల్లో కౌన్సిలర్లు అంతా ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, రాజు గౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్, సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను , అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత , రూప తదితరులు పాల్గొన్నారు.

26-02-2026