హనుమాన్ చాలీసా పారాయణంతో బుద్ధిబలం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది
వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో 58 వ ఆదివారం శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత మాజీ సైనికుడు, పెద్దముల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు సారా విద్యాసాగర్ మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణంతో బుద్ధిబలం, జ్ఞాపకశక్తి, ధైర్యం, ఏకాగ్రత , ప్రశాంతత ,భక్తి భావం కలుగుతుందని ప్రతి ఒక్కరూ నిత్యం ఉదయం సమయంలో పది నిమిషాల పాటు పారాయణం చేయాలని కోరారు.
29-03-2026