calender_icon.png 28 January, 2026 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_72619179.webp
భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, విద్యాబోధన ఎస్‌ఎన్‌జీజీఎస్ లక్ష్యం..

28-01-2026

తాండూరు, జనవరి 27 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు భారతీయ సంస్కృతి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ,దేశభక్తి పెంపొందించడమే తమ లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉన్న ప్రముఖ శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ ప్రవేటు పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వారోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, త్యాగాలు, దేశభక్తిని ప్రతిబింబించే ప్రసంగాలు, నాటికలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు.

article_34838082.webp
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ..

23-01-2026

తాండూరు, 23 జనవరి, (విజయక్రాంతి): ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ఘటన వికారాబాద్ జిల్లా పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, డిపో మేనేజర్ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ బస్టాండ్ నుండి మెట్లకుంట వెళ్లేందుకు 11 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇదే సమయంలో కొడంగల్ వైపు నుండి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. బస్సు అద్దాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్ నారాయణ కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు వాహనాలు రోడ్డుపైన ఉండడంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

article_19657556.webp
కోర్టు ఆదేశాలు ధిక్కరణ..

22-01-2026

తాండూరు, 22 జనవరి, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శ్రీ వీరభద్రేశ్వర స్వామి వ్యాపార సముదాయంలో ఉన్న దుకాణాలు గురువారం తెరుచుకున్నాయి . అయితే ఈ దుకాణ సముదాయం చట్ట విరుద్ధంగా నిర్మించారని వీరశైవ మాజీ యువ దళ్ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ కుమార్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఈ మేరకు కోర్టు జనవరి 31 తేదీ వరకు దుకాణ సముదాయాన్ని మూసి ఉంచాలని కోర్టు ఆదేశించి స్టే విధించింది. కాగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి దుకాణాలను తెరవడం పట్ల ప్రవీణ్ కుమార్ తప్పు పట్టారు. ఈ విషయమై ఆయన మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు .సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ న్యాయం చేయాలని మరోసారి కోర్టుకు వెళ్తానని తెలిపారు .