రామాలయ పునః ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
తాండూరు, మార్చి 21,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం ఇందిరానగర్ లో పునర్ నిర్మించిన శ్రీ రామ్ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈనెల 23వ తేదీ నుండి ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నామని హిందూ సంఘాలు ,యువకులు ,మహిళలు,భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహక కమిటీ పిలుపునిచ్చారు. దాతలు, భక్తులందరి సహాయ సహకారాలతో వైభవంగా నిర్మితమైన ఈ ఏకైక రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు .ఉదయం 7 గంటల నుండి శ్రీ భద్రప్ప స్వామి హనుమాన్ దేవాలయం నుండి నూతన రామాలయం వరకు మూల విరాట్ల విగ్రహ శోభాయాత్ర ఉంటుంది.
21-03-2026