27 May, 2026 | 9:16 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

Districts - Vikarabad

article_46357674.webp
మంత్రి రిబ్బన్ కట్ చేసి 10 ఏళ్లు.. దివ్యాంగులకు దక్కని కమ్యూనిటీ హాల్

తాండూరు, మే26, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దెముల్ మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం లక్షలాది రూపాయలతో ఖర్చుపెట్టి నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను(Community Hall) పదేళ్లుగా వారికి అప్పగించకపోవడంపై రాష్ట్ర దివ్యాంగుల కమిషనరేట్ సీరియస్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే 2016లో అప్పటి మంత్రి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వికలాంగుల కమ్యూనిటీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ భవనం ఇప్పటివరకు దివ్యాంగులకు దక్కకపోవడం గమనార్హం. డిసెబిలిటీ,రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర యాదయ్య గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ శైలజ స్పందించారు. జిల్లా ప్రజా పరిషత సీఈవో, పెద్దేముల్ ఎంపీడీవో లకు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు పంపారు.

26-05-2026

article_33594113.webp
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

తాండూరు ,మే 22,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలo కందనెల్లి తండా ఊర చెరువులో "జల సంచాయ్ - జన్ భాగిదారి'' కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో తిరుమల స్వామి, సర్పంచ్ ఆనంద్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, గ్రామ కార్యదర్శి నవిత ,ఫీల్డ్అసిస్టెంట్ ఆంజనేయులు లకు సూచించారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిరక్షరాస్య కూలీలు ''ఉల్లాస్'' కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకోవాలని అన్నారు.

22-05-2026

article_29899244.webp
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి.

తాండూరు, మే 21, (విజయ క్రాంతి): భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని, టెలి కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ రంగాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం పెద్దముల్ మండల కేంద్రం ప్రధాన కూడలిలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ టెక్నాలజీని, టెలి కమ్యూనికేషన్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

21-05-2026