15 June, 2026 | 7:49 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

Districts - Vikarabad

article_58831600.webp
పోలీస్ కస్టడీలో నిందితురాలి మృతి

​తాండూర్, జూన్ 11, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ మహిళల జంట హత్య కేసులో నిందితురాలుగా ఉన్న కరీమా బేగం పోలీస్ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి వెనుక వికారాబాద్ జిల్లా కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ప్రజా సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు . గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ​ పోలీస్ కస్టడీలో సురక్షితంగా ఉండాల్సిన బాధ్యత పోలీసులదే. ఆమె ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వ్యవస్థలోని లోపాలను, విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుందని విమర్శించారు.

11-06-2026

article_38242152.webp
అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

తాండూరు, జూన్ 11,(విజయక్రాంతి): అన్ని మౌలిక సదుపాయాలకు కూడిన నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తున్నామని..మీ పిల్లల్ని మా పాఠశాలల్లోనే చేర్పించాలి అంటూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పి ఏం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దేవరీ నరేందర్ రెడ్డి గురువారం మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న వివరాలను వివరిస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనుంజయ్ సిందే, జయశ్రీ, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

11-06-2026