3 June, 2026 | 11:20 PM

Districts - Vikarabad

article_46357674.webp
మంత్రి రిబ్బన్ కట్ చేసి 10 ఏళ్లు.. దివ్యాంగులకు దక్కని కమ్యూనిటీ హాల్

తాండూరు, మే26, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దెముల్ మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం లక్షలాది రూపాయలతో ఖర్చుపెట్టి నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను(Community Hall) పదేళ్లుగా వారికి అప్పగించకపోవడంపై రాష్ట్ర దివ్యాంగుల కమిషనరేట్ సీరియస్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే 2016లో అప్పటి మంత్రి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వికలాంగుల కమ్యూనిటీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ భవనం ఇప్పటివరకు దివ్యాంగులకు దక్కకపోవడం గమనార్హం. డిసెబిలిటీ,రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర యాదయ్య గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ శైలజ స్పందించారు. జిల్లా ప్రజా పరిషత సీఈవో, పెద్దేముల్ ఎంపీడీవో లకు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు పంపారు.

26-05-2026