ద్వారకలో భగవద్గీత పారాయణం
22-01-2026
వికారాబాద్, జనవరి-21: భగవద్గీత ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గీతా వాహిని సంస్థ ఆధ్వర్యంలో ద్వారక, బెడ్ ద్వారక లో సంపూర్ణ భగవద్గీత గీతా పారాయణం నిర్వహించారు. గతంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కురుక్షేత్రం, అయోధ్య, యాదగిరిగుట్ట, ముచ్చింతలో కూడా నిర్వహించారు. భగవద్గీత ప్రపంచంలోనే జీవిత సత్యాన్ని బోధించే గ్రంథం, భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి ఈ ఉపదేశం వల్ల అందరి ప్రజల యొక్క సంక్షేమం, వ్యక్తిత్వ నిర్మాణం ఆధారపడి ఉందని గీతా వాహిని అధ్యక్షురాలు టి. శ్రీదేవి తెలిపారు.