15 June, 2026 | 2:06 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

Districts - Vikarabad

article_58831600.webp
పోలీస్ కస్టడీలో నిందితురాలి మృతి

​తాండూర్, జూన్ 11, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ మహిళల జంట హత్య కేసులో నిందితురాలుగా ఉన్న కరీమా బేగం పోలీస్ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి వెనుక వికారాబాద్ జిల్లా కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ప్రజా సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు . గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ​ పోలీస్ కస్టడీలో సురక్షితంగా ఉండాల్సిన బాధ్యత పోలీసులదే. ఆమె ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వ్యవస్థలోని లోపాలను, విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుందని విమర్శించారు.

11-06-2026

article_38242152.webp
అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

తాండూరు, జూన్ 11,(విజయక్రాంతి): అన్ని మౌలిక సదుపాయాలకు కూడిన నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తున్నామని..మీ పిల్లల్ని మా పాఠశాలల్లోనే చేర్పించాలి అంటూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పి ఏం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దేవరీ నరేందర్ రెడ్డి గురువారం మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న వివరాలను వివరిస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనుంజయ్ సిందే, జయశ్రీ, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

11-06-2026