calender_icon.png 14 November, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

Districts

article_26126761.webp
నకిలీ నోట్ల తయారీ స్థావరంపై సౌత్ జోన్ పోలీసుల పంజా

13-11-2025

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహైల్, మొహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ ఉన్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరి కె.రామేశ్వరి సహాయంతో తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్ల ముద్రణ యంత్రాంన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

article_86792081.webp
తాండూరు డీఎస్పీ బీకే రెడ్డి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్

13-11-2025

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ డీఎస్పి బాలకృష్ణ రెడ్డిని(Tandur DSP BK Reddy) డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత 21 నెలల పాటు తాండూరు డీఎస్పీగా విధులు నిర్వహించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగలేదంటూ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాలు అప్పట్లో డిమాండ్ చేశాయి. సౌమ్యుడిగా ప్రజలతో మమేకమై విధులు నిర్వహించిన డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి బదిలీ వేటు వేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా నూతన డీఎస్పీగా రాష్ట్ర పౌర సరఫరా శాఖలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యాదయ్యను నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై హఠాత్తుగా బదిలీ వేటు పడడం తో తాండూర్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం మారింది.

article_50618019.webp
ఘనంగా సీఎం బర్త్ డే వేడుకలు

08-11-2025

మర్పల్లి (విజయక్రాంతి): మర్పల్లి మండల కేంద్రలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మర్పల్లి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పథకాలను అమలు చేస్తున్నాన్నారు. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు పండ్లను అందించారు.