calender_icon.png 16 June, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_11125626.webp
కార్మికుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం

14-06-2025

అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్(Former MP Seetaram Naik) పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో వికాసిత్ భారత్ 2047 కలను సహకారం చేసేలా అన్ని రంగాల్లో దేశాన్ని ఆత్మ నిర్బార్ భారత్ దిశగా శరవేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం అవసరమన్నారు. శనివారం అనంతగిరి మండలం కొత్త గోల్ తండా గ్రామంలో గిరిజన మోర్చా నియోజకవర్గ ఇన్చార్జి బానోతు అనుష ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్టి మోర్చా రచ్చబండ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

article_86141470.webp
ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు పుస్తకాల పంపిణీ

12-06-2025

మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో గురువారం ప్రాథమిక పాఠశాల నందు 1 తరగతి నుండి 5వ తరగతి వరకు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 6 నుండి 10 తరగతి వరకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేసి అనంతగిరి మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు(Former MPP Chunduru Venkateswara Rao) వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వారు అందించే ఉచిత యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ స్కూళ్లలో విద్య అభ్యసించాలని వారు సూచించారు.

article_88365031.webp
వికసత కృషి అభియాన్ ద్వారా భూసార పరీక్షలపై అవగాహన

07-06-2025

మండల కేంద్రంలోని రైతువేదికలో 'వికసత కృషి అభియాన్(Viksit Krishi Abhiyan)' శిక్షణ కార్యక్రమం నిర్వహించి నూతన వ్యవసాయ పద్ధతులపై దృష్టి సాధించాలని శాస్త్రవేత్తలు, రైతులు శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తే ఆదాయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు పంటలు సాగు చేసుకోవాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ అర్ గోబినాథ్, కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ తెలిపారు. రైతులకు రాపిడ్ మినీ సాయిల్ టెస్టు కిట్ ద్వారా మట్టిని పరీక్షించి రైతులకు పోషక లభ్యతను వివరించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ... రానున్న ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని పంటల సాగులో సుస్థిరమైన పద్ధతులు, శాస్త్రీయతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.