అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
26-11-2025
తాండూరు (విజయక్రాంతి): జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, సహజ వనరులు అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్నేహ మెహరా హెచ్చరించారు. ఇసుక, ఎర్రమట్టి, ఎర్ర రాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా కఠిన చర్యలకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరులను తరలిస్తున్న వారిపై నిఘా పెంచి, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.