calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_31140814.webp
గొల్ల చెరువు అన్యాక్రాంతం.. ఎన్‌జీటీలో ఫిర్యాదు

18-09-2025

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు అన్యాక్రాంతంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై(ఎన్‌జీటీ)లో ఫిర్యాదు దాఖలు అయింది. తాండూరు సిటీజన్స్ వెల్ఫేర్ సోసైటీ(టీసీడబ్ల్యూఎస్) అధ్యక్షులు, సామాజికవేత్త రాజ్ గోపాల్ సార్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు. గొల్ల చెరువు అన్యాక్రాంతం... కుంచించుకుపోతున్న అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం ముఖ్య కార్యదర్శి, తాండూరు సబ్ కలెక్టర్, ఇరిగేషన్, తహసీల్దార్లు, పురపాలక సంఘం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు రాజ్ గోపాల్ సార్డా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

article_64388180.webp
కన్నెత్తి చూడని గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు

18-09-2025

అనంతగిరి: మండల పరిధిలోని రంగయ్య గూడెం గ్రామంలో వీధి దీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నాయని సయ్యద్ సిరాజ్ అన్నారు. గురువారం పత్రిక ప్రకటన ద్వారా మాట్లాడుతూ మా గ్రామం చీకట్లు కమ్ముకుంటున్నాయి. వీధిలైట్ల నిర్వహణ పారిశుద్ధ్యం ఇతరత్రా సమస్యలు గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. సుమారుగా వర్షాకాలం స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు గడుస్తున్నా.. రంగయ్య గూడెం గ్రామంలో పాములు పురుగులు వస్తున్న వీధిలైట్లు వెలగక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని గ్రామవాసి సిరాజ్ మండిపడ్డారు. కనీసం పారిశుద్ధ్యం త్రాగునీరు సమస్యను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం బ్లిజంగ్ పౌడర్ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది చల్లడం లేదని అన్నారు. ఇంట్ల ఈగలతో బయట దోమలతో రకరకాల జ్వరాలు వస్తున్నాయి అని, అధికారులపైన తీవ్రంగా ఆరోపించారు.

article_52357247.webp
స్వచ్ఛ తాండూరు..

18-09-2025

తాండూరు (విజయక్రాంతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని తద్వారా ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించుకోవచ్చు అన్న మహాత్మా గాంధీ కలలు కన్నా భరతావనిని తయారు చేసుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ అన్నారు. గురువారం ఆయన బిజెపి నాయకులతో కలిసి పట్టణ శివారులో ఉన్న ప్రముఖ రసూల్ పూర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ వరకు నియోజకవర్గంలో స్వచ్ఛ తాండూర్ తో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

article_15363861.webp
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

17-09-2025

తాండూరు (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ పట్టణంలో బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలిగి దేశ ప్రజలకు సేవలు అందించేలా చూడాలని... ప్రపంచంలో భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టేందుకు మోడీకి సర్వశక్తులు ఇవ్వాలని ఆ కాళికాదేవిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం భారీగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

article_70464725.webp
తట్టేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం..

16-09-2025

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దముల్ మండలం తట్టేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేడు అటవీ ప్రాంతం నుండి పంట పొలాల మీదుగా చిరుత పులి వెళ్ళినట్టుగా గుర్తించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తాండూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి, సెక్షన్ బీట్ అధికారులు స్వప్న, నాగ సాయిలు అటవీ ప్రాంతంలో చిరుత ఆనవాళ్ళ కోసం గాలించారు. ఈ సందర్భంగా అధికారులకు మాట్లాడుతూ చిరుత అడుగులుగా గుర్తించామని పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అన్నారు.

article_87083663.webp
సమస్యలు పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్..

16-09-2025

తాండూరు (విజయక్రాంతి): తాండూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ యాదగిరి(Municipal Commissioner Yadagiri) అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందితో కలిసి ఇందిరానగర్ ప్రాంతం ఐదు ఆరు వార్డుల్లో పర్యటించారు. మురుగు కాల్వలో ఉన్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. వీధి దీపాలు, తాగునీరు వార్డుల్లో సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. భారీగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాల శుభ్రత పాటించాలని దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నీరు నిల్వ ఉన్నచోట జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.