calender_icon.png 24 December, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_48875683.webp
పీవీ వర్ధంతి వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు

23-12-2025

మంథని,(విజయక్రాంతి): మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆ మహానాయకునికి మంగళవారం మంథని క్యాంప్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూరదృష్టి కలిగిన నేత పీవీ గారని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లి, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. బహు భాషావేత్తగా, పండితుడిగా, రచయితగా వారు అనేక రంగాల్లో భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచారని అన్నారు. పీవీ దూరదృష్టి, సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, వారి ఆలోచనలు, ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

article_89850902.webp
మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి

23-12-2025

పెద్దపల్లి, డిసెంబర్-22(విజయ క్రాంతి): మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు.సోమవారం అదనపు కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకట స్వామి (కాక) వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మారు మూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు వెంకట స్వామి (కాక) కేంద్ర మంత్రిగా, వివిధ పదవులు చేపట్టి, ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వ కారణమన్నారు.

article_27144112.webp
కాంగ్రెస్ సర్కార్‌లో విద్యకు ప్రాముఖ్యత

23-12-2025

సుల్తానాబాద్, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థుల కోసం దాదాపు 45 రోజుల పాటు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. .విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఇబ్బందులు పడి సమయం వృధా కాకుండా ఉండటం కోసం తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.