చెక్ డ్యాములు, బ్రిడ్జిలు కూలిపోవడంపై మాజీ మంత్రే బాధ్యత వహించాలి
28-11-2025
మంథని, నవంబర్ 27విజయ క్రాంతి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు పై నాణ్యత లేకుండా నిర్మించిన చెక్ డ్యాములు కూలిపోవడం పై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావే బాధ్యత వహించాలని గురువారం మంథనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిపిసిసి ఎన్నికల కమీషన్ కో ఆర్డినేషన్ కమీటి సభ్యుడుశశిభూషణ్ కాచే అన్నారు. మానేరు పై దాదాపు రూ. 300 వందలు కోట్లతో నిర్మించిన చెక్ డ్యాములు, ఓడేడు మానేరు పై నిర్మించిన బ్రిడ్జి గాలివానకే కొట్టుకుపోయింది నిజం కాదా అని బీఆర్ఎస్ నాయకులను కాచే ప్రశ్నించారు.