మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞశాలి
మంథని, జూలై 10(విజయ క్రాంతి): మాజీ ఎమ్మెల్సీ మంథని మేధావి, కవి, రచయిత మరియు నిరంతర రాజకీయ పోరాటయోధుడు స్వర్గీయ గీట్ల జనార్ధన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. గీట్ల జనార్దన్ రెడ్డి 88వ జయంతి వేడుకలు మంథని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి చైర్మన్ పలువురు ప్రముఖులతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రగోతం రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఆకుల రాజ బాపు, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.
10-07-2026