26 April, 2026 | 4:45 PM

Districts - Peddapalli

article_87484041.webp
ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

సుల్తానాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): వాసవి మాత జయంతి వేడుకల ను అధికారికంగా నిర్వహించేందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో విడుదల చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనం ఆవరణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు , మంత్రులకు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చిత్రపటాల తో ఉన్న ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది,

24-04-2026

article_38558931.webp
మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన గంధం నగేష్,(55) శ్రీ రామ ఫోటో స్టూడియో యజమాని, వడ దెబ్బతో ఆకస్మికంగా మృతి చెందాడు. విధినిర్వహణలో ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి కర్ణ వేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చే క్రమంలో కస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఫోటోగ్రాఫర్ నగేష్, మృతి పట్ల మంథని పట్టణంలోని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు దిగ్బాంతి వ్యక్తం చేశారు.

24-04-2026