calender_icon.png 8 February, 2026 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29059480.webp
మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు చేతి గుర్తుకు ఓటు వేయాలి

07-02-2026

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేయాలని, విద్యావేత్త అయిన సీనియర్ వకీల్ సాబ్ ముసుకుల సురేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీపిసిసిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ప్రజలను కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డికి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ కూచిరాజ్‌పల్లి ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరుగుతుందని,