calender_icon.png 8 January, 2026 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_28882234.webp
అభివృద్ధిపై మాట్లాడే అర్హత పుట్ట మధుకు లేదు

08-01-2026

ముత్తారం, జనవరి 7(విజయక్రాంతి): ముత్తారం మండల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని బుధవారం ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మండలం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధు ముత్తారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడడం సరికాదన్నారు.

article_41345658.webp
శాటిలైట్ సర్వేలైన్స్‌తో అక్రమాలకు బ్రేక్

08-01-2026

సుల్తానాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): శాటిలైట్ సర్వే ద్వారా త్వరలోనే అక్రమాలకు బ్రేక్ పడనుందని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, కేజీ వీల్స్ తో వాహనాలు రోడ్డు పైకి వస్తే భారీ జరిమాణాలు విధించడం జరుగుతుందని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ అన్నారు, బుధవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణ లో కేజీ వీల్స్ వాడకంపై , ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎసిపి గజ్జి కృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత శాటిలైట్ సర్వే లైన్స్ ఏర్పాటు అవుతాయని, పోలీసులు కార్యాలయాల్లో ఉన్నప్పటికీ వాహనాల ద్వారా ఇసుకతో పాటు ఏలాంటి అక్రమాలకు పాల్పడిన తమకు తెలుస్తుందని, అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.