calender_icon.png 1 July, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_40983180.webp
మంత్రి శ్రీధర్ బాబు నటుడు కాదు ఒక హీరో

29-06-2025

మంథని నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రజల కోసం ఒక హీరో లాగా సేవ చేస్తున్న నాయకుడైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) నటుడు కాదని ఆయన ఒక హీరో అని హీరో శ్రీధర్ బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరిన పుట్ట మధుకు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి(Manthani Block Congress President Thotla Tirupati) యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రామగిరి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తు ఉంటే, నాకు నా రాజకీయ జీవితం ప్రశ్నార్తకంగా మారే విధంగా ఉందని మాజీ నాయకుడు పుట్ట అక్కసు వెళ్ళబోతున్నాడని విమర్శించారు.

article_79697389.webp
మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి

28-06-2025

మంథని,(విజయక్రాంతి): మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంథని ప్రాంతంలో మౌలిక సదుపాయాల పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం, రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. గోదావరి నదిపై మంథని నుంచి శివారం వరకు 125 కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు,162 కోట్ల రూపాయలతో మంథని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లైన్ రింగ్ రోడ్డు పనులకు, 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు.

article_74409494.webp
మంథనిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

28-06-2025

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో శుక్రవారం రాత్రి బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పరామర్శించారు. పట్టణంలోని మర్రివాడకు సంబంధించిన మంథని హమాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మున్నూరు కాపు డివిజన్ మాజీ అధ్యక్షులు,కార్మిక నాయకులు బాసాని రాజయ్య ఇటీవల మృతిచెందిగా పెంజేరు కట్ట లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రిటైర్డ్ సీఈ దేవల్ల తులసి దాస్ తల్లి దేవల్ల రత్నమ్మ కుటుంబాన్ని, అవధానుల నరసింహ శర్మ,రమేష్ గార్ల మాతృమూర్తి అవధానుల జయప్రద మరణించగా పోచమ్మ వాడ చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సార్ల సంపత్ తండ్రి సార్ల బాణయ్య మరణించగా బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ గౌడ్ అత్తమ్మ ఇటీవల మరణించగా వల్ల ఇంటికి వెళ్లి వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.