calender_icon.png 20 December, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_63264560.webp
టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

20-12-2025

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఎస్ జిఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి 14 సంవత్సరాల బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఈ వర్షిత,టి అభిజ్ఞ శ్రీ, ఏం సంప్రీత్ లు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు హైదరాబాదు లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు. హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్, మమత విద్యార్థులు పాల్గొన్నారు.

article_66772541.webp
గోపా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయండి

18-12-2025

సుల్తానాబాద్ (విజయక్రాంతి): గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గోపా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా గోపా ప్రతినిధి బుర్ర జగదీశ్వర్ గౌడ్ అన్నారు గోపా స్వర్ణోత్సవాలకు సంబంధించి పోస్టర్ ను గురువారం సుల్తానాబాద్ లోని గౌడ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ జాతి ఎదుర్కొంటున్న సమస్యలు, యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయ రంగంలో గౌడ ప్రాతినిధ్యంపై ఈనెల 26న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గోపా సరోత్సవాలకు అధిక సంఖ్యలో గౌడ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.