Districts - Peddapalli

జిల్లాలో వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
జిల్లాలో వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

పెద్దపల్లి, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి) వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పెద్దపల్లి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

19-09-2026 | 06:38pm