4 August, 2026 | 2:18 PM

Breaking News

హైదరాబాద్‌లో పలుచోట్ల హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీలు   •   ప్రజల్లో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి   •   మృతుడి కుటుంబానికి మాజీ సుడా చైర్మన్ పరామర్శ   •   విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై దృష్టి   •   విమాన ప్రయాణీకుల భద్రతపై తీసుకుంటున్న చర్యలేంటీ?   •   ఓటరు జాబితా సవరణలో నర్సాపూర్ ఆదర్శంగా నిలవాలి   •   ఏటీసీ సెంటర్ కు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   34.10 టి.ఎం.సి.లకు చేరిన ఎస్సారెస్పీ నీటి మట్టం   •   ఐదవ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు   •   రాహుల్ గాంధీకి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే   •  

Districts - Peddapalli

article_61080675.webp
గొట్టం మల్లయ్య జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

సుల్తానాబాద్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): గొట్టం మల్లయ్య జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు, పట్టణంలోని 9వ వార్డులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి ఒక సీలింగ్ ఫ్యాన్‌ను బహుకరించారు.అలాగే దర్గా వీధిలోని ఉర్దూ పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లను అందజేశారు. అనంతరం పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో భోజనం ఏర్పాటు చేసి దివ్యాంగులకు ప్రేమతోభోజనంవడ్డించారు. గొట్టం మల్లయ్య సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, వారి కుటుంబ సభ్యులు సమాజ సేవే లక్ష్యంగా ఈకార్యక్రమాలను నిర్వహించడంఅభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, శ్రేయోభిలాషులుపాల్గొన్నారు.

03-08-2026