Districts - Peddapalli

రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థులు
రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థులు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఇటీవల సుల్తానాబాద్‌‎లోని ఎస్‌ఎన్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ముగ్గురు విద్యార్థులు పతకాలు సాధించి 17న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీలకు అర్హత సాధించారు.15సంవత్సరాల బాలుర విభాగంలో ఎన్‌.సహర్ష్‌ బంగారు పతకం సాధించాడు.

16-09-2026 | 02:31pm