తాడిచర్లలో ఏఎంఆర్ కంపెనీ నిర్లక్ష్యం… ప్రాణాలతో చెలగాటం
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ మల్హర్ మండలం తాడిచర్ల లోని ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన భారీ వాహనాల రాకపోకలతో తాటిచర్ల నుంచి ఖమ్మంపల్లి, కొయ్యూరు కు పెద్దతుండ్ల, చిన్నతుండ్ల కు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ఛిద్రమైంది. అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారినా, వాటిని పూడ్చడంలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
01-09-2026 | 07:45pm