రాజాపూర్ సమస్య పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ వద్దు
మంథని, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఆర్జీ-3 ఓసీపీ-2 విస్తరణలో భూసేకరణ, పునరావాసానికి సంబంధించి రాజాపూర్ గ్రామ ప్రజల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ నిర్వహించవద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సెప్టెంబర్ 16న నిర్వహించనున్న అవార్డు ఎంక్వైరీని నిలిపివేయాలని స్పష్టం చేశారు. రాజాపూర్ పరిధిలోని ఇళ్లు, ఇతర అంశాలను ఆర్పీఎన్, ఆర్టిహెచ్ విభాగాలుగా విభజించినప్పటికీ, పబ్లిక్ నోటిఫికేషన్లో ఆర్పీఎన్ నంబర్లనే చేర్చడంతో సుమారు 500 కుటుంబాల సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోయిందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
05-09-2026 | 07:06pm