28 August, 2026 | 12:25 PM

Districts - Peddapalli

article_25776046.webp
మంథనిలో శర్మల ఆధ్వర్యంలో ఘనంగా నూతన యజ్ఞోపవీత ధారణ

మంథని, ఆగస్టు 28 (విజయక్రాంతి): మంథని పట్టణంలో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు జరిగాయి. తమ్మి చెరువుకట్ట వీధిలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వేద పండితులు అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులకు సంప్రదాయ పద్ధతిలో నూతన యజ్ఞోపవీతాలను ధరింపజేశారు.

28-08-2026