ఎమ్మెల్యే విజయ రమణారావును సన్మానించిన సుల్తానాబాద్ రైతులు
సుల్తానాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో గత రెండు మాసాలుగా సాగిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కలగకుండా అత్యంత విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను గురువారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ను సుల్తానాబాద్ రైతులు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు, రైతు ప్రతినిధులు ఎమ్మెల్యే కి పూలమాలలు వేసి , శాలువా కప్పి, కృతజ్ఞతలుతెలియజేశారు.
11-06-2026