గర్రెపల్లిలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత రామయ్యకు సన్మానం
సుల్తానాబాద్, సెప్టెంబర్ 1 (విజయ కాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన జానపద కళాకారుడికి రాష్ట్రపతి అవార్డు రావడం తమ గ్రామానికి గర్వకారణం అని గ్రామస్తులు అన్నారు, గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దుర్శేటి రామయ్య ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గర్రెపల్లి గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు కన్న రమేష్ , కస్తూరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గర్రెపల్లి చెరువు వద్ద శివుడి విగ్రహం ఎదుట రామయ్యను ఘనంగా సన్మానించారు.
01-09-2026