25 July, 2026 | 7:00 PM

Districts - Peddapalli

article_65020456.webp
శ్రీపాదరావు సోదరి వనమాల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

మంథని, జూలై 25(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి శ్రీమతి సువర్ణ వనమాల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, తెలంగాణ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం మంథనిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సువర్ణ వనమాల చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

25-07-2026

article_85093308.webp
తాహసిల్దార్ ఎదుట ఇద్దరి బైండోవర్

సుల్తానాబాద్, జులై 24 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ ఆదేశాల మేరకు నాటు సారా మరియు పటిక అమ్మిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, ఇద్దరు మహిళలను కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు ఎదుట శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై చిరంజీవి తెలిపారు, పెగడపల్లి కి చెందిన జట్ పట్ వసంత ,.అంతటి లక్ష్మీ వీరిని శ్రీరాంపూర్ తహసీల్దార్ ముందు ఒక లక్ష రూపాయలు పూచీకత్తు కు బైండోవర్ చేయటం జరిగింది అన్నారు , అలాగే,వీరి నుండి 25 కిలోల పటిక మరియు 8 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు,

24-07-2026