19 July, 2026 | 5:29 PM

Districts - Peddapalli

article_88605485.webp
అయ్యప్ప దేవాలయంలో మెట్లపూజ

సుల్తానాబాద్, జూలై 19 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్లో గల అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు అభిషేకం, మెట్ల పూజ, పడిపూజ, హోమం నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రెండు నెలలుగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు హోమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాయిరీ మహేందర్, అర్చకులు లక్ష్మణ శర్మ, సాయినాథ్, గురు స్వామి మురళీధర్, శశాంక్, వెంకటేష్ భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

19-07-2026

article_55299982.webp
ముత్తారం మాజీ జడ్పీటీసీకి పరామర్శ

ముత్తారం, జూలై 19(విజయక్రాంతి): ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం తండ్రి లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, శనివారం ముత్తారం ప్రెస్ క్లబ్ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రెస్ క్లబ్ సభ్యులు, చొప్పరి సదానందం మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఏలువాక కుమారస్వామి, అధ్యక్షుడు కొడారి మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి అక్కల నారాయణ, కార్యదర్శి వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిప్ప రాజేశం, అనుము వీరస్వామి, కాసు తిరుపతి యదవ్, మల్యాల దేవేందర్, అలువోజు రాకేష్ తమ సానుభూతిని తెలియజేశారు.

19-07-2026

article_74944029.webp
గోరింటా మెరిసే... మగువా మురిసే

సుల్తానాబాద్ , జూలై 19 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య మహిళలు శ్రీ కన్యకా పరమేశ్వరి (వాసవి మాత) దేవాలయం లో గోరింటాకు వేడుకల ను ఆదివారం వైభవంగా నిర్వహించారు... ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చేతులకు, కాళ్ళకు గోరింటాకును పెట్టారు,మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో మహిళలమంతా గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు, మహిళల తో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ గా వస్తుంది.పెళ్ళికి ముందుకూడాగోరింటాకుపెట్టుకుంటారు.అలా పెట్టుకోవడం ద్వారా అది ఎర్రగా పండితే వారి ప్రేమ అంత సౌఖ్యంగా ఉంటుంది అని మహిళలు ఆన్నారు, గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, అలాగే కాళ్లు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్లదనంగా ఉంటుందని మహిళలు తెలిపారు.... మహిళలంతా సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు...

19-07-2026

article_35090459.webp
ప్రధాన రహదారిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లు.. ప్రాణాలకు ముప్పు రోడ్డుపక్కనే

ముత్తారం, జూలై 19(విజయ క్రాంతి) ముత్తారం ప్రధాన రహదారిపై రోడ్డు పక్కనే ఎలాంటి రక్షణ కంచె లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లు(Electrical transformers) ప్రమాదానికి ఆహ్వానం పలుకుతోంది. ముత్తారం కాసర్లగడ్డ బాస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వద్దకు వేళ్లే ప్రధాన రాహదారి పై నిత్యం వందలాది వాహనాలు, పాదచారులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ కో కార్యాలయం కూడా పోలీస్ స్టేషన్ వెనుకాలే ఉండడంతో అధికారులకు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

19-07-2026

article_67752915.webp
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యతను పెంపొందించే లక్ష్యంతో శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ ఎన్నికలను నిజమైన ఎన్నికల మాదిరిగా నిర్వహించారు. ఓ వైపు పాఠశాల విద్యార్థి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టగా, మరోవైపు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో పోలింగ్‌, ఓటింగ్‌, కౌంటింగ్‌ విధానాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం విశేషంగా నిలిచింది.పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

18-07-2026

article_43425552.webp
బీజేపీతో దేశానికి ప్రమాదం

ధర్మపురి,జూలై18(విజయక్రాంతి): బీజేపీతో దేశానికే ప్రమాదం ఉందనీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఏకపక్ష నిర్ణయాలతో అన్నీ వర్గాలకు నష్టం వాటిల్లే బిల్లులు ప్రవేశ పెడుతున్నారనీ ధ్వజం ఎత్తారు. యూరియా ఆప్ తో రైతులకు తీరనీ అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనీ,కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ ప్రజల్లో గుర్తుంపు వస్తుందేమోనన్న భయాందోళనలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత భయమో తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారనీ బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, గుండాటి సందీప్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు,నాయకులు బందేల ఉదేయ్ గౌడ్,నక్క సురేష్,గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

18-07-2026