7 March, 2026 | 10:41 PM

Districts

article_67198417.webp
అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం వేడుకలు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సాంబశివ దేవాలయం ఆవరణ లో శ్రీ గంగా భవాని సమేత శ్రీ సాంబశివ కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగ జరిగాయి, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించారు, మోక్కులు చెల్లించుకున్నారు, అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ కళ్యాణి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు సాయి ప్రణవ్ శర్మ , మల్లికార్జున్ శర్మ , చంద్రశేఖర్ శర్మ, లక్ష్మణ్ శర్మ, వల్ల కొండ మహేష్ , రామన్న శర్మ, ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, పురం శ్రీ రాజ్ చక్రవర్తి , అభిషేక్ శర్మ , వైష్ణవి , శివపార్వతుల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఆలయ చైర్మన్ పల్లా సదా లక్ష్మీ మురళీధర్ దంపతులతో పాటు పలువురు దంపతులు స్వామి వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు, ఈ కార్యక్రమం చైర్మన్ పల్లా మురళీధర్ , పల్ల శరత్ ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి, కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు..

06-03-2026

article_29682293.webp
ముత్తారం మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్య గుండెపోటుతో మృతి

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల రాజయ్య శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు.‌ కుటుంబ సభ్యులు స్థానికుల కథనం రాజయ్య ఉదయం గుండె నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ వైద్యునికి చూపించగా అతను వెంటనే పెద్ద పెళ్లికి వెళ్లాలని తెలుపటంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతుండగా, మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ కు రాజయిన తరలిస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందినట్లు తెలిపారు.

06-03-2026