17 July, 2026 | 6:06 PM

Districts - Peddapalli

article_74680680.webp
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్ విద్యార్థి ఎంపిక

సుల్తానాబాద్, జూలై 17 (విజయకాంతి): పెద్దపల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ (ఐపీఎస్) విద్యార్థి ఎం. సంప్రీత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 12న సుల్తానాబాద్‌ లో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జరిగిన 1000 మీటర్ల పరుగు పందెంలో సంప్రీత్ గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు. ఈ విజయంతో ఈ నెల 18న మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే అర్హతను దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థి సంప్రీత్ ను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు శుక్రవారం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించి పాఠశాలకు,సుల్తానాబాద్‌కు మంచి పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థి విజయం పాఠశాలకు గర్వకారణమనిపేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత, మేనేజర్ శివ, పీఈటీలు సత్యం, సతీష్ , జ్యోతి తదితరులు పాల్గొని సంప్రీతిను అభినందించారు.

17-07-2026

article_78227408.webp
ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ముత్తారం, జులై 15(విజయ క్రాంతి): ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సంక్షేమం, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని మంథని డివిజన్ అధ్యక్షుడు, కరీంనగర్ జోనల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.వి. చారి తెలిపారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ గుర్తింపు తదితర అంశాలపై సంఘం తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సభ్యుల ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని డాక్టర్ చారి స్పష్టం చేశారు.

15-07-2026