calender_icon.png 8 February, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29059480.webp
మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు చేతి గుర్తుకు ఓటు వేయాలి

07-02-2026

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేయాలని, విద్యావేత్త అయిన సీనియర్ వకీల్ సాబ్ ముసుకుల సురేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీపిసిసిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ప్రజలను కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డికి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ కూచిరాజ్‌పల్లి ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరుగుతుందని,

article_59501660.webp
మైన్స్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన ఏఐటీయూసీ

06-02-2026

శ్రీరాంపూర్, ఫిబ్రవరి 5: యాజమాన్యం మొండి వైఖరినీ నిరసిస్తూ గురు వారం శ్రీరాంపూర్ ఓసీలో నిర్వహించే మైన్స్ కమిటీ సమావేశాన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు బహిష్కరించారు. ఈ సందర్భం గా ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ మోతె లచ్చన్న మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసిపిలో గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సమావేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక కీలక సమస్యలను ప్రస్తావించినప్పటికీ, యాజమాన్యం వాటిలో ఏ ఒక్క సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే, భవిష్యత్తులో మరింత కఠినమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని యాజమాన్యాన్నీ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.

article_64457366.webp
గెలుపునకు దగ్గరలో వకీల్ సాబ్

06-02-2026

మంథని ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మంథని పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు అధికార కాం గ్రెస్ పార్టీ ఖాతాలో పడనుంది. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది ముస్కుల సయేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్లడమే గాక దాదాపు గెలుపునకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక సర్వేలన్నీ ఆయనకి అనుకూలంగా వస్తుండడంతో 5వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు దా దాపు లాంఛన ప్రాయం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి శ్రీధర్ బాబు సుపరిపాలన ప్రచార అస్త్రంగా జనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రజలనుంచి కూడా ఆశీర్వాదాలు అందుకుంటున్నాడు.

article_22750832.webp
మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు

06-02-2026

మంథని,ఫిబ్రవరి ౫(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పాల్గొన్నారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను ఈ నెల 11 తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంథని పట్టణ ప్రజలు అభివృద్ధికి భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, అభ్యర్థులు ముసుకుల సురేందర్ రెడ్డి, శ్రీపది బానయ్య, దధితరులు పాల్గొన్నారు.