రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు
రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరిఖని 1-టౌన్, 2-టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడవడిక కలిగిన వారితో కౌన్సిలింగ్ నిర్వహించారు.
11-05-2026