calender_icon.png 17 January, 2026 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_21500425.webp
సురక్షిత ప్రయాణమే అరైవ్-అలైవ్ ముఖ్య లక్ష్యం

17-01-2026

గోదావరిఖని, జనవరి,16(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్ర జల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రా రంభించిన ఆర్రైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని 1- టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుం డం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్ అండ్ బి శాఖ, తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీతో పాటు అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

article_16151333.webp
అరైవ్ - అలైవ్ ముఖ్యలక్ష్యమే సురక్షిత ప్రయాణం

16-01-2026

గోదావరిఖని,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యం తో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆర్రైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని 1- టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్ అండ్ బి శాఖ, తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీతో పాటు అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

article_35193060.webp
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

16-01-2026

సుల్తానాబాద్,(విజయక్రాంతి): యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుందని సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కీర్తిశేషులు బండ నీలమ్మ కొమురయ్య లా జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు బండ రవీందర్ పుష్పలత దంపతులు ఏర్పాటు చేసిన గట్టపల్లి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్సై చంద్రకుమార్ ప్రారంభించారు, ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది, అనంతరం జరిగిన సమావేశం లో చంద్రకుమార్ మాట్లాడుతూ క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు.

article_20728988.webp
గృహ జ్యోతిని పిల్లల చదువులకు ఉపయోగించుకోండి

16-01-2026

ముత్తారం,(విజయక్రాంతి): గృహ జ్యోతి పథకంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పిల్లల చదువులకు ఉపయోగించుకోవాలని మండలంలోని ఖమ్మంపల్లి, సీతంపేట, రామకృష్ణాపూర్ లలో ప్రజలకు అవగాహనలో మంథని ట్రాన్స్ కో సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజా ప్రభుత్వం గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందని, మీరు వాడిన బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థకు చెల్లిస్తుందని, విద్యుత్ బిల్లుల ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, మీ ఆరోగ్యం, కుటుంబా అవసరాలకు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 52. 82. 498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులు ద్వారా లబ్ధి పొందారని, సుమారు మూడు కోట్ల 593 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపల్లి లైన్ మెన్ కుమారస్వామి, అసిస్టెంట్ లైన్ మెన్ రాజేష్, సిబ్బంది నాగరాజు నితిన్ తదితరులు పాల్గొన్నారు.