ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ముత్తారం,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా ముత్తరం మండల కేంద్రంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అలువోజు రవీందర్, ఉప సర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు చల్ల సమ్మయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పప్పు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
11-04-2026