24 May, 2026 | 4:04 PM

Districts - Peddapalli

article_89808798.webp
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

సుల్తానాబాద్, మే 21 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ,జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ సూచనల మేరకు మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బషి రుద్దీన్ కి గురువారం వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలిపారు.

21-05-2026