calender_icon.png 7 February, 2026 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_59501660.webp
మైన్స్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన ఏఐటీయూసీ

06-02-2026

శ్రీరాంపూర్, ఫిబ్రవరి 5: యాజమాన్యం మొండి వైఖరినీ నిరసిస్తూ గురు వారం శ్రీరాంపూర్ ఓసీలో నిర్వహించే మైన్స్ కమిటీ సమావేశాన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు బహిష్కరించారు. ఈ సందర్భం గా ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ మోతె లచ్చన్న మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసిపిలో గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సమావేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక కీలక సమస్యలను ప్రస్తావించినప్పటికీ, యాజమాన్యం వాటిలో ఏ ఒక్క సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే, భవిష్యత్తులో మరింత కఠినమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని యాజమాన్యాన్నీ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.

article_64457366.webp
గెలుపునకు దగ్గరలో వకీల్ సాబ్

06-02-2026

మంథని ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మంథని పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు అధికార కాం గ్రెస్ పార్టీ ఖాతాలో పడనుంది. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది ముస్కుల సయేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్లడమే గాక దాదాపు గెలుపునకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక సర్వేలన్నీ ఆయనకి అనుకూలంగా వస్తుండడంతో 5వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు దా దాపు లాంఛన ప్రాయం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి శ్రీధర్ బాబు సుపరిపాలన ప్రచార అస్త్రంగా జనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రజలనుంచి కూడా ఆశీర్వాదాలు అందుకుంటున్నాడు.

article_22750832.webp
మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు

06-02-2026

మంథని,ఫిబ్రవరి ౫(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పాల్గొన్నారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను ఈ నెల 11 తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంథని పట్టణ ప్రజలు అభివృద్ధికి భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, అభ్యర్థులు ముసుకుల సురేందర్ రెడ్డి, శ్రీపది బానయ్య, దధితరులు పాల్గొన్నారు.

article_45469724.webp
జిల్లాలో పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

06-02-2026

పెద్దపల్లి, మంథని, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం మండలంలోని గోలివాడ, రామగుండం, గోదావరిఖని సమ్మక్క సారలమ్మ టెంపుల్, రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ , మంథని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వద్ద రోజుకు 30 వేల భక్తులు వస్తారనే అంచనా తో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

article_47478953.webp
సుల్తానాబాద్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ

05-02-2026

సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు యువ మహిళా న్యాయవాది స్వప్న ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి అన్నారు. ఈ దారుణ హత్యకు నిరసనగా గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు హేయమైన చర్య అని, వారి రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొయిని భూమయ్య , న్యాయవాదులు భూసారపు బాల కిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు, ఆకారపు సరోత్తం రెడ్డి, జోగుల రమేష్, చిలుక ఆనంద్, వంగళ యుగేందర్ రెడ్డి, వేముల స్నేహ తదితరులు పాల్గొన్నారు.