11 July, 2026 | 8:42 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

Districts - Peddapalli

article_56148769.webp
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం కుటుంబాన్ని పరామర్శించిన దుద్దిళ్ల శ్రీను బాబు

ముత్తారం, జూలై 11(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం తండ్రి చొప్పరి లింగయ్య శుక్రవారం ఉదయం మృతి చెందడంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీను బాబు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సదానందం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్రీనుబాబు వెంట ముత్తారం సింగిల్ విండో చైర్మన్ యాదగిరిరావు, మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వినీత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల కిరణ్, అజీమ్ ఖాన్, సూదాటి సంపత్‌రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

11-07-2026