calender_icon.png 13 January, 2026 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_59627831.webp
నా కుటుంబంపై ఆరోపణలు పట్టించుకోను

13-01-2026

మంథని, జనవరి 12 (విజయక్రాంతి): ‘నా కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్న వారిని పట్టించుకోను. మంథని ప్రాంత అభివృద్ధి ఆశయంగా ముందుకు సాగుతా’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంథనిలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలలో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడం సహజమని, కానీ తన కుటుంబంపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్న కొంతమందికి తాను పట్టించుకోనని తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన మంత్రి నియోజకవర్గ ప్రజలను మర్చిపోనని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నానని, దీంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాన్నానని అన్నారు.

article_18336709.webp
అసత్య ఆరోపణలు మంచిది కాదు

13-01-2026

మంథని, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవని మంత్రి స్పష్టం చేశారు. మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.

article_25688235.webp
పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు

13-01-2026

మంథని, జనవరి-12(విజయ క్రాంతి): పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పలు అ భివృద్ధి పనులకు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శివ కిరణ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీ టింగ్ లో పాల్గొన్న మంత్రి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బా బు మాట్లాడుతూఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున తమ హాయంలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు మంజూరు చేశామని అన్నారు.