15 July, 2026 | 2:05 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

Districts - Peddapalli

article_67585083.webp
ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ అధికారి

పెద్దపల్లి,జూలై 14(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారి సతీష్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు బత్తుల శ్రీను వద్ద నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో సతీష్‌ను పట్టుకున్నారు.

14-07-2026