17 May, 2026 | 2:02 AM

Districts - Peddapalli

article_85772894.webp
మంథని ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు

మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేసి అవసరమైతే మరోచోట ఏర్పాటు చేస్తామని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. మంథని మున్సిపాలిటీలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అనే కథనం విజయ క్రాంతి పత్రిక లో ప్రచురితం కాగా స్పందించిన కమిషనర్ విజయ్ క్రాంతితో మాట్లాడుతూ... గత 15 రోజుల క్రితమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మంథని పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తరలించే ప్రక్రియ ప్రారంభించామన్నారు.

16-05-2026