4 July, 2026 | 4:56 PM

Districts - Peddapalli

article_44613446.webp
స్వామి వివేకానంద యువతకు శాశ్వత స్ఫూర్తి

మంథని, జూలై 04(విజయక్రాంతి): స్వామి వివేకానంద 124వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయమైన మహనీయుడని అన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఒకరని పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో హిందూ ధర్మ వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు.

04-07-2026