ముత్తారం మాజీ జడ్పీటీసీకి పరామర్శ
ముత్తారం, జూలై 19(విజయక్రాంతి): ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం తండ్రి లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, శనివారం ముత్తారం ప్రెస్ క్లబ్ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రెస్ క్లబ్ సభ్యులు, చొప్పరి సదానందం మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఏలువాక కుమారస్వామి, అధ్యక్షుడు కొడారి మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి అక్కల నారాయణ, కార్యదర్శి వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిప్ప రాజేశం, అనుము వీరస్వామి, కాసు తిరుపతి యదవ్, మల్యాల దేవేందర్, అలువోజు రాకేష్ తమ సానుభూతిని తెలియజేశారు.
19-07-2026