7 April, 2026 | 3:44 AM

Districts - Peddapalli

article_13437893.webp
శాత్రాజ్ పల్లిలో నూతన సబ్ స్టేషన్ కు భూమిపూజ

ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీ లోనీ శాత్రాజుపల్లి లో నూతన సబ్ స్టేషన్ కి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ఏఎంసీ డైరెక్టర్ బుచ్చం రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మాజీ పాక్స్ చైర్మన్ యాదగిరి రావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బియ్యని శివకుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్, ఉప సర్పంచ్ బోడ బాపు, సీనియర్ నాయకులు తూటి రఫీ, తాటిపాముల శంకర్, డా. చారి, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.

06-04-2026

article_17850916.webp
ప్రజలే గుణపాఠం చెప్తారు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రానున్న రోజుల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సూర శ్యామ్ , రేవల్లి తిరుపతి లు అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు ఓట్లతో , తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎనిమిది , తొమ్మిదవ వార్డు అభ్యర్థులపై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఎన్నికల కమిషనర్, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు, ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు తిప్పారపు దయాకర్, అనుమాల బాబురావు, మహేష్ , అజయ్, అక్బర్, అనిల్, కాళీ చరణ్ , వెంకటేష్ , రాజు పలువురు పాల్గొన్నారు.

06-04-2026