కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు
కరీంనగర్, పెద్దపల్లి జూలై 2(విజయ క్రాంతి) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు రెండేళ్లు కూడా గడవక ముందే కుంగిపోవడానికి కారణాలపై మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్, హరీశ్ రావు ఇంజనీర్ల సలహాలను పక్కనబెట్టి డిజైన్లలో మార్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, మరమ్మతు పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు.
02-07-2026