calender_icon.png 18 June, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_63184430.webp
ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయాలి

18-06-2025

ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగకముందే అడ్డుకట్ట వేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా(CP Ambar Kishore Jha) తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను కమిషనర్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు పుష్పగుచ్చలను అందజేసి స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

article_55556335.webp
ధర్మారంలో దొంగలు బాబోయ్... దొంగల

18-06-2025

మంథని,(విజయక్రాంతి): ధర్మారం లో దొంగలు బాబోయ్... దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారు జామున మండలంలోని ధర్మారం (గద్దలపల్లి) గ్రామంలో కందుకూరి లక్ష్మి బాయ్ (60) ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో దొంగలు ఆమె మెడలో నుంచి రెండు తులాలన్నారా బంగారాన్ని(Chain snatching) దొంగలు లాక్కొని పారిపోయారు. లక్ష్మీబాయికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉండగా, రెండు సంవత్సరాల క్రితం కుమారుడు మరణించాడు. ఆమె చిన్న కూతురుతో ఇంట్లో నివసిస్తుంది. ఇటీవల చిన్న కూతురు బంధువుల ఇంటికి వెళ్ళింది. ఈ సంఘటనతో గద్దలపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.మంథని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

article_63978134.webp
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

17-06-2025

కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వమని రైతుల సంక్షేమ ప్రభుత్వం ధ్యేయమని మంథని మాజీ జడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి(former ZPTC Moola Sarojana Purushotham Reddy) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులందరికీ ఎలాంటి కోత లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. బడ్జెట్లో దాదాపు రూ. 70 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందని, రైతు భరోసా పథకంతో రూ. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.