2 September, 2026 | 11:28 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

Districts - Peddapalli

article_20238329.webp
గర్రెపల్లిలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత రామయ్యకు సన్మానం

సుల్తానాబాద్, సెప్టెంబర్ 1 (విజయ కాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన జానపద కళాకారుడికి రాష్ట్రపతి అవార్డు రావడం తమ గ్రామానికి గర్వకారణం అని గ్రామస్తులు అన్నారు, గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దుర్శేటి రామయ్య ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గర్రెపల్లి గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు కన్న రమేష్ , కస్తూరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గర్రెపల్లి చెరువు వద్ద శివుడి విగ్రహం ఎదుట రామయ్యను ఘనంగా సన్మానించారు.

01-09-2026 | 11:19am

article_83600727.webp
మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లోనే గుర్తింపు

కొయ్యూరు, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): కొయ్యూరు మండలంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు రాపిడ్ టెస్ట్ కిట్లతో ప్రత్యేక నిఘా చేపట్టారు. అనుమానంతో పరీక్షలు నిర్వహించగా ఇద్దరు యువకులకు పాజిటివ్‌గా తేలడంతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మత్తు పదార్థాలకు బానిసైన వారు స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదిస్తే డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహేందర్ కుమార్ యాదవ్ తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

01-09-2026 | 11:11am