30 July, 2026 | 8:04 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

Districts - Peddapalli

article_26434358.webp
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, జూలై 30(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ మాతృమూర్తి ఇనుముల గౌరమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ ఘాడమైన దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొని గౌరమ్మ మృతికి సంతాపం ప్రకటించారు.

30-07-2026