మత్తు పదార్థాల జోలికొస్తే పీడీ యాక్ట్
యువత మత్తు ఇంజెక్షన్ల బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, మాదకద్రవ్యాల విక్రయం, సరఫరాకు పాల్పడే వారిపై ఎంతటి వారైనా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ స్పష్టం చేశారు. తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మంథని డివిజన్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
28-07-2026