25 April, 2026 | 9:17 PM

Districts - Peddapalli

article_87484041.webp
ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

సుల్తానాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): వాసవి మాత జయంతి వేడుకల ను అధికారికంగా నిర్వహించేందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో విడుదల చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనం ఆవరణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు , మంత్రులకు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చిత్రపటాల తో ఉన్న ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది,

24-04-2026

article_38558931.webp
మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన గంధం నగేష్,(55) శ్రీ రామ ఫోటో స్టూడియో యజమాని, వడ దెబ్బతో ఆకస్మికంగా మృతి చెందాడు. విధినిర్వహణలో ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి కర్ణ వేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చే క్రమంలో కస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఫోటోగ్రాఫర్ నగేష్, మృతి పట్ల మంథని పట్టణంలోని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు దిగ్బాంతి వ్యక్తం చేశారు.

24-04-2026

article_45098944.webp
నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసన

సుల్తానాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం నిర్వహించారు, ప్రధానిని 'టెర్రరిస్ట్' అనడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని ప్రజాస్వామ్యాన్ని కాలితో తన్నిన కాంగ్రెస్ డి.ఎన్.ఏ. లోనే వ్యక్తులను అవమానించేసంస్కృతి,,,సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు యత్నించారు, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన 'టెర్రరిస్ట్' అనే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, ఇవి ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు.

23-04-2026