23 April, 2026 | 11:42 PM

Districts - Peddapalli

article_45098944.webp
నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసన

సుల్తానాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం నిర్వహించారు, ప్రధానిని 'టెర్రరిస్ట్' అనడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని ప్రజాస్వామ్యాన్ని కాలితో తన్నిన కాంగ్రెస్ డి.ఎన్.ఏ. లోనే వ్యక్తులను అవమానించేసంస్కృతి,,,సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు యత్నించారు, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన 'టెర్రరిస్ట్' అనే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, ఇవి ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు.

23-04-2026