భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి
భూలక్ష్మి మహాలక్ష్మి సహిత బొడ్రాయి, పెద్దమ్మ తల్లి, పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి మహాలక్ష్మి సహిత బొడ్రాయి స్థిర ప్రతిష్ట, పెద్దమ్మ తల్లి, పోచమ్మ కొలుపు మహోత్సవ కార్యక్రమంలో టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
13-05-2026