శ్రీపాదరావు సోదరి వనమాల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
మంథని, జూలై 25(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి శ్రీమతి సువర్ణ వనమాల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, తెలంగాణ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం మంథనిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సువర్ణ వనమాల చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
25-07-2026