14 March, 2026 | 4:21 AM

Districts

article_28239769.webp
సతీష్ కుటుంబాన్ని అండగా ఉంటాను

మంథని,విజయక్రాంతి: మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పెరుగు సతీష్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించగా శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ,ముసుకుల సహేంద రెడ్డి, కౌన్సిలర్ వంశీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

13-03-2026

article_19616719.webp
దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసోహం వెంకటేశ్వర్లు, ఆయన బ్రదర్స్ ను మంగళవారం స్వర్ణకార సంఘం నాయకులు పరామర్శించారు, ఇటీవల దాసోహం వెంకటేశ్వర్లు తల్లి సరోజన అనారోగ్యంతో మృతిచెందగా స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు కందుకూరి ప్రకాష్ రావు( పెద్దన్న), స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు పొలాస సత్యనారాయణ, కార్పెంటర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పూసల ఆంజనేయులు , సంఘ నాయకులు జూపాక కుమారస్వామి , పల్లి రాకేష్ లు దాసోహం బ్రదర్స్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

12-03-2026