21 July, 2026 | 8:17 AM

Districts - Peddapalli

article_88605485.webp
అయ్యప్ప దేవాలయంలో మెట్లపూజ

సుల్తానాబాద్, జూలై 19 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్లో గల అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు అభిషేకం, మెట్ల పూజ, పడిపూజ, హోమం నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రెండు నెలలుగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు హోమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాయిరీ మహేందర్, అర్చకులు లక్ష్మణ శర్మ, సాయినాథ్, గురు స్వామి మురళీధర్, శశాంక్, వెంకటేష్ భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

19-07-2026

article_55299982.webp
ముత్తారం మాజీ జడ్పీటీసీకి పరామర్శ

ముత్తారం, జూలై 19(విజయక్రాంతి): ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం తండ్రి లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, శనివారం ముత్తారం ప్రెస్ క్లబ్ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రెస్ క్లబ్ సభ్యులు, చొప్పరి సదానందం మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఏలువాక కుమారస్వామి, అధ్యక్షుడు కొడారి మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి అక్కల నారాయణ, కార్యదర్శి వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిప్ప రాజేశం, అనుము వీరస్వామి, కాసు తిరుపతి యదవ్, మల్యాల దేవేందర్, అలువోజు రాకేష్ తమ సానుభూతిని తెలియజేశారు.

19-07-2026

article_74944029.webp
గోరింటా మెరిసే... మగువా మురిసే

సుల్తానాబాద్ , జూలై 19 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య మహిళలు శ్రీ కన్యకా పరమేశ్వరి (వాసవి మాత) దేవాలయం లో గోరింటాకు వేడుకల ను ఆదివారం వైభవంగా నిర్వహించారు... ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చేతులకు, కాళ్ళకు గోరింటాకును పెట్టారు,మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో మహిళలమంతా గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు, మహిళల తో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ గా వస్తుంది.పెళ్ళికి ముందుకూడాగోరింటాకుపెట్టుకుంటారు.అలా పెట్టుకోవడం ద్వారా అది ఎర్రగా పండితే వారి ప్రేమ అంత సౌఖ్యంగా ఉంటుంది అని మహిళలు ఆన్నారు, గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, అలాగే కాళ్లు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్లదనంగా ఉంటుందని మహిళలు తెలిపారు.... మహిళలంతా సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు...

19-07-2026