దాడి చేసినవాళ్లపై చర్యలు తీసుకోవాలి
30-04-2025
పెద్దపల్లి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, పెద్దపల్లి విధులకు ఆటంకము కలిగించి భయభ్రాంతులకు గురిచేసి, వారి పైన రిసిప్షనిస్ట్ ఆనంద్ చే కేసు నమోదు చేయించిన శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖని యజమాన్యం మరియు సిబ్బంది తదితరులపై చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా టిఎన్ జిఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ మరియు వైద్య ఉద్యోగులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26 తేదిన శనివారం డా. జి. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పెద్దపల్లి గారు విధి నిర్వహాణలో బాగంగా శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖనిని తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించడం జరిగినది.