6 July, 2026 | 4:06 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

Districts - Peddapalli

article_34822204.webp
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

మంథని కాటారం, జూలై 06(విజయక్రాంతి: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. దేవాలయాలు సమాజంలో ఐకమత్యం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గ్రామ ఆడపడుచులకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

06-07-2026

article_44613446.webp
స్వామి వివేకానంద యువతకు శాశ్వత స్ఫూర్తి

మంథని, జూలై 04(విజయక్రాంతి): స్వామి వివేకానంద 124వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయమైన మహనీయుడని అన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఒకరని పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో హిందూ ధర్మ వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు.

04-07-2026