15 May, 2026 | 1:11 AM

Districts - Peddapalli

article_64517247.webp
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సుల్తానాబాద్,(విజయ క్రాంతి):పాఠశాల పిల్లలకు నిర్మాణాత్మకంగా, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అది ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం ఆయన ఊషన్నపల్లి గ్రామ వీధుల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను, సౌకర్యాలను తెలియజేసే ప్లెక్సీ బ్యానర్ తో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 'ప్రభుత్వ పాఠశాలలు ప్రగతికి సోపానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు పిల్లల జీవితాల్లో నింపును వెలుగు' అంటూ గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య గ్రామంలోని హనుమాన్ దేవాలయం చావడి వద్ద గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులను సమావేశపరిచారు.

14-05-2026