30 May, 2026 | 3:16 AM

Districts - Peddapalli

article_39787675.webp
కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్‌గా తాటిపల్లి రాజన్న ఎన్నిక

మంథని కాళేశ్వరం,మే29 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం పాలకమండలి డైరెక్టర్‌గా ఆర్యవైశ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు, మంథని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, సామాజిక కార్యకర్త తాటిపల్లి రాజన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ దేవస్థాన కమిటీలో ఆయనకు చోటు దక్కడం పట్ల ఆర్యవైశ్య సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు, ఆయన అభిమానులు తాటిపల్లి రాజన్న ను కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

29-05-2026

article_23244466.webp
ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నీరటి శంకర్

సుల్తానాబాద్, మే 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన నీరటి శంకర్ ను ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ ఎన్ టి యు సి) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం చేసినట్లు ఆల్ ఇండియా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు డాక్టర్ జి, సంజీవరెడ్డి గురువారం ప్రకటించారు, మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా నీరటి శంకర్ నియామక పత్రాన్ని తీసుకున్నారు, తన నియామకానికి సహకరించిన ఐ ఎన్ టి యు సి ప్రెసిడెంట్ సంజీవరెడ్డి , రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణరావు, ఎంపీ వంశీకృష్ణ , ఐ ఎన్ టి యు సి నేషనల్ సెక్రెటరీ బాబర్ సలీం పాషా, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, నీరటి శంకర్ నియామకం పట్ల పలువురు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు,

28-05-2026

article_31326279.webp
రోహిణి కార్తె వచ్చిన ధాన్యం అమ్ముడు పోక రోడ్డుపైనే రైతు విలవిల

కాల్వ శ్రీరాంపూర్ మే 28(విజయక్రాంతి): రోని కార్తి వచ్చిన ధాన్యం అమ్ముడు పోక కల్లల్లోనే రైతు విలవిలాడుతున్నాడని, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వానికి రైతు ఉసురు తాగుతుందని, కాల్వ శ్రీరాంపూర్ లో మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి గురువారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మార్కెట్ల లో 30 శాతం దాన్యం నిలువలు పేరుకుపోయి ఉన్నాయని ఆయన అన్నారు. రోని కార్తీ లో రైతులు దుక్కులు దున్ని, నారుమల్లు పోసే సమయం వచ్చినా గాని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

28-05-2026

article_54487165.webp
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

పెద్దపల్లి, మే 27(విజయ క్రాంతి): జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.

27-05-2026