calender_icon.png 1 May, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_75881221.webp
కుటుంబ క్షేమం కన్నా... సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీస్ మాత్రమే

30-04-2025

రామగుండం, (విజయక్రాంతి): కుటుంబ క్షేమం కన్నా... సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీస్ మాత్రమేనని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా బుధవారం ఘనంగా సత్కరించారు. కమిషనరేట్‌ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో పదవీ విరమణ పొందిన పోలీస్‌ అధికారులు ఇన్స్పెక్టర్ డి. కమలాకర్, ఏఆర్ఎస్ఐ ఎం. నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎస్ సుందర్ రావు లను పోలీస్‌ కమిషనర్‌ పూలమాలలతో ఘనంగా సత్కరించడంతో పాటు, వారికి జ్ఞాపికలను అందజేసారు.

article_13870879.webp
దాడి చేసినవాళ్లపై చర్యలు తీసుకోవాలి

30-04-2025

పెద్దపల్లి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, పెద్దపల్లి విధులకు ఆటంకము కలిగించి భయభ్రాంతులకు గురిచేసి, వారి పైన రిసిప్షనిస్ట్ ఆనంద్ చే కేసు నమోదు చేయించిన శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖని యజమాన్యం మరియు సిబ్బంది తదితరులపై చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా టిఎన్ జిఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ మరియు వైద్య ఉద్యోగులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26 తేదిన శనివారం డా. జి. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పెద్దపల్లి గారు విధి నిర్వహాణలో బాగంగా శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖనిని తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించడం జరిగినది.