సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..
12-11-2025
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సిఐటియు పెద్దపల్లి జిల్లా మహా సభలను జయప్రదం చేయాలంటు బుధవారం స్థానిక రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు నవంబర్ 16న పెద్దపల్లి ఎంబి గార్డెన్స్ లో జరుగుతున్నాయని, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్, వీరయ్య, భూపాల్, తుమ్మల రాజారెడ్డి పాల్గొంటారని, ఈ మహాసభల్లో జిల్లాలోని వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఈ మహాసభల్లో జిల్లాలోని అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.