9 March, 2026 | 10:38 PM

Breaking News

Districts

article_17320357.webp
పెద్దపల్లి జిల్లాలో సంచలనం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో(Peddapalli district) కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) ఎగవేతదారులుగా ఉన్న రైస్ మిల్లు యజమానులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్లాది రూపాయల విలువైన బియ్యాన్ని ఇవ్వకుండా ఏళ్లుగా తప్పుదోవ పట్టిస్తున్న సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు యజమానులను అరెస్ట్ చేయడం జరిగిందని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ తెలిపారు, సోమవారం సిఐ, ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి లో గల సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు యాజమాన్యం తీరుపై సివిల్ సప్లై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

09-03-2026