Districts

article_35486737.webp
వేతనం అందక వెతలు

02-05-2024

గ్రామీణ ప్రాంతాల్లో కరువు నివారించి వ్యవసాయ కూలీలకు ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచి ఉపాధి హామీ పథకం అమల వుతున్నది. జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం గ్రామంలోనే ఉపాధి కల్పిస్తుంది. కూలీలకు పని కల్పించడం, వారి హాజరు రికా ర్డు చేయడం, వారికి వేతనాలు చెల్లించే బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఏపీవోలు, టెక్నికల్ అసి స్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తారు.పెద్దపల్లి జిల్లా పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలుగా వేతనాలు అందలేదు. ప్రభుత్వం ఆరు నెలల వేతనాలను మరిచి, కేవలం రెండు నెలలు వేతనాలు మాత్రమే విడుదల చేసింది. విడుదలైన అరకొర వేతనంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామ ని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు.