ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
29-10-2025
మొంత తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ సూచించారు... ఇప్పటికే చెరువులు , కుంటలు నిండుకుండలా మారాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, మత్తళ్లు దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు, రోడ్లపై గుంతలు గమనించి జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అవసరమైతే డయల్ 100 ను సంప్రదించాలని ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.