calender_icon.png 30 October, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_70000506.webp
మంథనిలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు ఆత్మహత్య

28-10-2025

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు మంథని ఎస్ఐ-2 సాగర్ తెలిపారు. మంథనికి చెందిన సిరిపురం వీర శంకర్ నారాయణ తల్లి సిరిపురం వీరలక్ష్మి(84) గత పది ఏండ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతుందని, చికిత్స కోసం ఆమెను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులలో చికిత్స చేయించిన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నడవలేని స్థితిలో ఉండడం వల్ల జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో తలుపులు దర్వాజాలకు ఉపయోగించే రంగులను కడుగుటకు గాను ఇంట్లో తెచ్చి పెట్టిన పెట్రోల్ తో తన ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణంపై కుటుంబ సభ్యులకు ఎవరిపై ఏలాంటి అనుమానం లేదని తన కుమారుడు వీర శంకర్ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

article_39697140.webp
అమర పోలీసుల త్యాగాలు మరువలేనివి

28-10-2025

ముత్తారం (విజయక్రాంతి): సమాజం కోసం పనిచేస్తూ అసాంఘిక శక్తుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసుల త్యాగాలు మరువలేనివని పెద్దపల్లి ఏసిపి కర్ణాకర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ముత్తారం మండలంలోని పోతారం గ్రామ శివారు నుంచి సర్వారం, కాజిపల్లి, లక్కారం, మచ్చుపేట మీదుగా రామగిరి పోలీస్ స్టేషన్ వరకు సైకిల్ ర్యాలీ విద్యార్థులు, యువకులతో కలిసి పోలీసులు ఉత్సవంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కర్ణాకర్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసులు త్యాగధనులన్నారు.