శాటిలైట్ సర్వేలైన్స్తో అక్రమాలకు బ్రేక్
08-01-2026
సుల్తానాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): శాటిలైట్ సర్వే ద్వారా త్వరలోనే అక్రమాలకు బ్రేక్ పడనుందని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, కేజీ వీల్స్ తో వాహనాలు రోడ్డు పైకి వస్తే భారీ జరిమాణాలు విధించడం జరుగుతుందని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ అన్నారు, బుధవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణ లో కేజీ వీల్స్ వాడకంపై , ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎసిపి గజ్జి కృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత శాటిలైట్ సర్వే లైన్స్ ఏర్పాటు అవుతాయని, పోలీసులు కార్యాలయాల్లో ఉన్నప్పటికీ వాహనాల ద్వారా ఇసుకతో పాటు ఏలాంటి అక్రమాలకు పాల్పడిన తమకు తెలుస్తుందని, అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.