మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు
మంథని,(విజయక్రాంతి): మంథనిలో సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ... సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని చరిత్ర నిర్మాణంలో తనదైన చెరగని పాత్రను నిర్వర్తించిన ఒక మహాయోధుడు తెలంగాణ గడ్డపై జన్మించాడనీ. అతడే సర్దార్ సర్వాయి పాపన్న. పీడిత ప్రజలకు రక్షకుడిగా నిలిచి దళిత, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటిసారిగా నిరూపించాడు. దాదాపు 350 ఏండ్ల క్రితమే కుల, మత, జాతివర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట యోధుడు, గొప్ప సామాజిక బహుజనవిప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న.
02-04-2026