26 May, 2026 | 12:02 AM

Districts - Peddapalli

article_52385073.webp
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు

సుల్తానాబాద్, మే 25 (విజయక్రాంతి): పంట భూముల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులు వినియోగం మేలు అని, ఇందుకోసం తమ ప్రభుత్వం రైతులకు జీలుగు విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేసే జానుము, జీలుగ విత్తనాలను స్థానిక నాయకులతో కలిసి విజయరమణ రావు పంపిణీ చేశారు, ముందుగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అధికారులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు కు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు.

25-05-2026