13 July, 2026 | 5:12 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

Districts - Peddapalli

article_38327830.webp
అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు శూన్యం..!

మంథని, జూలై 13(విజయక్రాంతి): తమ కుటుంబానికి చెందిన ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన ఘటనలో అన్ని ఆధారాలు, అధికారుల నివేదికలు, ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రిటైర్డ్ ఉపాధ్యాయుడు బడితెల రామయ్య కుమారుడు బడితెల రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంథని పట్టణంలోని పోచమ్మవాడలో ఉన్న తమ కుటుంబ స్థలానికి సంబంధించిన పూర్తి రికార్డులు, పాత పత్రాలు, అధికారిక ధ్రువీకరణలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు కూడా అక్రమ నిర్మాణాలు జరిగిన విషయాన్ని గుర్తించినప్పటికీ, వాటిని తొలగించేందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

13-07-2026

article_51117025.webp
భక్తులతో నిండిన శివాలయాలు

సుల్తానాబాద్, జులై 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం కలసి రావడం తో శివాలయాల్లో దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి విశేషంగా పలు రకాల పండ్లతో, రుద్రాభిషేకం జరిపించి బిల్వదళాలతో, కమలలాల అర్చించడం జరిగినది,అలాగే అన్న పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమం లో శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్ల కొండ రమేష్, పొలాస అశోక్, పారువెల్ల రమేష్ శర్మ , తొడుపునూరి రాజేంద్రప్రసాద్ తో పాటు పెద్ద ఎత్తున భక్త బృందం , మహిళలు పాల్గొని బిల్వదలాలు సమర్పించి తీర్థ ప్రసాదములుస్వీకరించినారు..సుల్తానాబాద్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు.....

13-07-2026

article_67900400.webp
మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంథనిలో నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం

మంథని జులై 13 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ యువతకు పోలీసు ఉద్యోగాల సాధనలో అండగా నిలిచే మరో కీలక కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో, శ్రీ విశ్వ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కార్యక్రమం జూలై 15 నుంచి ప్రారంభం కానుండగా, మంథని నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

13-07-2026