21 March, 2026 | 3:11 PM

Districts

article_57102011.webp
రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య

సుల్తానాబాద్: తెలంగాణ సమగ్ర శిక్ష శిక్ష లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పట్టణ పోటీలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు, మొదట వివిధ పాఠశాలల నుండి క్లస్టర్ స్థాయిలో తెలుగు ఆంగ్ల భాషలలో పోటీలు నిర్వహింపబడి ప్రథమ ద్వితీయ స్థాయి ఎంపిక చేయడం జరిగింది , అనంతరం మండల స్థాయిలో వీరికి పట్టణ పోటీలు నిర్వహించబడినాయి, ఉచ్చారణ దోషాలు లేకుండా విరామ చిహ్నాలు ఉపయోగిస్తూ స్పష్టంగా హావభావాలతో చదివిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య తెలియజేశారు.

20-03-2026