calender_icon.png 5 January, 2026 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_32800789.webp
మంథనిలో అలరించిన త్యాగరాజ ఆరాధనోత్సవం

05-01-2026

మంథని జనవరి 4 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ కార్యక్రమం వైభవపీతంగా నిర్వహించారు. వరంగల్ కు చెందిన సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తిరుపతయ్య, ఇతర సంగీత గురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజ కీర్తనలు భక్తులను మంత్రముగ్గులను చేసింది. మంథనిలోని ఈ ఆలయంలో నిర్వహించిన మా ఈ 129వ శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంథని సంగీత కళాశాలలో మృదంగం విధ్వాన్సులుగా విధులు నిర్వహిస్తున్న భీమా శంకర్ తెలిపారు.

article_13867695.webp
ఘనంగా అంతర్జాతీయ అంధుల దినోత్సం

05-01-2026

సుల్తానాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ అంధుల దినోత్స వాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యాంగుడు ప్రవీ ణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి, వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి వేడుకలను ప్రారంభించారు. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అల్లాడి వెంగళరావు వారి తల్లి సత్తెమ్మ, అత్తమ్మ సత్తెమ్మ జ్ఞాపకార్థం పునరావాస కేంద్రానికి రెండు టేబుల్లు బియ్యం వితరణ చేసి, ఒకరోజు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వయంగా మానసిక వికలాంగులకు భోజనాన్ని వడ్డించారు.

article_83838633.webp
గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు

04-01-2026

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): గ్రంథాలయంలో పాఠకులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి గ్రంథాలయంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యా రంగం, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. గ్రంథాలయాలలో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, సామాగ్రి సమకూర్చడం జరిగిందని, ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. గ్రంథాలయాల్లో పాఠకులకు, అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

article_74446644.webp
సుల్తానాబాద్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

03-01-2026

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాల , ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటాము అని తెలుపుతూ, ఆమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త , మహిళా విద్యకు మార్గదర్శకురాలు, ఆమె గౌరవార్థం తెలంగాణలో మహిళా విద్యా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పలువురు పాల్గొన్నారు..