18 July, 2026 | 12:46 AM

Districts - Peddapalli

article_74680680.webp
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్ విద్యార్థి ఎంపిక

సుల్తానాబాద్, జూలై 17 (విజయకాంతి): పెద్దపల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ (ఐపీఎస్) విద్యార్థి ఎం. సంప్రీత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 12న సుల్తానాబాద్‌ లో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జరిగిన 1000 మీటర్ల పరుగు పందెంలో సంప్రీత్ గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు. ఈ విజయంతో ఈ నెల 18న మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే అర్హతను దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థి సంప్రీత్ ను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు శుక్రవారం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించి పాఠశాలకు,సుల్తానాబాద్‌కు మంచి పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థి విజయం పాఠశాలకు గర్వకారణమనిపేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత, మేనేజర్ శివ, పీఈటీలు సత్యం, సతీష్ , జ్యోతి తదితరులు పాల్గొని సంప్రీతిను అభినందించారు.

17-07-2026