calender_icon.png 5 February, 2026 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_47478953.webp
సుల్తానాబాద్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ

05-02-2026

సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు యువ మహిళా న్యాయవాది స్వప్న ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి అన్నారు. ఈ దారుణ హత్యకు నిరసనగా గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు హేయమైన చర్య అని, వారి రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొయిని భూమయ్య , న్యాయవాదులు భూసారపు బాల కిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు, ఆకారపు సరోత్తం రెడ్డి, జోగుల రమేష్, చిలుక ఆనంద్, వంగళ యుగేందర్ రెడ్డి, వేముల స్నేహ తదితరులు పాల్గొన్నారు.

article_26817443.webp
యజ్ఞ యాగాలు మానవళి సుభిక్షతకు తోడ్పడతాయి

05-02-2026

మంథని, ఫిబ్రవరి 05(విజయక్రాంతి): యజ్ఞ యాగాలు సమస్త జీవులను సుభిక్షంగా ఉంచడానికి తోడ్పడతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం మంథని పట్టణంలోని శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సంపూర్ణ యజుర్వేద సహకార యజ్ఞంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఆమ్నాయ వర్ధిని సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరసిల్లుతున్న మంత్రపురిలో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు.

article_71045980.webp
మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు

05-02-2026

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పాల్గొన్నారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను ఈ నెల 11 తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంథని పట్టణ ప్రజలు అభివృద్ధికి భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, అభ్యర్థులు ముసుకుల సురేందర్ రెడ్డి, శ్రీపది బానయ్య, దధితరులు పాల్గొన్నారు.

article_54200626.webp
శభాష్ వార్డ్ మెంబర్

05-02-2026

ముత్తారం,(విజయక్రాంతి): శభాష్ వార్డ్ మెంబర్ అనిపించుకుంటున్నారు. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ లోని 6 వార్డులో దగ్గరుండి వార్డు సభ్యురాలు వేల్పుల మనేశ్వరి, శ్రీశైలం యాదవ్ మురుకి కాలువలు, రోడ్డు శుభ్రం చేయిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో గ్రామపంచాయతీలో ఎక్కడ వేసిన చెత్త అక్కడనే పేరుకుపోతుండటంతో ప్రజలు త్రీడీ ఇబ్బందులు పడుతున్నారు. వార్డు సభ్యులుగా ఇటీవల వార్డు సభ్యులుగా ఎన్నికైన మనేశ్వరి శ్రీశైలం యాదవ్ దగ్గరుండి వార్డులోని మురికి కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ వీధిలైట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు.