ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
సుల్తానాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): వాసవి మాత జయంతి వేడుకల ను అధికారికంగా నిర్వహించేందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో విడుదల చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనం ఆవరణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు , మంత్రులకు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చిత్రపటాల తో ఉన్న ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది,
24-04-2026