జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా కార్యాచరణ అమలు
06-01-2026
పెద్దపల్లి, జనవరి- 5(విజయక్రాంతి) జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా సరఫరా, యాసంగికు సాగు నీటి సరఫరా పై సంబంధిత అధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 8,2026 వరకు 7 తడులలో యాసంగి పంటకు ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల అవుతుందని, 7 రోజుల పాటు జగిత్యాల జిల్లాకు, 8 రోజుల పాటు పెద్దపెల్లి జిల్లాకు సాగు నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు.