సురక్షిత ప్రయాణమే అరైవ్-అలైవ్ ముఖ్య లక్ష్యం
17-01-2026
గోదావరిఖని, జనవరి,16(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్ర జల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రా రంభించిన ఆర్రైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని 1- టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుం డం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్ అండ్ బి శాఖ, తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీతో పాటు అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.