27 June, 2026 | 9:47 PM

Districts - Peddapalli

article_31740936.webp
మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు

పెద్దపల్లి, జూన్-27(విజయ క్రాంతి): మంథని మండలం మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాల వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ శాఖ తనిఖీ నివేదికలు, పంచనామా, సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధికారులు మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 11 మందిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) FIR No: 137 తేదీ : 25/06/2026 ,సెక్షన్లు

27-06-2026

article_20841357.webp
ముత్తారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుని మాతృమూర్తి మృతి

ముత్తారం, జూన్ 26(విజయక్రాంతి): ముత్తారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు కోల విజయకుమార్ మాతృమూర్తి శుక్రవారం ఉదయం అకాల మరణం చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం విజయకుమార్ నివాసానికి చేరుకుని, పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న విజయకుమార్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కఠిన సమయంలో పార్టీ కార్యకర్తలందరూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బుచ్చంరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూనెటి కృష్ణ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొని సంతాపం తెలియజేశారు.

26-06-2026