21 April, 2026 | 10:29 PM

Districts - Peddapalli

article_47795206.webp
సుల్తానాబాద్‌లో మినీ ట్యాంక్ బండ్ కు శంకుస్థాపన

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించేందుకు రూ.12 కోట్ల నిధులతో చేపట్టే పనులకు చెరువు వద్ద మంగళవారం సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా జరిగిన సమావేశం చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...చాలా కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న చెరువు అభివృద్ధి వల్ల సుల్తానాబాద్ తో పాటు పలు గ్రామాల పంట పొలాలకు ఆయకట్టు స్థిరీకరణపెరుగుతుందన్నారు.

21-04-2026