15 July, 2026 | 8:18 PM

Districts - Peddapalli

article_78227408.webp
ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ముత్తారం, జులై 15(విజయ క్రాంతి): ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సంక్షేమం, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని మంథని డివిజన్ అధ్యక్షుడు, కరీంనగర్ జోనల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.వి. చారి తెలిపారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ గుర్తింపు తదితర అంశాలపై సంఘం తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సభ్యుల ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని డాక్టర్ చారి స్పష్టం చేశారు.

15-07-2026

article_67585083.webp
ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ అధికారి

పెద్దపల్లి,జూలై 14(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారి సతీష్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు బత్తుల శ్రీను వద్ద నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో సతీష్‌ను పట్టుకున్నారు.

14-07-2026