18 July, 2026 | 7:49 PM

Districts - Peddapalli

article_67752915.webp
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యతను పెంపొందించే లక్ష్యంతో శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ ఎన్నికలను నిజమైన ఎన్నికల మాదిరిగా నిర్వహించారు. ఓ వైపు పాఠశాల విద్యార్థి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టగా, మరోవైపు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో పోలింగ్‌, ఓటింగ్‌, కౌంటింగ్‌ విధానాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం విశేషంగా నిలిచింది.పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

18-07-2026

article_43425552.webp
బీజేపీతో దేశానికి ప్రమాదం

ధర్మపురి,జూలై18(విజయక్రాంతి): బీజేపీతో దేశానికే ప్రమాదం ఉందనీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఏకపక్ష నిర్ణయాలతో అన్నీ వర్గాలకు నష్టం వాటిల్లే బిల్లులు ప్రవేశ పెడుతున్నారనీ ధ్వజం ఎత్తారు. యూరియా ఆప్ తో రైతులకు తీరనీ అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనీ,కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ ప్రజల్లో గుర్తుంపు వస్తుందేమోనన్న భయాందోళనలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత భయమో తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారనీ బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, గుండాటి సందీప్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు,నాయకులు బందేల ఉదేయ్ గౌడ్,నక్క సురేష్,గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

18-07-2026

article_87464851.webp
వర్షాల కోసం గ్రామదేవతలకు జలాభిషేకం

సుల్తానాబాద్, జూలై 18 (విజయక్రాంతి): వరుణుడు కరుణించిలని... వర్షాలు కురవాలని... పంటలు సమృద్ధిగా పండాలని... రైతులను చల్లంగా చూడాలంటూ.... శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీళ్లు తీసుకువెళ్లి పోచమ్మ , రేణుక ఎల్లమ్మ తల్లి గ్రామ దేవతల కు జలాభిషేకం చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత లు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినప్పటికీ వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ గ్రామదేవతల ను వేడుకోవడంజరిగిందన్నారు,నీళ్ల బిందెలను నెత్తిన ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు మహిళలు జిలాభిషేకం చేశారు.వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వాన దేవుడిని ప్రార్థించడం జరిగిందని వారు అన్నారు.

18-07-2026