చివరి గింజ వరకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి,(విజయక్రాంతి): రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.
22-05-2026