26 May, 2026 | 6:53 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Peddapalli

article_32473092.webp
మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి

మంథని మే 26 (విజయక్రాంతి): రేపు మంథనిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనదని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరుకానున్నారని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, మండల, కమిటీ ఏర్పాటు పై సమీక్ష సమావేశం నిర్వహించబడునని, ఈ సమావేశానికి శ్రీను బాబు హాజరైతరని, మంథని నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ లు పార్టీ ముఖ్య నాయకులు, ఆశవాకులు తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని అ ప్రకటనలో తిరుపతి యాదవ్ కోరారు.

26-05-2026

article_45271355.webp
సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే

సుల్తానాబాద్, మే 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad, Peddapalli District) పట్టణాన్ని 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దే అని బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు వహీద్ అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పని చేసిన దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ పట్టణం లో 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని ,అందులో 3 కోట్ల సిడిపి నిధులతో సి.సి.రోడ్లు, 5 కోట్ల రూపాయలతో 35 పడకల ప్రభుత్వ ఆసుపత్రి , సుల్తానాబాద్ పట్టణం నుండి వివిధ గ్రామాలకు పలు బిటి రోడ్లు , పట్టణంలోని వివిధ కూడళ్లలో హై మాస్ లైట్లు, ఇందులో పలు అభివృద్ధి పనులు 11 కోట్ల టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులతో నిర్వహించారని అన్నారు, కేవలం సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి చెందింది బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో దాసరి మనోహర్ రెడ్డి వల్లనే ఆయన పేర్కొన్నారు.

26-05-2026

article_52385073.webp
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు

సుల్తానాబాద్, మే 25 (విజయక్రాంతి): పంట భూముల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులు వినియోగం మేలు అని, ఇందుకోసం తమ ప్రభుత్వం రైతులకు జీలుగు విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేసే జానుము, జీలుగ విత్తనాలను స్థానిక నాయకులతో కలిసి విజయరమణ రావు పంపిణీ చేశారు, ముందుగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అధికారులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు కు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు.

25-05-2026