16 March, 2026 | 5:16 PM

Breaking News

Districts

article_41522090.webp
పోతారంలో ఏడ్ల వెంకటమ్మ ప్రథమ వర్ధంతిలో దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని, మార్చి 16 (విజయ క్రాంతి) మంథని మండలంలోని పోతారం గ్రామానికి చెందిన ఏడ్ల శ్రీనివాస్ తల్లి వెంకటమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆదివారం రాత్రి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. శ్రీను బాబు వెంట ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

16-03-2026

article_62022408.webp
కిష్టస్వామి లేని లోటు పూడ్చలేనిది

మంథని,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాటికొండ కిష్టస్వామి లేని లోటు పూడ్చలేనిదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. మంథని పట్టణములో కిష్టాస్వామి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో శ్రీను బాబు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీను బాబు వెంట మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

16-03-2026

article_50203761.webp
మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు సోదరి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం, మార్చి16 (విజయ క్రాంతి): ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు సోదరి చెన్నమనేని జయశ్రీ ఇటీవల గుండె పోటు తో హన్మకొండలో మృతి చెందగా, ఆదివారం రాత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Baba) హన్మకొండ లోని వారి ఇంటిలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతికి గల కారణాలు ఆమె కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మాజీ జడ్పీటీసీ నాగినెని జగన్ మోహన్ రావు తో పాటు జయశ్రీ కుటుంబ సభ్యులు ఉన్నారు.

16-03-2026