calender_icon.png 10 January, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_80140425.webp
ప్రమాదకరంగా జాతీయ రహదారి పనులు

09-01-2026

రామగిరి,(విజయక్రాంతి) ప్రమాద కారంగా జాతీయ రహదారి పనులు(National highway works) కొనసాగుతున్నాయి. మండలంలోని నవపేట నుంచి ప్రారంభించిన జాతీయ రహదారికి ఓసిపి మట్టిని టిప్పర్లలో తరలిస్తున్నారు. దీంతో టిప్పర్ డ్రైవర్లు ఓసిపి నుంచి నవ పేట వరకు మట్టిని తరలిస్తున్న డ్రైవర్లు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతుంది. మండలంలోని నాగేపల్లి-ముత్తారం ప్రధాన రాహదారి నవాబ్ పేట సమీపంలో గురువారం రాత్రి మెగా కంపెనీకి చెందిన మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో యువకుడ్ని ఆసుపత్రికి తరలించారు. మట్టి తరలిస్తున్న ట్రిప్పరు ఏకంగా ఇంటి సమీపంలో దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.

article_28882234.webp
అభివృద్ధిపై మాట్లాడే అర్హత పుట్ట మధుకు లేదు

08-01-2026

ముత్తారం, జనవరి 7(విజయక్రాంతి): ముత్తారం మండల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని బుధవారం ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మండలం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధు ముత్తారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడడం సరికాదన్నారు.