21 May, 2026 | 5:59 PM

Districts - Peddapalli

article_89808798.webp
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

సుల్తానాబాద్, మే 21 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ,జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ సూచనల మేరకు మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బషి రుద్దీన్ కి గురువారం వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలిపారు.

21-05-2026

article_79856248.webp
ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం

సుల్తానాబాద్ , మే 21 (విజయ క్రాంతి): ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరమని సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి,వాకర్స్అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అయిల రమేష్ అన్నారు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా డాక్టర్ అయిల రమేష్ మాట్లాడుతూ జీవితంలో క్రీడలు అనేది అత్యంత ఆవశ్యకమైనది ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఎదో ఒక క్రీడాలలోపాల్గొనాలని పేర్కొన్నారు.

21-05-2026