24 April, 2026 | 12:27 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

Districts - Peddapalli

article_38558931.webp
మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన గంధం నగేష్,(55) శ్రీ రామ ఫోటో స్టూడియో యజమాని, వడ దెబ్బతో ఆకస్మికంగా మృతి చెందాడు. విధినిర్వహణలో ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి కర్ణ వేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చే క్రమంలో కస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఫోటోగ్రాఫర్ నగేష్, మృతి పట్ల మంథని పట్టణంలోని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు దిగ్బాంతి వ్యక్తం చేశారు.

24-04-2026

article_45098944.webp
నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసన

సుల్తానాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం నిర్వహించారు, ప్రధానిని 'టెర్రరిస్ట్' అనడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని ప్రజాస్వామ్యాన్ని కాలితో తన్నిన కాంగ్రెస్ డి.ఎన్.ఏ. లోనే వ్యక్తులను అవమానించేసంస్కృతి,,,సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు యత్నించారు, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన 'టెర్రరిస్ట్' అనే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, ఇవి ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు.

23-04-2026