అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
08-02-2026
మంథని, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మంథని మున్సిపల్ 5వ వార్డు లో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, మహిళలకు ప్రతి నెల ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని, మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుల సహకారంతో పేదవారికి సంక్షేమ ఫలాలు అందిజేస్తామని శనివారం ఐదో వార్డులో ఎన్నికల ప్రచారంలో సీనియర్ వకీల్ సాబ్ మహేందర్రెడ్డి అన్నారు.అలాగే ఈ వార్డులో ఉన్న మురికి కాలువలను శుభ్రం చేసి కొత్తవి నిర్మిస్తామన్నారు.