9 May, 2026 | 9:00 AM

Districts - Peddapalli

article_37156648.webp
సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్

సుల్తానాబాద్, మే 07 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ పట్టణ దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు సుల్తానాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు గురువారం అధికారికంగా నియామక పత్రం అందజేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా ఇనుగాల శ్రీనివాస్ మాట్లాడుతూ... నాపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు కి, పెద్దపల్లి మాజీ శాసన సభ్యులు గుజ్జుల రామకృష్ణ రెడ్డి కి, దుగ్యాల ప్రదీప్ రావు కి , పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ్ కి, ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు కి, ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ కి, జిల్లా మాజీ దళిత మోర్చా అధ్యక్షులు లంక శంకర్ కి , కోశాధీకారి కామని రాజేంద్రప్రసాద్ కి, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్ కి బిజెపి కౌన్సిలర్ కందునూరి సమత కుమార్ కి, వాణిజ్య సెల్ అధ్యక్షులు ఎల్లంకి రాజన్న కి జిల్లా, మండల, పట్టణ స్థాయి బిజెపి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. బిజేపి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

07-05-2026

article_40632072.webp
ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన మంచరామి సర్పంచ్

సుల్తానాబాద్ , మే 07 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామం నుండి కరీంనగర్‌ కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి మంచిరామి బస్ స్టాండ్‌ లో గురువారం ప్రారంభించారు. బస్సు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , కరీంనగర్ , హుజురాబాద్ ఆర్టీసీ అధికారుల కు గ్రామస్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా ఈ బస్సు సేవలు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఉప్పు లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిరామి నుండి కరీంనగర్ కు బస్సు సౌకర్యం కల్పించినందుకు ప్రజలు ఎంతో సంతోషిస్తూ సర్పంచ్ ఉప్పు లక్ష్మి తిరుపతి లకు కృతజ్ఞతలు తెలిపారు..

07-05-2026