4 June, 2026 | 6:36 PM

Districts - Peddapalli

article_89390443.webp
మండలంలో మూడు ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మూడు ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య గురువారం తెలిపారు. అలాగే ఎంపీపీ ఎస్ సుల్తానాబాద్, ఎంపీపీ ఎస్ అశోక్ నగర్ సుల్తానాబాద్, ఎం పి యు పి ఎస్ నారాయణరావుపల్లి పాఠశాలలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులుస్వీకరిస్తున్నామని ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కు ( 10+2) ఇంటర్మీడియట్ సమాన విద్యార్హతలు కలిగి ఉండాలని, ప్రారంభ బాల్య విద్య ఈసీఈ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.

04-06-2026

article_27626084.webp
సంక్షేమ పథకాలలో రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అగ్రభాగంలో నిలిపారు

సుల్తానాబాద్, జూన్ 04 (విజయక్రాంతి) : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రభాగాన నిలిపారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 2, 3, 4, 5 వ వార్డు ల ప్రజలతో పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధి లో పూర్తిగా వైఫల్యం చెందారని అని ,గత పాలకులు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని దాని పర్యవసానమే ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో 217 ఇందిరమ్మ ఇండ్లను అందించిన ఘనత తమదేనని 80 శాతం ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో లేని విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలో ప్రజలకు అరుదైన చికిత్సలను అందిస్తూ ఆరు అవార్డులను అందుకుందని తెలిపారు.

04-06-2026

article_83593326.webp
సంకటాలు తొలిగించే సంకష్టహర చతుర్థి

మంథని,(విజయక్రాంతి): అధిక జేష్ఠ మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి అత్యంత పవిత్రమైనది.నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసంలో శ్రీ గణనాథుని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా బుధవారం గణనాథుని ఆలయాల్లో భక్తులు విగ్నేశ్వరుని దర్శించుకుని పునీతులయ్యారు. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయి. కొత్తగా చతుర్థి దీక్ష తీసుకునేవారు అధిక మాసంలో వచ్చే చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయష్కారం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీరడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయస్కారం.

03-06-2026