calender_icon.png 13 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_61582781.webp
కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం... రైతులకు మేలు చేసేందుకు కృషి

12-11-2025

మంథని (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని... రైతులంటేనే కాంగ్రెస్ అని... రైతుకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని అంగులూరులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్నలతో కలిసి ప్రారంభించారు.

article_11834458.webp
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు చర్యలు

12-11-2025

మంథని (విజయక్రాంతి): నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తో కలిసి మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించి, ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కలలు కని, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి సూచించారు.

article_59176103.webp
సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

12-11-2025

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సిఐటియు పెద్దపల్లి జిల్లా మహా సభలను జయప్రదం చేయాలంటు బుధవారం స్థానిక రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు నవంబర్ 16న పెద్దపల్లి ఎంబి గార్డెన్స్ లో జరుగుతున్నాయని, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్, వీరయ్య, భూపాల్, తుమ్మల రాజారెడ్డి పాల్గొంటారని, ఈ మహాసభల్లో జిల్లాలోని వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఈ మహాసభల్లో జిల్లాలోని అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

article_14591285.webp
మత్స్య కార్మికులకు నూతన సభ్యత్వాలు ఐడి కార్డులు అందజేత

12-11-2025

మంథని (విజయక్రాంతి): మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి ఆధ్వర్యంలో 32 మందికి నూతన మత్స్య కార్మికులకు సభ్యత్వాలు వాటి గుర్తింపు కార్డులను పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, జిల్లా అధికారి నరేష్ నాయుడు చేతుల మీదుగా బోయినిపేట లక్ష్మిదేవర గుడి ప్రాంగణంలో బుధవారం అందజేశారు. అనంతరం నూతన సభ్యత్వాల గురించి రెండు సంవత్సరాల నుండి జిల్లాలో మొదటి సారి సభ్యత్వాలు అందేలా కృషి చేసిన జిల్లా డైరెక్టర్ మంథని అధ్యక్షులు పోతరవేని క్రాంతిని నూతన సభ్యత్వాలు అందుకున్న మత్స్యకార్మికులు ఘనంగా సన్మానించారు.

article_21209284.webp
రైతులకు 48 గంటల్లోపు చెల్లింపులు జరిగేలా చూడాలి..

12-11-2025

సుల్తానాబాద్ (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం కు సంబంధించిన డబ్బులు రైతులకు 48 గంటల్లోపు చెల్లింపులు జరిగేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.