6 September, 2026 | 2:26 AM

Districts - Peddapalli

రాజాపూర్ సమస్య పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ వద్దు
రాజాపూర్ సమస్య పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ వద్దు

మంథని, సెప్టెంబర్‌ 5 (విజయక్రాంతి): ఆర్జీ-3 ఓసీపీ-2 విస్తరణలో భూసేకరణ, పునరావాసానికి సంబంధించి రాజాపూర్ గ్రామ ప్రజల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ నిర్వహించవద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సెప్టెంబర్‌ 16న నిర్వహించనున్న అవార్డు ఎంక్వైరీని నిలిపివేయాలని స్పష్టం చేశారు. రాజాపూర్ పరిధిలోని ఇళ్లు, ఇతర అంశాలను ఆర్‌పీఎన్, ఆర్‌టిహెచ్ విభాగాలుగా విభజించినప్పటికీ, పబ్లిక్ నోటిఫికేషన్‌లో ఆర్‌పీఎన్ నంబర్లనే చేర్చడంతో సుమారు 500 కుటుంబాల సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోయిందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

05-09-2026 | 07:06pm

బోయినపేటను విస్మరిస్తున్న విద్యుత్ అధికారులు
బోయినపేటను విస్మరిస్తున్న విద్యుత్ అధికారులు

మంథని, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బోయినపేటలో విద్యుత్ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేక రాత్రివేళ ప్రజలు చీకట్లో రాకపోకలు సాగిస్తున్నారని, కొన్ని చోట్ల విరిగిన, శిథిలావస్థకు చేరిన స్తంభాలు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న స్తంభాలు, తీగలను తొలగించి కొత్తగా అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోయినపేట ప్రధాన రహదారికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించకుంటే ప్రజలతో కలిసి విద్యుత్ కార్యాలయం ముట్టడి చేసి, అవసరమైతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

04-09-2026 | 01:22pm