జిల్లాలో ప్రభుత్వ సేవల నాణ్యతే లక్ష్యం
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన కమాన్పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, విద్య, వైద్యం, ఓటరు నమోదు, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
21-07-2026