ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్
సుల్తానాబాద్, జూన్ 23,(విజయక్రాంతి): ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక లో విజయరమణారావు విత్తనమేళా ను ప్రారంభించారు, అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వరి సన్న రకాలు ఈనెల 23 నుండి నుండి 30 వరకు ప్రతీ రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.
23-06-2026