15 March, 2026 | 12:30 PM

Districts

article_80466685.webp
మహిళా మృతి పై ముత్తారంలో ఆందోళన

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం గ్రామానికి చెందిన ఎరుకల కులానికి చెందిన సారమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు వేధించడంతోనే సారమ్మ మృతి చెందిందని, సారమును వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ చౌరస్తా వద్ద ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, మంథని కి చెందిన ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద సారమ్మ ఫోటోతో బైఠాయించి సారమ్మ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు.

14-03-2026

article_28239769.webp
సతీష్ కుటుంబాన్ని అండగా ఉంటాను

మంథని,విజయక్రాంతి: మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పెరుగు సతీష్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించగా శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ,ముసుకుల సహేంద రెడ్డి, కౌన్సిలర్ వంశీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

13-03-2026