త్వరలో పాలకుర్తి ఎత్తిపోతల పనులు షురూ
12-01-2026
రామగుండం, జనవరి 11 (విజయక్రాంతి): ప్రజల జీవన ప్రమాణాలు పెంచేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి డిప్యూటీ సీఎం రామగుండంలో పర్యటించారు. వివిధ డివిజ న్లలో రూ.80.52 కోట్ల అభివృద్ధి పనులకు, టియూఎఫ్ఐడి ద్వారా రూ.88.90 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ సరఫరా, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టనున్న రూ.6.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనం తరం నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 494 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.