మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన చొప్పరి సదానందం
ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం మానవత్వాన్ని చాటుతూ మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం గ్రామానికి చెందిన మిన్నాపురం రాధమ్మ, కాల్వ మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి నివాసాలకు వెళ్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
06-08-2026