సబ్స్టేషన్ భూమి ఆక్రమణపై విచారణకు డిమాండ్
ముత్తారం, ఆగస్టు09 (విజయక్రాంతి) ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శాత్రాజ్ పల్లి, టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామ సరిహద్దు పరిధిలోని శాత్రాజ్పల్లి సబ్స్టేషన్కు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. గ్రామానికి చెందిన జోడు రాజగట్టు, వడ్ల మొగిలిపై ఈ భూమి ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సబ్స్టేషన్కు కేటాయించిన భూమి ప్రభుత్వ అవసరాలకు సంబంధించినదై ఉండటంతో, దాని హద్దులు, రికార్డులు, ప్రస్తుత భౌతిక పరిస్థితిపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. భూమి ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, సబ్స్టేషన్ భూమిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
10-08-2026