Districts - Peddapalli

కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ లు తెలిపారు... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో సోమవారం రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు రోడ్డు భద్రత, గంజాయి వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైస్ మిల్ సూపర్‌ వైజర్లు, యాజమాన్యాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకపోవడం, రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు.

08-09-2026 | 12:43am

విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలి:డిసిపి భూక్య రామ్‎రెడ్డి
విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలి:డిసిపి భూక్య రామ్‎రెడ్డి

సుల్తానాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి సూచించారు. గర్జనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆదివారం సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పనితీరు, చట్టాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్న వయసులోనే చట్టాలు, న్యాయంపై అవగాహన పెంచుకోవాలని డీసీపీ సూచించారు. అనంతరం విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం, డీసీపీ కార్యాలయం, ఎన్టీపీసీని సందర్శించారు.

06-09-2026 | 05:20pm

లయన్స్ ఇంటర్నేషనల్ వేదికగా మంథనికి అరుదైన గౌరవం
లయన్స్ ఇంటర్నేషనల్ వేదికగా మంథనికి అరుదైన గౌరవం

మంథని, సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): సామాజిక సేవలో తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న మంథని లయన్స్ క్లబ్ విజన్ కేర్‌కు అరుదైన గౌరవం దక్కింది. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ ఆధ్వర్యంలో ఆదివారం రామగుండంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో అట్టహాసంగా నిర్వహించిన వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో లయన్స్ క్లబ్ విజన్ కేర్ అధ్యక్షుడు లయన్ బుద్దార్తి సతీష్ కుమార్ కు ప్రతిష్టాత్మక ఉత్తమ ప్రెసిడెంట్ అవార్డు లభించింది. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పేదలు, నిరుపేదలకు విశేష సేవలు అందించడంతో పాటు క్లబ్ అభివృద్ధికి సతీష్ కుమార్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.

06-09-2026 | 03:04pm

రాజాపూర్ సమస్య పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ వద్దు
రాజాపూర్ సమస్య పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ వద్దు

మంథని, సెప్టెంబర్‌ 5 (విజయక్రాంతి): ఆర్జీ-3 ఓసీపీ-2 విస్తరణలో భూసేకరణ, పునరావాసానికి సంబంధించి రాజాపూర్ గ్రామ ప్రజల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ నిర్వహించవద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సెప్టెంబర్‌ 16న నిర్వహించనున్న అవార్డు ఎంక్వైరీని నిలిపివేయాలని స్పష్టం చేశారు. రాజాపూర్ పరిధిలోని ఇళ్లు, ఇతర అంశాలను ఆర్‌పీఎన్, ఆర్‌టిహెచ్ విభాగాలుగా విభజించినప్పటికీ, పబ్లిక్ నోటిఫికేషన్‌లో ఆర్‌పీఎన్ నంబర్లనే చేర్చడంతో సుమారు 500 కుటుంబాల సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోయిందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

05-09-2026 | 07:06pm