ముత్తారంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లకు, ముగ్గులు
ముత్తారం, జూన్ 24(విజయ క్రాంతి): రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, ముత్తారం మండలంలోని ఎస్సీ కాలనీలో 'ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుల కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్ల బాలాజీ అధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఇనుముల పద్మ, తూటి రఫీ రజిత (తాజా మాజీ సర్పంచ్), నూనెటి కృష్ణ (సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి), అమ్ము వెంకట్ స్వామి, దేవేందర్, మేదరి నవీన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
24-06-2026