30 July, 2026 | 11:19 AM

Districts - Peddapalli

article_26434358.webp
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, జూలై 30(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ మాతృమూర్తి ఇనుముల గౌరమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ ఘాడమైన దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొని గౌరమ్మ మృతికి సంతాపం ప్రకటించారు.

30-07-2026

article_35414775.webp
భారీ వర్షాలు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సుల్తానాబాద్, జూలై 29(విజయక్రాంతి): రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత.తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసరమైతే నే బయటకు రావాలని, కరెంటు స్తంభాలు,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వద్దకు,తెగిపడిన కరెంటు వైర్ల వద్దకు వెళ్లకూడదని సూచించారు. నీరు ప్రవహించే ప్రాంతాలకు పిల్లలను వెళ్లకుండా చూడాలని అన్నారు.అలాగే చైర్మన్ బిరుదు రాధాకృష్ణ నాలుగో వార్డ్ 15వ వార్డులో లోతట్టు ప్రాంతాల్ని పరిశీలించారు, వార్డు ప్రజలను అప్రమత్తం చేస్తూ , వర్షపు నీరు ఎక్కడ నిలవకుండా కాలువలను క్లియర్ చేయించారు, చైర్మన్ వెంట కమిషనర్ రమేష్ , 15వ వార్డ్ కౌన్సిలర్ గాదాస్ మంజుల రవి పాల్గొన్నారు, ఏదైనా అత్యవసరమైతే కమిషనర్ కు , లేదా నాకు సమాచారం ఇవ్వాలని, ఈ నెంబర్లలో 739622 4440 ,6309532229 సంప్రదించాలని బిరుదు రాధాకృష్ణ కోరారు...

29-07-2026