విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు చెలగాటం
మంథని,(విజయక్రాంతి): విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ పాఠశాలలను విద్యా సంవత్సరం మధ్యలో విక్రయించారనే అపవాదితో మంథనిలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొంత ఆందోళనకు లోనయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయించిన అనంతరం ఒక్కసారిగా పాఠశాల యాజమాన్యాన్ని మార్చారనే వదంతులు కొందరు కావాలని చేసిన అవగతం అవుతుంది. ఈ వదంతుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు.
31-07-2026