calender_icon.png 12 January, 2026 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_84313718.webp
త్వరలో పాలకుర్తి ఎత్తిపోతల పనులు షురూ

12-01-2026

రామగుండం, జనవరి 11 (విజయక్రాంతి): ప్రజల జీవన ప్రమాణాలు పెంచేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి డిప్యూటీ సీఎం రామగుండంలో పర్యటించారు. వివిధ డివిజ న్‌లలో రూ.80.52 కోట్ల అభివృద్ధి పనులకు, టియూఎఫ్‌ఐడి ద్వారా రూ.88.90 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ సరఫరా, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టనున్న రూ.6.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనం తరం నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 494 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

article_64198074.webp
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముగిసిన సప్తాహ మహోత్సవాలు

12-01-2026

మంథని, రామగిరి, జనవరి11(విజయ క్రాంతి) : రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం సప్తహ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 4న ప్రారంభమైన భజన సప్తహ మహోత్సవములు 11న స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీలగుండా ఊరేగించారు. ఆలయంలో నిర్వహించిన గోపాల కాలువలు కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏడు రోజులపాటు నిరంతర నిత్య భజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఏడు రోజులపాటు నిత్యాన్నదానం కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

article_63654312.webp
ఆటో, ట్రాక్టర్ ఢీ.. మహిళ మృతి

12-01-2026

సుల్తానాబాద్, జనవరి 11 (విజయ క్రాంతి): ఆటో ను ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది, సుల్తానాబాద్ ఎస్త్స్ర చంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకపూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళ కూలీలు ఆదివారం మానకొండూరు మండలం ఊటూర్ కు పొలం పనులకు కు వెళ్తున్నారు, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ శివారులో ఆటోను ట్రాక్టర్ ఢీకొనగా శారద (35) అక్కడికక్కడే మృతి చెందింది, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, శారద మృతి తో బంధువుల రోదనలు మిన్నంటాయి.

article_34121184.webp
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలి

11-01-2026

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, (వీబీజీ) రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు డిమాండ్ చేశారు. హన్మకొండ డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగుల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు పాల్గొన్నారు.