27 May, 2026 | 10:46 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

Districts - Peddapalli

article_54487165.webp
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

పెద్దపల్లి, మే 27(విజయ క్రాంతి): జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.

27-05-2026

article_58539046.webp
మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి,మే27(విజయక్రాంతి): ఓదెల మండలంలో పలు బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు(Government Whip Vijaya Ramana Rao) బుధవారం పరామర్శించారు. మండలంలోని రూపునారాయణపేట గ్రామంలో శ్రీనివాస్, రాజు, మహిపాల్ మాతృమూర్తి అడ్డె భూలక్ష్మి మరణించడంతో వారి పార్థివ దేహానికి, అదే గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, అనంతరం శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏఎంసి డైరెక్టర్ దాగేటి రామచంద్రం తండ్రి దాగేటి జానయ్య మరణించడంతో వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

27-05-2026

article_32473092.webp
మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి

మంథని మే 26 (విజయక్రాంతి): రేపు మంథనిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనదని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరుకానున్నారని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, మండల, కమిటీ ఏర్పాటు పై సమీక్ష సమావేశం నిర్వహించబడునని, ఈ సమావేశానికి శ్రీను బాబు హాజరైతరని, మంథని నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ లు పార్టీ ముఖ్య నాయకులు, ఆశవాకులు తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని అ ప్రకటనలో తిరుపతి యాదవ్ కోరారు.

26-05-2026

article_45271355.webp
సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే

సుల్తానాబాద్, మే 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad, Peddapalli District) పట్టణాన్ని 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దే అని బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు వహీద్ అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పని చేసిన దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ పట్టణం లో 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని ,అందులో 3 కోట్ల సిడిపి నిధులతో సి.సి.రోడ్లు, 5 కోట్ల రూపాయలతో 35 పడకల ప్రభుత్వ ఆసుపత్రి , సుల్తానాబాద్ పట్టణం నుండి వివిధ గ్రామాలకు పలు బిటి రోడ్లు , పట్టణంలోని వివిధ కూడళ్లలో హై మాస్ లైట్లు, ఇందులో పలు అభివృద్ధి పనులు 11 కోట్ల టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులతో నిర్వహించారని అన్నారు, కేవలం సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి చెందింది బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో దాసరి మనోహర్ రెడ్డి వల్లనే ఆయన పేర్కొన్నారు.

26-05-2026

article_52385073.webp
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు

సుల్తానాబాద్, మే 25 (విజయక్రాంతి): పంట భూముల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులు వినియోగం మేలు అని, ఇందుకోసం తమ ప్రభుత్వం రైతులకు జీలుగు విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేసే జానుము, జీలుగ విత్తనాలను స్థానిక నాయకులతో కలిసి విజయరమణ రావు పంపిణీ చేశారు, ముందుగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అధికారులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు కు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు.

25-05-2026