12 August, 2026 | 9:52 AM

Districts - Peddapalli

article_32974489.webp
17 న పెద్దపల్లిలో మంత్రుల పర్యటన

సుల్తానాబాద్ ,(విజయక్రాంతి): ఈనెల 17న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొత్త రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చెప్పారు. మంగళవారం సాయంత్రం సుల్తానాబాద్ పట్టణం, మండలంలోని గర్రెపల్లి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని అనేక గ్రామాలను కలుపుతూ రూ.99 కోట్లతో గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు నిర్మించే తారు రోడ్డుకు మంత్రులచే గర్రెపల్లి గ్రామంలో శంకుస్థాపన చేయడంజరుగుతుందన్నారు.

12-08-2026