Districts - Peddapalli

కాంగ్రెస్‎తోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
కాంగ్రెస్‎తోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉంటూ నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు

15-09-2026 | 03:29pm