గణేశుడికి లక్ష గరిక, లక్ష ఉండ్రాలతో ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శ్రీ శివాలయం లో బుధవారం గణేశుడు వద్ద దంపతులు రవ్వ సతీష్ శ్రీదేవి, కాసం అశోక్ వెంకట్ లక్ష్మి , అల్లెంకి శ్రీనివాస్ లావణ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆది దేవుడైన గణేశుడికి లక్ష గరిక, లక్ష ఉండ్రాళ్ళు, బియ్యం, చక్కెర తో ప్రత్యేక పూజలు జరిపారు.
16-09-2026 | 06:39pm