23 August, 2026 | 6:12 PM

Districts - Peddapalli

article_10188747.webp
కమాన్‌పూర్‌లో ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల ఏర్పాట్లు

కమాన్‌పూర్, ఆగస్టు 23(విజయ క్రాంతి): కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి ఈ నెల 26వ తేదీ బుధవారం వరకు జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కొసన కాంతారెడ్డి తెలిపారు. జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లే రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హవనం, కళ్యాణ మహోత్సవం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, 7 గంటలకు అంకురార్పణ, రక్షాబంధనం, మృత్యంగ్రహణం కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

23-08-2026

article_49116312.webp
మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో కమాన్‌పూర్‌కు కొత్త రూపు

కమాన్‌పూర్, ఆగస్టు 23(విజయ క్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో కమాన్‌పూర్ మండలం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు సాకారం అవుతున్నాయి. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు రేపు సోమవారం కమాన్‌పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటలకు మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఆదివరాహ స్వామి దేవాలయానికి రూ.95 లక్షలతో నిర్మించిన

23-08-2026