కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ లు తెలిపారు... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో సోమవారం రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు రోడ్డు భద్రత, గంజాయి వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైస్ మిల్ సూపర్ వైజర్లు, యాజమాన్యాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకపోవడం, రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు.
08-09-2026 | 12:43am