జర్నలిస్టు పెండ్యాల రామ్ కుమార్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని, జూలై 22(విజయక్రాంతి): అనారోగ్యంతో చికిత్స పొందిన సీనియర్ జర్నలిస్టు, స్టాఫ్ రిపోర్టర్ పెండ్యాల రామ్ కుమార్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో రెండు రోజులపాటు చికిత్స పొందిన రామ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
22-07-2026