రాములవారి గుట్టపై కాషాయ జెండా ఆవిష్కరణ
శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బేగంపేట్, యువకులు రాములవారి గుట్టపై ఉన్న హనుమాన్ దేవస్థానం వద్ద కాషాయ జెండాను ఎగురవేశారు. బేగంపేట్కు చెందిన యువకులు పందుల రామ్, బెజ్జాల మహేష్, కండే సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రీరాముని సేవకుడైన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
13-08-2026