28 August, 2026 | 10:31 PM

Districts - Peddapalli

article_79027629.webp
వైభవంగా రక్షాబంధన్ వేడుకలు

సుల్తానాబాద్, ఆగస్టు 28 (విజయ క్రాంతి): ప్రేమ సోదరా భావం ... ఆప్యాయతకు ... ప్రతికగా నిలిచే రాఖీ పండుగ వేడుకలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ, మండలంలోని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు, నీకు నేను రక్ష... నాకు నువ్వు రక్ష అంటూ చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు, సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు, అలాగే శ్రావణ పౌర్ణమి శుక్రవారం పురస్కరించుకొని ఇళ్లల్లో ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి, సాంప్రదాయ దుస్తులతో దేవుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి... జంజిరాలు వేసుకున్నారు...సుల్తానాబాద్ పట్టణం, మండలం లోని గ్రామాల్లోనూ రక్షాబంధన్ వేడుకల ను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.

28-08-2026

article_54070178.webp
ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి

పెద్దపల్లి, ఆగస్టు 28 (విజయక్రాంతి): జిల్లాలో ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి ఐడీఓసీలో కన్నాల ఆర్‌ఓబీ పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములుతో కలిసి జిల్లాలోని వివిధ లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.

28-08-2026

article_73497524.webp
మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం

మంథని, ఆగస్టు 28 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబన, పొదుపు లక్ష్యంగా ఏర్పాటైన మదర్‌ థెరిసా మహిళా పొదుపు సమితిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యుల పొదుపు సొమ్ము, రుణాల పంపిణీ, వడ్డీ వసూళ్లు, ఖాతాల నిర్వహణలో పారదర్శకత లేదంటూ కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మంథని పట్టణంలోని లైన్‌గడ్డ సమీపంలో కొనసాగుతున్న ఈ సమితి 2002 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సభ్యుల నుంచి ఎంత పొదుపు సొమ్ము సేకరించారు, ఎంత మొత్తాన్ని రుణాలుగా అందించారు, ఎంత వడ్డీ వసూలు చేశారు, ప్రస్తుతం సమితి వద్ద ఎంత నిధి ఉందనే అంశాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని వారు కోరుతున్నారు.

28-08-2026

article_25776046.webp
మంథనిలో శర్మల ఆధ్వర్యంలో ఘనంగా నూతన యజ్ఞోపవీత ధారణ

మంథని, ఆగస్టు 28 (విజయక్రాంతి): మంథని పట్టణంలో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు జరిగాయి. తమ్మి చెరువుకట్ట వీధిలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వేద పండితులు అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులకు సంప్రదాయ పద్ధతిలో నూతన యజ్ఞోపవీతాలను ధరింపజేశారు.

28-08-2026