16 May, 2026 | 4:39 AM

Districts - Peddapalli

article_63846297.webp
మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్

మంథని,(విజయక్రాంతి): మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్, గౌరవ గౌరవాధ్యక్షులుగా బొల్లవరం విజయానందరావు,ఉపాధ్యక్షులుగా జబ్బార్ ఖాన్, వెల్మ రెడ్డి శ్రీనివాస రెడ్డి, కోశాధికారిగా చేరాల రవీందర్, సహాయ కార్యదర్శులుగా చిప్ప రాజేష్, గిరివేణి రాకేష్, ప్రచార కార్యదర్శి చెలుకల యుగంధర్, కార్యవర్గ సభ్యులుగా కాశీపేట శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్, ఆకుల రాజు, రామడుగు సాయి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఏర్పాటై అంచెలంచెలుగా ఎదుగుతున్న డివిజన్ ప్రెస్ క్లబ్ ఇదే స్థాయిలో మంథని, కమాన్ పూర్, ముత్తారం మండలాల స్థాయిలో గొప్ప పేరుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

15-05-2026

article_59272099.webp
గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి

రామగిరి, మే 15 (విజయక్రాంతి): గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు 100కు డయల్ చేయాలని మంథని సిఐ రాజు ప్రజలకు సూచించారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు గ్రామంలోని ఇళ్లను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. 08 నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజు గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ప్రతి ఇంటికి కెమెరాల ఏర్పాటు అవసరమని తెలిపారు.

15-05-2026

article_64517247.webp
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సుల్తానాబాద్,(విజయ క్రాంతి):పాఠశాల పిల్లలకు నిర్మాణాత్మకంగా, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అది ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం ఆయన ఊషన్నపల్లి గ్రామ వీధుల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను, సౌకర్యాలను తెలియజేసే ప్లెక్సీ బ్యానర్ తో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 'ప్రభుత్వ పాఠశాలలు ప్రగతికి సోపానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు పిల్లల జీవితాల్లో నింపును వెలుగు' అంటూ గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య గ్రామంలోని హనుమాన్ దేవాలయం చావడి వద్ద గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులను సమావేశపరిచారు.

14-05-2026