11 July, 2026 | 2:37 PM

Breaking News

అంగన్వాడీలతో వెట్టి చాకిరి సరికాదు   •   వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు చేద్దాం -భూగర్భ జలాలను పరిరక్షిద్దాం   •   ఆరుగురు హత్యల ఘటనపై స్పందించిన సీతక్క.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం   •   హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

Districts - Peddapalli

article_56148769.webp
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం కుటుంబాన్ని పరామర్శించిన దుద్దిళ్ల శ్రీను బాబు

ముత్తారం, జూలై 11(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం తండ్రి చొప్పరి లింగయ్య శుక్రవారం ఉదయం మృతి చెందడంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీను బాబు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సదానందం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్రీనుబాబు వెంట ముత్తారం సింగిల్ విండో చైర్మన్ యాదగిరిరావు, మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వినీత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల కిరణ్, అజీమ్ ఖాన్, సూదాటి సంపత్‌రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

11-07-2026

article_70562938.webp
మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞశాలి

మంథని, జూలై 10(విజయ క్రాంతి): మాజీ ఎమ్మెల్సీ మంథని మేధావి, కవి, రచయిత మరియు నిరంతర రాజకీయ పోరాటయోధుడు స్వర్గీయ గీట్ల జనార్ధన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. గీట్ల జనార్దన్ రెడ్డి 88వ జయంతి వేడుకలు మంథని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి చైర్మన్ పలువురు ప్రముఖులతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రగోతం రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఆకుల రాజ బాపు, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.

10-07-2026