calender_icon.png 24 January, 2026 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29109499.webp
ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన ఉన్నత విద్య

23-01-2026

సుల్తానాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం , ఇంటర్మీడియట్ బోర్డు వారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది, ఈ సమావేశం కు ముఖ్యఅతిథి గా ఇంటర్మీడియట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ వి. రమణారావు విద్యార్థుల తల్లిదండ్రులను ఉదేశించి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన ప్రమాణాలతో ఉచిత విద్య లభిస్తుందని, ప్రభుత్వం కూడా కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.

article_56025888.webp
జనవరి 30 నాటికి ఇందిరమ్మ ఇండ్లను 100శాతం గ్రౌండ్ చేయాలి

23-01-2026

పెద్దపల్లి జనవరి-23 (విజయక్రాంతి): జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల 100శాతం గ్రౌండ్ చేయాలని మజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్క్ ఔట్ చేయని ఇందిరమ్మ ఇండ్ల పట్టణ ప్రాంతాలలో 1406, రూరల్ ప్రాంతాల్లో 967 పెండింగ్ ఉన్నాయని, మొత్తం జిల్లాలో 2373 ఇండ్లు పెండింగ్ లో ఉన్నాయని, జనవరి 30 నాటికి ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మార్క్ ఔట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

article_45439577.webp
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

22-01-2026

సుల్తానాబాద్, జనవరి 22 (విజయ క్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయనీ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో సీఎం కప్ యూత్ వాలీబాల్ క్రీడలను గురువారం గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ నవీన్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరగోని రమేష్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యకరమైన భావి భారత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కవిత, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆసియా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

article_58986504.webp
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష

22-01-2026

గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తికి గోదావరిఖని మెజిస్ట్రేట్ 03 రోజుల జైలు శిక్ష విధించినట్లు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ ఆధ్వర్యంలో గోదావరిఖని లో డ్రంక్&డ్రైవ్ నిర్వహించగా దొరికిన 5 మందిని, సెకండ్ అడిషనల్ గోదావరిఖని మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా 4 గురికి రూ. 8,000/- రూపాయల జరిమానా విధించారని, ఒక వ్యక్తి కి రెండవసారి పట్టుబడగా 03 రోజుల జైలు శిక్ష విధించారని సీఐ తెలిపారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.