గుంజపడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహార యాత్ర
25-12-2025
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడుగు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్ లోని చారిత్రక ప్రాంతాలు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్ మొదలైనవి విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా గోల్కొండ, చార్మినార్ లకు సంబంధిత చరిత్ర ప్రభావాలను తెలుసుకుని అబ్బుర పడ్డారు. జూపార్క్ లోని జంతువులకు, పక్షులను సందర్శించి వాటి జీవన విధానాలను తెలుసుకున్నారు.