8 June, 2026 | 2:48 PM

Districts - Peddapalli

article_72642486.webp
కాళేశ్వరం అవినీతిపై ఎవరికీ క్లీన్ చిట్ లేదు

పెద్దపల్లి,జూన్ 8(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టు ఎటువంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోవడం అనాలోచిత నిర్మాణానికి నిదర్శనమని విజయ రమణారావు విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యం బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగడుతోందని పేర్కొన్నారు.

08-06-2026