కరెన్సీ గణనాథుడు..రూ.9లక్షతో అలంకరణ
సుల్తానాబాద్,సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడిని రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్ల మాలలతో అలంకరించారు. రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొనగా, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళా నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
19-09-2026 | 12:27pm