29 July, 2026 | 3:51 PM

Districts - Peddapalli

article_35414775.webp
భారీ వర్షాలు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సుల్తానాబాద్, జూలై 29(విజయక్రాంతి): రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత.తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసరమైతే నే బయటకు రావాలని, కరెంటు స్తంభాలు,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వద్దకు,తెగిపడిన కరెంటు వైర్ల వద్దకు వెళ్లకూడదని సూచించారు. నీరు ప్రవహించే ప్రాంతాలకు పిల్లలను వెళ్లకుండా చూడాలని అన్నారు.అలాగే చైర్మన్ బిరుదు రాధాకృష్ణ నాలుగో వార్డ్ 15వ వార్డులో లోతట్టు ప్రాంతాల్ని పరిశీలించారు, వార్డు ప్రజలను అప్రమత్తం చేస్తూ , వర్షపు నీరు ఎక్కడ నిలవకుండా కాలువలను క్లియర్ చేయించారు, చైర్మన్ వెంట కమిషనర్ రమేష్ , 15వ వార్డ్ కౌన్సిలర్ గాదాస్ మంజుల రవి పాల్గొన్నారు, ఏదైనా అత్యవసరమైతే కమిషనర్ కు , లేదా నాకు సమాచారం ఇవ్వాలని, ఈ నెంబర్లలో 739622 4440 ,6309532229 సంప్రదించాలని బిరుదు రాధాకృష్ణ కోరారు...

29-07-2026

article_20153819.webp
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన నూతన వైద్యులు

మంథని, జూలై 29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా నియమితులైన వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ద్వారా మంథని ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ ప్రాతిపదికన ఎంపికైన వైద్యులు బుధవారం మంత్రికి పూలమొక్కలు అందించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంథని ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టీ.వి. రాజశేఖర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుకు పూలమొక్కను అందజేశారు. ఇటీవల నియమితులైన గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ గుంట మౌనిక తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

29-07-2026

article_19856522.webp
చిల్డ్రన్ హోమ్ నుండి ఇద్దరు బాలికల అదృశ్యం

సుల్తానాబాద్, జులై 29 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న చిల్డ్రన్ హోమ్ నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు, మంగళవారం రాత్రి మిరియాల ఉమామహేశ్వరి (16), సుశీల ఆకృతి (08) గోడ దూకి వెళ్లిపోయినట్లు సూపరిటెండెంట్ వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు, బాలికల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ రంజిత్ రావ్ , ఎస్సై చంద్రకుమార్ లు బుధవారం తెలిపారు, ఎవరికైనా బాలికల ఆచూకీ తెలిసినచో సుల్తానాబాద్ ఎస్సై 8712656511, సీఐ 8712656510 కు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

29-07-2026

article_71059150.webp
సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్

మంథని, జూలై 29విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంటున్న మంథనికి చెందిన సీనియర్ పాత్రికేయుడు పెండ్యాల రామ్‌ కుమార్‌ను మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు రామ్ కుమార్ నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొంది తిరిగి పాత్రికేయ వృత్తిలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

29-07-2026