12 August, 2026 | 4:03 PM

Districts - Peddapalli

article_90583980.webp
బస్వాపూర్ లో ప్రమాదకర గుంతకు పోలీసుల తక్షణ మరమ్మతు

కాటారం, ఆగస్ట్ 12 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం బస్వాపూర్ ప్రధాన రహదారిపై మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం సమీపంలో రుద్రారం వైపు వెళ్లే మార్గంలో ఏర్పడిన భారీ గుంత ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. రాత్రివేళ గుంత కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి స్థానికులు ఈ విషయాన్ని కాటారం సీఐ నాగార్జునరావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ వెంటనే స్పందించి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదకరంగా మారిన గుంతను పరిశీలించి, తక్షణమే పూడ్చివేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ప్రమాదం తప్పింది. ప్రజల సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, సంబంధిత శాఖల కోసం వేచి చూడకుండా తక్షణ చర్యలు చేపట్టిన సీఐ నాగార్జునరావుపై స్థానికులు, ప్రయాణికులు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు స్పందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

12-08-2026

article_32974489.webp
17 న పెద్దపల్లిలో మంత్రుల పర్యటన

సుల్తానాబాద్ ,(విజయక్రాంతి): ఈనెల 17న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొత్త రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చెప్పారు. మంగళవారం సాయంత్రం సుల్తానాబాద్ పట్టణం, మండలంలోని గర్రెపల్లి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని అనేక గ్రామాలను కలుపుతూ రూ.99 కోట్లతో గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు నిర్మించే తారు రోడ్డుకు మంత్రులచే గర్రెపల్లి గ్రామంలో శంకుస్థాపన చేయడంజరుగుతుందన్నారు.

12-08-2026