రహదారుల నిర్మాణానికి రేవంత్రెడ్డి సర్కార్ పెద్దపీట
పెద్దపల్లి,సుల్తానాబాద్,ఆగస్టు 19(విజయక్రాంతి) రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాలకు ఆధునాతన రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
19-08-2026