జిల్లాలో వర్షాల వేళ పాఠశాలల్లో అప్రమత్తత తప్పనిసరి
పెద్దపల్లి, ఆగస్టు 01 (విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
01-08-2026