4 September, 2026 | 4:08 PM

Districts - Peddapalli

article_26814600.webp
బోయినపేటను విస్మరిస్తున్న విద్యుత్ అధికారులు

మంథని, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బోయినపేటలో విద్యుత్ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేక రాత్రివేళ ప్రజలు చీకట్లో రాకపోకలు సాగిస్తున్నారని, కొన్ని చోట్ల విరిగిన, శిథిలావస్థకు చేరిన స్తంభాలు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న స్తంభాలు, తీగలను తొలగించి కొత్తగా అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోయినపేట ప్రధాన రహదారికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించకుంటే ప్రజలతో కలిసి విద్యుత్ కార్యాలయం ముట్టడి చేసి, అవసరమైతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

04-09-2026 | 01:22pm

article_20238329.webp
గర్రెపల్లిలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత రామయ్యకు సన్మానం

సుల్తానాబాద్, సెప్టెంబర్ 1 (విజయ కాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన జానపద కళాకారుడికి రాష్ట్రపతి అవార్డు రావడం తమ గ్రామానికి గర్వకారణం అని గ్రామస్తులు అన్నారు, గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దుర్శేటి రామయ్య ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గర్రెపల్లి గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు కన్న రమేష్ , కస్తూరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గర్రెపల్లి చెరువు వద్ద శివుడి విగ్రహం ఎదుట రామయ్యను ఘనంగా సన్మానించారు.

01-09-2026 | 11:19am

article_83600727.webp
మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లోనే గుర్తింపు

కొయ్యూరు, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): కొయ్యూరు మండలంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు రాపిడ్ టెస్ట్ కిట్లతో ప్రత్యేక నిఘా చేపట్టారు. అనుమానంతో పరీక్షలు నిర్వహించగా ఇద్దరు యువకులకు పాజిటివ్‌గా తేలడంతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మత్తు పదార్థాలకు బానిసైన వారు స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదిస్తే డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహేందర్ కుమార్ యాదవ్ తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

01-09-2026 | 11:11am