మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత పర్యటన
మంథని, ఆగస్టు 02విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం రేపు మంథని నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. విద్య, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
02-08-2026