27 August, 2026 | 4:28 PM

Districts - Peddapalli

article_34367775.webp
ఖాకీకి రాఖీ బంధం.. మంథని పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు

మంథని, ఆగస్టు 27 (విజయక్రాంతి): అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని గురువారం మంథని పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ మంథని ఎస్ఐ సందీప్ కుమార్‌కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఖాకీ విధుల్లో నిత్యం ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసు కుటుంబంలో రక్షాబంధన్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా కానిస్టేబుల్ ప్రేమాభిమానాలకు ప్రతీకగా రాఖీ కట్టగా, ఎస్ఐ సందీప్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోదరభావాన్ని పంచుకున్నారు.

27-08-2026