8 July, 2026 | 3:33 AM

Districts - Peddapalli

article_15420143.webp
ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసేందుకు గాను మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో కరెంట్ స్తంభాల ఏర్పాటు ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ తెలిపారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆశీస్సులతో 15 వ ఫైనాన్స్ నుండి 11 లక్షల రూపాయలను తీసుకొని పలు వార్డులకు సంబంధించి కరెంటు స్తంభాలను కొనుగోలు చేసి వాటిని ఇందిరమ్మ ఇల్లుల దగ్గర, కరెంటు లేని ఏరియాలలో వేయడానికి మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు కృష్ణ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ తో కలిసి అవార్డులో స్తంభాలు వేయించడం జరిగినది.

07-07-2026

article_34822204.webp
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

మంథని కాటారం, జూలై 06(విజయక్రాంతి: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. దేవాలయాలు సమాజంలో ఐకమత్యం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గ్రామ ఆడపడుచులకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

06-07-2026