ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతం చేయాలి
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల పదమూడవ వార్డులో కౌన్సిలర్ సిద్ధ తిరుపతి ఆధ్వర్యంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల తొలగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
08-07-2026