తన మాట నిలబెట్టుకున్న బోయినిపేట కౌన్సిలర్
మంథని, జూలై 27 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మంథని పురపాలక సంఘం 6వ వార్డు (బోయిన్పేట్) కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రెండు నెలల కౌన్సిలర్ వేతనంతో స్థానిక నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. బోయిన్పేట్ ప్రాంతానికి చెందిన నాలుగు నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి ఉచితంగా బియ్యం, కిరాణా సామగ్రి, ఇతర నిత్యావసర వస్తువులను ఆమె స్వయంగా పంపిణీ చేశారు.
27-07-2026