6 August, 2026 | 12:02 AM

Districts - Peddapalli

article_84695710.webp
మంథని పట్టణంలో సీసీ రోడ్డే పార్కింగ్ స్థలమా..?

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని పట్టణంలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా మారిపోయిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లను ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే గంటల తరబడి నిలిపివేస్తుండటంతో ప్రజల రాకపోకలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మంథని పట్టణంలోని శ్రీపాద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సిఆర్ కే అపార్ట్మెంట్, పాత పెట్రోల్ బంక్, బస్సు డిపో ఏరియాల్లో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు పార్క్ చేయడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఒకదానికొకటి దారి ఇచ్చుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు కూడా సకాలంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

05-08-2026

article_80544304.webp
గ్రామీణ ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు అందిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు

మహాదేవపూర్,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో, వారి మార్గదర్శకత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి స్వర్గీయ సువర్ణ వనమాల (తాయి) స్మారకార్థం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.

05-08-2026

article_58733312.webp
మన ఊరు–మన కోచింగ్ సెంటర్ విజేతకు మంత్రి శ్రీధర్ బాబు సన్మానం

మంథని,(విజయక్రాంతి): పేద, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లి అధిక ఖర్చులు భరించాల్సిన అవసరం లేకుండా చేయాలనే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏర్పాటు చేసిన "మన ఊరు–మన కోచింగ్ సెంటర్" ఘనతను నమోదు చేసింది. ఈ కోచింగ్ సెంటర్‌లో 2022-23 సంవత్సరంలో శిక్షణ పొందిన ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మేకల అనూష సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి, మంథని స్థానిక పోలీస్ స్టేషన్ లోనే 2024 లో విధులలో చేరింది. ఈ సంవత్సరం మళ్ళీ మొదలైన మన ఊరు మన కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ సభలో ఆమెను మంథనిలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అనూషకు సభాముఖంగా శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిభతో పాటు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ పొందితే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం అసాధ్యం కాదని పేర్కొన్నారు. యువత లక్ష్యంతో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన సూచించారు.

05-08-2026