మంథని పట్టణంలో సీసీ రోడ్డే పార్కింగ్ స్థలమా..?
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని పట్టణంలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా మారిపోయిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లను ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే గంటల తరబడి నిలిపివేస్తుండటంతో ప్రజల రాకపోకలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మంథని పట్టణంలోని శ్రీపాద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సిఆర్ కే అపార్ట్మెంట్, పాత పెట్రోల్ బంక్, బస్సు డిపో ఏరియాల్లో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు పార్క్ చేయడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఒకదానికొకటి దారి ఇచ్చుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు కూడా సకాలంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
05-08-2026