22 August, 2026 | 3:41 AM

Districts - Peddapalli

article_30700116.webp
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

సుల్తానాబాద్ , ఆగస్టు 21 (విజయ క్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు గొట్టిముక్కుల సురేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

21-08-2026

article_44967421.webp
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి

మంథని, నారాయణ్‌ఖేడ్, ఆగస్టు 20(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సంగటన్ శ్రీజన్ అభియాన్ పీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో శ్రీను బాబు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అభిప్రాయ

21-08-2026