కొనుగోలు వేగంగా పూర్తి చేయండి
01-05-2025
నిర్మల్ ఏప్రిల్ 30(విజయక్రాంతి): యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన వారి ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.