భారీ వర్షాల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు సెలవు
19-08-2025
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (బుధవారం) నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడం, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోవడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు.