బోథ్ గడ్డను మోసం చేసింది కాంగ్రెస్సే..
16-12-2025
బోథ్, డిసెంబర్15(విజయక్రాంతి): అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో బోథ్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేస్తానని హామీ ఇచ్చి, అ తర్వాత హామీని తుంగలో తొక్కి బోథ్ గడ్డను మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధ్వజమెత్తారు. సోమవారం బోథ్, సోనాల పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.