calender_icon.png 25 May, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_25796564.webp
ప్రజల సూచనలు తప్పకుండా పరిగణతీసుకుంటాం

24-05-2025

ప్రయాణికుల సేవి ప్రథమ కర్తవ్యంగా టీజీ ఆర్టీసీ ప్రజల అభిప్రాయాలు కనుగుణంగా బస్ సర్వీస్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. శనివారం డయల్ యువర్ డిఎం లో వచ్చిన ప్రశ్నలకు జవాబులను అందించారు. నిర్మల్ డిపో పరిధిలోని గుమ్మిరాల నుండి ఏరుగట్ల వరకు బస్సు నడపాలని పిట్టాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలని నిర్మల్ బైంసా రూట్లో రద్దీకి అదనంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, గడిచందాకు బస్సు టైమింగ్లు మార్చాలని. ఓలా కుంటాలకు అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లు వచ్చినట్టు ఆయన తెలిపారు.

article_67199983.webp
ఆసుపత్రిలో ఎక్స్‌రే సెంటర్ ప్రారంబించిన ఎమ్మెల్యే

24-05-2025

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) ఎక్స్‌రే సెంటర్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంబడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉన్న ఈ హాస్పిటల్ ను గత ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో మాత్రం చేపట్టలేకపోయిందని అన్నారు. కనీస వసతులు, సిబ్బంది కొరత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మేరకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.