మేడిపెల్లి, తాండ్రకు బస్సు సర్వీసు
16-06-2025
వివిధ గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు సోమవారం నుండి నిర్మల్ మండలంలోని మేడిపల్లి మామున మండలం నుండి తాండ్ర వరకు బస్సు సర్వీసు ప్రారంభించినట్టు నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. ఈ బస్సు సర్వీసు అనంతపేట, నీలాయిపేట, మేడిపెల్లి,బూర్గుపెల్లి, మొండిగుట్ట, తాండ్ర గ్రామాలకు పల్లెవెలుగు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి ఉదయం 07.20 బయలుదేరి 08.05 తాండ్రకు చేరుకుంటుంది.