calender_icon.png 21 November, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_42733324.webp
కొనుగోలు వేగంగా జరగాలి

20-11-2025

మెట్ పల్లి (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. గురువారం మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహణ, సౌకర్యాలు మరియు ధాన్యం వాహనాల రాకపోకలను పరిశీలించి, ట్రక్‌షీట్లలో నమోదైన ధాన్యం వివరాలను తనిఖీ చేసి, గత సారి వచ్చిన వడ్లతో పోల్చి ప్రస్తుత సీజన్ రికార్డులను విశ్లేషించారు. అలాగే రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

article_82979428.webp
మిషన్ భగీరథ పనులు త్వరలో పూర్తి

20-11-2025

మెట్ పల్లి, (విజయక్రాంతి): మెట్ పల్లి మున్సిపల్(Metpally Municipal) పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులు త్వరలో పూర్తి అవుతాయని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. గురువారం ఆయన పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ లికేజి మరమత్తు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లీకేజ్ పనులు రెండు రోజులలో పూర్తవుతాయని సంబంధిత సూపర్వైజర్ తెలపడం జరిగిందని అన్నారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరం ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేయడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సూపర్వైజర్ దినేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ పాల్గొన్నారు.

article_15440263.webp
ధాన్యం కొనుగోళ్లలో రైతుల సమస్యలను పరిష్కరించాలి

19-11-2025

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సందర్శించి మొక్కజొన్న కొనుగోలపై రైతుల పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుకాలం పండించి విక్రయించడానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని విక్రయించే సందర్భంలో బయోమెట్రిక్ విధానంతో రైతులు ఇబ్బందులకు పాలవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా యార్డులో నిల్వ ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులు స్వయంగా చూశారు.

article_35397836.webp
వెల్గటూర్ ఎస్‌ఐగా ఉదయ్ కుమార్

18-11-2025

ధర్మపురి,నవంబర్ 1౭ (విజయక్రాంతి): వెల్గటూర్ మండల ఎస్ ఐగా పి.ఉదయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. శాంతి భద్రతల విషయంలో మండలప్రజలు పోలీసుశాఖకు సహకరించాలినీ ఆయ న కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కోటిలింగాల దేవస్థానాన్ని ఆయన సం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ పూదరి రమేష్, ఈవో కాంతరెడ్డి, డైరెక్టర్ గుమ్ముల వెంకటేష్ లు ఆయనకు స్వాగతం పలికారు.ఉదయ్ కుమా ర్ ను వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాద వ్, గాజుల విజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలుతెలిపారు.