25 July, 2026 | 6:37 PM

Districts - Jagtial

article_47608210.webp
రాంనూర్ లో భూ రీ సర్వే సమావేశం ఏర్పాటు

ధర్మపురి,జూలై23 (విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామములో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే అవగాహన సధస్సును మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సర్వే,ల్యాండ్ రికార్డు ఏడీ కిషన్ ప్రసాద్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అధికారులకు సహకరించి తమయొక్క సమస్యలను పరిష్కరించుకోవాలనీ ఆయన సూచించారు. రైతులు ఎవరు అధైర్య పడొద్దని, అందరి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారనీ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ ఐత తిరుపతి, పాలక వర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

23-07-2026

article_64238043.webp
విద్యార్థులకు అండగా ఉంటాం-సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి అడ్లూరి

ధర్మపురి,జూలై21(ధర్మపురి): విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామనీ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్ లో ఆయన మంగళవారం పర్యటించారు. విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కుమ్మరిపల్లె మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి బోర్‌వెల్ తవ్వకాలకు భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

21-07-2026