యథేచ్ఛగా ఇసుక దందా
20-04-2024
ఇసుక దందా దళారులకు కల్ప తరువుగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరంగా మారగా, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతుంది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా నిరంతరంగా కొనసాగుతున్నా పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు.