Districts - Jagtial

సింగపూర్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నారై యువత రక్తదానం
సింగపూర్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నారై యువత రక్తదానం

కొడిమ్యాల,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సింగపూర్ దేశంలో నివసిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎన్నారై(NRI) యువకులు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమానికి స్పందిస్తూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రక్తదాన కార్యక్రమానికి మద్దతుగా సింగపూర్‌లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 25 మంది ఎన్నారై యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

13-09-2026 | 02:04pm