మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
17-03-2025
జగిత్యాల అర్బన్, మార్చి 16 (విజయక్రాంతి): పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక కాలంలో అన్ని రంగాలలో మహిళలు రాణించాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక ఐడిఓసి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని, వారి ప్రాధాన్యత నేటి సమాజానికి అవసరమని, వారిని ఆర్ధికంగా బలోపేతం చేసి సమాజంలో గౌరవాన్ని పెంపొందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.