16 May, 2026 | 12:14 PM

Districts - Jagtial

article_83437808.webp
యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!

ధర్మపురి,మే11(విజయక్రాంతి): వెల్గటూర్ మండల జేసీబీ యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని యూనియన్ సభ్యులు హెచ్చరించారు. సోమవారం ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనాన్ని యూనియన్ సభ్యులతో కలిసి ఖండించారు. తాము ఎవరినీ బలవంతంగా డబ్బులు కట్టమని ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు. అప్పులు చేసి జేసీబీలు కొనుగోలు చేసి, ప్రతినెల ఫైనాన్స్‌లు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. జేసీబీ యూనియన్‌ను 2024లో రిజిస్ట్రేషన్ చేశామని, ప్రస్తుతం యూనియన్‌లో రూ.5.40 లక్షల నిధులు నిల్వ ఉన్నాయని వెల్లడించారు.

11-05-2026