5 September, 2026 | 10:29 PM

Districts - Jagtial

కంకర వేశారు. తారు మర్చారు..!
కంకర వేశారు. తారు మర్చారు..!

మల్యాల, సెప్టెంబర్‌ 5 (విజయక్రాంతి): మల్యాల మండల కేంద్రం నుంచి పెగడపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్యాచ్‌వర్క్‌ పేరుతో కంకర వేసి తారు వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రోడ్డుపై కంకర తేలి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం మీదుగా కొండగట్టుకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు, హనుమాన్‌ దీక్షాపరులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్యాచ్‌వర్క్‌ పనులను వెంటనే పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

05-09-2026 | 04:48pm

కాంగ్రెస్ 420 హామీలను 1000 రోజులు గడిచిన అమలు చేయలేదు
కాంగ్రెస్ 420 హామీలను 1000 రోజులు గడిచిన అమలు చేయలేదు

కొడిమ్యాల,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల అసమర్థ పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... ఎన్నికల ముందు రైతులకు 15 వేల రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 4 వేల పింఛన్‌,వికలాంగులకు 6 వేల పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు 15 వేల రైతు భరోసా ఇచ్చి రోడ్డుపైకి రావాలి.. లేదంటే ఏ ముఖం పెట్టుకొని ర్యాలీలు నిర్వహిస్తున్నారు.సిగ్గుందా అని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు.

03-09-2026 | 03:23pm