కంకర వేశారు. తారు మర్చారు..!
మల్యాల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మల్యాల మండల కేంద్రం నుంచి పెగడపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్యాచ్వర్క్ పేరుతో కంకర వేసి తారు వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రోడ్డుపై కంకర తేలి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం మీదుగా కొండగట్టుకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు, హనుమాన్ దీక్షాపరులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్యాచ్వర్క్ పనులను వెంటనే పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
05-09-2026 | 04:48pm