బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
మెట్ పల్లి, (విజయక్రాంతి): పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో జగిత్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మెట్పల్లిలో స్కూల్ బస్సు డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలకు మంగళవారం సమగ్ర రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.జగిత్యాల జిల్లా రవాణా అధికారి సందాని మహమ్మద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా డిఎస్పీ రాములు, రవాణా అధికారి సందాని మహమ్మద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి. శ్రీనివాసరావు, ఎం. సాయిచరణ్, షేక్ రియాజ్ లు డ్రైవర్లు పాటించాల్సిన కీలక భద్రతా నియమాలను వివరించారు.
05-08-2026