calender_icon.png 1 May, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_82280788.webp
గ్రూప్-1పై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై విచారణ

30-04-2025

హైదరాబాద్: గ్రూప్-1పై టీజీపీఎస్సీ(Telangana Public Service Commission) దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. సీజేధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇవాళ సింగిల్ బెంచ్ లో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. సింగిల్ బెంచ్ లో పిటిషన్లపై తేల్చుకోవాలని ధర్మాసనం తెలిపింది. గ్రూప్ వన్(TGPSC Group-1 Mains examination results) మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యుర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని అభ్యర్థులు ఆరోపించారు.

article_76342006.webp
నేల రాలిన మామిడి కాయలు

30-04-2025

జగిత్యాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఆకుపచ్చ రంగుతో మిల మిలా మెరుస్తూ, చెట్టు నిండా కోతకు వచ్చిన మామిడి పంట కళ్ల ముందే గాలివాన బీభత్సంతో నేల రాలడంతో ఆ రైతుల పరిస్థితి కన్నీటి పర్యంత మైంది. ఇటీవల కురిసిన గాలివానల మూ లంగా సుమారుగా 3 వేల ఎకరాల పైచిలు కు మామిడి పంట చెడి పోయినట్లు అధికారిక అంచనా. కానీ 4 వేల ఎకరాలకు పైచిలు కే నష్టపోయామన్నది రైతు సంఘాల నాయకుల మాట. గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా మామిడి రైతులు చేతికి అందివచ్చిన మామిడి కాయలకు ‘తేనె మంచు’ అలియాస్ ‘మంగు’ వైరస్ సోకడంతో అపా ర నష్టానికి గురవుతున్నారు. ఈ వైరస్ సోకి న మామిడి కాయ చూడడానికి నిండుగా, బలంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ నల్లటి మ చ్చలు ఉంటాయి. ఆ మచ్చలున్న కాయల్ని హోల్ సేల్ మామిడి వ్యాపారులు చాటింగ్లో తీసేసి, ఎగుమతికి నిరాకరిస్తారు.

article_37209589.webp
గ్రంథాలు విజ్ఞాన భాండాగారాలు

26-04-2025

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): గ్రంధాలు విజ్ఞాన భాండాగారాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆద్వర్యంలో రూపొందించిన ‘జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం‘ గ్రంధాన్ని జగిత్యాల మహిళ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి ) లో ఆవిష్కరించారు. అంతకుముందు పహల్గాం ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి సంఘీభావంగా మౌనం వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రంథాలు విజ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయన్నారు. సాహిత్య వేత్తలు, రచయితలు చరిత్రను నేటి తరాలకు అందించడం అభినందనీయమన్నారు.