calender_icon.png 1 February, 2026 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_53563289.webp
ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగరెయ్యాలే

31-01-2026

ధర్మపురి,జనవరి30 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి ధర్మపురి పట్టణాన్ని మరింత అభివృద్ది చేయడానికి అవకాశం కల్పించాలని మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, ధర్మపురి పట్టణం మరింత అభివృద్ది చెందాలంటే మున్సిపాలిటిపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఓటర్లను ఆయన కోరా రు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటితో గెలిపించాలనీ ఓట్లర్లను విజ్ఞప్తి చేశారు.

article_36513147.webp
అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడుతాం

22-01-2026

ధర్మపురి, జనవరి 21 (విజయక్రాంతి): గత పాలకుల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని సరిచేస్తూ నేడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగా సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.

article_25489272.webp
సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు

20-01-2026

ధర్మారం, జనవరి 19(విజయక్రాంతి): ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ధర్మారం మండలంలో పర్యటించి ఎంపిడిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ దొంగతుర్తి గ్రామానికి 11 వేల భక్తు లు, బోట్ల వనపర్తి గ్రామానికి 9 వేల మంది భక్తులు, నంది మేడారం కు 6 వేల మంది భ క్తులు , ధర్మారం కు 5 వేల మంది భక్తులు, కటికనపల్లి కు 10 వేల మంది భక్తు లు, కొత్తూరు కు 6 వేల మంది భక్తులు, ఎర్ర గుట్టపల్లి కు 8 వేల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వస్తారని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు తయారు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.