calender_icon.png 13 November, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_26204713.webp
ప్రజల అభివృద్ధి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

12-11-2025

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే కేసిఆర్ ప్రభుత్వం పని చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కోరుట్ల మండలానికి చెందిన ₹2,98,000/-(రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల) విలువగల 13 సీఎంఆర్ఎఫ్, 143 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. పేద యువతి వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శాతం అందజేశారు.

article_43880897.webp
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

12-11-2025

ధర్మపురి, నవంబర్ 11(విజయక్రాంతి): ఎండపల్లి మండల కేంద్రంగా కొనసాగుతున్న ఇసుక దందాపై “కలెక్టర్ సారూ... ఇటు చూడరూ”అనే శీర్షికతో విజయక్రాంతిలో కథనం ప్రచురితం అయిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై స్పందించిన ఎండపల్లి తహసీల్దార్ స్వయంగా రంగంలోకి దిగి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కారనీ, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైన ఉపేక్షించేది లేదనీ, కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామనీ అక్రమార్కులకు తహసీల్దార్ అడ్ల అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.

article_18122248.webp
జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి

11-11-2025

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జర్నలిస్టుల రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతూ టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కు వినతిపత్రం అందచేశారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారిలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు కల్పించాయన్నారు.

article_26856093.webp
విచారణ కమిటీని ప్రభావితం చేసే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు

10-11-2025

జగిత్యాల అర్బన్, నవంబర్ 9 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో 100 కోట్ల భూ అక్రమణ వ్యవహారంపై విచారణ కోసం జిల్లా కలెక్టర్ కమిటీ వేశారని, అయితే ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే 138 సర్వే నెంబర్ లోని భూమి సదరు వ్యాపారి కి వారసత్వంగా వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలెక్టర్ వేసిన విచారణ కమిటీని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మా ట్లాడుతూ చట్టసభలకు ఎన్నికైన వ్యక్తులుగా ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందన్నారు.