బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్ పి అశోక్ కుమార్ లు బక్రీద్ పండుగ నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ స్థాయిల అధికారులు, మత పెద్దలు, ముస్లిం మరియు హిందూ ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా పండుగను శాంతియుతంగా, సౌహార్ద వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
14-05-2026