calender_icon.png 19 September, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_35418900.webp
విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగెయ్యాలి

18-09-2025

ధర్మపురి (విజయక్రాంతి): పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతాకుమారి హాజరై ప్రసంగించారు. విద్యార్థినిలు కచ్చితంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కృషి చేయాలని, ఓటమి చెందిన దిగులు పడకుండా లక్ష్యాన్ని చేరేవరకు పోరాడాలని సూచించారు. మహిళలు సోషల్ మీడియా పట్ల చాలా జాగ్రత్త వహించాలని, సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని, జీవితంలో ఎదురయ్య ఎన్నో సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవాలన్నారు.

article_69743331.webp
ఇబ్రహీంపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన

18-09-2025

కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్(District Collector Satya Prasad) గురువారం మండలంలోని యామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు గ్రౌండింగ్ చేసి పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపేదలకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేసే విధంగా చూడాలన్నారు. ఇండ్ల నిర్మాణాలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు త్వరగా పొందాలని లబ్ధిదారులకు తెలిపారు.

article_72914322.webp
విద్యార్థులకు ఆర్మీ జవాన్ ప్లేట్లు బ్యాగుల వితరణ

18-09-2025

ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఆర్మీ జవాన్ జక్కుల సుభాష్ యాదవ్ తన స్వగ్రామంపై మమకారంతో తన తల్లి జక్కుల మల్లవ్వ ఙ్ఞాపకం మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు బ్యాగులు అందించి తన వితరణ చాటుకున్నారు. గత కొన్నేళ్ల క్రితం మూతపడిన కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం పునః ప్రారంభమైంది. దీంతో పలువురు విద్యార్థులు స్థానికంగా విద్యాభ్యాసానికి అవకాశం లభించింది. ఈ విద్యార్థులకు తన వంతు చేయూతను అందించాలని స్వగ్రామంపై మమకారంతో సుభాష్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. పాఠశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ప్లేట్ల తో పాటు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు, స్కేళ్ళు, రబ్బర్ చాక్ మార్ తదితర సామాగ్రిని అందించారు.

article_17354951.webp
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి

15-09-2025

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్(District Collector Satya Prasad) అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చే ప్రజల సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవచూపాలని అన్నారు.