calender_icon.png 19 March, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_76659349.webp
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

17-03-2025

జగిత్యాల అర్బన్, మార్చి 16 (విజయక్రాంతి): పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక కాలంలో అన్ని రంగాలలో మహిళలు రాణించాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక ఐడిఓసి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని, వారి ప్రాధాన్యత నేటి సమాజానికి అవసరమని, వారిని ఆర్ధికంగా బలోపేతం చేసి సమాజంలో గౌరవాన్ని పెంపొందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

article_43092745.webp
మెడికల్ హబ్‌గా జగిత్యాల జిల్లా

14-03-2025

జగిత్యాల అర్బన్, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల తో పాటు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పల్లె, దావాఖానాలు ఎక్కువగా మంజూరయ్యాయని దీంతో జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా మారుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా రు.20 లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖాన నిర్మాణపనులకు స్థల పరిశీలన చేసి, పల్లె దావఖాన నిర్మాణానికి భూమి దానం చేసిన హనుమాన్ రెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం హనుమాజీపేట్ బాలపెళ్లి గ్రామాల మధ్య రు.31 లక్షల 50 వేలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

article_31595306.webp
కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి మూడు ఏళ్ల జైలు శిక్ష

14-03-2025

జగిత్యాల, మార్చి 13 (విజయక్రాంతి): జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మేకల స్వామి అనే వ్యక్తి మైనర్ బాలికైన తన కన్న కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జిల్లా జడ్జి నీలిమ గురువారం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 5 వేలు జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకి ఆధారాలు సమర్పించారు. సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణరావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చిరంజీవి , సిఎంఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ నరేష్, సిఎంఎస్ కానిస్టేబుల్లు శ్రీధర్, కిరణ్’కుమార్లను ఎస్పీ అశోక్’కుమార్ అభినందించారు.