calender_icon.png 25 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_36513147.webp
అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడుతాం

22-01-2026

ధర్మపురి, జనవరి 21 (విజయక్రాంతి): గత పాలకుల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని సరిచేస్తూ నేడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగా సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.

article_25489272.webp
సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు

20-01-2026

ధర్మారం, జనవరి 19(విజయక్రాంతి): ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ధర్మారం మండలంలో పర్యటించి ఎంపిడిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ దొంగతుర్తి గ్రామానికి 11 వేల భక్తు లు, బోట్ల వనపర్తి గ్రామానికి 9 వేల మంది భక్తులు, నంది మేడారం కు 6 వేల మంది భ క్తులు , ధర్మారం కు 5 వేల మంది భక్తులు, కటికనపల్లి కు 10 వేల మంది భక్తు లు, కొత్తూరు కు 6 వేల మంది భక్తులు, ఎర్ర గుట్టపల్లి కు 8 వేల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వస్తారని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు తయారు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

article_70600631.webp
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యం

20-01-2026

జగిత్యాల, జనవరి 19 (విజయ క్రాంతి): కోటిమంది మహిళలను కోటీశ్వరులను చే యడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో 938 స్వయం సహాయక మ హిళా సంఘాలకు 2,98,40,444 కోట్ల రూ పాయల జంబో చెక్ జగిత్యాల ఎమ్మెల్యే సం జయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ లతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సం దర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు.

article_32326818.webp
అద్భుతం.. అంజన్న క్షేత్రం..!

08-01-2026

మల్యాల, జనవరి 7 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ రూపురేఖలు మారబోతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గిరి ప్రదక్షిణ’ ప్రాజెక్టు పనులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వేగవంతమయ్యాయి. అరుణాచలం, సింహాచలం, చిలుకూరు బాలాజీ తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రభుత్వం నిర్ణయించింది. కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రాజెక్టు కొరకు అధికారుల అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ల ప్రత్యేక కృషి , చొరవతో సమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గిరిప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు 6 కిలోమీటర్లు ఉంటుంది.