calender_icon.png 4 February, 2026 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_47835746.webp
విజేతలకు బహుమతులు అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్

04-02-2026

ధర్మపురి,ఫిబ్రవరి3(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం స్తంభం పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీలో గెలుపొందిన విజేతలకు మంగళవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ బహుమతులు అందజేశారు.ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మేరుగు మురళి గౌడ్, గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

article_51035782.webp
కూలికి వెళ్తే.. ఆయువు తీరింది

04-02-2026

మల్లాపూర్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లి ట్రాక్టర్‌లో సాయంత్రం తిరిగి వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం మొగిలిపేట గ్రామ శివారులో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు సుమారు పదిహేను మంది పనులు ముగించుకొని సాయంత్రం ట్రాక్టర్‌లో ఇంటికి బయలుదేరారు. చెరువు గట్టుపైన ఉన్న రోడ్డుపై డ్రైవర్ ఎర్రం శెట్టి గంగాధర్ (36)ట్రాక్టర్ ను అతివేగంగా నడపడంతో అదువు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలో పడింది.

article_53563289.webp
ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగరెయ్యాలే

31-01-2026

ధర్మపురి,జనవరి30 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి ధర్మపురి పట్టణాన్ని మరింత అభివృద్ది చేయడానికి అవకాశం కల్పించాలని మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, ధర్మపురి పట్టణం మరింత అభివృద్ది చెందాలంటే మున్సిపాలిటిపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఓటర్లను ఆయన కోరా రు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటితో గెలిపించాలనీ ఓట్లర్లను విజ్ఞప్తి చేశారు.