రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన ఎన్ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థులు
జగిత్యాల, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి): ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలలో రామకృష్ణ విద్యాసంస్థలకు చెందిన శ్రీ ఎన్ ఎస్ వి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు. ప్రథమ సంవత్సరము బైపిసి విభాగంలో ఎం. సంజన 437/440, ఎంపీసీ విభాగంలో బి లిఖిత 467/470, ఆర్ శ్రీ చైత్ర , ఎస్ అనూష, పి శివప్రియ 466/470 సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
15-04-2026