ప్రజల అభివృద్ధి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
12-11-2025
కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే కేసిఆర్ ప్రభుత్వం పని చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కోరుట్ల మండలానికి చెందిన ₹2,98,000/-(రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల) విలువగల 13 సీఎంఆర్ఎఫ్, 143 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. పేద యువతి వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శాతం అందజేశారు.