విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025
29-10-2025
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెట్ షీకా గోయల్ ఆదేశానుసారం, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతి వనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ రూరల్ యూనిట్, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆఫీసర్ పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ నిధికి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని, ప్రభుత్వ అధికారులు నిబద్ధత, నిజాయితీతో, పనిచేయాలని, ప్రజల సమస్యలను విజిలెన్స్ శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.