21 August, 2026 | 3:22 PM

Districts - Medchal Malkajgiri

article_34277328.webp
మాడిపోయిన అన్నం, నీళ్ల సాంబారు తినలేకపోతున్నాం.. విద్యార్థుల ఆవేదన

మల్కాజిగిరి, ఆగస్టు 21,(విజయక్రాంతి): నేరేడ్ మెట్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ సరైన భోజనం పెట్టక పోవడంతో సగం మంది విద్యార్థులు ఇంటి బాట పట్టిన పట్టించుకునే వారు లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తూ, పాఠశాలల బలోపేతానికి ఒక వైపు కృషి చేస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది విద్యార్థులు ఇంటి నుండి భోజనాలను టిఫిన్ బాక్సులలో తెచ్చుకుని భోజనాలు చేస్తున్నామని వాపోతు న్నారు. ఈ పాఠశాలలో మాడిపోయిన అన్నం, నీళ్ల సాంబారు అంద జేస్తున్నారని ఇది తినాలంటే మాకు ఇబ్బందిగా ఉందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

21-08-2026

article_32164655.webp
తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవినీతిపై చర్యలు లేవా..? మల్కాజిగిరి, ఆగస్టు 21, (విజయ క్రాంతి): మల్కాజిగిరి తహశీల్ధారు కార్యాలయంలో ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తాహశీల్ధార్ తో పాటు పలువురు ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేసినప్పటకీ మండల కార్యాలయంలో కింది స్ధాయి సిబ్బంది పని తీరు ఏ మాత్రం మారడం లేదని వీరీ అవినీతిపై బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, తహశీల్దార్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లుగా విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి.

21-08-2026

article_46078219.webp
20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయండి

గ్రామ కంటంలో నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వండి జవహర్ నగర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ తదితరులు కమిషనర్ ను కలిశారు. జవహర్ నగర్ డివిజన్ లోని పలు కాలనీలలో దెబ్బతిన్న డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

20-08-2026