ఉద్యమ స్ఫూర్తిని చాటిన మహానుభావుడు జయశంకర్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షే ఉద్యమానికి అసలైన బలం అంటూ ఉద్యమ స్ఫూర్తిని చాటిన మహానుభావుడు ప్రొ. జయశంకర్ అని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ వార్డులో తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ హాజరై జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.
07-08-2026