ప్రజాపాలనకు జనం జై.. బీఆర్ఎస్కు ఎందుకీ గగ్గోలు?
ఘట్ కేసర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక నానా జిమ్మిక్కులు చేస్తున్నారని ఘట్ కేసర్ సర్కిల్ పోచారం, ఘట్ కేసర్, ఎదులాబాద్ డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, బొక్క ప్రభాకర్ రెడ్డి, సామల అమర్ ఆరోపించారు. వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనకు సంబంధించి 1000 రోజుల సంబరాలు జరుపుతుంటే బిఆర్ఎస్ నాయకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ నిరసనలు తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
09-09-2026 | 03:52pm