5 September, 2026 | 5:55 PM

Districts - Medchal Malkajgiri

వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన
వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టి మేడ్చల్ అసెంబ్లీ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వంట వార్పు చేపట్టి నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగిందని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

04-09-2026 | 11:41pm

కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీ మహిళా వ్యతిరేక పార్టీగా నిరూపించుకుంది
కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీ మహిళా వ్యతిరేక పార్టీగా నిరూపించుకుంది

బిసి మహిళా బిడ్డని అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకు నుంచి బర్తరఫ్ చేయడం దుర్మార్గమైన చర్యని వాపోయారు.కూతురు ఏదో మాట్లాడిందని తల్లిని శిక్షించడం అత్యంత దారుణమైన చర్యని వారు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక మాటలు మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం కూతురేదో మాట్లాడిందని కొండా సురేఖని రాష్ట్ర క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయడం సిగ్గుచేటని గణేష్,రాజ్యోతిలు వ్యాఖ్యానించారు.

04-09-2026 | 07:34pm

కెపిఆర్ఐటి లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026  ప్రారంభం
కెపిఆర్ఐటి లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 ప్రారంభం

ఘట్‌కేసర్‌,సెప్టెంబర్‌ 4: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో స్మార్ట్‌ ఇండియా ఇంటర్నల్‌ హ్యాకథాన్‌–2026 ప్రారంభమైంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేట్‌, ఇన్‌స్పైర్‌, ఇంపాక్ట్‌’ స్ఫూర్తితో 24 గంటల పాటు హ్యాకథాన్‌ నిర్వహిస్తున్నారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, సమస్య పరిష్కార సామర్థ్యం, ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో డైరెక్టర్‌-స్ట్రాటజీ కొమ్మూరి దివ్యశ్రీ, సీఈవో డాక్టర్‌ సి.డి. నాయుడు, శ్రీనాథ్‌ కశ్యప్‌ తదితరులు పాల్గొన్నారు.

04-09-2026 | 11:38am

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా

ఉప్పల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, అమలు కాని ఎన్నికల హామీలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎక్స్‌రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గాడిదలతో వినూత్న నిరసన చేపట్టి, 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

02-09-2026 | 07:24pm

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. బీఆర్‌ఎస్ పిలుపుమేరకు శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు అధ్యక్షుడు అయ్యన్నగారి రవికిరణ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిడి మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, మహిళలకు నెలకు రూ.2,500 హామీని అమలు చేయలేదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా అమలుతో పాటు యూరియా సరఫరా, పంటల కొనుగోలులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.

02-09-2026 | 03:29pm