కల్తీ పెరుగు, కోవా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడి
ఉప్పల్ ఆగష్టు 16, విజయక్రాంతి: కాప్రా సర్కిల్ పరిధిలోని వైష్ణవి ఎన్క్లేవ్లో నిర్వహిస్తున్న నందిని మిల్క్ సెంటర్పై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి భారీ మొత్తంలో కల్తీ పెరుగు, కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి తయారీ, గడువు తేదీలు, నాణ్యతకు సంబంధించిన లేబుళ్లు లేకుండా ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల తనిఖీల్లో సుమారు 120 కిలోల కత్తి పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిల్క్ సెంటర్లో నిర్వహించిన సోదాల్లో మరో 50 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను పరీక్షల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సమాచారం.
16-08-2026