గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
26-12-2025
మేడిపల్లి,(విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....గురువారం రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్, ఆర్.ఎన్.పి.ఎస్ బృందం నిర్వహించిన ఆపరేషన్లో గుండ్ల పృథ్వీరాజ్, టి. రాహుల్, మహ్మద్ అక్రమ్, అబ్దుల్ షఫీ లను అరెస్ట్ చేసి 3 కిలోల గంజాయి,4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చెంగిచర్ల కు చెందిన పృథ్వీరాజ్ (27) గతంలో కుట్టు దారాల తయారీ వ్యాపారం చేసేవాడు.కానీ కోవిడ్ వల్ల అది ఆగిపోవడంతో డ్రైవర్గా మారాడు.