calender_icon.png 5 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_15098029.webp
నరసింహ రెడ్డి కళాశాలలో అద్దాలు, పూలకుండీలు ధ్వంసం

05-07-2025

మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(Narsimha Reddy Engineering College)లో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. విద్యార్థుల హాజరులేదని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు కళాశాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం పేటిబషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ... తాము అధిక ఫీజులు వసూలు చేయడం లేదని తెలిపారు.

article_64719377.webp
మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

05-07-2025

మేడ్చల్ మండలం(Medchal Mandal) ఘనపూర్ సమీపంలోని మెడిసిటీ మెడికల్ కాలేజీ(MediCiti Institute of Medical Sciences)లో శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2005లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు వైద్య వృత్తిలో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో సమావేశమయ్యారు. వివిధ దేశాలలో వైద్యులుగా స్థిరపడిన వారు ప్రత్యేకంగా ఈ సమ్మేళనానికి వచ్చారు. ఈ సందర్భంగా నాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె శివరామకృష్ణ మాట్లాడుతూ... వివిధ దేశాలలో స్థిరపడిన వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు చేపట్టే ప్రగతి కార్యక్రమాలకు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్తి సహకారం ఉంటుందన్నారు.

article_19938639.webp
బాచుపల్లిలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

05-07-2025

మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్(Bachupally Police Station) పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్, రామకృష్ణయ్యపల్లికి చెందిన అంజిలప్ప, రాధకు 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఈ దంపతులు వలస కూలీలుగా జీవనోపాధి కొనసాగించేవారు. ఈ క్రమంలోనే 2025 ఏప్రిల్ లో బాచుపల్లిలోని కాంట్రాక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో వజ్ర ప్రతీక కన్స్ట్రక్షన్స్ లో కూలీలుగా పనిచేస్తూ ఉండేవారు. రాధ తరచుగా తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడేది. జూన్ 22న అంజిలప్ప మద్యం సేవించి వచ్చాడు.

article_83117463.webp
పురపాలక జేబుకు చిల్లు.. కస్టమర్లకు మాత్రం బిల్లు

03-07-2025

గుండ్లపోచంపల్లి పురపాలికలోని పలు వాణిజ్య వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ పొందకుండానే యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. తెలంగాణ మున్సిపల్(Telangana Municipal) చట్టం ప్రకారం ట్రేడ్ లైసెన్సులు పొందిన తరువాతే వ్యాపారం చేయాల్సి ఉండగా ఆ నిబంధనలు భేకాతర్ చేస్తూ రూపాయలు లక్షల్లో వ్యాపారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాయి. ఇదే అంశంపై దృష్టి సాధించాల్సిన సంబంధిత మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక పట్టణ ప్రజలు ఆరోపణలు వినబడుతున్నాయి. నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వాణిజ్య సంస్థలకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.