మౌలిక వసతులు కల్పించండి
మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలోని పలు కాలనీలలో ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి శనివారం ఉప్పల్ జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల పరిధిలోని ధరణి కాలనీ, బీపీఎం కాలనీలతో పాటు పలు కాలనీల ప్రజలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
16-05-2026