అల్వాల్లో మరోసారి రాజకీయ వేడి
21-01-2026
మేడ్చల్, జనవరి 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లో మరోసారి రాజకీయ వేడి రగులు కుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. వెంకటాపూర్ డివిజన్ సుభాష్ నగర్ స్మశాన వాటిక కమాన్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.