ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకం శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మేడిపల్లి ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్యప్రసాద్ తమ పాఠశాలలో అల్పాహార పథకం అమలును, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత, పరిశుభ్రత, వడ్డింపు విధానాన్ని పరిశీలించారు.
01-08-2026