15 May, 2026 | 12:24 PM

Districts - Medchal Malkajgiri

article_67128730.webp
నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్

ఉప్పల్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించి నేర రహిత సమాజంగా తీర్చిదిద్దామని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లక్ష్మీ నగర్ కాలనీ సిడిఎస్ భవన్ లో సైబర్ అవగాహన శాసనం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సప్ స్టేటస్ ల అప్రమత్తంగా ఉండి అపరిచిత వ్యక్తి నుండి వచ్చే కాల్స్ మెసేజ్లు పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. డ్రగ్స్ అనర్ధాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత తో పాటుగా సైబర్ నేరాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్న వారు 1930 సమాచారం ఇస్తే తిరిగి డబ్బు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు

15-05-2026

article_57892050.webp
నిరు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

ఘట్ కేసర్, మే 14 (విజయక్రాంతి) : నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లను అందిస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్ పరిధి ఘనపురం పరిధిలోని ఫకీర్ టేక్య తండాలోని వడ్త్యా జ్యోతి, ననావత్ బుజ్జి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల కలల్ని సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గృహప్రవేశం ఒక చిన్న పండుగలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శకం మొదలైందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రజల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. గ

14-05-2026