calender_icon.png 25 June, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_41317643.webp
కన్నతల్లిని కడతేర్చిన కసాయి కూతురు

24-06-2025

తన ప్రేమకు అడ్డు పడుతుందని కన్నతల్లిని కూతురు కిరాతకంగా హత్య చేసిన విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఎనిమిది నెలల క్రితం తేజశ్రీ(16)కి నల్లగొండకు చెందిన పగిళ్ల శివ(19)తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి అంజలి పదవ తరగతికే ప్రేమ వ్యవహారం ఏంటని ప్రశ్నించడంతో వారం రోజుల క్రితం బాలిక శివతో వెళ్ళిపోయింది. అంజలి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. అనంతరం ప్రియుడు శివ తేజశ్రీని పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు శివకు నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే తన ప్రేమకు తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు శివ, అతడి సోదరుడు యశ్వంత్ (18) తో కలిసి అంజలిని హత్య చేయాలని ప్లాన్ చేశారు.

article_33496882.webp
ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు..

23-06-2025

ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎస్ఓటి, దుండిగల్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి(DCP Koti Reddy) నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా హర్యానా రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర తనిఖీలు నిర్వహించామన్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో AP 40 DM 8365 నెంబర్ గల టాటా నెక్సన్ కారులో నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా, సేవాలాల్ మందిర్ ప్రాంతానికి చెందిన సాగర్ పవార్(23) ని అరెస్ట్ చేశారు.

article_13423655.webp
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన

23-06-2025

పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే నెరవేరుతుందని మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్(Former councillor Kaude Mahesh) అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపికైన లబ్ధిదారుల యొక్క ఇంటి నిర్మాణాలకు మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు రూ. ఐదు లక్షలు అందించి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారని తెలిపారు.

article_13958958.webp
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కొలన్ శ్రీనివాస్ రెడ్డి

22-06-2025

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి(Congress party leader Kolan Srinivas Reddy) పేర్కొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 2వ డివిజన్ చందు లేఔట్, ఎన్ఆర్ఐ కాలనీ వాసులు అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డిని తన కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాలనీలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కాలనీలో నెలకొని ఉన్నటువంటి సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.