మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
05-07-2025
పోచారం మున్సిపల్ కార్మికుల మహాసభ శుక్రవారం పోచారంలో జరిగింది. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పోచారం మున్సిపల్ కమిటీ 42 మందితో ఏర్పడింది. మున్సిపల్ గౌరవ అధ్యక్షులుగా సిఐటియు జిల్లా నాయకులు చింతల యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నార్కట్ పల్లి సబిత, అధ్యక్షునిగా జి. అశోక్, కార్యదర్శిగా వై. చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.