పోలింగ్ బూత్లను పరిశీలించిన కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు
29-01-2026
మేడ్చల్, జనవరి 28 (విజయక్రాంతి): జిల్లాలోని ఆలియాబాదు, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నందున ఎన్నికల సాధారణ పరిశీలకులుగా కొర్ర లక్ష్మి, వ్యయ పరిశీలకులుగా సునయన చౌహాన్ నియమితు లయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి సాధారణ ఎన్నికల పరిశీలకులు కొర్ర లక్ష్మి ఆలియాబాదు మున్సిపాలిటిలోని పోలింగ్ బూతులను పరిశీలించి కావలసిన మౌలిక సదుపాయాలను, రేలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.