సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
11-11-2025
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొండా సుజాత, ఎరగాంధండ్ల వంశీ, సత్యనారాయణ, నీరుడు ఓంప్రకాష్, మర్గం శంకర్, కొట్టె సులోచనకి మంగళవారం మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు.