calender_icon.png 21 January, 2026 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_81853480.webp
తనయుడి చేతిలో తల్లి హతం

21-01-2026

జవహర్ నగర్, జనవరి 20 (విజయక్రాంతి): సహజీవనానికి ఓ నిండు ప్రాణం బలైంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి పై ఆమె కుమారుడు కోపం పెంచుకుని ఆమె మృతికి కారకుడయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల మేరకు జవహర్‌నగర్‌లోని విఘ్నేశ్వర కాలనీలో ఉంటున్న పొట్టోళ్ల రజిని(40) తన ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. జమీల్ (38) అనే వ్యక్తితో రజిని కొంత కాలంగా సహజీవనం చేస్తుంది. ఇది ఆమె చిన్న కుమారుడైన రాజకరణ్ (24) కు నచ్చకపోవడంతో... జమీల్ పై కోపం పెంచుకున్నాడు.

article_57709177.webp
నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

20-01-2026

శామీర్‌పేట్ , జనవరి 19(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి ల తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ....ప్రజలకు అందుబాటులో అధునాతన సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

article_52337671.webp
ఎన్నికల ముంగిట శంకుస్థాపనల జోరు

20-01-2026

మేడ్చల్, జనవరి 19 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పనులకు మోక్షం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలలో వివిధ పనులకు కొబ్బరికాయ కొడుతూ రిబ్బన్లు కట్ చేస్తూ వెళ్లారు. రెండు మూడు రోజులలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదల అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.