calender_icon.png 24 January, 2026 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_84980219.webp
కూలీలు టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలి

24-01-2026

మేడ్చల్ అర్బన్, జనవరి 24 (విజయ క్రాంతి): కూలీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 1800 200 100 12 టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకు వచ్చిందని తెలిపారు. కూలీలు ఈ నంబర్ కు ఫోన్ చేస్తే వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. యాజమాన్యం వేతనాలు చెల్లించకపోయినా, కనీస వసతులు కల్పించక పోయిన, ఇతర బెనిఫిట్స్ ఇవ్వకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని ఆమె తెలిపారు. అసంఘటిత కూలీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

article_27455832.webp
ఏయూలో విజనోవా 2.0 హ్యాకథాన్‌ నిర్వహణ

24-01-2026

ఘట్ కేసర్, జనవరి 24 (విజయక్రాంతి) : జిహెచ్ఎంసి, పోచారం డివిజన్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ లో విజనోవా 2.0 24 గంటల జాతీయ స్థాయి కృత్రిమ మేధస్సు హ్యాకథాన్‌ను ఈ బ్లాక్ ఆడిటోరియంలో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈహ్యాకథాన్‌ను ప్రధాన అతిథి ఎ. వెంకటేశ్వర రావు, మాజీ ప్రాంతీయ డైరెక్టర్, ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి ఉపాధ్యమిత్వ డైరెక్టరేట్ గౌరవప్రదమైన సమక్షంలో ప్రారంభించారు. తన ప్రారంభ ప్రసంగంలో, వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచ అవసరాలను తీర్చడానికి నైపుణ్యాధారిత విద్య, వినూత్న ఆలోచనలు, ఉపాధ్యమిత్వం ఎంతో కీలకమని ఆయన వివరించారు.

article_58697562.webp
గాయపడిన ఆలయ ఈఓను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

24-01-2026

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ గట్టుమైసమ్మ దేవాలయం కార్యనిర్వహణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మికి మైసమ్మ గుట్ట జాతర పనుల విధినిర్వహణలో భాగంగా కాలుజారి కింద పడడంతో చేతికి గాయమై జోడిమెట్ల లోని నీలిమ హాస్పిటల్ లో శాస్త్ర చికిత్స జరిగింది. శాస్త్ర చికిత్స అయిన సందర్భంగా చికిత్స పొందుతున్న ఈవో భాగ్యలక్ష్మిని ఘట్ కేసర్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండి సిరాజ్ పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స గురించి చర్చించారు.

article_13747298.webp
ఘట్ కేసర్ లో రేపు ఘట్టు మైసమ్మ జాతర

24-01-2026

ఘట్ కేసర్, జనవర్ 24 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో దక్షిణ దిక్కులో కొండ గట్టుపైన వెలసిన మహిమగల దేవత ఘట్టుమైనమ్మ. కోరిన కోర్కెలు తీర్చే కొండ పుత్రికను ప్రజలు గ్రామదేవతగా కొలుస్తారు. ఘట్టమైసమ్మ అంటే కొండపైన వెలసిన మైసమ్మ పేరునకే ఘట్ కేసర్ గ్రామం పేరు వచ్చిందని కొందరి ప్రగాఢ విశ్వాసం, ప్రతి సంవత్సరం పుష్యమానంలో జరిగే మకర సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే ఆదివారం గ్రామదేవత జాతరను ఘనంగా జరుపుకుంటారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఘనంగా జరుపుకునే ఏకైక పండగ ఈగ్రామ దేవత జాతరేనని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు భక్తితో కొలిచే ఘట్టు మైసమ్మకు చాలా మహిమలు గల దేవతగా ప్రఖ్యాతి ఉంది. గ్రామస్తులు తమ గ్రామదేవరకు మొక్కులు మొక్కితే గ్రామానికి

article_36593779.webp
ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తాం

23-01-2026

మేడ్చల్, జనవరి 22(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 2002 నుండి ఉన్న ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాకు అనుగుణంగా సవరించే మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే సూపర్ వైజర్లను, బిఎల్ ఓలను సస్పెండ్ చేస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. గురువారం మల్కాజిగిరి డిప్యూటి కమీషనర్ కార్యాలయంలో ఓటరు జాబిత అనుసంధాన ప్రక్రియ పురోగతి పై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలోనే మన జిల్లా చివరిస్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ద వహించి పురోగతి సాధించాలని సూపర్ వైజర్లను ఆదేశించారు.

article_21426856.webp
బీఆర్‌ఎస్ 10 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే దేనికైనా సిద్ధమే

22-01-2026

మేడ్చల్, శామీర్ పేట్, జనవరి 21 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 10 శాతం మున్సిపాలిటీలు గెలిస్తే తాను దేనికైనా సిద్ధమేనని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 10% గెలవకున్నా సర్పంచులకు సన్మానాలంటూ హడావిడి చేశారని, పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మూడేళ్లలో అధికారంలోకి వస్తామని కేటీఆర్ ఇటీవల పోలీసులను బెదిరించారని, కానీ ఎప్పటికీ అధికారంలోకి రాలేరన్నారు.