ముగ్గురు నాయకులకు అగ్నిపరీక్ష
02-02-2026
మేడ్చల్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగ్గురు నాయకులకు అగ్ని పరీక్ష లా తయారయ్యాయి. డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్, బిజెపికి చెందిన పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, బి ఆర్ ఎస్ కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి ఎన్నికలు సవాలుగా మారాయి. జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలకు ఈనెల 11న ఎన్నికలు జరుగుతున్నాయి.