అనురాగ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి అరుణ్ కుమార్ కు డాక్టరేట్ ప్రధానం
ఘట్ కేసర్, జూన్ 19 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి అరుణ్ కుమార్ పోలే పీహెచ్డీ పూర్తి చేశారు. ఎల్సీ-ఎమ్ఎస్/ఎమ్ఎస్ విశ్లేషణ ఇన్-సిలికో విషతుల్యత అంచనాల ద్వారా కొత్తగా ఆమోదించబడిన యాంటీ-ట్యూబర్క్యులర్ ఔషధాలు, వాటి కలయికల ఫోర్స్డ్ డీగ్రడేషన్ ఉత్పత్తుల గుర్తింపు, వేరు చేయడం, లక్షణ నిర్ధారణ అనే అంశంపై నిర్వహించిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది.
19-06-2026