calender_icon.png 6 February, 2026 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_20180415.webp
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

05-02-2026

జవహర్ నగర్, ఫిబ్రవరి 5,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని ఐఎఫ్ టీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ కార్యాలయంలో శివబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్ ను మున్సిపల్ కార్మికులతో కలిసి గురువారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శివబాబు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అందజేయాలని, జీవో 60ను యాథావిధిగా అమలు చేసి 8గంటల పనిదినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ, జయసుధ, రాములు, వెంకటమ్మ, రేణుక, ఎల్లేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

article_80048911.webp
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా

05-02-2026

జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్కారు స్థలాలు కబ్జాచేయాలని చూస్తే కటకటాలపాలే అవుతారని, అమాయకపేదలకు ప్రభుత్వ భూములు ప్లాట్లుగా చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్న కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని సర్వే నెం. 696లో సుమారు 20గుంటల భూమి అన్యాక్రాంతం అవుతుందని తెలుసుకుని... కాప్రా తహసీల్దార్ రాజేశ్ ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో ఫెన్సింగ్ వేసి కాపాడారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కోట్ల రూపాయాల విలువైన భూమిని కాపాడి కంచె ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.