calender_icon.png 30 October, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65421551.webp
మెరుగైన విద్యుత్ సదుపాయాలు కల్పించాలి

30-10-2025

మల్కాజిగిరి, అక్టోబర్ 29(విజయక్రాంతి) : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారుఖీని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్ ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు మెరుగైన విద్యుత్ సదుపాయాలు కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించారు. సీఎండీ ముషారఫ్ ఫారుఖీ సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, జెఎసి వెంకన్న, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

article_73825603.webp
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025

29-10-2025

మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెట్ షీకా గోయల్ ఆదేశానుసారం, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతి వనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ రూరల్ యూనిట్, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆఫీసర్ పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ నిధికి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని, ప్రభుత్వ అధికారులు నిబద్ధత, నిజాయితీతో, పనిచేయాలని, ప్రజల సమస్యలను విజిలెన్స్ శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

article_88453108.webp
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు

28-10-2025

మేడిపల్లి (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫిర్జాదిగూడలోని జ్ఞాన జ్యోతి ఫార్మ కాలేజీ, బోడుప్పల్ లోని విజన్ ఫార్మా కాలేజీ విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, సైబర్ క్రైమ్ నుంచి రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, ఆయుధాల వినియోగం, కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసు సిబ్బంది సేవా త్యాగాల గురించి తెలియజేశారు.

article_61211380.webp
మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి బెదిరిస్తుండు

28-10-2025

మేడ్చల్, అక్టోబర్ (విజయక్రాంతి): చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మరో ముగ్గురు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని, బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ కలెక్టరేట్ వద్ద సోమవారం బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది. షామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేట్ శివారులోని లియోనియో రిసార ట్స్‌ను గడ్డం రంజిత్ రెడ్డి, రామరాజు, ప్రవీ ణ్ రావ్, తిరుపతి రెడ్డి కొనుగోలు చేసి ఆక్రమణ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు.

article_34459876.webp
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

27-10-2025

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపించేందుకు సోమవారం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్న ప్రజా పాలన విధానాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అనునిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.