9 July, 2026 | 9:06 PM

Districts - Medchal Malkajgiri

article_17136489.webp
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

మేడిపల్లి, జూలై 9 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి పరిధిలోని కమలానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేడిపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురువారం మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రాజోజు నరసింహా చారి ఆధ్వర్యంలో,డిస్ట్రిక్ట్ 320F, రీజియన్–6, జోనల్ చైర్‌పర్సన్ లయన్ వేముల నాదం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

09-07-2026

article_55602240.webp
జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి

జవహర్ నగర్, జులై 9 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ కాలనీ సమస్యలపై, ఓటర్ల సంక్షేమంపై దృష్టి సారించేందుకు మాజీ మేయర్ డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి కాలనీ అధ్యక్షుడు జి. సూర్యనారాయణ బబ్లు, బజరంగ్ కాలనీ అధ్యక్షుడు ఇంద్రాసేన రావ్ లతో సమావేశమయ్యారు. కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై చర్చించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మేయర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేశ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిజాయితీగల ఓటరు నష్టపోకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కార్యకర్తలు ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ప్రేమల శ్రీను, కుతాడి సాయి, కృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ కొలిపాక సాయికిరణ్, మాజీ ఎంపీటీసీ విజయ రాయ్, ఏడుకొండలు, సరితతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.

09-07-2026

article_19076362.webp
సిమెంటు రోడ్డు నిర్మాణ పనుల పర్యవేక్షించిన బి ఆర్ ఎస్ నాయకులు

విజయక్రాంతి ఉప్పల్ జులై 9: సుమారు 30 లక్షల రూపాయలు వ్యయంతో బాబా నగర్ లోని జరుగుతున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ నూతన సిమెంట్ రోడ్డులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి సహకారంతో మాజీ కార్పొరేటర్ హయంలో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు . ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి రామచందర్ పొన్నాల మహేందర్ జెరిపోతుల భాస్కర్ నయీమ్ రాజు గౌడ్ కట్ట బుచ్చన్న గౌడ్ అశోక్ దేవా మల్లేష్ మల్లికార్జున్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

09-07-2026

article_72131968.webp
అనురాగ్ లో పీ.హెచ్.డి పూర్తి చేసిన జ్యోతి

ఘట్ కేసర్, జూలై 8 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పీ.హెచ్.డి. పరిశోధకురాలు వి. జ్యోతి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ జి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో ఏఐ డ్రైవెన్ ప్రెడిక్టివ్ లో టి సిస్టం ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ అనే అంశంపై నిర్వహించిన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈపరిశోధనలో కృత్రిమ మేధస్సు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో పంటల దిగుబడి, నాణ్యత, ఉత్పాదకతను మెరుగుపరచేందుకు వినూత్న అంచనా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.

08-07-2026

article_23899531.webp
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు టీచర్లను నియమించాలి

ఘట్ కేసర్, జూలై 8 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు టీచర్లను నియమించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నార్కట్ పల్లి సబిత డిమాండ్ చేశారు. 187 మంది విద్యార్థులు ఉండగా నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారని, అదనపు టీచర్లను నియమించి విద్యార్థుల సంఖ్య పెంపుదలకు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సహకరించాలని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాజీవ్ గృహకల్ప ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం మండల కమిటీ ప్రతినిధి బృందం సర్వే నిర్వహించింది.

08-07-2026