25 July, 2026 | 1:47 AM

Districts - Medchal Malkajgiri

article_84477093.webp
అక్రమంగా షెడ్డు, షెటర్స్ నిర్మాణం

కుత్బుల్లాపూర్, జులై 23(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఎలా నిర్మిస్తే మాకేంటి అడ్డు అనేలా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్రమ షెడ్డు, షెటర్లు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఅవుట్ డివిజన్ రెడ్డి అవెన్యూ కాలనీలో ఓ నిర్మాణదారుడు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు, షెటర్స్ నిర్మాణం చేపట్టాడు.అక్రమ కట్టడాలు యదేచ్చగా జరుగుతున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

24-07-2026

article_87040633.webp
కాంగ్రెస్ శాంతియుత నిరసన ర్యాలీ

మేడిపల్లి, జూలై 23 (విజయక్రాంతి): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ వరంగల్ హైవే పై బోడుప్పల్ కమాన్ నుండి మేడిపల్లి వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, వేధింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

24-07-2026