Districts - Medchal Malkajgiri

 మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్‎లో నో వాటర్
మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్‎లో నో వాటర్

మేడ్చల్ అర్బన్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మేడ్చల్, కీస్టాపూర్-పూడూరు డివిజన్లలో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసినా తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ నీటి సరఫరా బాధ్యతను పూర్తిగా చేపట్టాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే ప్రజల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

11-09-2026 | 04:07pm

రామంతాపూర్ పాలిటెక్నిక్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం నేతల అరెస్ట్!
రామంతాపూర్ పాలిటెక్నిక్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం నేతల అరెస్ట్!

ఉప్పల్‌ సెప్టెంబర్11విజయక్రాంతి : జీవో 97ను రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్‌ చేస్తూ రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల నిరసనకు కళాశాల సిబ్బంది సైతం మద్దతు ప్రకటించారు. ప్రిన్సిపాల్‌ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు సిబ్బంది ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులపై జీవో 97 ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యాపకులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ పేరుతో పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. మద్దతుగా బీజేవైఎం

11-09-2026 | 03:46pm

భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ సెప్టెంబర్ 11విజయక్రాంతి ‌: ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమం ఏర్పాట్లను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. భక్తులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

11-09-2026 | 03:20pm

ఎల్బీనగర్ జోనల్ ఆఫీస్ ఎదుట బీజేపీ ధర్నా
ఎల్బీనగర్ జోనల్ ఆఫీస్ ఎదుట బీజేపీ ధర్నా

ఎల్బీనగర్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): హస్తినాపురం డివిజన్‌లో మే 11న కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అద్విక్ ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్యచికిత్సకు సంబంధించిన ఆసుపత్రి బిల్లు సుమారు రూ, 16 లక్షలకు చేరుకుంది. ఘటన జరిగిన సమయంలో అద్విక్‌కు అయ్యే పూర్తి వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే పెండింగ్‌ బిల్లులు విడుదల కాకపోవడంతో చిన్నారికి అవసరమైన తదుపరి వైద్య చికిత్స కొనసాగించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

11-09-2026 | 12:59pm

ప్రజాపాలనకు జనం జై.. బీఆర్‌ఎస్‌కు ఎందుకీ గగ్గోలు?
ప్రజాపాలనకు జనం జై.. బీఆర్‌ఎస్‌కు ఎందుకీ గగ్గోలు?

ఘట్ కేసర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక నానా జిమ్మిక్కులు చేస్తున్నారని ఘట్ కేసర్ సర్కిల్ పోచారం, ఘట్ కేసర్, ఎదులాబాద్ డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, బొక్క ప్రభాకర్ రెడ్డి, సామల అమర్ ఆరోపించారు. వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనకు సంబంధించి 1000 రోజుల సంబరాలు జరుపుతుంటే బిఆర్ఎస్ నాయకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ నిరసనలు తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

09-09-2026 | 03:52pm