అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం
అనురాగ్ విశ్వవిద్యాలయం శనివారం 3వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అలాగే ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, సైన్సెస్, వ్యవసాయ విభాగాలకు చెందిన మొత్తం 2,789 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈసంవత్సరం పట్టభద్రులలో 2,193 మంది బి.టెక్ విద్యార్థులు ఉండగా, 44 మంది పరిశోధకులకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాలు ప్రదానం చేశారు.
04-07-2026