19 May, 2026 | 6:21 PM

Breaking News

Districts - Medchal Malkajgiri

article_34587639.webp
నరకయాతన

ఉప్పల్ మే 18 విజయక్రాంతి : ఉప్పల్ రింగ్ రోడ్ వరంగల్ హైవే మార్గం పూర్తిగా మూసివేయడంతో ఉప్పల్ మార్గం నరకయాతనగా మారింది ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వెళ్లే దారి మెట్రో స్టేషన్ దారి ఉప్పల్ గణపతి ఫ్యాక్టరీ దారి నిత్యం వాహనాలు భారీ సంఖ్యలో రాకపోకలు సాగించడంతో గల్లీలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు గల్లిలో శ్రమిస్తున్నారు. ఉప్పల్లోని రాజిరెడ్డి ఎలివేటెడ్ కార్డెన్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగ్ రోడ్డుకు వాహనాలు రాకుండా రోడ్డును మూసివేశారు ఉప్పల్ రింగ్ రోడ్ లోని స్మశానాల వద్ద కార్డియార్ సంబంధించిన పిల్లర్ నిర్మాణాలు పనుల చేపట్టడంతో దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు కు వెళ్లే వారదారులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కనే ఉన్న చిన్న గల్లీలో నుండి వాహనదారులు వెళ్లడంతో ఉప్పల్ పరిసర ప్రాంతంలో ఉన్న గల్లీలు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి

18-05-2026

article_77941144.webp
ప్రజా సమస్యలను పరిష్కరించాలి

మేడిపల్లి మే 18 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ తో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా కమిషనర్ తో చెంగిచెర్ల,బోడుప్పల్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

18-05-2026

article_89430880.webp
మాస్ కాపీయింగ్ కలకలం… 11 మంది అదుపులో!

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పాయస్ డిగ్రీ కాలేజీలో ఆదివారం నిర్వహించిన ఐఐసీటీ (సీసిర్ -ఐసీట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంట్స్) రాత పరీక్షలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మైక్రోచిప్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి కాపీయింగ్‌ పాల్పడుతున్నారని సమాచారం మేరకు నాచారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నార్త్ ఇండియాకు చెందిన 11 మంది అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే మైక్రో చిప్ లు దొరకలేదని కేవలం పుకార్లేనని సాంకేతిక పరికరాల లభించాయని వార్తల్లో నిజం లేదని పోలీసులు కొట్టి పారేశారు ప్రస్తుతం అదుపులో తీసుకున్న అనుమానిత అభ్యర్థులను పోలీస్ స్టేషన్ తరలించామని పూర్తిస్థాయిలో విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని నాచారం పోలీసులు తెలిపారు.

18-05-2026