5.849 కిలోల గంజాయి పట్టివేత
మేడ్చల్, జూన్ 25 (విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆర్ ఆర్ 06 ఎగ్జిట్ , ధృవ కాలేజ్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 5.849 కిలోల గంజే పట్టుబడినట్లు మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న 5.849 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
27-06-2026