అక్రెడిటేషన్ జీవోపై అసెంబ్లీలో చర్చించాలి
02-01-2026
మేడ్చల్, జనవరి 1 (విజయక్రాంతి): జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో నెంబర్ 252 పై అసెంబ్లీలో చర్చించాలని మేడ్చల్ జిల్లా టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలి స్టులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానందును కలిసి విన్నవించారు. బోయిన్పల్లి లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కొంపల్లిలో కుతుబులాపూర్ ఎమ్మెల్యే వివేక్ నివాసాల్లో కలిసి వినతి పత్రం అందజేశారు.