మానవత్వ, నెతిక విలువలు పెంపొందించాలి
28-04-2025
మేడ్చల్, ఏప్రిల్ 27(విజయ క్రాంతి): ఆధునిక యుగంలో పతనమవుతున్న మానవత్వ, నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అన్నారు. ఇస్కాన్, తెలంగాణ అగర్వాల్ సమాజ్, డిఆర్ఎస్ స్కూల్ ఆధ్వర్యం లో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ డిఆర్ఎస్ ఇంటర్నేష నల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘గీతా’ పఠనం వేసవి శిక్షణ శిబిరం2025’ను గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభించారు.