హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. బీఆర్ఎస్ పిలుపుమేరకు శామీర్పేట్లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు అధ్యక్షుడు అయ్యన్నగారి రవికిరణ్రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, మహిళలకు నెలకు రూ.2,500 హామీని అమలు చేయలేదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా అమలుతో పాటు యూరియా సరఫరా, పంటల కొనుగోలులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.
02-09-2026 | 03:29pm