ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా
మేడిపల్లి,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను(Telangana RTC Strike) ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను(RTC Workers Demands) ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు ఎమ్మెల్సీ, పి ఆర్ పి అధ్యక్షులు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మద్దతు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు.
22-04-2026