ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ భారీ ఆటో ర్యాలీ
ఉప్పల్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి):కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి నాచారం వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలు, బస్తీ దవాఖానాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
06-09-2026 | 09:13pm