నిరు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
ఘట్ కేసర్, మే 14 (విజయక్రాంతి) : నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లను అందిస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్ పరిధి ఘనపురం పరిధిలోని ఫకీర్ టేక్య తండాలోని వడ్త్యా జ్యోతి, ననావత్ బుజ్జి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల కలల్ని సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గృహప్రవేశం ఒక చిన్న పండుగలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శకం మొదలైందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రజల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. గ
14-05-2026