calender_icon.png 13 November, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18285475.webp
సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

11-11-2025

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొండా సుజాత, ఎరగాంధండ్ల వంశీ, సత్యనారాయణ, నీరుడు ఓంప్రకాష్, మర్గం శంకర్, కొట్టె సులోచనకి మంగళవారం మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు.

article_17702483.webp
గంజాయి నిర్మూలనకు గళమెత్తిన జగద్గిరిగుట్ట ప్రజలు

11-11-2025

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గంజాయిలేని సమాజం నిర్మించాలని జగద్గిరిగుట్ట కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగద్గిరిగుట్ట అన్ని బస్తీల కమిటీల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై గంజాయికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బస్తీ కమిటీల నాయకులు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో గంజాయి నిర్మూలన కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. గంజాయి కేసులో పట్టుబడితే జగద్గిరిగుట్ట నుండి బహిష్కరించాలని, అన్ని బస్తీలలో గంజాయి వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేసి బస్తీ ప్రజలను చైతన్యవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

article_25534418.webp
ఇంటింటికి తిరిగి క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తాం..

11-11-2025

మేడిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలక సంస్థలను క్షయ వ్యాధి రహితంగా మార్చడానికి చేపట్టిన "స్వాస్థ్య నగరం" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ శైలజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బోడుప్పల్ నగరపాలక సంస్థలో బుధవారం నుండి 14వ వార్డులో క్షయ వ్యాధి పరీక్షలు ఇంటింటికి తిరిగి నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించే సిబ్బందికి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.