బోడుప్పల్ సర్కిల్ లో ఆరోగ్య శిబిరాలు
మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 35వ రోజు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ నగర్, బోడుప్పల్ కార్యాలయం, కమల హాస్పిటల్ ప్రాంగణాల యందు ఆరోగ్య శిబిరాలను కేకేశ్వర హాస్పిటల్, యు పి హెచ్ సి బోడుప్పల్, కమల హాస్పిటల్ పీర్జాదిగూడ డాక్టర్ల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని బోడుప్పల్ సర్కిల్ ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంపులను ఏ ఎం ఓ హెచ్ పర్యవేక్షించి ప్రజలకు తమ విలువైన సలహాలు, సూచనలు అందించారు.
09-04-2026