calender_icon.png 8 December, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_73250836.webp
కాంగ్రెస్ వైఖరి నచ్చక సొంతగూటికి చేరిన మండల నాయకులు

08-12-2025

గుమ్మడిదల: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని గ్రామాలలో అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో పని చేసిన నాయకులు తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామాల అభివృద్దే ముఖ్యంగా పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు గుమ్మడిదల మండల జెడ్పిటిసి కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సద్ది విజయ భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా సుమారు 8 నెలలు గడుస్తున్న మండలంలోని గ్రామాల అభివృద్ధి కనిపించకపోవడంతో నిరాశకు గురై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ కండువా కప్పుకొని సొంతగూటికి చేరారు.

article_78116472.webp
ఖమ్మంపల్లిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

06-12-2025

మునిపల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా మండలంలోని ఖమ్మంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిస్ర్ ర్ ఫౌండేషన్ చైర్మన్ పైతారా సాయికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పైతారా సాయికుమార్ మాట్లాడుతూ బీ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దృష్టి లేకపోతే నేటి ప్రజాస్వామ్యానికి ఉన్న బలమైన పునాదులు ఏర్పడేవి కాదని, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య–ఉపాధుల్లో హక్కులు వంటి విలువలను ఆయన భారతదేశ ఆత్మలో నాటారన్నారు.