calender_icon.png 20 November, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_80539968.webp
క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

19-11-2025

పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సంస్థకు కీర్తిని తెచ్చి పెడుతున్నారు. ఆయా ఈవెంట్లలో పతకాలను గెలుచుకుని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చెన్నైలోని జేఎన్ఎల్ఎస్ లో జరిగిన ‘ది చీఫ్ మినిస్టర్స్ ట్రోఫీ గేమ్స్’ రాష్ట్ర స్థాయి పోటీలలో సీఎస్ఈ తొలి ఏడాది విద్యార్థి మందలపు శ్రీశాంత్ స్ట్రీట్ ఫైటర్ 6లో రజత పతకాన్ని సాధించారు. మరో అద్భుతమైన విజయంలో, బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి రుషికేశ్ మార్కా, హైదరాబాదులోని హైటెక్ సిటీలో నిర్వహించిన వీవైబీ యాక్టివ్ సీనియర్ టోర్నమెంట్ 2025-26లో (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

article_90139808.webp
పాడి పశువుల సంరక్షణకు నివారణ చర్యలు

18-11-2025

గుమ్మడిదల: పాడి పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ సాధారణ పరీక్షలతో పాటు నట్టల మందు, పిడుదల మందు, చూడి, గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత వైద్య చికిత్స శిబిరం నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ న్యూల్యాండ్ సంస్థ ద్వారా మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు పోచమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకు పశు వ్యాధుల చికిత్సను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ టి ఆదిత్య వర్మ మాట్లాడుతూ.. నోరులేని మూగజీవాలకు వ్యాధుల నివారణ కోసం న్యూల్యాండ్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో పశువులకు వ్యాధుల నిరోధక టీకాలతో పాటు పలు వ్యాధులకు వైద్యం చేశారు ఇట్టి ఉచిత వైద్య శిబిరాన్ని పశువుల యజమానులు సద్వినియోగం చేసుకొని పశువులన్నిటికీ చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.