కౌలంపేటలో స్వాతి శ్రీశైలం సంచలన గెలుపు
12-12-2025
సంగారెడ్డి,(విజయ క్రాంతి): కంది మండలం కౌలంపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు చరిత్రను రాసారు. స్వాతి శ్రీశైలం కేవలం 5 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో గ్రామ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికింది. ప్రారంభ రౌండ్ల నుంచే ఉత్కంఠ కొనసాగగా, ప్రతి ఓటు విలువ మరింతగా పెరిగిపోయింది. చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో, స్వాతి విజేతగా నిలవడం గ్రామం అంతటా హర్షాన్ని రేకెత్తించింది. గ్రామ పెద్దలు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ విజయాన్ని స్వాగతించారు.