నోట్లపై గాంధీ బొమ్మ లేకుండా మోదీ కుట్ర
29-12-2025
సంగారెడ్డి, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ చిత్రం తీసేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆది వారం కాంగ్రెస్ పార్టీ 141 ఏళ్ల ఆవిర్భావ వేడుకను సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలాజగ్గారెడ్డితో కలిసి జెండాను ఎగురువేసిన జగ్గారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ప్రజ లు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మా గాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ.. ఇంకా ఎందరో స్వాతంత్య్రం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారన్నారు.