కురుమ సంఘం అధ్యక్షుడిగా తాటిపల్లి మల్లేశం
05-01-2026
మునిపల్లి, జనవరి 4 : కురుమ సంఘం మునిపల్లి మండల నూతన కమిటీని జిల్లా కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పైతర సాయికుమార్, కురుమ సంఘం సీనియర్ నాయకులు మంతూరి శశికుమార్, చిట్కుల వెంకటేశం, బండారి పాండుల ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కురమ మండల అధ్యక్షునిగా తాటిపల్లి గ్రామానికి చెందిన తాటిపల్లి మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్కుల సుధాకర్, ఉపాధ్య క్షులుగా హైద్లాపూర్ బక్కన్న, ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి సుధాకర్, సహాయ కార్యదర్శిగా యాదయ్య, కోశాధికారిగా మన్సాన్పల్లి నర్సింహులు, సలహాదారులుగా మేళాసంగం శ్రీనివాస్ ఎన్నుకున్నారు.