calender_icon.png 30 January, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_19648017.webp
ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్

30-01-2026

నారాయణఖేడ్, జనవరి 29: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో రాత్రి మిగిలిన ఆహార పదార్థాలు విద్యార్థులకు వడ్డించడంతో ఫుడ్ పాయిజన్ జరిగి వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వారిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రైవేట్ ఫంక్ష న్‌లో మిగిలిన ఆహార పదార్థాలు విద్యార్థులకు వడ్డించడంతోనే ఈ సంఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు.

article_67989361.webp
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు

30-01-2026

నాగల్ గిద్ద, జనవరి 29: నాగల్ గిద్ద మండల పరిధిలోనీ కారముంగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ నో డల్ అధికారి ప్రదీప్ కుమార్, ఎండీ వాహా బ్, నింహాడ కృష్ణయ్య కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల గైర్హాజరు,విద్యా ప్రమాణాలు, మ ధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలు, టిఎల్‌ఎం, యాఫ్.ఎల్.ఎస్, పాఠశా ల పలు రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య,వసతులు అందించడ మే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వారితోపా టు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హల్లె బసవరాజ్, సి ఆర్ పి అర్జున్, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

article_69015918.webp
ఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం

27-01-2026

నారాయణఖేడ్, జనవరి 26: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సమావేశాన్ని సోమవారం స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ సెట్‌కార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో మున్సిపల్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.

article_72138689.webp
హోటల్ కార్మికుల సంక్షేమానికి కృషి

27-01-2026

పటాన్‌చెరు, జనవరి 26 :హో టల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అం డగా నిలుస్తున్నామని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వారికి తగు ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ హోటల్ కార్మికుల సంక్షేమ సంఘం పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు.

article_56493013.webp
ఉమ్మడి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

27-01-2026

సంగారెడ్డి, జనవరి 26(విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా వివరించారు. వేడుకల్లో భాగంగా డీఆర్డీఓ, హౌసింగ్, వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అగ్నిమాపక శాఖ, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు నిర్వహించారు.