జీవో 252పై అపోహలు వద్దు.. జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం
30-12-2025
సంగారెడ్డి, (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులందరికీ బస్ పాస్ లు, హెల్త్ కార్డులు సహా అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ విభాగం నేతలు అనిల్ కుమార్, ఆసిఫ్ లతో కలిసి ఆయన మాట్లాడారు. 252 జీవో ద్వారా 13 వేల అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, తమ ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.