Districts

article_66993137.webp
మతోన్మాదన్ని ఓడిస్తేనే భవిష్యత్తు

02-05-2024

మతోన్మాదన్ని ఓడిస్తేనే దేశానికి, ప్రజలకు భవిష్యత్ ఉంటుందని సీఐటియూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ య్య అన్నారు. బుధవారం కార్మిక దినోవత్సవం సందర్భంగా పాశమైలారంలోని వివిధ పరిశ్రమల్లో జెం డా ఆవిష్కరించి, బైక్ ర్యాలీలు నిర్వహించారు. మోదీ మూడోసారి అధికారంలోని వస్తే దేశంలో ఉన్న సంస్థలను నాశనం చేస్తారని ఆరోపించారు. లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోవడంతో నిత్యం కోట్లాటలు జరుగుతు న్నాయ ని తెలిపారు. సమావేశంలో కార్మిక సంఘం నాయకులు వి.ఎస్. రాజు, శ్రీనివాస్, మల్లేశం, రోషన్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.

article_59102202.webp
విద్యార్థినిని అభినందించిన మంత్రి

02-05-2024

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి మెహ్రీన్ సుల్తాన్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సన్మానం చేసి అభినందించారు. బుధవారం సంగారెడ్డిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన మెహ్రీన్ సుల్తాన్ తన తండ్రితో కలిసి మంత్రిని కలిశారు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు 993 మార్కులు సాధిం చి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థిని అభినందించి ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.