calender_icon.png 16 September, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_50720260.webp
వంద రోజుల్లో రోడ్డు పూర్తి చేయకపోతే ధర్నా

16-09-2025

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ చౌరస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌(GHMC Commissioner R.V. Karnan)తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్కు వరకు రహదారి నిర్మాణానికి పేపర్‌వర్క్ పూర్తి చేసి జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే అధికారుల మీనమేషాల వల్ల పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. నెల రోజులుగా కమిషనర్ కర్ణన్‌ను అనుసరిస్తూ, చివరికి ఈ రోజు క్షేత్రస్థాయిలో ఆయనతో కలిసి పర్యటించాల్సి వచ్చిందని తెలిపారు. నాలా పక్కన, రహదారి ఇరువైపులా ఉన్న ఎన్‌క్రోచ్‌మెంట్‌లను తొలగించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.

article_29774510.webp
బహిరంగంగా చెత్త వేస్తే కఠిన చర్యలు: కార్పొరేటర్ మెట్టు కుమార్

16-09-2025

పటాన్చెరు,(విజయక్రాంతి): కాలనీలలో రోడ్లమీద బహిరంగంగా చెత్త వేస్తే జిహెచ్ఎంసి సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి చెత్త వేసిన వారిపై ఫైన్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే జైలుకు పంపుతామని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ హెచ్చరించారు. జి.హెచ్.ఎం.సి డిప్యూటీ కమిషనర్ సురేష్ తో కలిసి పటాన్చెరు డివిజన్ పరిధిలో వివిధ కాలనీలో బహిరంగంగా చెత్త వేసే ప్రదేశాలను సందర్శించారు. ఇకపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే ఉపేక్షించ వద్దని హెచ్చరించారు, వెంటనే చెత్తను తీసివేసి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి చెత్త వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం శాంతినగర్ లోని బతుకమ్మ ఘాట్ ను సందర్శించి బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా శుభ్రం చేయాలని ఆదేశించారు.

article_25101226.webp
ఘనంగా హిందీ భాషా దినోత్సవం

16-09-2025

నాగల్ గిద్ద, సెప్టెంబర్ 15 : జాతీయ హిం దీ దినోత్సవం సందర్భంగా సోమవా రం నాగల్ గిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దినోత్సవం వేడుకలు ఘ నంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులు కాశీరాం జాదవ్ మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ లో హిందీ భా షను జాతీయ భాషగా గుర్తించినట్లు, అప్పటి నుంచి హిందీ దివస్ వేడుకలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయుడు కాశీరాం జాదవ్ కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంక ర్, ఉపాధ్యాయులు జ్యోతి, మారుతి, విజేందర్ రెడ్డి, మల్లేశ్వరి పాల్గొన్నారు.