calender_icon.png 19 November, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_90139808.webp
పాడి పశువుల సంరక్షణకు నివారణ చర్యలు

18-11-2025

గుమ్మడిదల: పాడి పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ సాధారణ పరీక్షలతో పాటు నట్టల మందు, పిడుదల మందు, చూడి, గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత వైద్య చికిత్స శిబిరం నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ న్యూల్యాండ్ సంస్థ ద్వారా మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు పోచమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకు పశు వ్యాధుల చికిత్సను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ టి ఆదిత్య వర్మ మాట్లాడుతూ.. నోరులేని మూగజీవాలకు వ్యాధుల నివారణ కోసం న్యూల్యాండ్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో పశువులకు వ్యాధుల నిరోధక టీకాలతో పాటు పలు వ్యాధులకు వైద్యం చేశారు ఇట్టి ఉచిత వైద్య శిబిరాన్ని పశువుల యజమానులు సద్వినియోగం చేసుకొని పశువులన్నిటికీ చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.

article_56879290.webp
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో రాజ్యశ్యామల దేవి హోమం

18-11-2025

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నేడు భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చిత్రాన్ని ముగ్గుతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాటా సుధ శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా, మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, శశిధర్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

article_79168269.webp
ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత

18-11-2025

పటాన్ చెరు: ధర స్థిరత్వం ప్రధానంగా కేంద్ర బ్యాంకుల బాధ్యత (మనదేశంలో ఆర్బీఐ) అని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ఆయన కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధి సమస్యలను పరిష్కరించడం: కేంద్ర బ్యాంకింగ్ భవిష్యత్తు’ అనే రెండు అంశాలపై మంగళవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత అయినప్పటికీ, సరఫరాలో లోపాలు తలెత్తినప్పుడు పన్ను సర్దుబాట్లు లేదా సబ్సిడీలు వంటి ప్రభుత్వ ఆర్థిక జోక్యం అవసరమన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక లక్ష్యాలతో, తిరిగి ప్రజామోదం పొందే లక్ష్యంతో పనిచేస్తాయి కాబట్టి, స్వతంత్ర కేంద్ర బ్యాంకు అవసరమని ఆయన స్పష్టీకరించారు.

article_33055204.webp
వెలిమెల విద్యార్థుల విహారయాత్రకు దాతృత్వ సహాయం

18-11-2025

సంగారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన ‘యాత్రదానం’ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో మంచి స్పందన లభిస్తోంది. వెలిమెల గ్రామానికి చెందిన ఆశం గారి వీరమ్మ, ఆమె కుమారుడు ఆశం గారి రాజు సామాజిక సేవలో భాగంగా వెలిమెల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల విహారయాత్ర కోసం ముందుకు వచ్చి దాతృత్వ సహాయంగా చెక్కును అందించారు. స్కూల్ హెడ్ మాస్టర్ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయుడు సుభాష్ ఆధ్వర్యంలో, ఆర్టీసీ బస్ స్టేషన్ మేనేజర్ ఇస్సాక్, ఆర్టీసీ కాలనీ బస్సు ఆఫీసర్ రవికుమార్ సమక్షంలో చెక్కును అందజేశారు. విద్యార్థుల అధ్యయన వికాసం, వ్యక్తిత్వ అభివృద్ధికి ఇటువంటి విహారయాత్రలు ఎంతో ఉపయుక్తమని అధికారులు అభిప్రాయపడ్డారు. గ్రామస్థులు ఆశం గారి కుటుంబం చేసిన దాతృత్వాన్ని అభినందించారు. యాత్రదానం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు, సహకరించిన ప్రతీ ఒక్కరికీ హెచ్‌.సి.యూ డిపో మేనేజర్ శ్రీనాథ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.