మంత్రి అశోక్ నివాసంలో అయ్యప్ప శరణు ఘోష
06-12-2025
జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామం అంబేద్కర్ కాలనీలో మంత్రి అశోక్, కన్నయ్య ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మాదారం అంబేద్కర్ కాలనీ మార్మోగింది. సత్యనారాయణ, వినోద్ గురుస్వాములు అర్చకులు 18 మెట్ల పూజ, గణపతి, కుమారస్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. మహ పడిపూజ మహోత్సవానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప శరణు ఘోషతో మంత్రి నివాసం దద్దరిల్లింది.