మృతుల కుటుంబాలకు కోటి పరిహారం
02-07-2025
సంగారెడ్డి, జూలై 1(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం మృతుల కుటుం బాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటన తీవ్రవిషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్, వివేక్వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, నీలం మధుతో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించారు.