calender_icon.png 31 December, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_39092114.webp
జీవో 252పై అపోహలు వద్దు.. జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం

30-12-2025

​సంగారెడ్డి, (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులందరికీ బస్ పాస్ లు, హెల్త్ కార్డులు సహా అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ విభాగం నేతలు అనిల్ కుమార్, ఆసిఫ్ లతో కలిసి ఆయన మాట్లాడారు. 252 జీవో ద్వారా 13 వేల అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, తమ ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

article_36032608.webp
శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

30-12-2025

సంగారెడ్డి,(విజయక్రాంతి): ​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న ఆయన, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో శుభప్రదమని, ఈ భాగ్యం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

article_63190069.webp
వైకుంఠపురంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు

30-12-2025

సంగారెడ్డి,(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైకుంఠపురం క్షేత్ర అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.