మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన: ఎస్సై
19-11-2025
కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం(Drugs) మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై బుధవారం ఎస్సై రవి గౌడ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడారు. గుడుంబా, బెల్లం, గంజాయి, డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు.