గెలిచిన వారికి భార్య.. ఓడిన వారికి భర్త సన్మానం
14-12-2025
సంగారెడ్డి, డిసెంబర్ 13(విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలుపొందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సన్మానించారు. శనివారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.