calender_icon.png 22 December, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_61868267.webp
రేవంత్‌రెడ్డి రేసింగ్ ఫ్లయింగ్ సీఎం

21-12-2025

సంగారెడ్డి, డిసెంబర్ 20(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేసింగ్ సీఎం కాదని.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరిగే ఫ్లయింగ్ సీఎం అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్‌రెడ్డికి నోబల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. శనివారం ఆయన సంగారెడ్డి, ఆందోల్ నియోజ కవర్గాల్లో గెలుపొందిన నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యుల సన్మాన కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా అద్భుతంగా ఎదిరించి గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు బీఆర్ ఎస్ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరులో కాంగ్రెస్ బేజారైందన్నారు.

article_16522985.webp
జేసీబీ ఢీకొని కొడుకు మృతి

21-12-2025

గుమ్మడిదల, డిసెంబర్ 20(విజయక్రాంతి): రోడ్డు మీదికి హఠాత్తుగా వచ్చిన జేసీబీ ఢీకొట్టడంతో కొడుకు మృతి చెందగా తల్లికి గాయాలైన సంఘటన గుమ్మడిదల మండలం బొంతపల్లి వద్ద శనివారం జరిగింది.వీరన్నగూడెం బొంతపల్లి గ్రామానికి మధ్యలో ఉన్న గ్రాన్యూవల్ పరిశ్రమలో బొగ్గు బైలర్ వద్ద లోడింగ్, అన్ లోడింగ్ చేసే జేసీబీ హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో వీరన్నగూడెం గ్రామానికి చెందిన తల్లి, కొడుకు విశాల్ (25) స్కూటీపై వెళ్తుండటంతో ఢీకొట్టింది.దీంతో విశాల్ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా వెనకాల ఉన్న తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులను ఘటన స్థలానికి చేరుకొని విచారించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.