calender_icon.png 3 December, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51419565.webp
టీచర్ కు ఇదొక ఆదాయం..

02-12-2025

మునిపల్లి,(విజయక్రాంతి): ఆయనొక ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ టీచర్(Government Teacher).. ఆయనకేం అంతా మంచిగున్నడు.. అనుకోని వాళ్ళు చాలామంది ఉంటారు.. కానీ ఓ టీచర్ మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే సాలరీతోపాటు ఇంట్లో చార్జింగ్ పెడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనుకున్నాడేమో.. ఆ టీచర్.. అందుకే తాను బోధించే పాఠశాలలోని చార్జింగ్ పెడుతున్న దృశ్యం మంగళవారం ఉదయం.. విజయక్రాంతి కెమెరాకు చిక్కింది. ఆ పాఠశాల ఎక్కడో లేదు.. మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉంది ఆ పాఠశాల ఖమ్మంపల్లి పాఠశాలనే(Khammampally School). ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హిందీ పండిట్ గా పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్నాడు.

article_25602341.webp
సిగాచి బాధితుల ప‌రిహారం ఎప్పుడిస్తారు ?

02-12-2025

సంగారెడ్డి,(విజ‌య‌క్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారం సిగాచి పేలుడు బాధితుల‌కు చెల్లించాల్సిన రూ.కోటి ప‌రిహారం ఎప్పుడిస్తార‌ని, ఆల‌స్యం చేయ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ ప్రావీణ్య‌, జిల్లా ఎస్పీ ప‌రితోష్ పంక‌జ్ ల‌కు జ‌హీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుతో క‌లిసి విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్భంగా చింతా ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ సిగాచి ఘ‌ట‌న జ‌రిగి నాలుగు నెల‌లు పూర్త‌యినా ఇంత‌వ‌ర‌కు బాధితుల‌కు ప‌రిహారం అందించ‌క పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. బాధిత కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం అందిస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించి చేతులు దులుపుకున్నార‌ని విమ‌ర్శించారు.