calender_icon.png 16 November, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_20868261.webp
అంతారం పాండురంగ విట్టలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి

15-11-2025

మునిపల్లి: మండలంలోని అంతారం గ్రామంలో గల శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయాన్ని శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దామోదరను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మాజీ ఎంపీటీసీ పాండు, మాజీ కోఆప్షన్ నెంబర్ రహీం తదితరులు ఉన్నారు.

article_13498151.webp
స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ జిల్లాలో నిర్వహించడం అభినందనీయం

15-11-2025

మునిప‌ల్లి (విజయక్రాంతి): స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండ‌ల ప‌రిధిలోని లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం నాడు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారత్‌లో యువతకు క్రమశిక్షణ, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసం కోసం ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.12లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.