calender_icon.png 6 December, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_86576237.webp
మంత్రి అశోక్ నివాసంలో అయ్యప్ప శరణు ఘోష

06-12-2025

జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామం అంబేద్కర్ కాలనీలో మంత్రి అశోక్, కన్నయ్య ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మాదారం అంబేద్కర్ కాలనీ మార్మోగింది. సత్యనారాయణ, వినోద్ గురుస్వాములు అర్చకులు 18 మెట్ల పూజ, ‌గణపతి, కుమారస్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. మహ పడిపూజ మహోత్సవానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప శరణు ఘోషతో మంత్రి నివాసం దద్దరిల్లింది.

article_57780249.webp
బీరంగూడ గుట్టలో అన్నదాన సత్రం విస్తరణకు శంకుస్థాపన

05-12-2025

బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో అన్నదాన సత్రం విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, దాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, అన్నదాన సత్రం విస్తరణ పనులకు మొత్తం రూ.3 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా తిరుమల హాస్పిటల్ ఎండీ తిరుపతి రావు రూ.1,50,000 విరాళంగా అందించారని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని వివిధ భక్తులు, దాతల సహకారంతో సమకూర్చి పనులు చేపట్టుతున్నామని చెప్పారు. దేవస్థానాన్ని అభివృద్ధి పరచడం, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు అందించడమే తమ ధ్యేయమని సుధాకర్ యాదవ్ అన్నారు. అన్నదాన సత్ర విస్తరణ పూర్తి అయితే గుట్టకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించగలమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

article_21884865.webp
మైనింగ్ ఏడీ స‌ర్వేను అడ్డుకున్న రైతులు

05-12-2025

ప‌టాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని ఊట్ల రెవెన్యూ దాదిగూడెం శివారులోని అంతయ్య చెరువుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 829 లో సంగారెడ్డి జిల్లా మైనింగ్ ఏడీ డిజిటల్ సర్వే పరికరాలు తీసుకువచ్చి సర్వే చేయడానికి వచ్చారు. అధికారులను చూసి చుట్టుపక్కల రైతులు వచ్చి రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏం సర్వే చేయడానికి వచ్చార‌ని అడుగగా మండ‌ల త‌హ‌సీల్దార్‌ ఈ స్థలాన్ని సర్వే చేయమని పంపార‌ని చెప్పడంతో అక్కడున్న రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రాళ్లకత్వ గ్రామానికి చెందిన రైతులు గత రెండు, మూడు సంవత్సరాలుగా హైకోర్టు, మైనింగ్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామ‌ని తెలిపారు. రైతుల పొలాలు పాడవుతున్నాయని వాటిని కాపాడుకోవడానికి పోరాడుతున్న సంగతి మీకు తెలీదా అంటూ ప్ర‌శ్నించారు. కంకర క్వారీలకు, మైనింగ్ మాఫియా యజమానులకు రైతుల భూములు ఇవ్వడానికి ఈ సర్వే చేస్తున్నారా అంటే మైనింగ్ ఏడీని నిల‌దీశారు. దీంతో చేసేదేమీ లేక ఏడీ అక్క‌డి నుండి జారుకున్నారు.

article_10852793.webp
రూపకల్పన, పరంజాలపై అవగాహన

04-12-2025

పటాన్ చెరు: నిర్మాణంలో కాంక్రీటుకు కావలసిన ఆకారాన్ని ఇవ్వడానికి ఉపయోగించే ఫార్మ్ వర్క్ (రూపకల్పన), నిర్మాణ పనులలో ఎత్తులో ఉన్న ప్రదేశాలకు చేరడానికి, పనిముట్లు కార్మికులకు ఇవ్వడానికి ఉపయోగించే పరంజా (Scaffolding)ల గురించి గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో స్వీయ అనుభవాన్ని గడించారు. వాస్తవ సమయంలో ఫార్మ్ వర్క్, స్కాఫోల్డింగ్ లపై లోతైన అవగాహనను పొందారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమిత్ భట్టాచార్య, తపతి తపన్విత భంజా మార్గదర్శనంలో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ఈ క్షేత్ర స్థాయి సందర్శనను ఇటీవల నిర్వహించారు.

article_19728140.webp
క్రీడలతో మానసిక ఉల్లాసం

04-12-2025

పటాన్ చెరు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో పటాన్ చెరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేట్ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక వికాసం, శారీరక ధారుడ్యం లభిస్తుందని తెలిపారు. ర్యాంకుల మాయలో పడి క్రీడలను నిర్లక్ష్యం చేయవద్దని పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడంతో పాటు.. ఆధునిక వసతులతో స్టేడియాలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, TRSMA రాష్ట్ర కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు సాయి తేజ, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఎస్సై మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.