calender_icon.png 17 December, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_41530436.webp
కాంగ్రెస్ అభ్యర్థి విమల విఠల్ రెడ్డిని గెలిపించండి: నాగేష్ శెట్కార్

16-12-2025

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామాన్ని జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నాగేష్ శెట్కార్ సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి మల్లగారి విమల విఠల్ రెడ్డి ప్రచారంలో పాలొన్నారు. ప్రచారంలో అయన మాట్లాడుతూ...మూడవ దశ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్బంగా కడ్పల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లగారి విమల విఠల్ రెడ్డి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నాగేష్ శెట్కార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే అభ్యర్థి విమల విఠల్ రెడ్డిని గెలిపిస్తే గ్రామం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని అన్నారు. గ్రామస్థులు ఐక్యంగా ఉండి ఉంగరం గుర్తుకు గెలుపుంచాలని అయన కోరారు. గ్రామంలో నాగేష్ శెట్కార్ వెంట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విమల విఠల్ రెడ్డి వెంట ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు.

article_70893443.webp
హద్దు దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదు: ఎస్ఐ రవి గౌడ్

15-12-2025

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ సోమవారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ... మండల కేంద్రం, మండల పరిధిలో సోమవారం 15/12/2025 సాయంత్రం 5 గంటల నుండి తేది: 17/12/2025 బుధవారం రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కావున నలుగురు కంటే ఎక్కువమంది ఒక చోట గుమి గూడటం గానీ, తిరగటం గానీ నిషేదం పోలీంగ్ కు 44 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి, పోస్టర్స్, గుర్తు కండువాలతో ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, గ్రామంలో ఎవరైనా తాగి న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది కలిగించిన తాట తీస్తామని, పోలింగ్ రోజు ఎవరైనా తాగి పోలింగ్ బూత్ లోకి వచ్చిన, న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది చేస్తే ఎవరైనా ఊరుకునేది లేదు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ రవి గౌడ్ హెచ్చరించారు.

article_44110874.webp
హద్దు దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదు: ఎస్ఐ మహేష్

15-12-2025

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రం, మండల పరిధిలో సోమవారం 15/12/2025 సాయంత్రం 5 గంటల నుండి తేది: 17/12/2025 బుధవారం రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కావున నలుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట గుమి గూడటం గానీ, తిరగటం గానీ నిషేదం పోలీంగ్ కు 44 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి. పోస్టర్స్, గుర్తు కండువాలతో ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, గ్రామంలో ఎవరైనా తాగి న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది కలిగించిన తాట తీస్తామని, పోలింగ్ రోజు ఎవరైనా తాగి పోలింగ్ బూతులోకి వచ్చిన, న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది చేస్తే ఎవరైనా ఊరుకునేది లేదు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ మహేష్ హెచ్చరించారు.