20వ లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి
19-01-2025
గుమ్మడిదల, జనవరి 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఫీల్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో సర్వే బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు.