ఉమ్మడి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
27-01-2026
సంగారెడ్డి, జనవరి 26(విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా వివరించారు. వేడుకల్లో భాగంగా డీఆర్డీఓ, హౌసింగ్, వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అగ్నిమాపక శాఖ, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు నిర్వహించారు.