calender_icon.png 20 October, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_83089396.webp
బీసీ బంద్‌కు పటాన్‌చెరు బీఆర్‌ఎస్ మద్దతు

18-10-2025

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మెయిన్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమం జరిగింది. బీసీ తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు పటాన్‌చెరు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆదేశాల మేరకు, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య నేతృత్వంలో నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ బీఆర్‌ఎస్ నాయకులు కుమార్ గౌడ్, పరమేశ్ యాదవ్, చిన్న, రమేష్ యాదవ్, పాపయ్య, పటి సత్యనారాయణ, అప్పల భాస్కర్, చికురు శ్రీను, రవి, సంపత్ గౌడ్, రాజేశ్, కిరణ్ గౌడ్, గౌస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

article_20619848.webp
పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

17-10-2025

పటాన్ చెరు: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్ చెరు రెవెన్యూ మండలాల పరిధిలోని 105 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి 5 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.