calender_icon.png 7 December, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_78116472.webp
ఖమ్మంపల్లిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

06-12-2025

మునిపల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా మండలంలోని ఖమ్మంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిస్ర్ ర్ ఫౌండేషన్ చైర్మన్ పైతారా సాయికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పైతారా సాయికుమార్ మాట్లాడుతూ బీ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దృష్టి లేకపోతే నేటి ప్రజాస్వామ్యానికి ఉన్న బలమైన పునాదులు ఏర్పడేవి కాదని, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య–ఉపాధుల్లో హక్కులు వంటి విలువలను ఆయన భారతదేశ ఆత్మలో నాటారన్నారు.

article_86576237.webp
మంత్రి అశోక్ నివాసంలో అయ్యప్ప శరణు ఘోష

06-12-2025

జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామం అంబేద్కర్ కాలనీలో మంత్రి అశోక్, కన్నయ్య ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మాదారం అంబేద్కర్ కాలనీ మార్మోగింది. సత్యనారాయణ, వినోద్ గురుస్వాములు అర్చకులు 18 మెట్ల పూజ, ‌గణపతి, కుమారస్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. మహ పడిపూజ మహోత్సవానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప శరణు ఘోషతో మంత్రి నివాసం దద్దరిల్లింది.

article_57780249.webp
బీరంగూడ గుట్టలో అన్నదాన సత్రం విస్తరణకు శంకుస్థాపన

05-12-2025

బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో అన్నదాన సత్రం విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, దాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, అన్నదాన సత్రం విస్తరణ పనులకు మొత్తం రూ.3 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా తిరుమల హాస్పిటల్ ఎండీ తిరుపతి రావు రూ.1,50,000 విరాళంగా అందించారని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని వివిధ భక్తులు, దాతల సహకారంతో సమకూర్చి పనులు చేపట్టుతున్నామని చెప్పారు. దేవస్థానాన్ని అభివృద్ధి పరచడం, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు అందించడమే తమ ధ్యేయమని సుధాకర్ యాదవ్ అన్నారు. అన్నదాన సత్ర విస్తరణ పూర్తి అయితే గుట్టకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించగలమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

article_21884865.webp
మైనింగ్ ఏడీ స‌ర్వేను అడ్డుకున్న రైతులు

05-12-2025

ప‌టాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని ఊట్ల రెవెన్యూ దాదిగూడెం శివారులోని అంతయ్య చెరువుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 829 లో సంగారెడ్డి జిల్లా మైనింగ్ ఏడీ డిజిటల్ సర్వే పరికరాలు తీసుకువచ్చి సర్వే చేయడానికి వచ్చారు. అధికారులను చూసి చుట్టుపక్కల రైతులు వచ్చి రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏం సర్వే చేయడానికి వచ్చార‌ని అడుగగా మండ‌ల త‌హ‌సీల్దార్‌ ఈ స్థలాన్ని సర్వే చేయమని పంపార‌ని చెప్పడంతో అక్కడున్న రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రాళ్లకత్వ గ్రామానికి చెందిన రైతులు గత రెండు, మూడు సంవత్సరాలుగా హైకోర్టు, మైనింగ్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామ‌ని తెలిపారు. రైతుల పొలాలు పాడవుతున్నాయని వాటిని కాపాడుకోవడానికి పోరాడుతున్న సంగతి మీకు తెలీదా అంటూ ప్ర‌శ్నించారు. కంకర క్వారీలకు, మైనింగ్ మాఫియా యజమానులకు రైతుల భూములు ఇవ్వడానికి ఈ సర్వే చేస్తున్నారా అంటే మైనింగ్ ఏడీని నిల‌దీశారు. దీంతో చేసేదేమీ లేక ఏడీ అక్క‌డి నుండి జారుకున్నారు.