గీతం ఆర్కిటెక్చర్ స్కూల్ ను సందర్శించిన పాఠశాలల విద్యార్థులు
12-11-2025
పటాన్ చెరు: విద్యాపరమైన ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా, కేంద్రీయ విద్యాలయం(గోల్కొండ, బోయిన్ పల్లి)లతో పాటు సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులు ఇటీవల హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను సందర్శించారు. ఓపెన్ హౌస్ లో భాగంగా, సందర్శించడానికి వచ్చిన 11, 12వ తరగతి విద్యార్థులకు ముఖాముఖి ప్రదర్శనల ద్వారా నిర్మాణ అభ్యాసంపై సృజనాత్మక, లోతైన అవగాహనను కల్పించారు.