calender_icon.png 9 November, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_15362403.webp
26 ఏళ్ల విద్యా ప్రయాణానికి గుర్తింపు

08-11-2025

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో గల సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థలో శనివారం గౌరవ డాక్టరేట్ సత్కార సభ ఘనంగా జరిగింది. సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధినేత డా. ఈ. సొలోమన్ రెడ్డి విద్యారంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి మలేషియా మాస్ట్రో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. కార్యక్రమాన్ని డా. సొలోమన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ. అరుణ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఈ. జయబాల రెడ్డి, డైరెక్టర్ ఈ. విజయ కుమార్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఈ. జ్యోతి రెడ్డి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జోహార్, వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్ లక్కిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

article_40504544.webp
క‌పాస్ యాప్ క‌ష్టాలు తీర్చండి..

08-11-2025

మునిప‌ల్లి: సీసీఐ తీసుక‌వ‌చ్చిన క‌పాస్ యాప్ తో తాము ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్నామ‌ని, తమ స‌మ‌స్య‌లు తీర్చాల‌ని డిమాండ్ చేస్తూ.. శ‌నివారం నాడు సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి మండ‌లం కంకోల్ టోల్ ప్లాజా వ‌ద్ద రైతులు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ ధ‌ర్నాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపి రైతుల‌కు సీసీఐ చేస్తున్న మోసాల‌పై ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు పైత‌ర సాయికుమార్, మండ‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మంతూరి శ‌శికుమార్, కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు స‌తీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండ‌ల ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్, మండ‌ల సీనియ‌ర్ నాయ‌కుడు బుర్క‌ల పాండు త‌దిత‌రులు మాట్లాడుతూ కొత్త‌గా సీసీఐ తీసువ‌చ్చిన కొత్త నిబంధ‌న‌లతో రైతులు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌ని, అందుకు పాతనిబంధ‌న ల‌తో ప‌త్తి కొనుగోళ్లు చేప‌ట్టాల‌ని వారు డిమాండ్ చేశారు.

article_79662584.webp
పారిశుధ్య తీరుపై మండిపడ్డ కలెక్టర్

08-11-2025

సంగారెడ్డి, నవంబర్ 7(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ సమస్యపై కలెక్టర్ పి.ప్రావీణ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా పాఠశాలల్లో శానిటేషన్ సమస్య, ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం సరిగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పాటు పాఠశాలలో శానిటేషన్ సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.