గీతంలో ఉత్సాహంగా ఎన్సీసీ దినోత్సవం
24-11-2025
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం 77వ ఎన్సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని దాదాపు 100 మంది క్యాడెట్లతో ఉత్సాహంగా నిర్వహించారు. 1948లో స్థాపించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్ సీసీ), భారతదేశ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవ, దేశ నిర్మాణాన్ని పెంపొందిస్తున్న విషయం విదితమే. ఈ వేడుకలు క్యాడెట్ల సమావేశం, కవాతుతో ప్రారంభమయ్యాయి. తరువాత గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జెండా ఎగురవేయగా, క్యాడెట్లు ఎన్ సీసీ ప్రతిజ్జ చేసి, విధి, జాతీయ విలువల పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.