అంతారం పాండురంగ విట్టలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి
15-11-2025
మునిపల్లి: మండలంలోని అంతారం గ్రామంలో గల శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయాన్ని శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దామోదరను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మాజీ ఎంపీటీసీ పాండు, మాజీ కోఆప్షన్ నెంబర్ రహీం తదితరులు ఉన్నారు.