calender_icon.png 11 December, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_61775378.webp
సంగారెడ్డిలో ఘనంగా దళిత జర్నలిస్టుల ఫోరం 11వ వార్షికోత్సవం

10-12-2025

సంగారెడ్డి, డిసెంబర్ 9: దళిత జర్నలిస్టుల ఫోరం స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంగా ఈరోజు అంబేద్కర్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టులు పరస్పరం శుభాకాంక్ష లు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ విచ్చేసి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల ఫోరం జర్నలిస్టుల హక్కుల సాధనకు, సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.