విద్యార్థులపై శ్రద్ద చూపండి
వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని ఎంఈఓ భీంసింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంఎల్ఎన్ విద్యార్థులు విద్యా ప్రమాణాలను సాధిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. ముఖ్యంగా తెలుగు భాషలో చదవడం, రాయడం నైపుణ్యాలు, అలాగే గణితంలోని చతుర్విధ ప్రక్రియలు (కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం) నిర్వహించే సామర్థ్యాన్ని పర్యవేక్షించారు.
14-07-2026