ఇండిపెండెంట్లపై ఫోకస్!
20-12-2025
సంగారెడ్డి, డిసెంబర్ 19(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులకు వివిధ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సం గారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో జరిగిన మొదటి, రెండవ, మూడో విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 766 మంది గెలుపొందగా, బీఆర్ఎస్ మద్దతుదారులు 609 మంది, బీజేపీ మద్దతుదారులు కేవలం 54 మంది మాత్రమే గెలుపొందారు.