calender_icon.png 21 November, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37211484.webp
ఉస్మాన్‌ నగర్‌లో ఉద్రిక్తత.. కూల్చివేతలపై రాస్తారోకో

21-11-2025

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. లంచాలు తీసుకుంటూ బిల్డర్లకు సహకరిస్తూ, పేదవారి ఇళ్ల నిర్మాణాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారనే ఆరోపణలతో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్‌పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు కోర్టు స్టే ఆర్డర్‌ను ఉల్లంఘించి నిర్వహించారని బాధితులు ఆరోపించారు. స్టే ఉన్నప్పటికీ అధికారులే నిర్లక్ష్యంగా చర్యలు తీసుకోవడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు. కూల్చివేతల ప్రాంతంలోనే రోడ్డు మీద రాడ్లు, ఇనుప వస్తువులు వేసి రాస్తారోకోకు దిగిన నిరసనకారులు ఏకపక్ష నిర్ణయాలతో పేదవారిపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కమిషనర్ స్వయంగా అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా "కమిషనర్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కూడా బాధితులు బైఠాయించి నిరసనను కొనసాగించారు.

article_53241484.webp
మొగ్దుంప‌ల్లిలో బోరు వేయించిన నాయ‌కులు

21-11-2025

మునిప‌ల్లి: మండ‌లంలోని మొగ్దుంప‌ల్లి గ్రామంలో తాగునీటి అవ‌స‌రాల కోసం రాష్ట్ర వైద్య‌. ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజ‌న‌ర్సింహ్మ స‌హ‌కారంతో బోరు మంజూరైంది. ఈ సంద‌ర్భంగా గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్ బోరు మోట‌రు వేయించి మాట్లాడారు. మంత్రి దామోద‌ర స‌హ‌కారంతో మండ‌లంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందుల్లేకుండా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మర్పల్లి సంగన్న, కార్యదర్శి నర్సింలు, షఫీయొద్దిన్ , చాంద్ పాషా, ఎంపల్లి నాగిశెట్టి, చెల్మెడ వీరన్న , బాయికాడి ఈశ్వరప్ప, ప్రమోద్, గ్రామస్థులు పాల్గొన్నారు.

article_31760512.webp
ఆల‌యాల‌కు నిధులు వ‌చ్చేలా సీఎంతో మాట్లాడుతా!

20-11-2025

సంగారెడ్డి (విజ‌య‌క్రాంతి): హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాలకు సంబంధించిన ఆలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అవసరమైన నిధులు కేటాయించేలా చొరవ తీసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని వివరించారు. గురువారం సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

article_74641150.webp
దళిత జర్నలిస్టు ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజు

20-11-2025

జహీరాబాద్: దళిత జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజును నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏ. డేవిడ్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కాశ పోగు జాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా రాపాక విజయరాజుకు నియామక పత్రం అందజేయడం జరిగింది.

article_80374775.webp
కార్తీకమాస బహుళ అమావాస్య సందర్భంగా శ్రీ బగలాముఖి శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు.!

20-11-2025

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలో నిర్మితమైన శ్రీ భగలాముఖి శక్తిపీఠం భారతదేశ నలుమూలల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి శ్రీ భగలాముఖి శక్తి పీఠం అమ్మవారి యొక్కవిశిష్టలు తెలుసుకొని అనేకమంది భక్తులు ప్రతినిత్యం ప్రజలు భారీ సంఖ్యలో ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోవడం కోసం రావడం జరుగుతుంది అమ్మవారి ప్రీతి పాత్రమైన రోజు కార్తీక మాసం చివరి అమావాస్య కావడం సందర్భంగా శ్రీ భగలాముఖి అమ్మవారి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి సన్నిధిలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.