calender_icon.png 29 December, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_76005674.webp
మా ప్రాణాలను కాపాడండి మహాప్రభో!

29-12-2025

గుమ్మడిదల, డిసెంబర్ 28: హెటీరో పరిశ్రమ వ్యర్థ రసాయనాల వల్ల మా ప్రాణాలు పోకుండా రక్షించండని సంబంధిత అధికారులను అడిగితే తమపై కేసులు నమోదు చేస్తారా అంటూ సంగారెడ్డి జిల్లా దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని కేసుల రూపంలో నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్న రెవెన్యూ అధికారులకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఏదేమి జరిగినప్పటికీ తమపై కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని, పరిశ్రమను ఎత్తివేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఆదివారం విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా నిరసన తెలిపారు.

article_23427438.webp
నోట్లపై గాంధీ బొమ్మ లేకుండా మోదీ కుట్ర

29-12-2025

సంగారెడ్డి, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ చిత్రం తీసేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆది వారం కాంగ్రెస్ పార్టీ 141 ఏళ్ల ఆవిర్భావ వేడుకను సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గారెడ్డితో కలిసి జెండాను ఎగురువేసిన జగ్గారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ప్రజ లు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మా గాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ.. ఇంకా ఎందరో స్వాతంత్య్రం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారన్నారు.