ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు
24-05-2025
సదాశివపేట మండలంలోని ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు గత 5 రోజులుగా సెయింట్ ఆంథోని పాఠశాలలో శిక్షణ నిర్వహించడం జరిగిందని, శిక్షణ ముగింపు కార్యక్రమంలో టీచర్స్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో నూతన అంశాలు నేర్చుకున్నామని, నేర్చుకున్న ప్రతి అంశాన్ని పాఠశాలకు వెళ్లి, పాఠశాలలో గుణాత్మక, నిర్మాణాత్మక విద్యను విద్యార్థులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.