కపాస్ యాప్ కష్టాలు తీర్చండి..
08-11-2025
మునిపల్లి: సీసీఐ తీసుకవచ్చిన కపాస్ యాప్ తో తాము పడరాని కష్టాలు పడుతున్నామని, తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపి రైతులకు సీసీఐ చేస్తున్న మోసాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మండల సీనియర్ నాయకుడు బుర్కల పాండు తదితరులు మాట్లాడుతూ కొత్తగా సీసీఐ తీసువచ్చిన కొత్త నిబంధనలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, అందుకు పాతనిబంధన లతో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.