calender_icon.png 7 February, 2026 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_89120666.webp
అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి విరాళాలు

06-02-2026

మఠంపల్లి ఫిబ్రవరి 06(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన ప్రధాన రహదారి వద్ద దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం కమిటి సభ్యులు మఠంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య మంజు నాయక్,మాజీ ఎంపీపీ మూడవతు పార్వతి కొండా నాయక్ ను విన్నవించగా ఇద్దరు చేరో రూ.లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,రామచంద్రపురం మాజీ సర్పంచ్ మాలోతు బుజ్జి భీముడు నాయక్ రూ.యాభై వేలు చెక్కులను కమిటి సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన నాయకులకు కమిటి సభ్యులు,అయ్యప్ప భక్తులు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

article_49656107.webp
శ్రీ శక్తి మహిళా సమైక్య భవనానికి భూమి పూజ

06-02-2026

తుంగతుర్తి,(విజయక్రాంతి): మహిళలను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి మహిళా సమైక్య భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం గొట్టిపర్తి గ్రామంలో శ్రీ శక్తి మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ముగ్గు పోయడం జరిగింది . ఇట్టి భవన నిర్మాణ అంచన విలువ 10 లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట సమావేశాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ కు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో గొట్టిపర్తి గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న గ్రామ ఉప సర్పంచ్ అన్నే బోయిన శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ చంద వెంకన్న మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి యాకన్న ఎన్ ఎస్ యు ఐ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్అందే పరశురాం పాల్గొన్నారు

article_16554836.webp
ఎన్‌హెచ్‌–365 పక్కనే దొంగతనం.. భద్రత ప్రశ్నార్థకం!

06-02-2026

చివ్వెంల: జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–365కు అతి సమీపంలోనే దొంగలు రెచ్చిపోవడం చివ్వెంల మండలంలో భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. అక్కలదేవిగూడెం గ్రామ పరిధిలోని అమరగాని ఆంజనేయులు వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్‌లోని విలువైన పనిముట్లను గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ దొంగిలించారు. ఈ ఘటనలో రైతులకు అత్యంత అవసరమైన స్టార్టర్ పెట్టెలు, విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్లడంతో సాగు పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి పక్కనే ఈ తరహా దొంగతనాలు జరుగుతుండటం, వరుస ఘటనలపై చర్యలు లేకపోవడం రైతులు, గ్రామస్తుల్లో భయాందోళనను పెంచుతోంది. దొంగలు ఎవరో ఇప్పటికీ తేలకపోవడంతో, గ్రామంలో రాత్రి పహారా, పోలీస్ గస్తీ పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

article_60612608.webp
ఆన్లైన్ మిషన్ ప్రాబ్లంతో రైతుల గోస

06-02-2026

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి, యూరియా బస్తాలు కొరత లేకుండా నివారించాలనే దృడ సంకల్పంతో, ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టగా, ఆదిలోనే రైతులు కష్టాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గురువారం ఉదయం రైతు సేవా సహకార సొసైటీ తో పాటు పలు కేంద్రాలలో ఆన్లైన్ మిషన్లు ఒక్కసారిగా సర్వర్ బిజీ తో కొన్ని, మరి కొన్ని ఏకంగా మిషన్ నడవకపోవడంతో, కోదాడ ,హుజూర్నగర్ ప్రాంతాల నుండి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న రైతులు,2 రోజులు కావడంతో, ఆన్లైన్ చేసింది పోగా, దుబారా ఖర్చులతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.