calender_icon.png 14 December, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_19246960.webp
ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరగాలి

13-12-2025

చివ్వెంల (విజయక్రాంతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాల్సిందిగా సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం రాత్రి చివ్వెంల మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, పోలింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికల విధులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేస్తూ, శాంతిభద్రతలు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

article_10935512.webp
ప్రజలు వర్గ విభేదాలకు, గొడవలకు పోవద్దు

13-12-2025

మోతే (విజయక్రాంతి): మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు, ఆంక్షలు అమలు చేయాలని కోరారు. లెక్కింపు ప్రక్రియ సమయంలో తప్పుడు సమాచారం వెళ్లకుండా అభ్యర్థులను లెక్కింపు ప్రారంభంలోనే కూర్చోబెట్టుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో పోలీస్ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించడం జరిగినది. ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలని వర్గ వివాదాలకు పోవద్దు, గొడవలు తగాదాలు పెట్టుకోవద్దు అని కోరారు.

article_13036588.webp
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం

13-12-2025

మోతే (విజయక్రాంతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం మోతె మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను సందర్శించారు. ఆయా డిఆర్సి కేంద్రాలలో కలెక్టర్ మాట్లాడుతూ మోతే మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినవని, మిగతా 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకొరకు 231 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడినవని పిఓలు, ఏపీవోలు పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, బ్యాలెట్ పేపర్లు క్రమ పద్ధతిలో ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించుకోవాలని చెప్పారు.

article_77683744.webp
రెండవ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

13-12-2025

కోదాడ: జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనైనదని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టర్ నడిగూడెం, కోదాడ, అనంతగిరి మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను సందర్శించారు. ఆయా డిఆర్సి కేంద్రాలలో కలెక్టర్ మాట్లాడుతూ నడిగూడెం మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 1 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయినదని, మిగతా 15 గ్రామ పంచాయతీల పోలింగ్ కొరకు 136 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనైనదని, కోదాడ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినవని, మిగతా 14 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకొరకు 138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడినవని అన్నారు.

article_58002910.webp
దోపిడీ పీడనలు లేని సమాజం సీపీఐ అభ్యర్థులతోనే సాధ్యం

13-12-2025

గరిడేపల్లి (విజయక్రాంతి): దోపిడి పీడనలు లేని సమాజం రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులతోనే సాధ్యమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు కోరారు. శనివారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని గానుగబండ, రంగాపురం గ్రామాల్లో పోటీ చేస్తున్న సీపీఐ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిరంతరం కార్మిక కర్షక సమస్యలపై నిలబడి పోరాటం చేస్తున్న ఎర్రజెండా బిడ్డలు కడియాల పద్మ, కట్టా కళ్యాణి లను ఈ ఎన్నికల్లో గెలిపించి నీతికి నిజాయితీకి ప్రజలు పట్టం కట్టాలని కోరారు.

article_61787523.webp
గుడిబండ ప్రజల చూపు.. మాజీ ఎస్సై పులి వెంకటేశ్వర్లు వైపు

13-12-2025

కోదాడడి,(విజయక్రాంతి): కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామం రాజకీయంగా ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంటూ ఉంటుంది. ఇక్కడి రాజకీయ పరిణామాలు నిత్యం చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈసారి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో గుడిబండ గ్రామం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎస్సై పులి వెంకటేశ్వర్లు తన ప్రభుత్వ ఉద్యోగ పదవీకాలం పూర్తికాకముందే గ్రామ ప్రజల సేవ చేయాలనే సంకల్పంతో ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వచ్చిన ఆయన నిర్ణయాన్ని గ్రామ ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు.