కాంగ్రెస్వన్నీ హత్యా రాజకీయాలే
14-12-2025
సూర్యాపేట, డిసెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవ న్నీ హత్యా రాజకీయాలేనని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. శనివారం నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని, అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో వైపు ఉన్న ట్టు పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తంచేశారు.