ఆన్లైన్ మిషన్ ప్రాబ్లంతో రైతుల గోస
06-02-2026
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి, యూరియా బస్తాలు కొరత లేకుండా నివారించాలనే దృడ సంకల్పంతో, ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టగా, ఆదిలోనే రైతులు కష్టాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గురువారం ఉదయం రైతు సేవా సహకార సొసైటీ తో పాటు పలు కేంద్రాలలో ఆన్లైన్ మిషన్లు ఒక్కసారిగా సర్వర్ బిజీ తో కొన్ని, మరి కొన్ని ఏకంగా మిషన్ నడవకపోవడంతో, కోదాడ ,హుజూర్నగర్ ప్రాంతాల నుండి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న రైతులు,2 రోజులు కావడంతో, ఆన్లైన్ చేసింది పోగా, దుబారా ఖర్చులతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.