ప్రభుత్వ పథకాలపై కళాకారుల అవగాహన
24-06-2025
జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖాధికారి ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా(Suryapet District) జాజిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం ఆధ్వర్యంలో కళాకారులు తమ ఆటపాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, బడిబాట, సీజనల్ వ్యాధులు, ఆరు గ్యారెంటీలు, భూభారతి చట్టం వంటి వివిధ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి జిల్లా టీం లీడర్ వెన్నెల నాగరాజు, కళాకారులు మేడిపల్లి వేణు, వేముల శ్రవణ్, ఈర్ల సైదులు, లక్ష్మి, ప్రియాంక, ప్రియదర్శిని, స్రవంతి, ఇంద్రజ గ్రామస్తులు బింగి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.