calender_icon.png 19 April, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_74372763.webp
అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి ఆదర్శం

19-04-2025

సూర్యాపేట, ఏప్రిల్18 (విజయక్రాంతి) : భారతదేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వచ్ఛత వాతావరణంలో ఉండేలా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం రచనయే నేటి భావితరాలకు అన్ని వర్గాలకు సమకూలంగా ఫలాలు అందేలా కృషి చేశారని రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని మున్యా నాయక్ తండ గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన పీక్లా తండాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మేధావులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు చదివి భారత దేశంలోని అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు నా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్క వర్గాలకు సమన్యాయం చేకూర్చేలా భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు.

article_57927404.webp
మా బతుకులు ఇంతేనా.. కలెక్టర్ సార్

18-04-2025

తుంగతుర్తి, విజయక్రాంతి: గడిచిన 20 సంవత్సరాలు గా, ప్రజా ప్రతినిధులు మారుతున్న.. ప్రభుత్వ అధికారులు వస్తూ, ప్రత్యేక పాలన అధికారులు ఉన్నప్పటికీ తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న డ్రైనేజీ కంపు, మరొక ప్రక్కన వెంపటిలో గడిచిన 20 సంవత్సరాలకు పైగా వీధిలో గత సిసి రోడ్డు నిర్మాణం పూర్తిగా శిధిలమై, పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడంతో అభివృద్ధి కోసం నిధులు రాకపోవడంతో నూతనంగా పనులు చేపట్టకపోవడం మా బతుకులు ఇంతేనా అన్నట్లు వీధి ప్రజలు ప్రతిరోజు అనునిత్యం కష్టాలతో సతమతమవుతున్నారు.వెంపటి వీధిలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా సిసి రోడ్డు నిర్మాణం కనీసం డ్రైనేజీ కూడా లేకపోవడంతో ఈ ప్రాంతంలో తుంగతుర్తి మండలంలో మొట్టమొదటిసారిగా డెంగ్యూ కేసు కూడా నమోదు కావడం జరిగింది.