calender_icon.png 25 June, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_61558966.webp
డ్రగ్స్ అనర్ధాలకు దారితీస్తుంది

24-06-2025

డ్రగ్స్ అనర్ధాలకు దారితీస్తుందని, యువత చదువు, క్రీడలపై దృష్టిసరించాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి(DSP Sridhar Reddy) అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో ఉన్న తేజ విద్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి(Excise Deputy Commissioner Somi Reddy) ఆధ్వర్యంలో డ్రగ్స్ అనర్ధాలు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగాలంటే మంచి అలవాట్లు అలవార్చుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తుతో అనేక అనర్ధాలు ఉన్నాయని, వాటితో ఎంతో మంది జీవితాలు పాడైపోయినట్లు తెలిపారు. విద్యార్థులు ఇంట్లో పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరించి వారిలో పరివర్తనకు కృషి చేయాలని సూచించారు.

article_64623434.webp
తిరుమల గ్రాండ్ హోటల్ కి రూ.5 వేల జరిమాన

24-06-2025

పట్టణంలోని ఎంజి రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహ సమీపంలో గల తిరుమల గ్రాండ్ హోటల్(Tirumala Grand Hotel)లో మంగళవారం మధ్యాహ్నం హోటల్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన ఇద్దరు కస్టమర్లకు ఈగలు, వెంట్రుకలు ఉన్న బిర్యానీ పెట్టారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని గమనించిన మున్సిపల్ కమీషనర్ ఆదేశాల మేరకు శానిటరీ సిబ్బంది వెంటనే హోటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆహార పదార్ధముల విషయంలో కొంత నిర్లక్ష్యం వేయిస్తున్నారంటూ యాజమాన్యానికి రూ.5 వేల జరిమాన విధించారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బంది మాట్లాడుతూ... ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం చేసిన హోటల్ పై చర్యలు తప్పమన్నారు.

article_82917017.webp
ప్రభుత్వ పథకాలపై కళాకారుల అవగాహన

24-06-2025

జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖాధికారి ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా(Suryapet District) జాజిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం ఆధ్వర్యంలో కళాకారులు తమ ఆటపాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, బడిబాట, సీజనల్ వ్యాధులు, ఆరు గ్యారెంటీలు, భూభారతి చట్టం వంటి వివిధ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి జిల్లా టీం లీడర్ వెన్నెల నాగరాజు, కళాకారులు మేడిపల్లి వేణు, వేముల శ్రవణ్, ఈర్ల సైదులు, లక్ష్మి, ప్రియాంక, ప్రియదర్శిని, స్రవంతి, ఇంద్రజ గ్రామస్తులు బింగి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

article_47100126.webp
సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నాయకులు, రైతులు

24-06-2025

మండలంలోని అల్వాలపురం గ్రామ రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో మంగళవారం నాయకులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు ఏఓ రజిని ఏఈఓ నాగేశ్వరరావు, కోదాడ మార్కెట్ డైరెక్టర్లు మల్లు నాగిరెడ్డి, బోలు ప్రసాద్ రైతులు పాల్గొన్నారు.

article_40505821.webp
అనాజీపురం రైతు వేదికలో సంబరాలు

24-06-2025

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజీపురం, చీదేళ్ల, పెన్ పహాడ్ రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన మంత్రివర్గంతో కలసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. రైతుల అభివృద్దే ద్యేయంగా ప్రజాపాలన అందిస్తుందని అందులో భాగంగానే వానాకాలంలో రైతుల పెట్టుబడి కోసం కేవలం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాలోకి వేసి ఆదుకున్నట్లు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించాడంతో రైతులు హర్షధ్వనాలు.. జై సోనియామ్మ.. జై కాంగ్రెస్.. జై రేవంత్ నినాదాలతో రైతు వేదికలు మిన్నంటాయి.

article_81288397.webp
విత్తనం ఎదగడానికి కవచం ప్రధానం: మామిడి వెంకటయ్య

24-06-2025

ఏ విత్తనమైనా ఎదగడానికి విత్తన కవచం ఏర్పాటు చేసుకోవడం ప్రధానమని ఉత్తమ ఉపాధ్యాయులు మామిడి వెంకటయ్య అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల పరిధిలోని యుపిఎస్ దోసపాడు పాఠశాల యందు విద్యార్థులకు సీడ్ బాల్స్ మొక్కల పెరుగుదల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మనం ఎండాకాలంలో సేకరించిన విత్తనాలను సీడ్ బాల్సగా అంటే సేంద్రియ పదార్థాలతో వాటిని కప్పి ఒక గుండ్రంగా మనం ఉండలాగా మార్చి అవసరమైన ప్రాంతాలలో చల్లినట్లయితే వర్షాలు రాగానే విత్తనానికి కప్పి ఉన్న ఉండ ఎదుగుతున్న మొక్కకు సేంద్రియ ఎరువుగా మొక్క తీసుకుంటుందన్నారు.

article_89366243.webp
కరుడుగట్టిన కాంగ్రెస్ వాది.. దామోదర్ రెడ్డి

24-06-2025

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది దామోదర్ రెడ్డి అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Former Minister Ramreddy Damodar Reddy) నివాసంలో కలిసి మాట్లాడారు. నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనకు తండ్రిలా అండగా నిలిచారని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటానని, తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తుంగతుర్తి అని, ఈ తుంగతుర్తి ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోనని, కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ, సహకారాలు అందిస్తానన్నారు.