calender_icon.png 13 November, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_30608358.webp
ఇద్దరు బైక్ దొంగ‌లు అరెస్ట్‌

12-11-2025

సూర్యాపేట‌ (విజయక్రాంతి): ఖరీదైన బైకులే లక్ష్యంగా చేసుకుని చోరీల‌కు పాల్ప‌డుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నర‌సింహ‌ వెల్లడించారు. సూర్యాపేట టూటౌన్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున పట్టణ ఇన్‌స్పెక్ట‌ర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ సురేశ్ సిబ్బందితో వాహనాల‌ తనిఖీ చేప‌ట్టారన్నారు. అదే సమయంలో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి తనిఖీ చేశారన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్‌వ‌ర్క్ సిస్టం ద్వారా అతడి వేలిముద్రలు తనిఖీ చేసి అత‌డిపై సుమారు 50 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

article_73929449.webp
హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి

12-11-2025

హుజూర్ నగర్/మేళ్లచెరువు: హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు, గరిడేపల్లి, మేళ్లచెరువు, మఠంపల్లి, చింతలపాలెం మండలాలలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మేళ్లచెర్వు శివరాత్రి జాతర నాటికి ఎన్ఎస్పీ కాల్వపై నిర్మిస్తున్న బ్రిడ్జిలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.