ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పసునూరు ఈటూరు మామిడిపల్లి గ్రామాలలో ఐకెపి, పస్తాల గ్రామంలో పిఎసిఎస్ దాన్యం కొనుగోలు కేంద్రాలను , తుంగతుర్తి మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించి మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల చేతుల్లో పోసి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి దాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
13-04-2026