గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించాలి
08-12-2025
వనపర్తి క్రైమ్: గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని జోగులాంబ జోన్-7 డిఐజి ఎల్ ఎస్, చౌహన్ అన్నారు. మూడు విడుతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ, ఏఆర్ అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లలతో జోగులంబ జోన్ డీఐజీ కార్యాలయంలో డీఐజీ ఎల్ ఎస్, చౌహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీఐజీ మాట్లాడుతూ... ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికల నియమాలని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా సరిహద్దుతో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ ద్వారా అడ్డుకోవాలని తెలిపారు.