calender_icon.png 27 October, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_66301286.webp
ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలి

21-10-2025

వనపర్తి: ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు బుధ, గురువారాల్లో ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ తన ఛాంబర్ లో పీపీసీల ఏర్పాటు, పీపీసీల ఇన్చార్జిలకు శిక్షణకు సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

article_61068471.webp
బిజెపి పార్టీకి ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు

18-10-2025

వనపర్తి టౌన్: కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో ఓ లాగా కేంద్రంలో మరో లాగా వ్యవహరించడం తగదని రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు 42 శాతం బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకోవడం డబల్ ఇంజన్ సర్కార్ ద్వంద వైఖరి ఇట్టే అర్థమవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణలో బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో చేపట్టిన బంధు కార్యక్రమంలో భారీ బైక్ ర్యాలీ క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా వివిధ పుర వీధుల మీదుగా రాజీవ్ చౌరస్తాకు చేరుకున్నారు.

article_73034720.webp
డోర్నకల్- గద్వాల కొత్త రైల్వేలైన్‌కు సర్వే పూర్తి

18-10-2025

వనపర్తి టౌన్ అక్టోబర్ 17: వనపర్తి ప ట్టణ గుండా వెళ్లే ఈ రైలు మార్గం ద్వారా ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్ డివిజన్లోని డోర్నకల్ , హైదరాబాద్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ మధ్య కొత్త లై న్ కు సంబంధించిన సర్వే పూర్తయినట్లు ఎ మ్మెల్యే తెలిపారు.డోర్నకల్ స్టేషన్ సికింద్రాబాద్ విజయవాడ లైన్ మరియు మర్రిపేట్ దక్షిణ మధ్య రైల్వే లో సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, సికింద్రాబాద్, సమీపంలోని శ్రీరాంనగర్ స్టేషన్ వరకు రైల్వే సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ రైలు మార్గం యొక్క సు మారు పొడవు 304 కిలోమీటర్లు ఉండబోతున్నట్లు నిర్మాణం పూర్తి సమయం సుమా రు ఐదు సంవత్సరాలు పట్టవచ్చునని ఆయ న తెలిపారు.ఈ రైల్వే లైన్ కోసం ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ డా. మల్లురవి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు