calender_icon.png 14 December, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_28657044.webp
బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయి

13-12-2025

వనపర్తి (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్ని నిర్వీర్యం అయిపోయాయని, ఎందరో సర్పంచులు అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉద్ధాంతాలు ఎన్నో ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని తన నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరా అధినాయకులు అందిన కాడికి దోచుకొని గ్రామస్థాయిలోని సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ప్రభుత్వ పరమైన ఇబ్బందులను తట్టుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు.

article_50217439.webp
బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది..

10-12-2025

వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో నిర్వహించనున్న మొదటి విడత 5 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును తమకు నచ్చిన అభ్యర్థికి వేసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండ, భయబ్రాంతులకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు.బుధవారం గోపాల్పేట, ఏదుల మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయల ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

article_75987589.webp
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

10-12-2025

వనపర్తి (విజయక్రాంతి): మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఖిల్లా గణపురం మండలంలో గురువారం పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు. బుధవారం ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయల ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఘనపూర్ మండల పరిధిలో 27 సర్పంచి, 198 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు గాను పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తీసుకొని తరలివెళ్ళారు.

article_23493040.webp
తెలంగాణ అస్తిత్వంకు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుంది

09-12-2025

వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జిల్లా అటవీశాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఐడిఓసి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.