పేదవాడికి ప్రాణదాత
14-01-2026
రేవల్లి జనవరి 13: ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడంలో వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేద మహిళకు ఏకంగా రూ. 10 లక్షల విలువైన ఎల్.ఓ.సి పత్రాలను మంజూరు చేయించి ఆమె ప్రాణాలను కాపాడేందుకు భరోసానిచ్చారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. రేవల్లి మండలం, తల్పునూర్ గ్రామానికి చెందిన మద్దుల సావిత్రి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో, బాధితురాలి భర్త, మాజీ ఎంపీటీసీ ఎక్కె వెంకటేష్ కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని కలిసి తమ ఆవేదనను వివరించారు.