calender_icon.png 16 December, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_26903066.webp
పాన్ గల్ మండలంలో చీరల పంపిణీకి బీఆర్ఎస్ నేతల యత్నం

16-12-2025

వనపర్తి, (విజయక్రాంతి): ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు నానా రకాలుగా యత్నిస్తున్నారు. వనపర్తి జిల్లా పాన్ గల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద బిఆర్ఎస్ నేతలు రమేష్ రెడ్డి, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి లు ఓటర్లకు చీరలు పంపిణి చేస్తుండగా... కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.దీంతో బిఆర్ఎస్ నేత తిరుపతి రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు.బిఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు 5వేల చీరలు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టపగలే ఓటర్లకు చీరలు పంచేందుకు బిఆర్ఎస్ నాయకులు బరితెగించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

article_79235506.webp
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

15-12-2025

వనపర్తి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులకు, కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మొదటగా పెబ్బేరు మండలం, అయ్యవారిపల్లి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

article_28657044.webp
బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయి

13-12-2025

వనపర్తి (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్ని నిర్వీర్యం అయిపోయాయని, ఎందరో సర్పంచులు అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉద్ధాంతాలు ఎన్నో ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని తన నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరా అధినాయకులు అందిన కాడికి దోచుకొని గ్రామస్థాయిలోని సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ప్రభుత్వ పరమైన ఇబ్బందులను తట్టుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు.