జాగృతి విద్యార్థులకు మాజీ మంత్రి సన్మానం
వనపర్తి, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ) : ఇటీవల వెలువడిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో పట్టణంలోని జాగృతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం బైపీసీ లో ఉజ్మా హజారా 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును, అదే విధంగా ద్వితీయ సంవత్సరం బైపీసీ లో హెచ్ .అనుష్ణ 994 మార్కులతో ఉమ్మడిజిల్లా మొదటి ర్యాంకును సాధించి మరొకసారి వనపర్తిలో ప్రతిభ చాటారు, ఈ విషయాన్ని తెలుసుకున్న మాజి మంత్రి నిరంజన్ రెడ్డి జాగృతి కళాశాలకు వచ్చి స్టేట్ ర్యాంకర్లను ఘనంగా సన్మానించారు.
15-04-2026