పనుల్లో జాప్యం వద్దు.. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి!
వనపర్తి,(విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వనపర్తి ఐడీఓసీ కార్యాలయంలో ఏదుల, పాన్ గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ, ఏఈలను ఆదేశించారు.
14-03-2026