పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే వరకు ఉద్యమిస్తాం
వనపర్తి,(విజయక్రాంతి): బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి, రైతులకు, చిరు వ్యాపారులకు, కార్మికులకు, కర్షకులకు, సామాన్య ప్రజలందరూ జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న అద్వాన పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ , నిత్యవసర వస్తువులకు ధరలు పెంచి సామాన్య ప్రజలను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి లు మండిపడ్డారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రామాలయం నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలపై ఎద్దుల బండ్ల పై ర్యాలీగా బయలుదేరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
27-05-2026