calender_icon.png 31 January, 2026 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_77421919.webp
రెండవ రోజు నామినేషన్ల జోరు

30-01-2026

వనపర్తి:(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల పోరుకు రెండవ రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలలో 80 వార్డులకు సంబంధించి నామీనేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 269 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు అధికారకంగా ప్రకటించారు.అందులో వనపర్తి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ 49 , బీఆర్ఎస్ 36, బిజెపి 22 , సిపిఎం 3, ఇండిపెండెంట్ 22 , అమరచింత మున్సిపాలిటీలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 6 , బిజెపి, 9, ఇండిపెండెంట్ 6 , ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 7, బిజెపి 7, సిపిఎం 4 , ఇండిపెండెంట్ 3, కొత్తకోట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, బిజెపి 3, బి ఎస్పీ 2 , ఇండిపెండెంట్ 4, పెబ్బేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 11 , బీఆర్ఎస్ 7, బిజెపి 9 , బి ఎస్పీ 1, ఇండిపెండెంట్ 2 నామినేషన్ దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.

article_66366252.webp
మున్సిపల్ ఎన్నికల్లో లబ్దికోసం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

30-01-2026

వనపర్తి, జనవరి 29 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ వ్యతిరేకతను,పాలన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధిపొందడానికి సిట్ విచారణ పేరుతో కె.సి.ఆర్ గారికి నోటీసులు అందజేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ లు తీవ్రంగా ఖండించారు. గురువారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు వై.ఎస్.ఆర్,చంద్రబాబు నాయుడు వంటి వారికంటే బలవంతులు కారన్నారు. ప్రభుత్వం చేసే చిలిపి,చిల్లర చేష్టలతో వారి మీద ప్రజలు అసహ్యం,ఏహ్యభావం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

article_27062585.webp
ఉత్తమ అవార్డు పొందిన అధికారులకు సన్మానం

30-01-2026

శ్రీరంగాపురం జనవరి 29: మండల కేంద్రంలో ఉత్తమ అవార్డులు పొందిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నం చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి రాజు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉత్తమ సేవలందించిన ఎస్‌ఐ హిమబిందు, వ్యవసా య అధికారి హైమావతి లకు గత జనవరి 26 రోజున కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు స్వీకరించినందుకు అభినందించి శాలువాలతో సన్మానం చేశారు. ఇకముందు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విష్ణు ,రా మచంద్రయ్య యాదవ్ , బహుజన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

article_90763416.webp
ఈ కేంద్రానికి మార్పు రాదా?

29-01-2026

గోపాలపేట జనవరి 28 : విజయక్రాంతి కథనాలకు జిల్లా కలెక్టర్ లో చలనం వచ్చినా గోపాలపేట మత్స్యకారుల సంఘాల్లో మార్పు రాలేదు. ఈ చేపల విక్రయ కేంద్రానికి నిత్యం తాళం వేసిందే దర్శనమిస్తుంది. మరి చేపలు విక్రయించే మత్స్యకారుల సంఘానికి మార్పు ఎందుకు రావడం లేదో మత్స్యశాఖ అధికారులే తేల్చి చెప్పాలి. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని హైదరాబాదు రహదారి లో ప్రధాన రోడ్డు పక్కనే లక్షల రూపాయల ప్రజాధనం వృధా అయినట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. 3-8 - 2018 సుమారుగా 8 ఏళ్లు గడుస్తుంది. చాపల విక్రయ కేంద్రం మంత్రులు- ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులు ఎన్నో అంగులతో ప్రారంభించారు.

article_40441145.webp
హామీలు అమలుచేయని కాంగ్రెస్.. ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టండి

29-01-2026

వనపర్తి టౌన్ జనవరి 28 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షులు డి.నారాయణ లు అన్నారు. బుధవారం స్థానిక నాయకులతో కలిసి వనపర్తి మున్సిపాలిటీలో బిజెపి రాష్ట్ర నాయకు లు మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు పర్యటించారు. మున్సిపాలిటీ 13 వ వార్డు లో కొండోజు గోపీనాథ్ నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మహిళల ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ అ బద్ధపు గ్యారంటీలు అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడన్నారు.

article_55127538.webp
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

28-01-2026

చిన్నంబావి, జనవరి 27: అర్హులైన వారందరూ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లద్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి,బీచుపల్లి యాదవ్, నరసింహ రెడ్డి, తేజరెడ్డి, నరేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, లద్దిదారులు తదితరులు పాల్గొన్నారు.