ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
27-11-2025
వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఘనపూర్ (Ghanpur) మండల పరిధిలోని సోలిపూర్, ఉప్పరపల్లి, మాణజిపేట, షాపూర్, ఘనపూర్, మామిడిమాడ, అప్పారెడ్డిపల్లి, ఆల్మైపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.