calender_icon.png 27 November, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_22606756.webp
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

27-11-2025

వనపర్తి, నవంబర్ 26 ( విజయక్రాంతి ) : సముద్రం లాంటి పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ అందరం కలిసి కట్టుగా పని చేసి కాంగ్రెస్ జెండాను స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకుంటామని రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్, డిసిసి జిల్లా అధ్యక్షులు శివ సేనా రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని ఒ ప్రవేట్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్, డిసిసి జిల్లా అధ్యక్షులు శివ సేనా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో వర్గ పోరు అనేవి ఉండవని అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ని ఓడించడం జరుగుతుందన్నారు.

article_41837335.webp
మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలి

26-11-2025

వనపర్తి క్రైమ్ : గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు 27వ తేదీన ఉదయం 10 గంటలకల్లా నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతి మొదటి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గ్రామ పంచాయతి మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు గురువారం ఉదయం 10 గంటలకల్లా నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలని ఆర్వోలకు ఆదేశించారు.

article_64671396.webp
ఆంగ్ల అధ్యాపకుడికి డాక్టరేట్ ప్రదానం

26-11-2025

వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆంగ్ల అధ్యాపకుడు ఎండి మహబూబ్ పాషా ప్రతిష్ఠాత్మకమైన సన్‌రైజ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ బిరుదును అందుకుని విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖ కవుల కవిత్వం, వారి రచనా శైలి, భావవ్యక్తీకరణ, సాహిత్య సామాజిక సందర్భాలపై ఆయన చేసిన లోతైన పరిశోధనను విశ్వవిద్యాలయం అత్యంత ప్రశంసించింది. భాషపై తనకున్న అభిరుచి, సాహిత్యంపై అపారమైన ప్రేమే ఈ పరిశోధనకు ప్రేరణయి నిలిచిందని డా.మహబూబ్ పాషా తెలిపారు. విద్యార్థులకు బోధన చేస్తూనే తన శాస్త్రీయ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేయడం సవాలుతో కూడుకున్నదైనా, అది తనకు ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.