calender_icon.png 10 November, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_11826046.webp
31వ వార్డు పార్కులపై నిర్లక్ష్యం ఎందుకు

08-11-2025

వనపర్తి టౌన్: ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు విస్తరించిపోతున్న వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి పోతుందని 31వ వార్డు సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల కేడీఆర్ పార్కు అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారవుతుందని వనపర్తి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు షేక్ జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్కుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి హయాంలో పార్కులను ఎంతో అభివృద్ధి చేశారని ఆ తర్వాత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పట్టణ మున్సిపాలిటీని సుందరీకరణ చేశారని ఆయన పేర్కొన్నారు.

article_83520450.webp
నేర రహిత సమాజమే ధ్యేయంగా సమిష్టి కృషి చేయాలి

06-11-2025

వనపర్తి టౌన్: నేరరహిత సమాజమే ధ్యేయంగా పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వహించి ప్రజలకు సత్వర న్యాయంనేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు,ముందు నుంచే వాటిని అరికట్టే విధానాలపై దృష్టి పెట్టాలని సమయానుసారంగా స్పందించే పోలీస్‌ శాఖనే ప్రజలు గౌరవిస్తారని అందరూ జట్టు భావనతో పనిచేసి జిల్లా శాంతి భద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన గ్రేవ్ కేసులను పరిశీలించారు, ఆయా కేసులలో విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు.

article_72697769.webp
తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించేయాలి

06-11-2025

వనపర్తి, (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం చిట్యాల లోని మార్కెట్ యార్డులో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిపిసి కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని టోకెన్ల వారీగా రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించేయాలని ఆదేశించారు.

article_14020120.webp
దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలి: సిపిఐ

01-11-2025

గోపాలపేట: ఇటీవల కురిసిన వర్షాలకు వంట నష్టం తీవ్రంగా జరిగింది. ఈ పంటల్లో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని. సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గోపాల్పేట మండలంలోని నరసింగయపల్లి తాడ్పర్తి పుల్కాపాడు ఏదుట్ల చాకలి పల్లి తదితర గ్రామాల్లో సిపిఐ నాయకులు పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ. నష్టపోయిన పంటలకు ప్రతి ఎకరాకు 50, వేలు ఇవ్వాలన్నారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకు ఒరిగి నీళ్లలో పడ్డాయని, పక్వానికి వచ్చిన ఒడ్లు మొలకెత్తి, పక్వం కాని వడ్లు తాలు పోయి రైతుల నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఎకరానికి రూ. 40 వేల దాకా పెట్టుబడి పెట్టి 6 కాలం పనిచేశారన్నారు.