డోర్నకల్- గద్వాల కొత్త రైల్వేలైన్కు సర్వే పూర్తి
18-10-2025
వనపర్తి టౌన్ అక్టోబర్ 17: వనపర్తి ప ట్టణ గుండా వెళ్లే ఈ రైలు మార్గం ద్వారా ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్ డివిజన్లోని డోర్నకల్ , హైదరాబాద్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ మధ్య కొత్త లై న్ కు సంబంధించిన సర్వే పూర్తయినట్లు ఎ మ్మెల్యే తెలిపారు.డోర్నకల్ స్టేషన్ సికింద్రాబాద్ విజయవాడ లైన్ మరియు మర్రిపేట్ దక్షిణ మధ్య రైల్వే లో సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, సికింద్రాబాద్, సమీపంలోని శ్రీరాంనగర్ స్టేషన్ వరకు రైల్వే సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ రైలు మార్గం యొక్క సు మారు పొడవు 304 కిలోమీటర్లు ఉండబోతున్నట్లు నిర్మాణం పూర్తి సమయం సుమా రు ఐదు సంవత్సరాలు పట్టవచ్చునని ఆయ న తెలిపారు.ఈ రైల్వే లైన్ కోసం ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ డా. మల్లురవి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు