తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి
02-07-2025
కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సరదాగ విహారయాత్రకు బయలుదేరారు. విహార యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్టం ధర్మపురి సమీపంలో అతి వేగంగా వస్తున్నా లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయలైన సంఘటన తమిళనాడులో జరిగింది. సమీప బంధువుల వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా(Wanaparthy District) కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన సాయి దాబా రాజు తమ కుటుంబం, బంధుమిత్రులతో కలిసి రెండు వాహనాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆయా రాష్టాలకు విహాయ యాత్రకు బయలుదేరారు.