రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కొనుగోలు చేయాలి
21-11-2025
వనపర్తి, నవంబర్ 20 ( విజయక్రాంతి ) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇబ్బందులు కల్పించకుండా కొనుగోలు చేసి డబ్బులు త్వరగా అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ఉదయం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి వరి కొనుగోలు పై ఐ.కే.పి., సహకార సంఘం కొనుగోలు కేంద్రాల యజమానులు, రైస్ మిల్లర్లు, ఎపియం లతో సమీక్ష నిర్వహించారు.