ప్రతి ఒక్కరు పరిశుభ్రత కోసం నడుం బిగించాలి
వనపర్తి,(విజయక్రాంతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని, కాబట్టి "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ"లో భాగంగా ప్రతి ఒక్కరు పరిశుభ్రత కోసం నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని ఎకో పార్క్ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని స్వయంగా శ్రమదానం చేసి పార్క్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తట్టలు పట్టుకొని చెత్తను పరిసరాలను శుభ్రం చేశారు.
07-03-2026