3 June, 2026 | 3:09 AM

Districts - Wanaparthy

article_31485553.webp
చీరల పంపిణీకి మహిళల “టార్గెట్”...

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న చీరల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలను తరలించాలని ఆర్పీలు, సమాఖ్య సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి సమాఖ్య నుంచి “పక్కాగా 100 మంది మహిళలు హాజరు కావాలి” అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికార ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమం కావడంతో సభను జనాలతో నింపేందుకు అధికారులు దిగివచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలతో పాటు, సభ్యులు కాని వారినీ తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

29-05-2026

article_28789480.webp
ఇరిగేషన్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు, తాగు నీటి సమస్య తీర్చడానికి అవసరమైన ఇరిగేషన్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా సందర్శించి సాగు, తాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించనున్న నేపథ్యంలో వనపర్తి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు, భవిష్యత్తులో సైతం తాగు నీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు.

27-05-2026

article_68120842.webp
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే వరకు ఉద్యమిస్తాం

వనపర్తి,(విజయక్రాంతి): బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి, రైతులకు, చిరు వ్యాపారులకు, కార్మికులకు, కర్షకులకు, సామాన్య ప్రజలందరూ జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న అద్వాన పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ , నిత్యవసర వస్తువులకు ధరలు పెంచి సామాన్య ప్రజలను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి లు మండిపడ్డారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రామాలయం నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలపై ఎద్దుల బండ్ల పై ర్యాలీగా బయలుదేరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

27-05-2026