ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ పని చేయాలి
వనపర్తి, ఏప్రిల్ 5 ( విజయక్రాంతి ) : రై తుల సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహానేత బా బూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆ ధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హా ల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
06-04-2026