ఆంగ్ల అధ్యాపకుడికి డాక్టరేట్ ప్రదానం
26-11-2025
వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆంగ్ల అధ్యాపకుడు ఎండి మహబూబ్ పాషా ప్రతిష్ఠాత్మకమైన సన్రైజ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ బిరుదును అందుకుని విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖ కవుల కవిత్వం, వారి రచనా శైలి, భావవ్యక్తీకరణ, సాహిత్య సామాజిక సందర్భాలపై ఆయన చేసిన లోతైన పరిశోధనను విశ్వవిద్యాలయం అత్యంత ప్రశంసించింది. భాషపై తనకున్న అభిరుచి, సాహిత్యంపై అపారమైన ప్రేమే ఈ పరిశోధనకు ప్రేరణయి నిలిచిందని డా.మహబూబ్ పాషా తెలిపారు. విద్యార్థులకు బోధన చేస్తూనే తన శాస్త్రీయ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేయడం సవాలుతో కూడుకున్నదైనా, అది తనకు ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.