calender_icon.png 8 December, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_62092714.webp
గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించాలి

08-12-2025

వనపర్తి క్రైమ్: గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని జోగులాంబ జోన్-7 డిఐజి ఎల్ ఎస్, చౌహన్ అన్నారు. మూడు విడుతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ, ఏఆర్ అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లలతో జోగులంబ జోన్ డీఐజీ కార్యాలయంలో డీఐజీ ఎల్ ఎస్, చౌహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీఐజీ మాట్లాడుతూ... ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికల నియమాలని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా సరిహద్దుతో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ ద్వారా అడ్డుకోవాలని తెలిపారు.

article_18979579.webp
బుద్దారం చెక్‌పోస్ట్‌పై ఆకస్మిక తనిఖీ

02-12-2025

వనపర్తి క్రైమ్: గ్రామ పంచాయతి ఎన్నికల సందర్భంగా నిబంధనల అమలులో ఏ మాత్రం రాజీ లేకుండా, అక్రమ నగదు-మద్యం రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా చెక్‌పోస్టులు కఠిన నిఘా కేంద్రాలుగా పనిచేయాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి స్పష్టం చేశారు. గ్రామపంచాయతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గోపాలపేట్ పోలీ స్టేషన్ పరిధిలోని బుద్దారం చెక్‌పోస్ట్‌ను ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్ నమోదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల ప్రభావానికి దారి తీసే అక్రమ నగదు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను అరికట్టాలని ఆదేశించారు.

article_48749155.webp
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం..

02-12-2025

వనపర్తి టౌన్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మహాధర్నకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నప్పటికీ గత రెండేళ్లుగా జాప్యం చేస్తుందని అన్నారు.