10 April, 2026 | 4:38 AM

Districts - Wanaparthy

article_29655257.webp
పొంగులేటి కాదు— పొంగు'లూటీ'

వనపర్తి,(విజయక్రాంతి): అంబేద్కర్ సచివాలయం లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడిన పొగరు లేటి మాటలు అందరు విన్నామని ఒకవైపు అంబేద్కర్, మరొక వైపు అమ్మవారు, బిర్లా మందిరం సాక్షిగా రాఘవ కన్స్ట్రక్షన్ మీద నిజాలు దాటి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ, లక్ష్మా రెడ్డీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు అల వెంకటేశ్వర్ రెడ్డీ, అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, నాగం తిరుపతి రెడ్డీ లతో కలిసి ఆయన మాట్లాడారు. పొంగులేటి కాదు పొంగు లూటి పొగరు లూటి బాంబ్ లేటి మైనింగ్ లూటి అని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన మాటలను చూస్తుంటే అర్థం అవుతుందని సరుకు లేనప్పుడు తిట్ల రాగాన్ని అందుకున్నారన్నారని తెలిపారు.

09-04-2026

article_30568870.webp
పొలిటికల్ అఫైర్స్ జిల్లా కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతుంది

వనపర్తి,(విజయక్రాంతి): పొలిటికల్ అఫైర్స్ కమిటీ అత్యంత కీలకమైన ,పటిష్టమైన వ్యూహంతో నిర్ణయాధికారంగా అధిష్టానం లో పనిచేస్తుందని, అలాంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీని జిల్లాలో ఏర్పాటు చేయడంతో జిల్లాస్థాయిలో ప్రతిష్టాత్మకంగా మారబోతుందని డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డిలు హాజరై పాల్గొన్నారు.

09-04-2026

article_72060994.webp
గొల్లపల్లి సభకు న్యాయస్థానం అనుమతి

వనపర్తి,(విజయక్రాంతి): 100 రోజులుగా రైతులు, ప్రజలు చేస్తున్న నిరసన కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్న సభ కోసం అనుమతి తీసుకుంటే అనుమతి ఇచ్చి రద్దు చేయడం జరిగిందని కానీ న్యాయస్థానం అనుమతి ఇవ్వడం నాయకులకు,అధికారులకు చెంప పెట్టు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలు సమావేశాలు ప్రజల ప్రాథమిక హక్కు అని 14ఏండ్లు శాంతియుతంగా ఉద్యమం నడిపించామని సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఎందుకు బయపడుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం పనిచేయాలని ప్రజాధనం వృథా కాకూడదు అని మా అభిప్రాయమన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం పనిచేయదని వాగ్ధానాలు నెరవేర్చడం చేతకాదు కానీ నిరసనను తొక్కివేయడం న్యాయం కాదన్నారు.

09-04-2026

article_43588420.webp
కమిషన్లకు అలవాటై... రిజర్వాయర్ల పేరుతో రాద్ధాంతం

వనపర్తి, (విజయక్రాంతి): గొల్లపల్లి రిజర్వాయర్ కావాలని జీవో నెంబర్ 105 తీసుకువచ్చింది ఎవరనీ జూన్ 10 2015 బి ఆర్ ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జీవోను తీసుకువచ్చిన నాయకులు నిండు రిజర్వాయర్లు పేరు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి లో ఒక భాగమైంది ఏదుల రిజర్వాయర్ 2800 ఎకరాలలో రిజర్వాయర్ నిర్మాణం అయిందనీ ఆయన పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్ వనపర్తి నియోజకవర్గంలో నిర్మాణం అయిందే తప్ప దాని నుంచి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. ముందు దీనికి సమాధానం చెప్పి తప్పు చేసినమని వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని ఎమ్మెల్యే విమర్శించారు.

09-04-2026