ప్రాజెక్టులు లేకనే పాలమూరుకు దుస్థితి
23-12-2025
వనపర్తి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కృష్ణానది ప్రవహించేదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అని, సరైన సమ యంలో ప్రాజెక్ట్లు కట్టకపోవడం వల్లే పాలమూరు జిల్లాకు ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. సోమవారం ఆత్మకూరులో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహ న్రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం కాలంలో ఉన్నటువంటి ప్రాజెక్టు లను ఉమ్మడి ఏపీ లో రద్దు చేశారని బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జూరాల కు నీటి కేటాయింపు జరిగిందని ఆరున్నర టీఎంసి లు మాత్రమే జూరాలలో ఉంటాయన్నారు.