calender_icon.png 3 December, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18979579.webp
బుద్దారం చెక్‌పోస్ట్‌పై ఆకస్మిక తనిఖీ

02-12-2025

వనపర్తి క్రైమ్: గ్రామ పంచాయతి ఎన్నికల సందర్భంగా నిబంధనల అమలులో ఏ మాత్రం రాజీ లేకుండా, అక్రమ నగదు-మద్యం రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా చెక్‌పోస్టులు కఠిన నిఘా కేంద్రాలుగా పనిచేయాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి స్పష్టం చేశారు. గ్రామపంచాయతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గోపాలపేట్ పోలీ స్టేషన్ పరిధిలోని బుద్దారం చెక్‌పోస్ట్‌ను ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్ నమోదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల ప్రభావానికి దారి తీసే అక్రమ నగదు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను అరికట్టాలని ఆదేశించారు.

article_48749155.webp
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం..

02-12-2025

వనపర్తి టౌన్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మహాధర్నకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నప్పటికీ గత రెండేళ్లుగా జాప్యం చేస్తుందని అన్నారు.

article_72793219.webp
తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం..

01-12-2025

వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు నగర అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల వ్యయంతో అమరచింత నగర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరు భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు.