13 April, 2026 | 5:05 AM

Districts - Wanaparthy

article_60417636.webp
ప్రేమలో మోసపోయి యువతి ఆత్మహత్యయత్నం

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమలో మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… నిఖిత(24) అనే యువతి జుర్రు మహేష్(27) అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతడు మరో యువతిని వివాహం చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయినట్లు మహేష్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయంలో న్యాయం కోసం నిఖిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినప్పటికీ, నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

11-04-2026