మాయమాటలు చెప్పం.. మంచి చేస్తాం
15-01-2026
వనపర్తి/దేవరకద్ర/భూత్పూర్, జనవరి 14: ప్రజా పాలన ప్రభుత్వం అంటే ప్రజలు కష్టాలు పడకుండా ప్రతి సమస్యను పరిష్కరించు ముందుకు సాగడమేనని రాష్ట్ర రోడ్ల,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, భూత్పూర్, దేవరకద్ర పట్టణాల్లో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు.