ఆర్యవైశ్య వెంకటాపురం నూతన మండల కమిటీ ఎన్నిక
01-12-2025
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 30(విజయక్రాంతి): ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వెంకటాపురం మండల నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులను మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథులుగా ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు సిద్ధం శెట్టి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధంశెట్టి లక్ష్మణరావు, ములుగు జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి అనంతుల కృష్ణమూర్తి,మాడిశెట్టి రాజమౌలీ, జిల్లా నాయకులు కలకోట సంతోష్ కుమార్, వేల్పూరి శ్రీనివాస్ రావు, బచ్చు పూర్ణ చందర్ రావుల ఆధ్వర్యంలోనూతన కమిటీని ఎన్నుకున్నారు.