calender_icon.png 16 June, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

Districts

article_45648646.webp
ఏసీబీకి పట్టుబడ్డ ములుగు డీఈవో పాణి

16-06-2025

ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు గత సంవత్సరం ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదానికి గురై అక్టోబర్ నెల వరకు సిక్ లో ఉన్నడాని తెలిపారు. ఆనంతరం తన జాయినింగ్ కోసం లక్ష్మీపురం ప్రధానోపాద్యాయున్ని సంప్రదించగా మూడు నెలలు గడిచి నందున రీజైనింగ్ కోసం డీఈఓ కార్యాలయం నుండి ఆర్డర్ కాఫీ తీసుకురావాలని సూచించారు. కాగా సదరు ఉపాద్యాయుడు డీఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయగా తనకు రూ.20 వేల రూపాయలు లంచంగా ఇస్తేనే రీజాయినింగ్ ఆర్డర్ ఇస్తానని డీఈఓ డిమాండ్ చేశారని, ఆర్డర్ ప్రిపేర్ చేసేందుకు డీఈఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ. 5వేలు డిమాండ్ చేశారని తెలిపారు.

article_65443116.webp
తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుదారుల వెల్లువ..

16-06-2025

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం(Tahsildar office) సోమవారం ప్రజలతో నిండిపోయింది. భూభారతి చట్టంలో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. దీనిలో భాగంగా మండలంలోని కొన్ని పంచాయతీల్లో దరఖాస్తులను తీసుకునేందుకు ప్రత్యేక తేదీలను అధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేని వారికోసం సోమవారం ప్రత్యేకంగా తహసిల్దార్ కార్యాలయంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. భూభారతిలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో తాసిల్దార్ కార్యాలయం సోమవారం ప్రజలతో కిక్కిరిసిపోయింది.

article_28724196.webp
వ్యాయామం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం

16-06-2025

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఆందోళనలను నివారించవచ్చనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంటలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S.), గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... జిల్లా కేంద్రం లో రెండు ఓపెన్ జిమ్ సెంటర్లులు ఉన్నాయని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.

article_45616629.webp
ఏటూరునాగారం నార్త్ రిజర్వ్ ఫారెస్టులో గుడిసెలు వేసిన గిరిజనులు

16-06-2025

ములుగు జిల్లా ఏటూరునాగారం నార్త్ రేంజ్ అటవీ శాఖ అధికారుల(North Range Forest Department officials)పై ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్టులో గుడిసెలు వేసిన గిరిజనులు సోమవారం దాడులకు దిగారు. గత సంవత్సర కాలంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం నార్త్ రేంజ్ అటవీ శాఖ పరిధిలోని రొయ్యూర్ బీట్, రోయ్యూర్ సెక్షన్ లోని రిజర్వ్ ఫారెస్ట్ లోని అటవీ ప్రాంతంలో కొంత మంది గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే ఇటీవల పలుమార్లు అక్రమంగా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేసి గుడిసెలను తొలగించినా తిరిగి గుడిసెలు నిర్మిస్తూ అక్కడే ఉంటున్నారు.

article_71042296.webp
పోడు భూములలో ఫల సహాయం మొక్కల పెంపకం పేరుతో రైతులను మోసం చెయ్యద్దు

14-06-2025

ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోడు భూముల సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరిగిందని, ఫారెస్ట్ ఉన్నత అధికారుల సహకారంతో రైతులకు సంబంధించిన భూములలో పండ్ల మొక్కల పెంపకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు న్యాయం చేస్తుందని ఇట్టి విషయాన్ని మంత్రి సీతక్క చొరవతో పరిష్కార మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు, మంత్రి సీతక్క చూపిస్తారని, చిన్నబోయినపల్లి రైతులు ఎటువంటి భయాందోళన చెందవద్దని ఏటూరునాగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి హామి ఇవ్వడం జరిగింది.

article_69640224.webp
ముప్పనపల్లి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

14-06-2025

మండలంలోని ముప్పనపల్లి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు స్థానిక ఎస్ఐ ఇనిగాల వెంకటేష్(SI Inigala Venkatesh) అద్వర్యంలో నిర్వహించారు.ఈ ప్రధాన రహదారిపై కన్నాయిగూడెం మండలం నుండి ఏటూరునాగారం వైపుగా వచ్చి పోయో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు పేపర్లను పరిశీలించి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని హెల్మెట్ లేనియెడల జరిమాన విదిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చని వారికి తెలిపారు.

article_23237272.webp
కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ అధ్యక్షులు

14-06-2025

: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు(KTR)కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. ఏసీబీ అధికారులు గతంలో ఒకసారి కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించి ఏమీ తేల్చలేకపోయిన సందర్భాన్ని కాకులమర్రి లక్ష్మణ్ బాబు గుర్తు చేశారు. ఫార్ములా-ఈ రేస్ సజావుగా సాగిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరుగకున్నా, ఎటువంటి అవినీతి చోటుచేసుకోకున్నా కేటీఆర్ ను విచారించడం చట్ట వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

article_28557089.webp
ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధం

14-06-2025

ములుగు జిల్లాలో వరదలు మొదలగు ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Shabarish) ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రానున్నది వర్షాకాలమైనందున అతిగా వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు ఏర్పడి ముంపుకు గురయ్యే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు గాను ములుగు జిల్లాలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.