22 April, 2026 | 7:27 PM

Districts - Mulugu

article_79561621.webp
మంత్రి సీతక్క ప్రజా దర్బార్

ములుగు జిల్లా, మంగపేట(విజయక్రాంతి): ప్రజల సమస్యలను గ్రామాలలోనే క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, నేరుగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు, మంగపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

21-04-2026

article_56620898.webp
మహాద్భుతంగా మేడారం గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

మేడారం, (మహబూబాబాద్) ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఆదివారం ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్‘ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు.

20-04-2026

article_57028703.webp
రక్త దాతల స్ఫూర్తి అభినందనీయం

ములుగు,(విజయక్రాంతి): రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంశనియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు.

18-04-2026