calender_icon.png 6 February, 2026 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_47139185.webp
మేడారం వెళ్తుండగా వాహనం బోల్తా

05-02-2026

ములుగు/మేడారం, ఫిబ్రవరి4,(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర తిరుగువారం వెళ్తున్న భక్తులతో నిండిన వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి మేడారానికి భక్తులతో బయల్దేరిన వాహనం, తాడ్వాయి మండల కేంద్రాన్ని దాటి సుమారు రెండు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద నియంత్రణ తప్పి రోడ్డుపక్కకు బోల్తా పడినట్లు స్థానికు లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

article_25220354.webp
స్వచ్ఛ మేడారం అందిస్తాం

05-02-2026

మేడారం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసిన నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో వ్యర్ధాలను పూర్తిగా తొలగించి స్వచ్ఛ మేడారం గ్రామాన్ని గ్రామస్తులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక్క ఆదేశించారు. తిరుగువారం పండగ సందర్భంగా మంత్రి సీతక్క, ము గు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తిరుగు వారం పండుగ సందర్భంగా బుధవారం సుమారు 5 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారని తెలిపారు.

article_46186723.webp
రామప్పను సందర్శించిన శిక్షణ అధికారులు

05-02-2026

వెంకటాపూర్, ఫిబ్రవరి4, (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిహెచ్‌ఆర్డి) లో శిక్షణ పొందుతున్న అధికారులు సందర్శించారు. భారత్ దర్శన్ స్టడీ టూర్లో భాగంగా దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 80 మంది శిక్షణ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ శర్మలు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రామప్ప దేవాలయ విశిష్టత, కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళా నైపుణ్యం, ఆలయ నిర్మాణ శైలి, యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన నేపథ్యాన్ని టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ సవివరంగా వివరించారు.

article_52173126.webp
రాతిలో సంగీతం.. స్తంభాల్లో ప్రతిధ్వని

04-02-2026

వెంకటాపూర్, ఫిబ్రవరి03, (విజయక్రాంతి): మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పాల నైపుణ్యం, దేవాలయ గర్భగృహం, స్తంభాలపై చెక్కిన సున్నితమైన శిల్పాలు, నర్తకీ మణులు, శబ్ద స్తంభాలు వంటి విశేషాలను టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ విపులంగా వివరించారు.

article_37164117.webp
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

04-02-2026

ఏటూరునాగారం,ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పలు గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సీతక్క ఆదేశాల మేర కు,జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్నల బ్ధిదారులకు పంపిణీ చేశారు. హళావత్ కళ్యాణి-15వేలు, అనుము నీలయ్య-20వేలు, కొండమల్ల రాణి 21వేలు, సంగిరెడ్డి లక్ష్మి 25వేలు, బోట పోసాని -32వేలు, తుమ్మ నవనీత రావు- 37వేలు, గార జయమ్మ- 43వేలు, జక్కుల లత 45వేలు, లొటపెట్టల మహాలక్ష్మి-1లక్ష10వేలు, బండారి రాజు- 1. 14వేల రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణి చేశారు.

article_89192720.webp
ములుగులో మత్తు జోరు

04-02-2026

ములుగు, ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం-ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఓ వ్యక్తి మద్యం మత్తులో గం టల తరబడి స్పృహ లేకుండా పడిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. మంగళవా రం ఉదయం నుంచే సదరు వ్యక్తి ఎక్సైజ్ కార్యాలయం మెట్ల మార్గంలో మత్తులో నిద్రపోతూ కనిపించాడు. ప్రభుత్వ కార్యాల యం ముందు ఇలాంటి పరిస్థితి ఉన్నా, కార్యాలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ క నీసం స్పందించకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రజల రాకపోకల మధ్య ఈ దృశ్యం కనిపించడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.