calender_icon.png 5 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_13370381.webp
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

04-12-2025

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి గురించి "విజయక్రాంతి" పత్రికలో "డాక్టర్ లేక కన్నాయిగూడెం ప్రభుత్వ ఆస్పత్రి" అని వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశానుసారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని, లేనియెడల సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోబడతాయని సిబ్బందిని హెచ్చరించారు.