గిరిజన గూడేల్లో వెల్ల్లివిరిసిన సేవాభావం
08-01-2026
వెంకటాపురం(నూగూరు), జనవరి 7 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖమ్మం వారు వెంకటాపురం మండలంలోని జెల్లా కాలనీ, టేకులబోరు, మంగవాయి, ముక్కునురుపాలెం, రామచంద్రపురం, మొర్రవానిగూడెం, ఆలుబాక, బర్రెబొంద , ఎదిర గ్రామాలలోనీ జిటియస్ యస్ చైల్ కేర్ సెంటర్ నీ 800 మంది నీరు పెద విద్యార్ధిని విద్యార్థులకు, దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్లు , ఆట బొమ్మలను మొర్రవానిగూడెం జి యస్ యస్ చైల్ కేర్ సెంటర్ లో పాఠశాల ఉపాధ్యాయులు దీలిప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను పిల్లల తల్లి తండ్రులు అభినందించారు.