వర్షాల విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి
01-07-2025
ములుగు జిల్లాలో వర్షాకాలం నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా సహాయక చర్యలు చేపట్టుటకు సిద్ధంగా ఉండాలని, గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం(NDRF)ను కోరారు. మంగళవారం జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం(ఎన్డీఆర్ఎఫ్) జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector Revenue CH Mahenderji)తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు, గోదావరి నది, జంపన్న వాగు నీటి ప్రవాహం గతంలో జరిగిన సంఘటనల గురించి(ఎన్డీఆర్ఎఫ్) బృందంనకు వివరించారు.