calender_icon.png 10 January, 2026 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38023577.webp
భక్తులకు ఇబ్బందులు కలగనీయొద్దు

09-01-2026

ములుగు, జనవరి8(విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జాతరను నిర్వహించాలని,రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటి చెప్పాలని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభం చేస్తామని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. గురువారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్,ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా,డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31వతేదీ వరకు జరుగుతుందన్నారు.

article_75359533.webp
యువత క్రీడా ప్రతిభకు సీఎం కప్ పోటీలు సువర్ణావకాశం

09-01-2026

ములుగు, జనవరి 8 (విజయక్రాంతి): యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ రెండవ ఎడిషన్ సరైన వేదిక అని ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.