calender_icon.png 2 February, 2026 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_26702745.webp
ఆదివాసి బిడ్డను.. పారిపోను

02-02-2026

మేడారం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మేడారం మహా జాతర సందర్భంగా తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పరితపించే ఆదివాసి బిడ్డను తాను అని పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని, భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడారు. ఆదివాసి అస్తిత్వం, తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భ యపడబోనని మంత్రి తెలిపారు.

article_71474881.webp
జాతర విజయానికి పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అనిర్వచనీయం

02-02-2026

ములుగు, జనవరి1(విజయక్రాంతి): ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తులు హాజరైన మహా జాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. జాతర కాలమంతా నిరంతరంగా క్షేత్రస్థాయిలో పనిచేసి, మేడారాన్ని పరిశుభ్రంగా ఉంచి నందుకు సిబ్బందికీ ధన్యవాదాలు తెలిపారు.

article_19172925.webp
తల్లులారా దీవించండి!

31-01-2026

మేడారం/ములుగు, జనవరి 30 (విజయక్రాంతి): మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తిప్రవాహం వెల్లువిరిస్తోంది. శతాబ్దాల ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అరణ్య దేవతల గద్దెల వద్ద లక్షలాది మంది భక్తులు శుక్రవారం మొక్కులు తీర్చుకున్నారు. మనసు నిండా కృతజ్ఞతాభావంతో తిరుగుముఖం పడుతున్నారు. వనదేవతల స్పర్శతో పునీతమై, మేడారం జాతర పరిసరాలన్నీ అమ్మవార్ల నామస్మరణతో ప్రతిధ్వనిం చాయి. కోరిన కోరికలు నెరవేర్చినందుకు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు కృతజ్ఞతగా లక్షల మంది భక్తులు పసుపు కుంకుమ (బండారి), వడిబియ్యం, బంగారం(బెల్లం), పూలు, చీరే, కొబ్బరికాయలు, వెండి తొట్టెలు, కానుకలు, నైవేద్యాలు అర్పించారు.

article_62133192.webp
వనదేవతలకు మొక్కులు సమర్పించేందుకు తరలివస్తున్న భక్త‘కోటి’

30-01-2026

మేడారం (విజయక్రాంతి): ఇలవేల్పు దేవతలకు మొక్కులు సమర్పించడానికి భక్తకోటి శుక్రవారం గద్దెల ప్రాంగణానికి చీమలదండులా బయలుదేరారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెను అధిష్టించిన మరుక్షణం నుండే మొక్కులను భక్తులు సమర్పించుకునేందుకు గద్దెలకు క్యూ కట్టారు. నిర్విరామంగా భక్తుల దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం పూర్తిగా వనదేవతలంతా భక్తుల మొక్కులు తీర్చుకోవడానికి గద్దెలపైన ఆశీనులు కావడంతో జాతరలో మొక్కులు సమర్పించుకోవడానికి భక్తులు అమిత ఆసక్తి చూపిస్తారు. దీనితో శుక్రవారం మేడారం(Medaram Maha Jatara ) గద్దెల ప్రాంగణం పూర్తిగా భక్తకోటితో నిండిపోయింది. లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించి తిరుగు ముఖం పడుతున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం జాతర ప్రధాన రహదారులు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి.

article_47829574.webp
బైక్‌పై పొంగులేటి, కలెక్టర్ దివాకర టీఎస్

30-01-2026

మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్ లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి పరిశీలించారు. మొదటగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల చేరుకొని స్నాన ఘట్టాలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి సర్కిల్ వద్ద ట్రాఫిక్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్య అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.