22 August, 2026 | 3:14 AM

Districts - Mulugu

article_78831875.webp
ఎఫ్ సీఐజీఎంను కలసిన ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ ప్రతినిధులు

ములుగు, ఆగస్టు 19 (విజయక్రాంతి): రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎఫ్ సి ఐ జిఎం అనూజ్ త్యాగి ని బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ ఎఫ్ సి ఐ గోదాములలో కొత్త బియ్యం స్టోరేజ్ చేయటానికి స్థలాలు లేకపోవడంతో పాటు పాత బియ్యాన్ని తరలించేందుకు రాక్ మూమెంట్ సైతం చేయకపోవడం వల్ల మిలర్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. రైస్ మిల్లర్లు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని వివరించారు.

19-08-2026