calender_icon.png 18 July, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_82667224.webp
ములుగు జిల్లాకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈనెల 23న రాక

16-07-2025

ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బుధవారం విహెచ్పిఎస్ మండల కమిటీ అత్యవసర సమావేశం జరిగింది.ఈ సమావేశానికి విహెచ్పిఎస్ మండల నాయకులు బొమ్మన రాజయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా చాతల రమేష్ మాదిగ,మడిపెల్లి శ్యామ్ బాబు మాదిగ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు 6 వేలు, వృద్దులు, వితంతువులు 4 వేలు పెన్షన్ ఇవ్వాలని వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల విషయంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పట్టించుకోవడం లేదన్నారు.