క్రీడారంగంలో ములుగు ముందుండేలా కృషి
ములుగు (మహబూబాబాద్) జూన్ 24 (విజయక్రాంతి): క్రీడా రంగంలో ములుగు జిల్లా ముందుండేలా కృషి చేస్తామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ములుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, క్రీడాకారులకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకంగా నిలుస్తుందని, క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.
25-06-2026