calender_icon.png 17 January, 2026 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_87719262.webp
గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

17-01-2026

ములుగు,జనవరి16(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ దేవాలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నాయక పోడు పూజారులు మంత్రి సీతక్కని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈనెల 21న గట్టమ్మ వద్ద నిర్వహించే ఎదురు పిల్ల పండుగ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ కమిటీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, నాయకులు గండ్రత్ జయాకర్,గుంటోజు పావని,గూడెపు రాకేష్,మరియు నాయక పోడు పూజారులు కొత్త సదయ్య,అరిగేలా సమ్మయ్య,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

article_90314707.webp
మేడారం పనులు నత్తనడకన!

15-01-2026

మేడారం, జనవరి 1౪ (విజయక్రాంతి): మేడారం మహా జాతర సమగ్ర అభివృద్ధి కోసం స్వయంగా మేడారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. గత ఏడాది ఆదివాసీ పూజారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, పెద్దలతో చర్చించి శాశ్వత ప్రాతిప దికన మేడారం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది సెప్టెం బర్‌లో మేడారం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 101 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని రాతి ప్రాకారాలతో పునరుద్ధరించాలని నిర్ణయించారు. అలాగే 150 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను నిర్వహించడానికి కేటాయించాలని తీర్మానించారు.

article_31002552.webp
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క

15-01-2026

మేడారం, జనవరి 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ఈనెల 19న ప్రారంభించడానికి ఈనెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శతక అధికారులతో కలిసి పరిశీలించారు. గద్దెల ప్రాంగణం ల్యాండ్ స్కేప్ పనులను, క్యూలైన్ పనులను మంత్రి పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను చేపట్టాలన్నారు. గద్దెల ప్రాంగణంలో వివిధ రకాల ఔషధ మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు.

article_87234433.webp
మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధం

15-01-2026

మేడారం, జనవరి 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి ఈనెల 25 నుండి ఆర్టీసీ ప్రత్యేక బ స్సు సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పా ట్లు సిద్ధం చేస్తోంది. 2024లో జరిగిన జాతరకు 3,500 బస్సులను వినియోగించి 20 లక్షల మంది భక్తులను మేడారం జాతరకు తరలించగా, ఈసారి జాతరకు 4 వేల బస్సులను నడపనున్నట్లు, 30 లక్షల మంది భక్తులను తరలించేందుకు అనుగుణంగా ఏ ర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టిసి వరంగల్ రీజియన్ మేనేజర్ విజయ భాను తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ 14 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు చెప్పా రు.