calender_icon.png 3 July, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51433902.webp
మేడారం మహా జాతర తేదీల ప్ర‌క‌ట‌న పట్ల మంత్రి సీత‌క్క హ‌ర్షం

02-07-2025

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర(Medaram Maha Jatara) తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Danasari Anasuya Seethakka) హర్షం వ్యక్తం చేశారు. శ్రీ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర తేదిల‌ను ప్ర‌క‌టించిన పూజారుల సంఘానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కోట్ల మంది భ‌క్తుల‌కు ఏలాంటి అసౌక‌ర్యం క‌లుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సీత‌క్క ప్ర‌క‌టించారు. ఇప్పుడు మ‌హ‌జాత‌ర తేదీల‌ను ప్ర‌క‌టించ‌డంతో ప‌నుల్లో వేగం పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రూ.110 కోట్ల‌తో మేడారంలో అభివృద్ది ప‌నులు కొన‌సాగుతున్న‌ట్లు పేర్కొన్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది.

article_24839020.webp
చిట్యాల గ్రామంలో టవర్ షాక్ సర్క్యూట్ తో రెండు మూగజీవాలు మృతి

02-07-2025

ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన రైతులు సోడే నారాయణ, సోడే రాకేష్ ల ఇద్దరివి దుక్కిటెద్దులు అని గ్రామస్తులు తెలిపారు. ఒక దుక్కిటి ఎద్దు. రూ. 60 వేలు మరొకరిది ఆవు దూడ రూ. 20.వేల విలువగల పశువులు చిట్యాల గ్రామంలో గల బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కు గల పెన్సింగ్ కు విద్యుత్ షాక్ సర్క్యూట్ అవడం వలన మూగ జీవాలు మరణించడం జరిగింది. కాగ దుక్కిటి ఎద్దు మృత్యువాత పడగా వ్యవసాయం చేసుకుని బతికి మా కుటుంబాన్ని పోషించుకునేది. ఇప్పుడు ఆ వ్యవసాయం భారమైందని బోరున విలపించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించగలరని ఆవేదన వ్యక్తం చేశారు.

article_75959148.webp
అక్రమ పశువుల రవాణా ఆగేనా

02-07-2025

ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండల కేంద్రంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద పైకి కూరగాయాల ట్రెలు కనిపించేలా లోపల పశువులను దాచి అక్రమంగా డీసీఏంలో తరలిస్తున్న వాహనం పట్టుబడింది. ఈ డీసీఏం వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తు పైకి మాత్రం చూసే వారికి అనుమానం రాకుండా కూరగాయాల ట్రెలు తరలిస్తున్నట్లు కనిపించేలా అమర్చి పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రోజున ఉదయం సమయంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఏం వాహనం ఏటూరునాగారం అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద అపకుండా వేగంగా ముందుకు వెళ్లడంతో అనుమానం వచ్చిన అటవీ శాఖ అధికారులు వాహనాన్ని వెంబడించి జాతీయ రహదారి పోతు రాజు బోరు వద్ద పట్టుకుని చూడగా అందులో పశువులను అక్రమంగా తరలిస్తుండడం గుర్తించారు.

article_80399040.webp
కేజీబీవీ హాస్టల్లో వైద్య శిబిరం

02-07-2025

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వాజేడు పరిధిలో గల కేజీబీవీ హాస్టల్లో జిల్లాఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం వాజేడు వైద్యులు మధుకర్(Doctor Madhukar) ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. దగ్గు తలనొప్పి ఉన్నవారికి పరీక్షించి తగిన మందులు పంపిణీ చేశారు. శిబిరంలో 44 మంది విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు, ఇద్దరు విద్యార్థులకు రక్తపూత సేకరణ ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వసతిగృహం పరిసరాలను పరిశీలించి తనిఖీ చేశారు. అనంతరం వంటశాలను పరిశీలించారు.

article_47782174.webp
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

01-07-2025

సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వాజేడు ప్రాథమిక వైద్యశాల వైద్యులు కొమరం మహేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యశాల ఆవరణంలో డాక్టర్స్ డే(National Doctors Day)ను పురస్కరించుకొని ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు కొమరం మహేందర్, మధుకర్ మాట్లాడుతూ... వారానికి రెండుసార్లు డ్రై డే ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో గ్రామపంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డెంగ్యూ దోమలు కుట్టకుండా, దోమలు పుట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి నిలువ లేకుండా చూసుకోవడం, మురుగు నీటిలో దోమలు పుట్టకుండా ముందస్తుగా మందు పిచికారి చేయడం వంటివి కచ్చితంగా చేయాలని తెలియజేశారు.

article_53658503.webp
వర్షాల విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

01-07-2025

ములుగు జిల్లాలో వర్షాకాలం నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా సహాయక చర్యలు చేపట్టుటకు సిద్ధంగా ఉండాలని, గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం(NDRF)ను కోరారు. మంగళవారం జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం(ఎన్డీఆర్ఎఫ్) జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector Revenue CH Mahenderji)తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు, గోదావరి నది, జంపన్న వాగు నీటి ప్రవాహం గతంలో జరిగిన సంఘటనల గురించి(ఎన్డీఆర్ఎఫ్) బృందంనకు వివరించారు.

article_53396246.webp
ఇసుక వాగుపై వంతెన నిర్మాణం వేగంగా చేపట్టాలి..

01-07-2025

మండలంలో మరమ్మతులకు గురైన ఏకన్న గూడెం సమీపంలోని ఇసుక వాగుపై వంతెన నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని ములుగు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి తోట మల్లికార్జున రావు(CPI Party Secretary Thota Mallikarjuna Rao) డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ఏకన్న గూడెం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై కుంగిన వంతెన నిర్మాణం కారణంగా వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన కూలిపోయి ఆరు నెలలు గడుస్తున్న మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో నేటికీ చేపట్టపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల, వెంకటాపురం మధ్య వర్షాల కారణంగా రహదారిపై రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.