calender_icon.png 31 January, 2026 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_19172925.webp
తల్లులారా దీవించండి!

31-01-2026

మేడారం/ములుగు, జనవరి 30 (విజయక్రాంతి): మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తిప్రవాహం వెల్లువిరిస్తోంది. శతాబ్దాల ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అరణ్య దేవతల గద్దెల వద్ద లక్షలాది మంది భక్తులు శుక్రవారం మొక్కులు తీర్చుకున్నారు. మనసు నిండా కృతజ్ఞతాభావంతో తిరుగుముఖం పడుతున్నారు. వనదేవతల స్పర్శతో పునీతమై, మేడారం జాతర పరిసరాలన్నీ అమ్మవార్ల నామస్మరణతో ప్రతిధ్వనిం చాయి. కోరిన కోరికలు నెరవేర్చినందుకు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు కృతజ్ఞతగా లక్షల మంది భక్తులు పసుపు కుంకుమ (బండారి), వడిబియ్యం, బంగారం(బెల్లం), పూలు, చీరే, కొబ్బరికాయలు, వెండి తొట్టెలు, కానుకలు, నైవేద్యాలు అర్పించారు.

article_62133192.webp
వనదేవతలకు మొక్కులు సమర్పించేందుకు తరలివస్తున్న భక్త‘కోటి’

30-01-2026

మేడారం (విజయక్రాంతి): ఇలవేల్పు దేవతలకు మొక్కులు సమర్పించడానికి భక్తకోటి శుక్రవారం గద్దెల ప్రాంగణానికి చీమలదండులా బయలుదేరారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెను అధిష్టించిన మరుక్షణం నుండే మొక్కులను భక్తులు సమర్పించుకునేందుకు గద్దెలకు క్యూ కట్టారు. నిర్విరామంగా భక్తుల దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం పూర్తిగా వనదేవతలంతా భక్తుల మొక్కులు తీర్చుకోవడానికి గద్దెలపైన ఆశీనులు కావడంతో జాతరలో మొక్కులు సమర్పించుకోవడానికి భక్తులు అమిత ఆసక్తి చూపిస్తారు. దీనితో శుక్రవారం మేడారం(Medaram Maha Jatara ) గద్దెల ప్రాంగణం పూర్తిగా భక్తకోటితో నిండిపోయింది. లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించి తిరుగు ముఖం పడుతున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం జాతర ప్రధాన రహదారులు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి.

article_47829574.webp
బైక్‌పై పొంగులేటి, కలెక్టర్ దివాకర టీఎస్

30-01-2026

మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్ లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి పరిశీలించారు. మొదటగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల చేరుకొని స్నాన ఘట్టాలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి సర్కిల్ వద్ద ట్రాఫిక్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్య అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

article_52639291.webp
పడిగె రూపంలో పగిడిద్దరాజు

28-01-2026

మేడారం, జనవరి 27 (విజయక్రాంతి): గిరిజనుల మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మేడారానికి తీసుకెళ్తారు. పెళ్లి ఘట్టం నిమిత్తం మేడారానికి మంగళవారం అత్యం త భక్తిశ్రద్ధలతో పెనుక వంశీయుల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయాల ప్రకారం పడిగే రూపంలో బయలుదేరారు. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పూజారుల బృందం, మంగళవారం పస్ర సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో బస చేసి, బుధవారం ఉదయం పడిగవాగు వద్ద జంపన్నవాగులో స్నానలు చేసి, అనంతరం సాయంత్రం 6:30 గంటల వరకు మేడారంలోని పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు.