గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
17-01-2026
ములుగు,జనవరి16(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ దేవాలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నాయక పోడు పూజారులు మంత్రి సీతక్కని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈనెల 21న గట్టమ్మ వద్ద నిర్వహించే ఎదురు పిల్ల పండుగ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ కమిటీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, నాయకులు గండ్రత్ జయాకర్,గుంటోజు పావని,గూడెపు రాకేష్,మరియు నాయక పోడు పూజారులు కొత్త సదయ్య,అరిగేలా సమ్మయ్య,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.