6 May, 2026 | 7:33 PM

Districts - Mulugu

article_59192068.webp
హేమాచలుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామిని శనివారం ములుగు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ కోర్టు జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి , ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వీరాస్వామి , దేవాదాయ శాఖ పరిశీలకులు, కురవి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ యర్రంగారి సురేష్ తదితరులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళ గోత్రనామాలతో ఆలయ అర్చకులు స్వామి వారికి అర్చన చేసి , స్వామి వారి విశిష్టత గురించి జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు వివరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు అందించి ఆశ్వీరవచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యురాలు పాయం అనిత తదితరులు పాల్గొన్నారు.

02-05-2026

article_83014240.webp
కళ్యాణం కమనీయం

మంగపేట,ములుగు జిల్లా, (విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో శ్రీహేమాచల క్షేత్రంలో( మల్లూరు గుట్ట) నెలకొని ఉన్న శ్రీలక్ష్మీ నృసింహ స్వామి తిరు కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల ( మల్లూరు ) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ తదితరుల ఆధ్వర్యంలో తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

01-05-2026