calender_icon.png 19 January, 2026 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_69089992.webp
మేడారం జాతర భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

19-01-2026

మేడారం, జనవరి 18 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పా ట్లపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు సంబం ధించిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, సమ్మక్క సారలమ్మ ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ మ్యాప్స్, సీసీటీవీ పర్యవేక్షణ, అధునాతన డ్రోన్ టెక్నాలజీ ద్వారా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

article_76127594.webp
నేతకాని వర్గానికి మేడారం ట్రస్ట్ బోర్డులో సముచిత గౌరవం దక్కింది

19-01-2026

ములుగు,జనవరి18(విజయక్రాంతి): ఆదివాసీల కుంభమేళాగా పేరుగాంచిన మేడా రం సమ్మక్క-సారలమ్మ జాతర ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ల కమిటీలో నేతకాని(నైతకాని)సామాజిక వర్గానికి చోటు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేతకాని వర్గానికి చెందిన జనగం గంగలక్ష్మిని ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి సీతక్కకు నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్,సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ కృతజ్ఞతలు తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ మేడారం జాతరలో సంప్రదాయబద్ధ సేవలందిస్తున్న నేతకాని వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డా. నగేష్ చేసిన డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

article_87719262.webp
గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

17-01-2026

ములుగు,జనవరి16(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ దేవాలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నాయక పోడు పూజారులు మంత్రి సీతక్కని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈనెల 21న గట్టమ్మ వద్ద నిర్వహించే ఎదురు పిల్ల పండుగ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ కమిటీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, నాయకులు గండ్రత్ జయాకర్,గుంటోజు పావని,గూడెపు రాకేష్,మరియు నాయక పోడు పూజారులు కొత్త సదయ్య,అరిగేలా సమ్మయ్య,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.