బాగా చదువుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం
08-11-2025
ములుగు,నవంబరు7(విజయక్రాంతి):బాగా చదువుకోవడంతో పాటుసాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. విద్యార్థినిలకు సూచించారు. శుక్రవారం ములుగు మండలంలోని జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో బి.ఈ.ఎల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సి.ఎస్.ఆర్.(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి) క్రింద జిల్లాలోని 9ఆశ్రమ పాఠశాలలు చిన్న బోయినపల్లి,కర్లపల్లి,లక్ష్మీనగరం,ఏకే ఘనపూర్,జగ్గన్నపేట,మేడారం,తాడ్వాయి చిరుతపల్లి-1,ఊరటం,కే.జీ.వీ. కన్నాయిగూడెం పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్ పరికరాలను సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సమక్షంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్ అందచేశారు.