calender_icon.png 16 September, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_33146675.webp
కంకల వాగు బ్రిడ్జిపై భారీ గుంతలు

15-09-2025

వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : మండల కేంద్రం సమీపంలోని ఆజేడు రహదారిలోని కంకలవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. వందనపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ వంతెనపై ఐరన్ ప్లేట్లు పైకి తేలి ఉండగా ఇటీవల ఆర్ అండ్ బి అధికారులు వాటిని కట్ చేశారు. గుంతల కారణంగా భారీ ఇసుక లారీలు వెళ్తుంటే ఇజక వాహనదారులు వాటిని దాటి వెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది. వంతెన పైనే పదుల సంఖ్యలో భారీ గొంతలు ఉండడంతో ప్రజలు అందరిపై బిక్కు బిక్కుమంటూ ప్రయాణాలు చేస్తున్నారు. ఆర్ అండ్ బాధికారులు ఇకనైనా స్పందించి వంతెనపై గుంతలను పూడ్చి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

article_44174016.webp
రహదారి మరమ్మతులు చెయ్యండి

11-09-2025

చర్ల, సెప్టెంబర్ 10, (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు నుండి భద్రాచలం వరకు ప్రధాన రహదారులను తక్షణమే మ రమ్మత్తులు చేయాలని, కష్టాల్లో ఉన్న రైతులకు సరిపడ యూరియా అందించాలని బి ఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చర్ల గాంధీ బొ మ్మ సెంటర్ నుండి గుంపేనగూడెం వరకు ప్రధాన రహదారిలో బైకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి తదనంతరం తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందచేసిన నాయకు లు బిఆర్‌ఎస్ పార్టీ చర్ల మండలవివి కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో జరిగిన.

article_87612054.webp
వీరవనిత చాకలి ఐలమ్మ

10-09-2025

మంగపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల రజక సంఘం అధ్యర్యంలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు నూతలకంటి రాజు చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... నిజాం రజాకార్లతో భూమి కోసం బుక్తి కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాడిన వీరవనీత అని చిట్యాల ఐలమ్మను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు పుణ్యం నాగలక్ష్మి గ్రామ శాఖ అధ్యక్షులు తాటి రమణ గట్టికొప్పుల ఉపేందర్ పుణ్యం వెంకటేశ్వర్లు వేల్పుల రమేష్ సురేష్ నూతులకంటి రమేష్ నరేష్ మహేష్ లోంక రాజు చల్మయ్య రాచకొండ గణేష్ పుణ్యం సాయి కొండపర్తి నగేష్ నూతులకంటి రాధికా అరుణ కొండపర్తి రమాదేవి. పర్వతాల పుషమ్మ రాచకొండ భరతమ్మ పాల్గొన్నారు.

article_12518447.webp
కన్నాయిగూడెం రైతు వేదికలో మెగా రక్తదాన శిబిరం

09-09-2025

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రంలో రైతు వేదికలో ముప్పనపల్లి సహాయనిధి సంస్థ ఇంచార్జి అబ్బు సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో ముప్పనపల్లి సహాయ నిధీ టీమ్ అందరూ బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కన్నాయిగూడెం మండలంలోని యవకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల మాజీ ఎంపీపీ జనగాం సమ్మక్క బ్లడ్ డొనేటర్స్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపిపి మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది ప్రాణదానంతో సమానం ప్రమాదనికి గురి అయినా వారికీ శత్ర చికిత్స చేసుకునేవారికి లేదా సైకిల్ సెల్ తలసేమియా, గర్భిణీ స్త్రీలకు,