మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధం
15-01-2026
మేడారం, జనవరి 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి ఈనెల 25 నుండి ఆర్టీసీ ప్రత్యేక బ స్సు సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పా ట్లు సిద్ధం చేస్తోంది. 2024లో జరిగిన జాతరకు 3,500 బస్సులను వినియోగించి 20 లక్షల మంది భక్తులను మేడారం జాతరకు తరలించగా, ఈసారి జాతరకు 4 వేల బస్సులను నడపనున్నట్లు, 30 లక్షల మంది భక్తులను తరలించేందుకు అనుగుణంగా ఏ ర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టిసి వరంగల్ రీజియన్ మేనేజర్ విజయ భాను తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ 14 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు చెప్పా రు.