సమయానికి మేడారం పనులు పూర్తి
24-12-2025
ములుగు, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు రెండు వందల సంవత్సరాల కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండేలా అభివృద్ధి చేస్తున్నామ ని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం మం త్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి మేడారంలో శ్రీసమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.