భూతల స్వర్గధామం ములుగు అందాలు
01-01-2026
ములుగు, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ఉందని, సహజ సిద్ధ ప్రకృతి అందాలు, భక్తి , ఆనందం, -ఆహ్లాదంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు నెలవై ఉన్నాయని, పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి.ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి ప్రారంభించారు.