calender_icon.png 23 January, 2026 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_79788882.webp
గద్దెలపైకి విసురుతున్న బెల్లం,కొబ్బరికాయలు

22-01-2026

మేడారం, జనవరి 21 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మరో వా రం రోజులు గడువు ఉండగానే ముందస్తు మొక్కలు చెల్లించుకోవడానికి బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గద్దెల ప్రాంగణం ఇటీవల విస్తరించడంతో పెద్ద ఎత్తున భక్తులు లోపలికి వస్తున్నారు. దీనితో గద్దెల పైకి భక్తులను అనుమతిం చడంతో చాలామంది ఎక్కువ సేపు అక్కడే ఉంటుండగా రద్దీ పెరగడంతో బయట నుండి భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తెచ్చిన బంగారం బెల్లం కొబ్బరికాయలను గద్దెల ప్రాంగణం పైకి విసురుతున్నారు. దీనితో బుధవారం ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి.

article_17209110.webp
మేడారంలో మండ మెలిగే పండుగ

21-01-2026

మేడారం, జనవరి 20 (విజయక్రాంతి): మేడారం మహా జాతరకు ఆరంభ సంకేతమైన ‘మండమెలిగే’ పండుగను సమ్మక్క, సారలమ్మ , పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుండే మేడారం, కన్నేపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో బుధవారం ఆదివాసి గిరిజనులు సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక పండుగగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ మహా జాతర ప్రారంభానికి సంకేతంగా నిర్వహించే ’మండమెలిగే పం డుగ’ ఆదివాసీ సమాజంలో సాంప్రదాయిక విలువలను ప్రతిబింబిస్తుంది.

article_87196207.webp
వనదేవతలను దర్శించుకున్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

21-01-2026

మేడారం, జనవరి 20 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు అమ్మవార్లకు ఎత్తు బంగారం (బెల్లం) మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లతో మేడారంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. అడవి తల్లుల చరిత్రను చా టి చెప్పేలా, కోయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అనేక శిల్పాలు, బొమ్మలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.

article_36567165.webp
ముగిసిన సీఎం మేడారం పర్యటన

19-01-2026

మేడారం, (విజయక్రాంతి): మేడారం మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా 251 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ పనులను ప్రారంభించడంతోపాటు, రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించారు. మంత్రివర్గ సహచరులతో కలిసి అధికారుల బృందం మొత్తం ఆదివారం మేడారం లోనే బస చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి మేడారం హరిత కాకతీయ హోటల్లో బసచేసిన సీఎం సోమవారం ఉదయం మేడారం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. అక్కడినుండి గద్దెల ప్రాంగణానికి చేరుకొని తనతో పాటు మనవడిని తులాభారం వేసుకుని ఎత్తు బంగారం సమర్పించారు. అనంతరం మంత్రివర్గ సహచరులతో కలిసి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరారు.