8 April, 2026 | 8:01 PM

Districts - Mulugu

article_28533967.webp
బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి

మంగపేట, (విజయక్రాంతి) : అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా పాలకులకు అంటగట్టే నీచమైన బుద్దిని బీఆర్ఎస్ పార్టీ వీడనాడాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు హితవు పలికారు. శనివారం మండల కేంద్రమైన మంగపేటలో స్థానిక విలేకరులతో కర్రీ నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగితే ప్రభుత్వం చేసింది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దుష్ప్రచారం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యం ఏదోఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వంపైనా, రాష్ట్ర మంత్రి సీతక్క పైన బురద జల్లాలి అనే పద్ధతిని ఆచరిస్తున్నారని, ఆ పద్దతిని మార్చుకోవాలన్నారు.

04-04-2026