20 April, 2026 | 11:37 AM

Districts - Mulugu

article_56620898.webp
మహాద్భుతంగా మేడారం గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

మేడారం, (మహబూబాబాద్) ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఆదివారం ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్‘ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు.

20-04-2026

article_57028703.webp
రక్త దాతల స్ఫూర్తి అభినందనీయం

ములుగు,(విజయక్రాంతి): రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంశనియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు.

18-04-2026

article_88469328.webp
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ములుగు జిల్లా, మంగపేట ( విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో శ్రీహేమాచల లక్ష్మీనృసింహ స్వామి రైతు మిత్ర సంఘం ( ఎంసిఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ తోట రవీందర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తోట రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు రకం వడ్ల కు 2389, సీ గ్రేడు రకం వడ్లకు 2369 రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని విక్రయించుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, శ్రీహేమాచల లక్ష్మీనృసింహ స్వామి రైతు మిత్ర సంఘం ( ఎంసిఎస్ఎస్) ప్రెసిడెంట్ అన్నపురెడ్డి రాణా ప్రతాప రెడ్డి, ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ఇంచార్జ్ అన్నపురెడ్డి శ్రీనివాస రెడ్డి, రైతులు పచ్చా శేషగిరిరావు, చింతా పున్నారావు, మండవ రామకృష్ణ,బూర చంద్రం, పానుగంటి రమణయ్య, రాజేష్, కిషోర్, పంజాల హరిబాబు, హనుమంతరావు, నాగేష్, టి.హరిబాబు, రాఘవులు, యాదగిరి, బత్తుల వెంకన్న, పిచ్చయ్య, నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

16-04-2026

article_81218488.webp
సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం

ములుగు జిల్లా, మంగపేట ( విజయక్రాంతి ) : సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానమని మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి, మంగపేట సెకండ్ యస్ఐ శ్రీకాంత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగపేట పోలీసుల ఆధ్వర్యంలో మంగపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి, మంగపేట సెకండ్ యస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

16-04-2026