calender_icon.png 9 January, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38023577.webp
భక్తులకు ఇబ్బందులు కలగనీయొద్దు

09-01-2026

ములుగు, జనవరి8(విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జాతరను నిర్వహించాలని,రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటి చెప్పాలని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభం చేస్తామని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. గురువారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్,ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా,డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31వతేదీ వరకు జరుగుతుందన్నారు.

article_75359533.webp
యువత క్రీడా ప్రతిభకు సీఎం కప్ పోటీలు సువర్ణావకాశం

09-01-2026

ములుగు, జనవరి 8 (విజయక్రాంతి): యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ రెండవ ఎడిషన్ సరైన వేదిక అని ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

article_56120251.webp
మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు సరికాదు

08-01-2026

కన్నాయిగూడెం, జనవరి 7 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజన మహాజాతర శ్రీమేడారం సమ్మక్క సారలమ్మాల జాతర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాలో ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క ఎన్నోమార్లు మేడారం జాతరకు ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చెయ్యండి అని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అడిగిన కనీసం మేడారం జాతర సమయానికి కూడా నిధులు విడుదల చెయ్యకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో ఉన్న ఒక్క మంత్రి ఎమ్మెల్యే లోకల్ లీడర్లు కూడా మేడారం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లెవ్వుని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కన్వీనర్- సునార్కని సాంబశివ అన్నారు.

article_24875841.webp
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి

08-01-2026

ఏటూరునాగారం, జనవరి 7 (విజయక్రాంతి): విద్యార్ధులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని,ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించడం, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలు నిర్వహించే ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ,గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏటూరునాగారం మండల కేంద్రంలోనీ జంబోరి మైదానంలో బుదవారం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ లు నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంబించారు.

article_27032667.webp
గిరిజన గూడేల్లో వెల్ల్లివిరిసిన సేవాభావం

08-01-2026

వెంకటాపురం(నూగూరు), జనవరి 7 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖమ్మం వారు వెంకటాపురం మండలంలోని జెల్లా కాలనీ, టేకులబోరు, మంగవాయి, ముక్కునురుపాలెం, రామచంద్రపురం, మొర్రవానిగూడెం, ఆలుబాక, బర్రెబొంద , ఎదిర గ్రామాలలోనీ జిటియస్ యస్ చైల్ కేర్ సెంటర్ నీ 800 మంది నీరు పెద విద్యార్ధిని విద్యార్థులకు, దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్లు , ఆట బొమ్మలను మొర్రవానిగూడెం జి యస్ యస్ చైల్ కేర్ సెంటర్ లో పాఠశాల ఉపాధ్యాయులు దీలిప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను పిల్లల తల్లి తండ్రులు అభినందించారు.