అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత
ములుగు (మహబూబాబాద్), జూన్ 5 (విజయక్రాంతి): అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, సరస్సు, అటవీ, ఆధ్యాత్మిక, పర్వత పర్యాటక ప్రాంతాలు ఒకేచోట ఉన్న అరుదైన జిల్లాగా ములుగు ప్రత్యేక గుర్తింపు పొందిందని, రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా, నియోజకవర్గంగా ములుగు అగ్రస్థానంలో ఉందని, నియోజకవర్గంలో 77 శాతం, జిల్లాలో 64 శాతం అడవులు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మేడారాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్ది, అటవీ సంపదను భావితరాలకు అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు.
06-06-2026