మేడారంలో మండ మెలిగే పండుగ
21-01-2026
మేడారం, జనవరి 20 (విజయక్రాంతి): మేడారం మహా జాతరకు ఆరంభ సంకేతమైన ‘మండమెలిగే’ పండుగను సమ్మక్క, సారలమ్మ , పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుండే మేడారం, కన్నేపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో బుధవారం ఆదివాసి గిరిజనులు సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక పండుగగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ మహా జాతర ప్రారంభానికి సంకేతంగా నిర్వహించే ’మండమెలిగే పం డుగ’ ఆదివాసీ సమాజంలో సాంప్రదాయిక విలువలను ప్రతిబింబిస్తుంది.