calender_icon.png 9 November, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_90178883.webp
బాగా చదువుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం

08-11-2025

ములుగు,నవంబరు7(విజయక్రాంతి):బాగా చదువుకోవడంతో పాటుసాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. విద్యార్థినిలకు సూచించారు. శుక్రవారం ములుగు మండలంలోని జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో బి.ఈ.ఎల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సి.ఎస్.ఆర్.(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి) క్రింద జిల్లాలోని 9ఆశ్రమ పాఠశాలలు చిన్న బోయినపల్లి,కర్లపల్లి,లక్ష్మీనగరం,ఏకే ఘనపూర్,జగ్గన్నపేట,మేడారం,తాడ్వాయి చిరుతపల్లి-1,ఊరటం,కే.జీ.వీ. కన్నాయిగూడెం పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్ పరికరాలను సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సమక్షంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్ అందచేశారు.

article_64914084.webp
సబ్సిడీపై పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి

06-11-2025

ములుగు (విజయక్రాంతి): సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కొండం రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే రోటీవేటర్, కల్టివేటర్, బ్యాటరీ పంపులు అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడం జరుగుతుందని అన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్సశాఖకు సంబంధించి ఉచిత చేప పిల్లల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందని అన్నారు.

article_68496296.webp
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఏటూరునాగారం డిగ్రీ గురుకుల విద్యార్థులు ఎంపిక

06-11-2025

ఏటూరునాగారం (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఏటూరునాగారం డిగ్రీ బాలికల గురుకులం కళాశాల విద్యార్థినిలు మేఘన, కీర్తనలు టీచర్ వెల్ఫేర్ సొసైటీ (ఆర్ టి డబ్ల్యూ ఎస్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో నేటి నుండి జరగబోయే 58వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ ఖోఖో పోటీలు జవహర్లాల్ స్టేడియంలో నిర్వహించగా తమ కళాశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచి క్రీడలలో రాణించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగిందినీ. కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల. పిడి. డి అరుణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కళాశాల విద్యార్థినిలు మేఘన. కీర్తనలు పాల్గొనడం జరుగుతుందన్నారు.

article_83467639.webp
రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన ములుగు జర్నలిస్టులు

06-11-2025

ములుగు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాదులో గురువారం ములుగు జర్నలిస్టులు, ఐ.జే.యూ ములుగు జిల్లా అధ్యక్షులు షఫీ హమ్మద్, ఉపాధ్యక్షులు బేతి సతీష్ యాదవ్ కార్యదర్శి చిదిరాల వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ములుగు జిల్లా జర్నలిస్టుల స్థితిగతులు, పరిస్థితులను ప్రెస్ అకాడమీ చైర్మన్ కు వివరించారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని పొద్దుటూరులో గల ప్రగతి రిసార్ట్ లో జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ.జే.యూ) రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని ములుగు జిల్లాలో ఐజేయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వారు ఈ సమావేశంలో వివరించారు.