వ్యాయామం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం
16-06-2025
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఆందోళనలను నివారించవచ్చనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంటలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S.), గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... జిల్లా కేంద్రం లో రెండు ఓపెన్ జిమ్ సెంటర్లులు ఉన్నాయని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.