రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ
18-10-2025
ములుగు, అక్టోబరు 17 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ఎటువంటి అవాంఛనీయ నేర సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ములుగు జిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక నిఘా చర్యలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి,ఆదేశాల మేరకు, ములుగు జిల్లా పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు ప్రతి నెలా క్రమం తప్ప కుండా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని, వారి కదలికలపై నిఘా ఉంచాలని ములు గు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి. జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.