కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
21-11-2025
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 20(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాన్ బోస్కో సంస్థ యొక్క సహకారంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లోని వరద ముంపుకు గురైన 400 బాధిత కుటుంబాలకు కాఫెడ్ సంస్థ నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చాప, కండవా తదితర వస్తువులు వారి యొక్క ఆఫీసు ఆవరణంలో పంచిపెట్టారు.