మహా జాతరకు ప్రత్యేక రైళ్లు
25-01-2026
మేడారం, జనవరి 24 (విజయక్రాంతి): దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈనెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో జరగనుంది. ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి సుమారు మూడు కోట్ల మంది ఈసారి జాతరకు వస్తారని అధికారవర్గాలు అంచనా వేశాయి. నాలుగు వేల ఆర్టీసీ బస్సులను భక్తులను మేడారం చేరవేసేందుకు సిద్ధం చేసింది.