మహా జాతరకు భారీ బందోబస్తు
10-01-2026
మేడారం, జనవరి 9(విజయక్రాంతి): మేడారం మహా జాతరకు 12 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో వరంగల్, రామగుండం సీపీలు సన్ ప్రీత్ సింగ్, అంబర్ కిషోర్ ఝా, 15 మంది ఎస్పీ స్థాయి అధికారులు, 20 మందికి పైగా ఐపీఎస్ ఆఫీసర్లు మేడారం జాతర బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటారని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తెలిపారు.