calender_icon.png 14 December, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65787064.webp
చలిలో చంటి పిల్లలతో ఓటింగ్ కు.. 9 గంటల వరకు 25 శాతం పోలింగ్

14-12-2025

కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చలి కారణంగా ఓటర్లు మందకొడిగా బయటకు వస్తున్నారు. చిన్న గ్రామపంచాయతీల్లో చంటి పిల్లలతో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు 25 శాతం పోలింగ్ పోలింగ్ నమోదైంది. ఎండ వేడి పెరగడంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఓటు వేయడానికి క్యూ కడుతున్నారు. మరోవైపు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు అనేక పాట్లు పడుతున్నారు.

article_67775661.webp
రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

13-12-2025

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రెండో విడత ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఎన్నికలు జరగనున్న మండలాల్లో శనివారం పర్యటించారు. రెండో విడత ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ మేరకు లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలని, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.

article_47216253.webp
వాహనాల తనిఖీల్లో పట్టుబడిన మద్యం

10-12-2025

ఎల్లారెడ్డి:(విజయక్రాంతి): అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఫ్లయింగ్ స్కాడ్ టీం మంగళవారం సాయంతరం మల్లయ్యపల్లి గేటు వద్ద FST టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా, పట్టుబడినట్లు ప్లయింగ్,స్కాడ్ టీం, అధికారి ఆర్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పాత లింగయ్య పల్లి గ్రామానికి చెందిన చింతకాయల రమేష్ అనే వ్యక్తి తన ఆటో నెంబర్ TS 35 T 6506 గల ప్యాసింజర్ ఆటోలో మద్యం తీసుకుపోతుండగా మూడు కాటన్ల మద్యం (25 లీటర్లు విలువ 28000/-)పట్టుకొని సీజ్ చేసి అట్టి ఆటో, మద్యం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో అప్పగించి దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.