రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
12-11-2025
సదాశివనగర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి (DTO) జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు, స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో బుధవారం రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళాశాల ప్రిన్సిపల్ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.