రైతు భరోసా సంబరాలు..
24-06-2025
కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల కేంద్రంలో గల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ(Government Advisor Shabbir Ali) చిత్రపటాలకు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీతారాం మధు, శ్రీకాంత్, గోపాల్ రెడ్డి, నల్లపు శ్రీనివాస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.