రాష్ట్ర స్థాయి పోటీలో లలితకు ద్వితీయ బహుమతి
06-01-2026
మహబూబ్నగర్టౌన్, జనవరి 5 : తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, మంథని వారి ఆర్థిక సహకారంతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచనా పోటీలో నాగర్కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, మంగనూరు గ్రామానికి చెందిన లలిత ద్వితీయ బహుమతి సాధించారు.