calender_icon.png 12 January, 2026 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18255315.webp
విద్యార్థులు క్రీడలో రాణించాలి

12-01-2026

హన్వాడ : విద్యార్థులు రాష్ట్ర స్థైలో రాణించాలి అని బీజెవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించినటువంటి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. మొదటి విజేతగా దొరి తండా గ్రామానికి చెందిన దినేష్, రెండో విజేతగా సల్లోనిపల్లి గ్రామానికి చెందిన నరేష్ విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కోశాధికారి డాక్టర్ వెంకటయ్య గారు, మాజీ జెడ్పిటిసి రమణారెడ్డి గారు, హన్వాడ మండల్ బిజెపి అధ్యక్షుడు కొండ లింగన్న,జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రఘురాం గౌడ్, కొనగట్టుపల్లి సర్పంచ్ గడ్డం కుర్మయ్య, హన్వాడ మండల్ బీజెవైఎం అధ్యక్షులు ఎర్ర చంద్రశేఖర్ జనరల్ సెక్రెటరీ అరవింద చారి,తిరుమలయ్య ఉపాధ్యక్షులు గర్కశివప్రసాద్ గౌడ్, సతీష్ , కార్యదర్శి పాండు కుమార్, బండారి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

article_36498926.webp
నేడు పాలమూరుకు కేటీఆర్ రాక

12-01-2026

మహబూబ్ నగర్, జనవరి 11 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు నేడు విచ్చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ నుంచి సభా స్థలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు ప్రజలు కార్యకర్తలు భారీ ఎత్తున సభకు విచ్చేయాలని వారు కోరారు.