calender_icon.png 4 February, 2026 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_15165691.webp
అందరికి అండగా ప్రజాపాలన ప్రభుత్వం

03-02-2026

అడ్డాకుల ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు రెండు మూడు నెలల్లోనే పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం అడ్డాకుల మండల కేంద్రంలోని రైతు వేదిక సమావేశంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొస్టింగ్ ఎమ్మెల్యే అందజేశారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం మహిళలు ప్రతిష్టాత్మకంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.