calender_icon.png 20 January, 2026 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18236530.webp
శ్రీ కురుమూర్తి కొండకు పోటెత్తిన భక్తజనం

19-01-2026

చిన్న చింతకుంట, జనవరి 18: తిరుమల తిరుపతి వెంకన్నగా భక్తుల మొక్కులు అందుకుంటున్న శ్రీ కురుమతి స్వామి కొండకు భక్తులు పోటెత్తారు. ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కాలినడకన స్వామివారి కొండకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండ దిగువ నుంచి స్వామివారి సన్నిధి వరకు ఉన్న క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు, ఆలయ ఈవో, దేవస్థాన సిబ్బంది ఎంతో ఇబ్బంది పడ్డారు. భక్తుల గోవింద నామస్మరణతో కాంచన గుహ పులకరించింది. స్వామివారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

article_22413088.webp
చేతగానోళ్లకు మాటలెక్కువ

18-01-2026

మహబూబ్‌నగర్, జనవరి 17 (విజయక్రాంతి): మారువేషంలో వచ్చి మాయమాట లు చెప్పినవారిని గుర్తుపట్టి కర్రు కాల్చి వాత పెడతారని రాష్ర్ట ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పా టుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడా రు. పనులు చేయలేని చేతగానోళ్లంతా ఏవే వో మాట్లాడుతున్నారని, వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. శాసన సభకు వచ్చి చేసింది ఏందో చెప్పాలంటే, ఫామ్ హౌస్‌లో కూర్చొని అప్పుడప్పుడు కాలం చె ల్లిన మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉం దన్నారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడిపారని సీఎం విమర్శించారు.

article_48039574.webp
మినీ ట్యాంక్ బండ్ ను నగరానికి తలమానికం చేస్తాం

17-01-2026

మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): ప్రజల అవసరాన్ని బట్టి అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముడా నిధులు రూ.1 కోటి 50 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ, ఆధునిక వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యానికి గురైన మినీ ట్యాంక్ బండ్‌ను నగరానికి ఆభరణంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నగర సౌందర్యం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సుందరీకరణ పనులను రూపకల్పన చేశామని అన్నారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.