29 August, 2026 | 4:21 AM

Districts - Mahabubnagar

article_64043300.webp
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన కౌన్సిలర్ పద్మ

భూత్పూర్, ఆగస్టు 28 : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కి హైదరాబాద్ లోని తన నివాస గృహంలో భూత్పూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ కేంద్యాల పద్మ నరేందర్ శుక్రవారం రాఖీ కట్టి మిఠాయిలను తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానం, ఎన్నో విజయాలు లభించాలని ఆమె ఆకర్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రేమాభిమానాలతో నాకు రాఖీలు కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.

28-08-2026

article_25980672.webp
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్‌(Collectorate) ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వందలాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గవినోళ్ల రాజీవ్‌రెడ్డి, కన్వీనర్ ఎస్. విజయ్‌కుమార్ మాట్లాడుతూ రెండో పీఆర్‌సీ ప్రకటించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం, ఉద్యోగుల బకాయిలు విడుదల చేయకపోవడం, సీపీఎస్‌ను రద్దు చేయకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

28-08-2026