10 August, 2026 | 8:34 PM

Districts - Mahabubnagar

article_48273475.webp
పెద్దాయపల్లిలో.. తల్లిపాల వారోత్సవాలు

బాలానగర్: మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. గాయత్రి లక్ష్మయ్య పాల్గొని గర్భిణీలకు రోజు తీసుకునే ఆహారం శుభ్రంగా ఉండాలని, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న గుడ్లు, బాలామృతం పిల్లలకు తినిపించాలన్నారు. గర్భిణీలు అంగన్వాడి సెంటర్ కు వచ్చి ఫుడ్డు తీసుకున్నట్లయితే మీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సరిత, విష్ణు, అంగన్వాడి టీచర్ రేణుక ఆశా వర్కర్ విజయలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.

08-08-2026

article_75935604.webp
ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా పెద్దల్లి జంబులయ్య మాదిగ

మహబూబ్ నగర్ అర్బన్ : హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెద్దెల్లి జంబులయ్య సేవలను గుర్తించి నేడు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ మేడి పాపన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన పలు ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మెట్టు అంజమ్మను రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

08-08-2026