ఆస్పత్రి పునర్జన్మనిస్తుంది..
హన్వాడ, ఏప్రిల్ 8: అమ్మ జన్మనిస్తే ఆసుపత్రి పునర్జన్మ నిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బండమీది పల్లిలో సద్గురు శ్రీ మధు సూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్, వన్ వరల్ వన్ ఫ్యామిలీ మిషన్, శ్రీ జయరామ చారిటబుల్ ట్రస్ట్ సయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్న సాయి ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.
09-04-2026