ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా
మహబూబ్నగర్,(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్(Collectorate) ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వందలాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గవినోళ్ల రాజీవ్రెడ్డి, కన్వీనర్ ఎస్. విజయ్కుమార్ మాట్లాడుతూ రెండో పీఆర్సీ ప్రకటించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్లో ఉండటం, ఉద్యోగుల బకాయిలు విడుదల చేయకపోవడం, సీపీఎస్ను రద్దు చేయకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
28-08-2026