7 September, 2026 | 3:30 AM

Districts - Mahabubnagar

ఉద్యమకారుడు పల్లె రవి మృతి
ఉద్యమకారుడు పల్లె రవి మృతి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సహాయశక్తులుగా కృషిచేసిన నగరంలోని క్రిస్టియన్ పల్లి ప్రాంతానికి చెందిన పల్లె రవి మృతి చెందారు. రాత్రి క్రిస్టియన్ పల్లి సమీపంలో తన భార్యతో పాటు ద్విచక్ర వాహనంపై వెళుతున్న పల్లె రవిని ఓ వాహనం ఢీకొట్టడంతో అతనికి వారి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఓ ఆసుపత్రికి వైద్య చికిత్సలు నిమిత్తం తరలించినప్పటికీ వైద్య చికిత్సలు పొందుతూ పల్లె రవి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ జీవితమంతా స్వరాష్ట్ర ఉద్యమం తో పాటు బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగా పనిచేశారని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి తెలిపారు.

06-09-2026 | 11:15am

బీరు సీసాలో చెత్త... మద్యం ప్రియుల్లో ఆందోళన
బీరు సీసాలో చెత్త... మద్యం ప్రియుల్లో ఆందోళన

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో శనివారం వినియోగదారులు బీరు సీసాలను (కింగ్ ఫిషర్ ) కొనుగోలు చేయడంతో ఒక బీరు సీసాలో చెత్త, మలిన పదార్థాలు కనిపించడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన సీసాలో మలినాలు ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు న్యూస్ టుడే కు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు, సరఫరా వ్యవస్థపై తనిఖీలు చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

06-09-2026 | 12:32am

రాజకీయాల్లోకి వచ్చింది దోపిడీ చేయడానికి కాదు
రాజకీయాల్లోకి వచ్చింది దోపిడీ చేయడానికి కాదు

మేము రాజకీయాల్లోకి వచ్చింది మీలాగా దోపిడీ చేయడానికి కాదని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామం నుంచి భూత్పూర్ పట్టణం కేంద్రం వరకు ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్య, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా విమర్శించారని ఆయన తెలిపారు.

05-09-2026 | 09:28pm