రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి సేవలు చిరస్మరణీయం
మహబూబ్నగర్, ఆగస్టు 22: హైదరాబాద్ నగర తొలి పోలీస్ కమిషనర్, విద్యావేత్త, సామాజిక సంస్కర్త కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి సేవలు చిరస్మరణీయమని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని 22వ డివిజన్ పద్మావతి కాలనీలో శనివారం రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్రెడ్డి, మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి తదితరులు హాజరై వెంకట్రామా రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
22-08-2026