ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే జీఎంఆర్
చిన్నచింతకుంట(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, పౌష్టికాహారం అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు. చిన్నచింతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్స్ బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు, విద్యా సామగ్రి, మెరుగైన తరగతి గదులు, బ్రేక్ఫాస్ట్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
05-09-2026 | 05:10pm