22 August, 2026 | 10:39 PM

Districts - Mahabubnagar

article_81310435.webp
రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి సేవలు చిరస్మరణీయం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 22: హైదరాబాద్‌ నగర తొలి పోలీస్‌ కమిషనర్‌, విద్యావేత్త, సామాజిక సంస్కర్త కొత్వాల్‌ రాజా బహదూర్‌ వెంకట్రామా రెడ్డి సేవలు చిరస్మరణీయమని మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ మారేపల్లి సురేందర్‌ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని 22వ డివిజన్‌ పద్మావతి కాలనీలో శనివారం రాజా బహదూర్‌ వెంకట్రామా రెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్‌ గుమ్మల మమత శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ మారేపల్లి సురేందర్‌రెడ్డి, మూఢ చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి తదితరులు హాజరై వెంకట్రామా రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

22-08-2026

article_79059084.webp
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి): ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి మంజూరైన రూ.10 లక్షలతో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధితో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

22-08-2026