2 April, 2026 | 6:15 AM
Breaking News
మహబూబ్ నగర్ టౌన్ , ఏప్రిల్ 1 : ప్రయాణం చేసి సమయంలో మన భద్రత కోసం మనమే బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు.
02-04-2026
పెబ్బేరు, ఏప్రిల్ 1:మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
అలంపూర్ ఎప్రిల్ 1 గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో సర్పం చులు చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు లు ఇప్పించాలని ఆ దిశగా మాజీ సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీడీవోకు మాజీ సర్పంచులు విన్నవించారు.
భూత్పూర్, ఏప్రిల్ 1 : మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో ( 5వ వార్డు) లో లక్ష్మీదేవి అనే లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ పద్మ నరేందర్ బుధవారం భూమి పూజ చేశారు.
నవాబ్ పేట, ఏప్రిల్ 1 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌ లిక వసతుల కల్పనకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం అరబిందో ఫార్మా ప్రతినిధులు పాఠశాలను సందర్శించారు.
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 1: శ్రీరంగాపూర్ అంగన్వాడి-3 కేంద్రంలో గ్రామీణ ఆరోగ్య పోషణ దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు,
అలంపూర్ ఎప్రిల్ 1: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సం బంధిత అధికారులను ఆదేశించారు.
అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం 12వ డివిజన్ లో పర్యటించి డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు,
01-04-2026
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు.
రాజాపూర్ మార్చి 31 : రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలు అర్జించవచ్చని తెలంగాణ విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన అన్నారు. మంగళవారం ఈద్గాన్ పల్లి గ్రామంలోని రైతు వేదిక భావనంలో పంట మార్పిడి విధానం పై రైతులకు అవగాహన కల్పించారు.
నవాబ్ పేట, మార్చి 31: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మండలంలో పకడ్బందీగా అమలు చేసేందుకు అందరూ నడుం బిగించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో దళిత బహుజన శ్రామిక యూనియన్, ’పార’ సంస్థల ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి ‘సిటిజన్ విజిలేన్స్ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్గా ఎం ఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాదాసు శాంతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చిన్న చింతకుంట, మార్చి 31 : మండల కేంద్ర పరిధిలోని అమ్మాపూర్ గ్రామ శివారులో కాంచన గృహాలో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో మైనింగ్ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్థానికు లు, భక్తులు భారీ ఎత్తున కురుమూర్తి స్వామి ఏడుకొండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కురుమూర్తి స్వామి ఆలయం వద్ద కొండల్లో క్రషర్ క్వారీ ఏర్పాటుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఏడు కొండలు ఉన్నాయని, క్వారీతో భక్తుల మనసులు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.