calender_icon.png 17 January, 2026 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_48039574.webp
మినీ ట్యాంక్ బండ్ ను నగరానికి తలమానికం చేస్తాం

17-01-2026

మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): ప్రజల అవసరాన్ని బట్టి అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముడా నిధులు రూ.1 కోటి 50 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ, ఆధునిక వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యానికి గురైన మినీ ట్యాంక్ బండ్‌ను నగరానికి ఆభరణంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నగర సౌందర్యం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సుందరీకరణ పనులను రూపకల్పన చేశామని అన్నారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

article_46752200.webp
బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఎమ్మెల్యే

16-01-2026

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యం కొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, మన్యం కొండ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేసి ఆహ్వానించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, బ్రహ్మోత్సవాల్లో ఏదైనా ఒక రోజు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

article_13825690.webp
పాలమూర్‌లో హాట్ టాపిక్..!

15-01-2026

మహబూబ్ నగర్, జనవరి 14 (విజయక్రాంతి): ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు పార్టీలలో ఒక్కసారిగా సందడి వాతావరణం చెప్పగానే దర్శనమిస్తుంది. పాలమూరు కన్నీటి కోసం తీర్చడంలో ఆ పార్టీ ఈ పార్టీ అంటూ కాలయాపన జరుగుతుందంటూ దశాబ్దల తరబడి రైతన్న కన్నీరు పెట్టుకుంటున్న తుడిచే వారే మాత్రం మాది తప్పు కాదంటే మాది తప్పు కాదు అంటూ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల తీరును ప్రజలు నిశితంగా గమనిస్తుండ్రు. ఇటీవల పాలమూరు జిల్లాలో బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచ్ల సన్మాన సభలో ప్రసంగించిన కొన్ని మాటలు అధికార పార్టీని ఆలోచింపచేయడంతో తప్పులను కూడా గొప్పలుగా మార్చుకొని చెప్తే ఎప్పటికీ అవి నిజం కావంటూ పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాట తీవ్ర చర్చకు దారితీస్తుంది.