ఓటును వృథా చేసుకోకండి
08-02-2026
మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి7: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటును ఎట్టి పరిస్థితి లో వృథా చేసుకోకుండా, బీజేపీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్ కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడ వెళ్లాయని, నిరుద్యోగ భృతి, తులం బంగారం ఎక్కడ? అని ప్రశ్నించారు.