సమష్టిగా ఉండి అభివృద్ధి చేసుకుందాం
12-01-2026
భూత్పూర్, జనవరి 11: అందరం సమిష్టిగా ఉండి అభివృద్ధి చేసుకుందామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉపసర్పంచ్, పదిమంది వార్డు సభ్యులు ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.