4 March, 2026 | 10:32 PM

Districts

article_41688379.webp
వాట్సాప్ లో ఏం పెట్టావు రా అని కొట్టారు

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నగరంలోని ఓ యువకుడిని ముస్లిం యువకులు ఒక్కసారిగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మెట్టుగడ్డ దగ్గర మాకు ఒక బట్టల షాపు ఉంది. ఈనెల 1వ తేదీన ఇటీవల ఇరాన్ ఇజ్రాయిల్(Iran-Israel war) మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇరాన్ దేశం మిలటరీ రక్షణ శాఖ మంత్రి ఖమేని మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో అనుచితంగా పెట్టడం జరిగిందని కొందరు ముస్లిం యువకులు ఒక్కసారిగా షాప్ దగ్గరికి వచ్చి ఎందుకు సోషల్ మీడియాలో అలా పెట్టావురా అంటూ కిందపడేసి ఒక్కసారిగా కొట్టారు.

04-03-2026

article_39958178.webp
కంటైనర్ లో గోవుల తరలింపు

అడ్డాకుల : కంటైనర్ లో అక్రమంగా గోవులను తరలిస్తుండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు 112 కాల్ చేయడంతో సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డాకుల టోల్ ప్లాజా మంగళవారం సాయంత్రం కంటైనర్ ను పట్టుకుని అడ్డాకుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి కె.ఏ 01 ఏ.ఎం 1978 నెంబర్ గల పెద్ద కంటైనర్ లో అక్రమంగా గోవులను తరలిస్తున్నారని షాద్నగర్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కంటైనర్ ఆపకపోవడంతో కారులో వెంబడించి అడ్డాకుల టోల్ ప్లాజా దగ్గర కంటైనర్ ను ఆపారు. డ్రైవర్ బజరంగదళ్ కార్యకర్తలను చూసి భయపడి కంటైనర్ దిగి పారిపోయాడు. కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కంటైనర్ నడుపుకుంటూ అడ్డాకుల పోలీస్ స్టేషన్కు తరలించారు. కంటైనర్ ను, అందులోని34 ఎద్దులు జడ్చర్ల సమీపంలో ఉన్న గోశాలకు తరలించారు.

04-03-2026

article_74543964.webp
అమానవీయ ఘటనపై విచారణకు ఆదేశం

జడ్చర్ల: ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఒక శవాన్ని కుక్క పీక్కుతిన్న ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో ఈ సంఘటనపై విచారణ చేయడానికి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.జే. అజయ్ కుమార్ నేడు విచారణకు వస్తున్నారు. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు(Minister Damodar Rajanarsimha) ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అజయ్ విచారణ చేయడానికి ఈరోజు జడ్చర్లకు వస్తున్నారు. ఈ సంఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.

03-03-2026

article_33536771.webp
జడ్చర్ల ఆసుపత్రిలో జరిగిన ఘటన కలచివేసింది

జడ్చర్ల : మున్సిపాలిటీ లోని ప్రభుత్వ హాస్పిటల్(Jadcherla Hospital incident) లో మృతదేహన్ని భద్రత పరచలేని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మా రెడ్డి(Former Minister Lakshma Reddy ) అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించడం ప్రభుత్వ హాస్పిటల్స్ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణ కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందన్నారు. మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీఎం సొంత జిల్లా, ఇన్ ఛార్జ్ గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటికి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

03-03-2026