2 April, 2026 | 6:15 AM

Districts

article_50352044.webp
పేదల తిరుపతిపై మైనింగ్ కుట్ర

చిన్న చింతకుంట, మార్చి 31 : మండల కేంద్ర పరిధిలోని అమ్మాపూర్ గ్రామ శివారులో కాంచన గృహాలో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో మైనింగ్ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్థానికు లు, భక్తులు భారీ ఎత్తున కురుమూర్తి స్వామి ఏడుకొండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కురుమూర్తి స్వామి ఆలయం వద్ద కొండల్లో క్రషర్ క్వారీ ఏర్పాటుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఏడు కొండలు ఉన్నాయని, క్వారీతో భక్తుల మనసులు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.

01-04-2026