Districts - Mahabubnagar

పాఠశాల చైర్మన్‌ నియామకంపై ప్రజావాణిలో ఫిర్యాదు
పాఠశాల చైర్మన్‌ నియామకంపై ప్రజావాణిలో ఫిర్యాదు

మండల పరిధిలోని నంచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చైర్మన్‌ నియామకంపై నంచర్ల గ్రామానికి చెందిన ఎం. సరోజ సోమవారం మహమ్మదాబాద్‌ మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారుల సమక్షంలో ఆమె ఫిర్యాదును అందజేశారు. తనను నంచర్ల గ్రామ సంఘాల అధ్యక్షురాలిగా నియమించిన నేపథ్యంలో పాఠశాల చైర్మన్‌గా కూడా కొనసాగించాల్సి ఉందని సరోజ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయులు తనను చైర్మన్‌గా కొనసాగించకుండా మరో వ్యక్తిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

08-09-2026 | 01:31am