కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి ఆధ్వర్యంలో ఏడు, ఎనిమిదవ వార్డులకు చెందిన బిజెపి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరమన్నారు.
09-09-2026 | 06:18pm