Districts - Mahabubnagar

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన ఏవీఆర్ గ్లోబల్ స్కూల్ విద్యార్థిని మోక్షిత
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన ఏవీఆర్ గ్లోబల్ స్కూల్ విద్యార్థిని మోక్షిత

మండల కేంద్రంలోని ఏవీఆర్ గ్లోబల్ స్కూల్ విద్యార్థిని మోక్షిత రాష్ట్రస్థాయి యోగా క్రీడా పోటీలకు ఎంపికై ప్రతిభ కనబరిచింది. ప్రస్తుతం జాతీయస్థాయి యోగా క్రీడల కోసం కరీంనగర్‌లో జరుగుతున్న పోటీల్లో ఆమె పాల్గొంటోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని పాఠశాల ప్రిన్సిపల్ అంజయ్య గౌడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వెంకట్రాములు, రమేష్, వెంకటస్వామి, అనిల్ కుమార్‌, పసుపుల జ్యోతి తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని మోక్షితను అభినందించారు.

12-09-2026 | 04:58pm

పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేద్దాం
పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేద్దాం

జడ్చర్ల, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి): ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని కాలేజ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను శనివారం జడ్చర్లలో విడుదల చేశారు. సభ ఇన్చార్జ్ రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయం, యువతకు ఉద్యోగాలు, విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చించడమే పాంచజన్య ఉద్దేశమని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ బిర్లా ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ జడ్చర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

12-09-2026 | 03:59pm