పోచమ్మ గడ్డ తాండలో ప్రజాబాట
24-01-2026
జడ్చర్ల: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) ఆదేశాల మేరకు ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డా తండా(Pochamma Gadda Tanda) గ్రామ పంచాయతీలో శనివారం పర్యటించారు. ఏడీ చంద్రశేఖర్, ఏఈ వెంకటయ్య, లైన్మెన్లు రాధాకృష్ణ, బాలస్వామి, రాజారెడ్డి, జూనియర్ లైన్మెన్ సతీష్ పోచమ్మ గడ్డ తండా గ్రామ పంచాయతీలో ఉన్న కరెంట్ సమస్యలను తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు సర్పంచ్ కేతావత్ శ్రీకాంత్ నాయక్(Sarpanch Kethavath Srikanth Naik) తండాలోని సమస్యలను దగ్గరుండి వివరించారు.