calender_icon.png 5 January, 2026 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_30777407.webp
పండుగకు రూ.1200 కోట్ల పనులను చేపడుతాం

05-01-2026

మహబూబ్ నగర్, జనవరి 4(విజయక్రాంతి): సంక్రాంతి పండుగకు ముందే మహబూబ్నగర్ జిల్లాలో రూ.1200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాకు రానున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కో-ఆప్షన్ సభ్యులు అర్షద్ అలి ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, మహబూబ్నగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.680 కోట్లతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీటిని ప్రజలు వినియోగించే పరిస్థితిలేదని, అందుకే రూ.220 కోట్ల వ్యయంతో ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నా మని వెల్లడించారు.

article_82113411.webp
అంధుల జీవితంలో వెలుగులు నింపింది లూయిస్ బ్రెయిలీ

05-01-2026

మహబూబ్ నగర్, జనవరి 4 (విజయక్రాంతి): అందులో జీవితాల్లో వెలుగులు నింపింది మహనీయులు లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డ లోని శిశు గృహ లో లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతి వేడుకల ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం తో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధులు సామాన్యులతో సమానంగా అన్ని రం గాల్లో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు.

article_39480235.webp
ఎమ్మెల్యే సార్ జన్మదిన శుభాకాంక్షలు

03-01-2026

మహబూబ్ నగర్,(విజయక్రాంతి) : నగర పాలక సంస్థ ప్రాంగణంలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక-సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిక్షణ నేర్చుకుంటున్న విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యే సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు స్వయంగా కేక్ కట్ చేసి, మహిళా సాధికారతకు నిరంతరం తోడ్పడుతున్న ఎమ్మెల్యే తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.