calender_icon.png 23 January, 2026 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_45568969.webp
కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు

23-01-2026

చిన్న చింతకుంట : భక్తుల ఆరాధ్య దైవంగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిగా కొలువబడుతున్న శ్రీ కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు నిర్వహించారు. పల్లె ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కానుకల రూపేనా స్వామివారి హుండీలో వేసిన నగదును ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, దేవదాయ శాఖ పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో లెక్కించగా 14 లక్షల 40వేల 520 రూపాయల ఆదాయం రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, మాజీ పాలకమండలి సభ్యులు భాస్కరాచారి, కమలాకర్, నాగరాజు, గోపాల్, భారతమ్మ, చక్రవర్ధన్ రెడ్డి, ఆలయ అర్చకులు వెంకటయ్య, సత్యనారాయణ, అనంత విజయ్, లక్ష్మీనరసింహచార్యులు, భక్తుడు వెంకటేశ్వర రెడ్డి, సేవా సమితి మహిళా భక్తులు, తదితరులు ఉన్నారు.