29 May, 2026 | 10:24 PM

Districts - Mahabubnagar

article_41142338.webp
విభేదాలు పక్కన పెడదాం సంతోషంగా జీవిద్దాం

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టి అందరం ఐక్యంగా ఉండి సంతోషంగా జీవిద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ నగరంలోని మయూరి పార్కు వద్ద గల హైలే హద్దీస్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం త్యాగం, నిస్వార్థత, దానధర్మాల ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

28-05-2026