calender_icon.png 30 January, 2026 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_81457319.webp
కాంగ్రెస్ మోసాలు గల్లీ గల్లీకి తీసుకెళ్లండి

30-01-2026

మహబూబ్ నగర్, జనవరి 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ చెప్పిన 420 మోసాలను గల్లి గల్లికి తీసుకెళ్లి...బీఆర్‌ఎస్ చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం భారత రాష్ట్ర సమితి క్యాంపు కార్యయంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ ల వారీగా పార్టీ నాయకులు.. కార్యకర్తలతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వా రికీ..గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ వస్తుందని..టికెట్ రాలేదని ఎవరు నిరాశ చెందవద్దని కోరారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మంచి స్థానం కల్పిస్తామన్నారు.

article_68971831.webp
విద్యాశాఖ తీరే వేరు..!

30-01-2026

మహబూబ్నగర్, జనవరి 29 (విజయక్రాంతి) : అనుమతి ఉన్న లేకపోయినా మా ది ఇంటర్నేషనల్ స్కూల్ మీ బిడ్డలను చేర్పించండి అంటూ పెద్ద పెద్ద హోల్డింగ్ లలో ప్ర చారం చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆయోమయానికి గురి చేస్తూ కొన్ని ప్ర వేటు పాఠశాలల యాజమాన్యాలు వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యాశాఖ అనుమతి లేకపోయినప్పటికీ పట్టణ ప్ర ధాన కూడలలో కూడా భారీ ఎత్తున హో ల్డింగ్ లు ఏర్పాటు చేసి ఆకర్షణీయమైనటువంటి బోర్డులు ఏర్పాటు చేసుకుంటూ మా పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభమైనవి పరిమిత సీట్లే ఉన్నాయి అంటూ ఎవరికి వారు గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.

article_12371020.webp
సమగ్ర అభివృద్ధి లక్ష్యం

29-01-2026

దేవరకద్ర : సమగ్ర అభివృద్ధి బిజెపి లక్ష్యంగా అడుగులు వేస్తుందని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ డోఖ్పూర్ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. దేవకద్ర నియోజకవర్గం కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో అశోక్ సాగర్ బిజెపి మండల ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో చౌదర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నంది కురుమయ్య, తో పాటు పలువురు నాయకులు బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, దొడ్ల శ్రీను, చౌదర్పల్లి గ్రామ బిజెపి అధ్యక్షులు శంకర్, ఉపాధ్యక్షుడు మల్లేష్, శ్రీశైలం, వెంకటేష్, మహేష్, ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.MA

article_63890480.webp
కేంద్రం తీరు మార్చుకోవాలి

29-01-2026

మహబూబ్ నగర్ టౌన్, జనవరి 28 : పేదల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధిహామీ పథకంలో మార్పులు చేసిందని పార్లమెంట్ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణుగౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చు చేసేలా ఉపాధిహామీ చట్టాన్ని మార్చినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

article_82951263.webp
ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పనిసరిగా పాటించాలి

28-01-2026

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సెక్షన్ 144 అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని ఆమె అన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct)ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

article_38455032.webp
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

28-01-2026

పాలమూర్ యూనివర్సిటీ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పాలమూర్ యూనివర్సిటీ నుండి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మహబూబ్‌నగర్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో 2K వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. “రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అన్నారు. యువత రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండి, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతాం” అని పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులలో బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.