ప్రజలకు జవాబుదారీగా ఉండండి
చిన్నచింత కుంట : ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సీసీ కుంట పోలీస్ స్టేషన్ను(CC Kunta police station) జిల్లా ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరుపై సమీక్ష, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు స్థితి, గ్రేవ్ కేసుల విచారణ, నాన్-గ్రేవ్ కేసుల పరిష్కారం, వారెంట్ల అమలు, పెండింగ్ పిటిషన్లు, కోర్టు ట్రయల్లో ఉన్న కేసులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసును వేగవంతంగా, నాణ్యమైన దర్యాప్తుతో పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గ్రామాల వారీగా అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
17-07-2026