సిట్ నోటీసులు ఎన్ని కల స్టంట్
31-01-2026
మహబూబ్ నగర్, జనవరి 30 (విజయ క్రాంతి): ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కి సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఎం పీడీకే అరుణ క్యాంపు కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ప్రజలను మోసం చేసినందుకు ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారిందని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెర పైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ పాలిటిక్స్ తో అడుగులు వేస్తున్నాయని విమర్శించారు.