calender_icon.png 9 January, 2026 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_85266961.webp
ప్రజల మన్ననలు పొందుతున్న విజయక్రాంతి

09-01-2026

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలను బహిర్గతం చేస్తూ పరిష్కరించేందుకు దారి చూపిస్తున్న విజయ క్రాంతి దినపత్రిక తక్కువ సమయంలోనే అత్యధికంగా జనాదరణ పొందుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మూఢ కార్యాలయంలో విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరములు మరింతగా పాఠకులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి వారధిగా నిలబడుతూ ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ క్రాంతి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ జిల్లెల రఘు, అడ్డాకల్ రిపోర్టర్ శేఖర్, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

article_44504979.webp
చేపల కూర తినడానికి ప్రాజెక్టుల పేరెందుకు?

09-01-2026

జడ్చర్ల, జనవరి 8: ఏదో రాజకీయ రగడ సృష్టించాలి ప్రజలకు నాలుగు మాయమాటలు చెప్పాలి తప్పుదోవ పట్టించాలి అనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలని తపన బి ఆర్ ఎస్ నేతలకు లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం జడ్చర్లలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు దగ్గర బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రాజెక్టును పరిశీలించగా అక్కడికి వెళ్లి చేపల కూర తినడానికి వెళ్లారా? అంటూ విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకొని ఇప్పుడు ఏం చేయడానికి వెళ్లారంటూ ప్రశ్నించారు.

article_48317943.webp
నేడు నల్లబ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన

09-01-2026

మహబూబ్ నగర్ టౌన్, జనవరి 8: సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలని, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలని, ఎన్పిఎస్, సిపిఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) పిలుపు మేరకు శుక్రవారం రోజు అన్ని పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఎస్ యుటిఎఫ్ ఎస్ టి యు నాయకులు సమావేశం అయ్యారు.