అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
09-01-2026
రాజాపూర్ జనవరి 8: మండలం కుచ్చర్కల్ గ్రామానికి చెందిన జింకల అనంతమ్మ, తిర్మలాపూర్ కు చెందిన చింతకింది నర్సమ్మ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. మృతుల అంత్యక్రియల నిమిత్తం బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యురెడ్డి రూ. 5వేల ఆర్థిక సాయం ప్రకటించారు. గురువారం అభిమన్యు యువసేన సభ్యులు మృతుల కుటుంబ సభ్యులను పరమర్శించి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, బోయ శ్రీశైలం, కరుణాకర్ గౌడ్, నర్సింలు, వెంకటయ్య, కృష్ణయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.