calender_icon.png 22 January, 2026 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18236530.webp
శ్రీ కురుమూర్తి కొండకు పోటెత్తిన భక్తజనం

19-01-2026

చిన్న చింతకుంట, జనవరి 18: తిరుమల తిరుపతి వెంకన్నగా భక్తుల మొక్కులు అందుకుంటున్న శ్రీ కురుమతి స్వామి కొండకు భక్తులు పోటెత్తారు. ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కాలినడకన స్వామివారి కొండకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండ దిగువ నుంచి స్వామివారి సన్నిధి వరకు ఉన్న క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు, ఆలయ ఈవో, దేవస్థాన సిబ్బంది ఎంతో ఇబ్బంది పడ్డారు. భక్తుల గోవింద నామస్మరణతో కాంచన గుహ పులకరించింది. స్వామివారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.