calender_icon.png 29 January, 2026 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_63890480.webp
కేంద్రం తీరు మార్చుకోవాలి

29-01-2026

మహబూబ్ నగర్ టౌన్, జనవరి 28 : పేదల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధిహామీ పథకంలో మార్పులు చేసిందని పార్లమెంట్ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణుగౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చు చేసేలా ఉపాధిహామీ చట్టాన్ని మార్చినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

article_82951263.webp
ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పనిసరిగా పాటించాలి

28-01-2026

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సెక్షన్ 144 అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని ఆమె అన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct)ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

article_38455032.webp
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

28-01-2026

పాలమూర్ యూనివర్సిటీ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పాలమూర్ యూనివర్సిటీ నుండి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మహబూబ్‌నగర్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో 2K వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. “రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అన్నారు. యువత రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండి, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతాం” అని పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులలో బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

article_42836035.webp
జనరల్ స్థానాలంటే బీసీలవే..

28-01-2026

మహబూబ్ నగర్, జనవరి 27 (విజయక్రాంతి): కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి గెలవాలని, జనరల్ స్థానాలంటే బీసీలవే అని 50 నుంచి 60 శాతం ఉన్న బీసీల ఓట్లతోనే మన ఓట్లు మనకే వేసుకొని జనరల్ స్థానాలు కైవసం చేసుకోవాలని అని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. మంగళవారం బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పాలమూర్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనరల్ 14 డివిజన్లో బీసీలు పోటీలో ఉండాలని, అక్కడ బీసీలే నిర్ణయాత్మక శక్తులుగా ఉంటారు కాబట్టి గెలుపు సునాయసమన్నారు.

article_17303482.webp
రూ.600 కోట్లతో త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణం

27-01-2026

జడ్చర్ల, జనవరి 26: జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి జెడ్పిహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం వంటి పర్వదినాన ఈ పాఠశాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గానికి మంజూరైన ట్రీబుల్ ఐటీ కళాశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందని,దాదాపు మూడు విడతలుగా రూ.600 కోట్ల వ్యయంతో ఈ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.