19 February, 2026 | 12:39 PM
19-02-2026
భూత్పూర్, ఫిబ్రవరి 18: మండల కేంద్రంలోని 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పెద్దమందడి ఫిబ్రవరి 18: పెద్దమందడి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బత్తుల తరుణ్ (20సం‘) మరణించాడు. విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ జంగం పద్మశివ మృ తుని కుటుంబ సభ్యులకు రూ 2 వేల ఆర్థిక సహాయం అందించాడు.
18-02-2026
మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి):.క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (నమోదు, నియంత్రణ) చట్టం ప్రకారం, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నిర్వహణలో ఉన్న శ్రీరామ్ ఆసుపత్రికి షోకాష్ నోటీస్ జారీ చేశారు.
పెబ్బేరు పిబ్రవరి 17: పట్టణ కేంద్రంలోని మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను పట్టణ, మండల అధ్యక్షులు దిలీప్ రెడ్డి, వనం రాములు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
గోపాలపేట ఫిబ్రవరి17 : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బి ఆర్ ఎస్ నాయకులు పండ్ల పంపిణీ చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాలపేట, ఎదుల రేవల్లి మండలాల్లో ఉన్న బి.ఆర్.ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : ఎంసిహెచ్ఆర్డి లో శిక్షణ పొందుతున్న60 మంది గ్రూప్1 ట్రైనీ అధికారులు బృందం మంగళ, బుధవారాలలో క్షేత్ర స్థాయి పర్యటనాలో భాగంగా శిక్షణ నిమి త్తం మంగళ వారం మహబూబ్ నగర్ కు చేరుకున్నారు.
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : పాలమూరు తొలి కార్పొరేషన్ ఎ న్నిక రసవత్తమైన చర్చ జరిగినప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలోని ఎన్నిక ప్రక్రియ ముగిసింది.
గట్టు ఫిబ్రవరి 17: భారత్ మాల రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన రోడ్డు పనుల్లో గట్టు మండలం రాయపురం గ్రామస్తులు బ్రిడ్జ్ సౌకర్యం లేక గ్రామానికి చేరుకునేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీరంగపురం ఫిబ్రవరి 17:శ్రీరంగాపూర్ మండల కేంద్రం నుంచి పెబ్బేరు పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించాలని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు వనపర్తి డిపో మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు.
జడ్చర్ల, ఫిబ్రవరి 17: మండలంలోని మీనాంబర గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పర్షవేదిశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.
రాజాపూర్, ఫిబ్రవరి 17: గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్ర భుత్వం ప్రజా బాట కార్యక్రమం ద్వారా స మస్యలు పరిష్కరిస్తున్నామని ఏడీఈ నవీన్ కుమార్, ఏఈ వెంకటేష్ తెలిపారు.
17-02-2026
భూత్పూర్ : మహిళలకు సముచిత స్థానం ప్రజాపాలన ప్రభుత్వం కల్పిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని పాత మొల్గర గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజను చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ మహిళల పేరిటనే ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేయలని సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.