నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు
04-01-2026
మహబూబ్నగర్, జనవరి 3 (విజయక్రాం తి): పాలమూరు జిల్లాను కేవలం రాజకీయా ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని, నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కేసీఆర్కు, రేవంత్రెడ్డి ఇద్దరికీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ)లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏమీ లేదన్నారు. కేసీఆర్, రేవంత్రెడ్డి ఇద్దరూ పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారే అని విమర్శించారు.