calender_icon.png 14 January, 2026 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_78619392.webp
భూత్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

14-01-2026

భూత్పూర్: మండల పరిధిలోని గాజులపేట ( టర్న్ ) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందారు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సూర్యం తిరుపతి, తన భార్య నాగమణి తో పాటు ఇద్దరు కూతుర్లతో సంక్రాంతి పండుగకు బైక్ ( టి జి 08 ఏజే 1667 ) పై తన గ్రామానికి వెళ్తుండగా భూత్పూర్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి సేఫ్టీ గ్రిల్స్ కు గుద్దగా అక్కడికక్కడే నాగమణి (25) తల పగిలి మృతి చెందింది. యసన్ని (4 )కు త్రివ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్. తిరుపతయ్య, పెద్ద కూతురు ప్రియాంచి లకు గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

article_24779757.webp
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యెన్నం

14-01-2026

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఈ సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి భవిష్యత్తు తరాలు బాగుండాలని సంకల్పంతో ప్రతిక్షణం పాటుపడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నాని, ఎల్లప్పుడు వాస్తవాలను ముందు ఉంచి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రజలు అండగా ఉంటారని ఆశిస్తున్నానని తెలియజేశారు.

article_59553398.webp
అలీంకో సేవలు అద్భుతం

14-01-2026

మహబూబ్‌నగర్, జనవరి 13 (విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి అలీంకో సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు. మహబూబ్నగర్ నగరం, మెట్టుగడ్డ ప్రాంతంలో స్టేట్ హోం సమీపంలో అలీంకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార శిబిరానికి గౌరవ మహబూబ్నగర్ ఎంపి డికె అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే దివ్యాంగులకు అవసరమైన ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు. దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహాకారంతో అలీంకో సంస్థ నిర్వహిస్తున్న ఈ తరహా శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు అన్నారు.

article_58584068.webp
కేంద్రం ప్రభుత్వం వాటా లేనిది ఏ పథకం లేదు

14-01-2026

మహబూబ్ నగర్, జనవరి 13 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం వాటా లేనిది రాష్ట్రంలో ఏ పథకం అమలు కావడం లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జీ రామ్ జీ పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, వికసిత్ భారత్ లక్ష్యంతో దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారన్నారు. వికసిత్ భారత్ కావాలంటే.. వికాసిత్ గ్రామం కావాలని జీ రామ్ జీ పథకం తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన తో పాటు వంద రోజుల నుంచి 125 రోజులకు పని పెంచడం జరిగిందనన్నారు.

article_28681244.webp
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇద్దాం

14-01-2026

జడ్చర్ల, జనవరి 13: సమిష్టిగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పదో వార్డులో ప్రత్యేకంగా పారిశుద్ధ పనులను చేపట్టారు. 10 శాతం లాంటోంది సైతం బౌండరీస్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికివారు వారి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీ వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి కృష్ణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

article_67104117.webp
ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది

13-01-2026

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): ఇప్పటికైనా నిజమే గెలుస్తుందని ఆ పదేళ్ల కాలం పాటు మోసం చేశారు కనుక ఇంకా మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ పాలమూరుకు వచ్చి కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి, రాసిచ్చినవి ఎలా పడితే అలా అర్థం పడటం లేని మాటలు మాట్లాడాలని విమర్శించారు. 2001 నుంచి 2014 వరకు ఉదయం నుంచి రాత్రి వరకు పాలమూరు పదం లేకుండా కెసిఆర్ సభ ముగించలేదని ఎప్పుడు మాట్లాడుతూనే పాలమూరు జిల్లాకు తీవ్ర మోసం చేశారని విమర్శించారు. 2009 లో బీఆర్ఎస్ పార్టీ కి 10 శాతం ఓట్లు కూడా లేవని అప్పుడు ఎంపీగా గెలిపించిన ఘనత జిల్లా ప్రజలకు దక్కుతుందన్నారు. వందలసార్లు కాలు అడ్డంపెట్టి నీళ్లు పారిస్తానని చెప్పారని ఇప్పటివరకు మరి కాలు అడ్డం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

article_69893479.webp
టీజీవో క్యాలెండర్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

13-01-2026

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టిజిఓ అసోసియేషన్ న్యూ ఇయర్ 2026,డైరీ, వాల్ క్యాలెండర్, అట్టహాసంగా ఆవిష్కరించారు. ప్రభుత్వం ను నడుపుతున్నది ఉద్యోగులేనని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు తక్కువ గా ఉంటారని ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నడుపుతున్నది ఉద్యోగులేనని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బి.శ్యామ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సందన విజయ్ కుమార్ ముదిరాజ్, కార్యదర్శి కె.వరప్రసాద్, వివిధ జిల్లాల అధ్యక్షలు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. డి ఎ ఇవ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సందన విజయ్ కుమార్ ముదిరాజ్, కార్యదర్శి కె.వరప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరో ఐదు డిఏలతో పాటు పిఆర్సి ని కూడా ప్రభుత్వం అందించాలని విన్నవించారు.

article_26199554.webp
దాహార్తికి చెక్

13-01-2026

గోపాలపేట, జనవరి 12: ఆ గ్రామంలో తాగునీటి సమస్య తాండవిస్తుంది ప్రజలు దాహర్తికై వ్యవసాయ బోరుబావులను ఆశ్రయిస్తున్నారు. ఓ దాత సహకారంతో ప్రజల దాహార్తిని రూపుమాపారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటింటి నల్ల ఏర్పాటు చేశారే కానీ సమయం మాత్రం కొద్దిపాటు ఉండడంతో ప్రజలకు సరైన నీరు అందడం లేదు. ప్రజలు కావలసిన నీరు కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తుండడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ ఆలోచనలో పడ్డాడు. ఎలాగైతే నేమి ప్రజలకు తాగునీరు అందించాలన్న సంకల్పం ఎక్కువగా ఉంది.

article_16868827.webp
కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే మున్సిపాలిటీని త్యాగం చేస్తాం..

13-01-2026

కల్వకుర్తి టౌన్, జనవరి 12 : కల్వకుర్తిని నూతన జిల్లాగా ప్రకటిస్తే అందుకు ప్రతిఫలంగా వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని సీఎం రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని బిజెపి నేత బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. పూర్వపు కల్వకుర్తి సమితి, ఆమనగల్లు సమితి, వెల్దండ, మాడుగుల, కడ్తాల్, తలకొండపల్లి, కేశంపేట, మిడ్జిల్, ఊరుకొండపేట, వంగూరు, చారకొండ, డిండి, కొత్తగా ఇర్విన్, గట్టిప్పల్లపల్లి, రఘుపతిపేట, వెల్జాల, ముద్విన్, మండలాలను ఏర్పాటు చేసి, అచ్చంపేట నియోజక వర్గాన్ని కలుపుతూ కల్వకుర్తి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

article_89552436.webp
ప్రతి ఇంటికి ప్రతిరోజు సంక్షేమ పథకం అందిస్తున్నాం

13-01-2026

మహబూబ్ నగర్, జనవరి 12 (విజయక్రాంతి): ప్రతి నిరుపేద ఇంటికి ప్రతిరోజు సంక్షేమ పథకం అందిస్తున్న ఏకైక ప్రజాపాలన ప్రభుత్వమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రతీకగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ నగరంలోని విద్యుత్తు సౌధ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు ప్రశంసాపత్రం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్దిదారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ పథకాన్ని సార్థకం చేసినందుకు ప్రతి ఒక్క లబ్దిదారుకు కృతజ్ఞతలు తెలిపారు.