calender_icon.png 18 February, 2026 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_89627265.webp
ప్రజాపాలన లో మహిళలకు సముచిత స్థానం

17-02-2026

భూత్పూర్ : మహిళలకు సముచిత స్థానం ప్రజాపాలన ప్రభుత్వం కల్పిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని పాత మొల్గర గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజను చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ మహిళల పేరిటనే ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేయలని సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.

article_68086677.webp
అంబులెన్స్ లోనే ఆయుష్షు పోసుకున్న బిడ్డ

17-02-2026

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అంబులెన్స్ లోనే ఓ బిడ్డ ఆయుషు పోసుకున్నది. వివరాల్లోకి ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ సమీపంలోని గడ్డమీది తండా కు చెందిన ప్రియాంక అనే గర్భిణీ మహిళా కు పురిటి నొప్పులు రావడంతో 108 కుటుంబ సభ్యులు కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ తాండకు చేరిన 108 సిబ్బంది గర్భిణీ మహిళలు అంబులెన్స్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకు వస్తున్న క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో వాహనాన్ని పక్కనే ఆపారు. అంబులెన్స్ లోనే ప్రసవం అయ్యేందుకు అంబులెన్స్ సిబ్బంది ప్రత్యేక వైద్య చికిత్సలు అందించారు. ప్రియాంకకు ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలియజేశారు. తల్లి ఇరువురిని జనరల్ హాస్పిటల్ కు వైద్య చికిత్స నిమిత్తం చేర్పించారు. డెలివరీ చేసిన వారిలో కుటుంబ సభ్యులతో పాటు పైలట్ మహమూద్,టెక్నీషియన్ లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు.