22 May, 2026 | 7:12 PM

Districts - Mahabubnagar

article_50912383.webp
ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ హన్వాడ మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకొన్న వారికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సహాయం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అర్హులైన లబ్ధిదారులు తమ వైద్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు (బిల్లులు, మెడికల్ రిపోర్టులు) మా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సమర్పించిన పత్రాలను పరిశీలించి, ప్రాసెస్ చేసి, ప్రభుత్వానికి (సెక్రటేరియట్) పంపించి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేలమంది లబ్ధి పొందగా, మరింత మంది ప్రజలకు ఉపయోగపడేలా విస్తరిస్తున్నామని చెప్పారు.

21-05-2026

article_31627792.webp
రాజకీయం అంటే పెత్తనం కాదు.. బాధ్యత

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : రాజకీయం అంటే పెత్తనం కాదు బాధ్యత అని ఆ బాధ్యత ను సమర్ధవంతంగా తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవా చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీవర్ధంతి సందర్భంగా అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద వారి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం మొత్తం కన్నీరు పెట్టించిన ఆ దురదినం మన దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు అన్నారు. రాజీవ్ గాంధీ యువ ప్రధానిగా దేశానికి కొత్త దిశ చూపించారని, ఆయన కళ్ళలో ప్రేమ, మాటల్లో మృదుత్వం, వ్యక్తిత్వంలో హుందాతనం స్పష్టంగా కనిపించేవన్నారు.

21-05-2026

article_61052756.webp
సూపర్ కిడ్ విజేతగా జాన్ వెస్లీ

మహబూబ్ నగర్ అర్బన్ : రెమా వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో 2026 యేడాదికి గాను నిర్వహించిన కిడ్స్ ఫెస్టివల్ వేడుకల్లో విజేతగా జాన్ వెస్లీ నిలిచాడు. మూడు రోజులు పాటు నిర్వహించిన ఈ ఫెస్టివల్ వేడుకలు చివరి రోజైనా బుదవారం ప్రతిభ కనబరిచిన చిన్నారుల్లో విజేతగా జాన్ వెస్లీ నీ పాస్టర్ పరంజ్యోతి, జోయల్ బాబులు ప్రకటించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి ప్రసంగిస్తూ, చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే తాము ప్రతి ఏటా కిడ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించి విజేతను ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ మూడు రోజులపాటు జరిగిన వేడుకల్లో చిన్నారులకు బైబిల్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారికి అర్థమైన రీతిలో స్కిట్స్ కొరియోగ్రఫీ, క్విజ్ వంటి పద్ధతిలో వివరించామన్నారు.

21-05-2026