నీట్ ఫలితాలలో రిషి ప్రభంజనం
15-06-2025
నేటి ఫలితాలలో రుచి కళాశాల ప్రభంజనం సృష్టించింది. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి వందకు పైగా మెడికల్ సీట్లు పొందుతున్నారని కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్(College Chairperson Chandrakala Venkat), చీఫ్ అకాడమీక్ అడ్వైజర్ వెంకటయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తరుణ్ సాయి 550, స్వర్ణకుమారి 545, వినయ్ 525 మెడికల్ సీట్లు సాధిస్తున్న విద్యార్థులను కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమీక్ అడ్వైజర్ వెంకటయ్య అభినందించారు. విద్యార్థులను విజయతీరాలకు చేర్చడంలో రిషి కళాశాల ప్రత్యేకంగా కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు.