calender_icon.png 5 February, 2026 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_73384676.webp
మహిళా సంఘాల భవనాలకు రూ.8.40 కోట్లు

05-02-2026

జడ్చర్ల : నియోజకవర్గంలో మహిళా సంఘాలకు చెందిన 84 గ్రామైక్య సంఘాల (వీఓలు)కు రూ.8.40 కోట్ల వ్యయంతో సొంత భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy) వెల్లడించారు. ఆరు మండలాల్లో ఈ భవనాల నిర్మాణం మంజూరైయిందని గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక్కొక్కటి రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించే వీఓ భవనాల్లో ఊర్కొండ మండలానికి 16, మిడ్జిల్ మండలానికి 5, రాజాపూర్ మండలానికి 8, బాలానగర్ మండలానికి 17, జడ్చర్ల మండలానికి 14, నవాబుపేట మండలానికి 24 చొప్పున మంజూరు అయ్యాయని చెప్పారు.

article_24111309.webp
ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం

05-02-2026

రాజాపూర్ : గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటిదని తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి సంతోష అన్నారు. మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎంతో బాసటగా నిలుస్తున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బ్యాగరి యాదమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ కార్యక్రమం లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృష్ణ, చంద్రయ్య పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, నరసింహులు, కే సత్యనారాయణ గౌడ్, బంగారి వెంకటేష్, గుర్రంగాడి యాదగిరి. గ్రామ వార్డు సభ్యులు మహమ్మద్ రహమత్ పాషా, దాచని శ్రీనివాస్ రెడ్డి, గుర్రంకాడి చెన్నయ్య,వడ్డే గోపాల్, శ్రీశైలం, ఆంజనేయులు, నరసింహులు, యాదయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

article_54816834.webp
నిబంధనలకు మించి ఖర్చు పెట్టకూడదు

05-02-2026

భూత్పూర్ : మున్సిపాలిటీలకు జరుగనున్న కౌన్సిలర్లుగా గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిమితికి మించి అత్యధికంగా ఖర్చులు చేయకూడదని ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ బాబు అన్నారు. ఎన్నికల్లో ప్రచార నిమిత్తం చేసే ఖర్చు ల వివరాలు ఏ విధంగా నమోదు చేయాలో పోటీలో ఉన్న అభ్యర్థులకు భూత్పూర్ మున్సిపాలిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సు కు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు చేశారు. ఈ నెల తేదీ 5,7,9 వ తేదీ లలో వ్యయo చేయు సమయంలో వ్యయాలకు సంబంధించిన వోచర్లు, బిల్లులు తీసుకోవాలన్నారు.

article_19634410.webp
పాలమూరు కార్పొరేషన్ డిమాండే వేరు

04-02-2026

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ తొలి కార్పోరేటర్ అయ్యేందుకు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సైతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పాలమూరు కార్పొరేషన్ లో 60 మంది కార్పొరేటర్ లను ఎన్నుకోవలసి ఉండగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండడం ఇంత ప్రజలతో ఉందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం నెలకొంది. అప్ 2, బీజేపీ 52, బిఎస్పి 7, సిపిఎం 1,కాంగ్రెస్ 60,ఎంఐఎం 16, బీఆర్ఎస్ 58,ఎఐఎఫ్ బీ 3, ఐయుఎంఎల్ 2,జేయస్పి 18, ఇతర పార్టీ 1, స్వతంత్ర అభ్యర్థులు 127, మొత్తం 347 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బిజెపి పార్టీ 60 డివిజన్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ 52 డివిజన్లను మాత్రమే బరిలో తమ అభ్యర్థులను నిలిపింది. బీఆర్ఎస్ పార్టీ సైతం 58 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో ఉంచింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో 60 డివిజన్లో 60 మంది అభ్యర్థులను పోటీలో ఉంచడం ఉంచింది. పార్టీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం సాయంత్రం గుర్తులను కేటాయించి బరిలో నిలుచున్న అభ్యర్థులకు అందజేశారు.