30 March, 2026 | 3:11 AM

Districts

article_67408742.webp
టీసీసీ జిల్లా అధ్యక్షులుగా కుంబర్తి రవీందర్

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 29 : సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రభుత్వ వైద్య,ఆరోగ్య కుటుంబ శాఖలో కమిటీ హెల్త్ ఆఫీసర్ గా సేవలందించి కుంబర్తి రవీందర్ కు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ టిసిసి జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ లోని తన నివాసంలో నియామాక పత్రం తో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో రవీందర్ జన్మించి, పెరిగి, విద్యాభ్యాసం చేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చేరి సేవలందించారు.

30-03-2026

article_61842182.webp
రాజాపూర్ తైబజార్ వేలం

రాజాపూర్ : మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారంతపు సంత (తైబజార్ )వేలంపాటను శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీవో వెంకట్ రాములు,సర్పంచ్ కావలి రామకృష్ణ, అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో రూ 2.36లక్షల కు మండల కేంద్రానికి చెందిన రాకేష్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సంత రోజు తిర్మలాపూర్ దిక్కు వెల్లు రోడ్డు ట్రాఫిక్ సమస్య చాలా ఏర్పడుతుంది. మండల కేంద్రం లో జాతీయ రహదారి పై బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నా క్రమంలో సంత కు ఎటువంటి సమస్యలు తలేత్తకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

28-03-2026