అమిస్తాపూర్ లో లోకాయుక్త విచారణ..
03-07-2025
అన్యాయాన్ని ఆపాలంటూ ఇటీవల కాలంలో లోకాయుక్తకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) పరిధిలోని అమిస్తాపూర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 372, 375, 458, 457 లోని భూములలో జాగృతి ఎంక్లేవ్ వెంచర్ అక్రమంగా చేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సర్వే నెంబర్ లపై భూములను, పంచాయతి రాజ్ రోడ్లను, దేవదాయ శాఖ, భూదాన్, అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేశారని గత రెండు సంవత్సరాల క్రితం అమిస్తాపూర్ కు చెందిన కేద్యాల నరేందర్, శ్రీశైలం, ఎన్ చంద్రశేఖర్, సునీల్ కుమార్ లు రాష్ట్ర లోకాయుక్త కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోకాయుక్త డీఎస్పీ అధికారి విద్యాసాగర్ గురువారం భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ గ్రామానికి చేరుకొని విచారణ చేశారు.