calender_icon.png 25 May, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_36844485.webp
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం

24-05-2025

జడ్చర్ల నుండి కోదాడ వరకు 220 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన 167 జాతీయ రహదారి జడ్చర్లతో పాటు అనేక పట్టణాల మీదుగా వెళ్లిందని జడ్చర్ల బీఆర్ఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) జడ్చర్ల నుంచి కోదాడ వరకు నిర్మించిన రోడ్డు విషయంలో పరిహారంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు కొన్ని విషయాలను తెలియజేశారు. కల్వకుర్తి, దేవరకొండ, హాలియా పట్టణాల మీదుగా వెళ్లిన నేషనల్ హైవేలో అనేక మంది ఇండ్లు, భూములు కోల్పోయారని, జాతీయ రహదారి నిబంధనల ప్రకారం జడ్చర్ల పట్టణంతో పాటు మిగతాచోట్ల కూడా ఎక్కడా బాధితులకు పరిహారం ఇవ్వలేదన్నారు.

article_76237645.webp
జానపద కళలను ప్రోత్సహించడం అందరి బాధ్యత

24-05-2025

మారుగుణపడిపోతున్న మన తెలంగాణ జనపదకళాలను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని బీఅర్ఎస్ పార్టీ నాయకుడు అభిమన్యు రెడ్డి(BRS party leader Abhimanyu Reddy) అన్నారు. శుక్రవారం మండలంలోని చోక్కంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ అది చింతల మునిరంగ స్వామి వీది నాటకమును ప్రారంభించారు. మునిరంగా స్వామి నాటకానికి చేయూత అందించిన అభిమన్యు రెడ్డిని భజన మండలి భక్తులు శాలువలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... శ్రీశ్రీశ్రీ చింతల మునిరంగా స్వామి వారి వీధి నాటకం వేయడం నిజంగా అభినందనీయమని సినిమా ప్రపంచంతో అంతరించిపోతున్న పురాతన కళలకు జీవం పోయడం అభినందనీయమని అన్నారు.

article_12232285.webp
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

24-05-2025

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుందని మండల విద్యా అధికారి సుధాకర్(Mandal Education Officer Sudhakar) అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు అధునాతన బోధనా పద్ధతులలో విద్యార్థులకు బోధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల హంగులతో వసతులతో పాఠశాలలను బలోపేతం చేస్తుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఉపాధ్యాయులకు బోధనలో కొత్త పద్ధతులను ప్రమాణాలను పెంచడానికి రాజాపూర్ మండలంలోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు తెలంగాణ సమగ్ర శిక్ష, తెలంగాణ విద్యా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని డిజిటల్ తరగతుల రూపంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

article_29860658.webp
విద్యా బోధనలో మంచి, చెడులు చెప్పండి

24-05-2025

విద్యా బోధన చేయు సమయంలో విద్యార్థిని విద్యార్థులకు మంచి చెడు కూడా సవిధానంగా అర్థమయ్యేలా వివరించాలని ఏఎమ్ఓ దుంకుడు శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ లోని గత రోజులుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దేవరకద్ర మండల స్థాయి ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఏయంఓ దుంకుడు శ్రీనివాస్ సందర్శించి ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల కోసం తయారు చేయబడిన చట్టాల గురించి కూడా వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని సూచించారు.

article_14163484.webp
దైవ అనుగ్రహం అందరిపై ఉండాలి

24-05-2025

మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో బొడ్రాయి పండుగ, నాగ నాభిశిల, గ్రామ దేవతల పునః ప్రతిష్టపనను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బొడ్రాయి ప్రతిష్ఠాపనలో వివిధ ప్రాంతాల నుంచి ఆడపడుచులు వచ్చి సంబరంగా వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు పండేలా చూడాలని గ్రామ దేవతలను మొక్కుకున్నట్టు చెప్పారు.

article_38137790.webp
ఒక్క క్లిక్ తో సభ్యుల వివరాలు మీ ముందు

24-05-2025

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : కంప్యూటర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆర్పిలు సభ్యుల వివరాలు ఒక క్లిక్ చేస్తే పూర్తి సమాచారం మీ కళ్ళముందు క్షణాలలో ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మెప్మా భవనం ( నగరపాలక సంస్థ కార్యాలయం) లో ఆర్పీలకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో కంప్యూటర్ ద్వారా వచ్చేందుకు ఈ కంప్యూటర్ శిక్షణ ఆర్పి లకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

article_49252792.webp
మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

24-05-2025

భూత్పూర్ : మహిళలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని విఎన్ వి విజనరీ అసోసియేషన్(VNV Visionary Association) డైరెక్టర్ దర్శన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వెల్కిచర్ల గ్రామంలో మహిళలకు అగర్బత్తిలా ఉచిత తయారీ శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహిణి మహిళలకు ఉపాధి కల్పించడం కోసం వర్క్ ఫ్రం హోం(Work from home) ద్వారా అగర్బత్తిలా తయారీ శిక్షణ ఇచ్చి తమ ఇంటి వద్దకే పనిని కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. మూడు నెలల తర్వాత మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా వస్తాయన్నారు. ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా అగర్బత్తిలా తయారు చేయడం నేర్పిస్తున్నామని అన్నారు. గృహిణి మహిళలు ఇంట్లోనే ఉండి సులువుగా పనిని చేసుకునే విధంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ రాణి, కవితా సహిబా, టీం లీడర్ సాజిదా బేగం, తదితర మహిళలు ఉన్నారు.