calender_icon.png 16 June, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

Districts

article_34894914.webp
నీట్ ఫలితాలలో రిషి ప్రభంజనం

15-06-2025

నేటి ఫలితాలలో రుచి కళాశాల ప్రభంజనం సృష్టించింది. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి వందకు పైగా మెడికల్ సీట్లు పొందుతున్నారని కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్(College Chairperson Chandrakala Venkat), చీఫ్ అకాడమీక్ అడ్వైజర్ వెంకటయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తరుణ్ సాయి 550, స్వర్ణకుమారి 545, వినయ్ 525 మెడికల్ సీట్లు సాధిస్తున్న విద్యార్థులను కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమీక్ అడ్వైజర్ వెంకటయ్య అభినందించారు. విద్యార్థులను విజయతీరాలకు చేర్చడంలో రిషి కళాశాల ప్రత్యేకంగా కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు.

article_35977900.webp
వినియోగదారుల నమ్మకం పోగొట్టకూడదు

14-06-2025

వ్యాపారం ఏదైనా వినియోగదారుల నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా చూడవలసిన బాధ్యత వ్యాపార యజమానులపై ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం హన్వాడ మండలంలోని ముని మోక్షం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రోహిత్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేశవులు ఏర్పాటు చేసిన చాయ్ విల్లాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి రోహిత్ రెడ్డి, కేశవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి లాభాలను పొందాలని, వ్యాపారాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.