విద్యార్థులు క్రీడలో రాణించాలి
12-01-2026
హన్వాడ : విద్యార్థులు రాష్ట్ర స్థైలో రాణించాలి అని బీజెవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించినటువంటి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. మొదటి విజేతగా దొరి తండా గ్రామానికి చెందిన దినేష్, రెండో విజేతగా సల్లోనిపల్లి గ్రామానికి చెందిన నరేష్ విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కోశాధికారి డాక్టర్ వెంకటయ్య గారు, మాజీ జెడ్పిటిసి రమణారెడ్డి గారు, హన్వాడ మండల్ బిజెపి అధ్యక్షుడు కొండ లింగన్న,జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రఘురాం గౌడ్, కొనగట్టుపల్లి సర్పంచ్ గడ్డం కుర్మయ్య, హన్వాడ మండల్ బీజెవైఎం అధ్యక్షులు ఎర్ర చంద్రశేఖర్ జనరల్ సెక్రెటరీ అరవింద చారి,తిరుమలయ్య ఉపాధ్యక్షులు గర్కశివప్రసాద్ గౌడ్, సతీష్ , కార్యదర్శి పాండు కుమార్, బండారి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు