calender_icon.png 22 December, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_53679742.webp
పాలకవర్గం చేతికి పంచాయతీలు

22-12-2025

మహబూబ్ నగర్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రెండేళ్ల సుదీర్ఘ కాలానికి ముగింపు పలుకుతూ స్పెషల్ ఆఫీసర్ల పాలనకు చరమగీతం పాడుతూ పంచాయతీలలో పాలకవర్గం నేడు కొలువుతీరునున్నది. జనవరి 31 2024 సంవత్సరంలో సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ దాదాపు రెండేళ్ల కాలం పాటు తెలంగాణ ప్రభుత్వము సర్పంచ్ల ఎన్నిక అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసిన విషయం విధితమే. ఈ తరుణంలో ఎట్టకేలకు జరిగిన మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 423 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్క గ్రామ పంచాయతీకి మినహా 42 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగడంతో పాటు సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది.

article_30799172.webp
దేశంలో పేదల హక్కులను కాపాడటమే..

22-12-2025

మహబూబ్ నగర్, డిసెంబర్ 21(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడటం అంటే దేశంలో పేదల హక్కులను కాపాడటమే అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షత భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశంలోని పేద, గ్రామీణ, శ్రమజీవి ప్రజలకు ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో తీసుకువచ్చిన అత్యంత ప్రజాప్రయోజనకరమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని స్పష్టం చేశారు.

article_57057176.webp
భూత్‌పూర్‌లో నెలవారీ ఫాతిహా, జిక్ర్ మహఫిల్

20-12-2025

భూత్‌పూర్ : హజ్రత్ సయ్యద్ కాజిమ్ పాషా ఖాదిరీ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహి జ్ఞాపకార్థంగా నెలవారీ ఫాతిహా, జిక్ర్ మహఫిల్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజ్రత్ సయ్యద్ ఆలే ముస్తఫా ఖాద్రి పాల్గొని ధార్మిక సందేశం ఇచ్చారు. అల్లాహ్ జిక్ర్ మన హృదయాలకు శాంతి, సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అల్లాహ్ తాలా మానవాళి హిదాయత్ కోసం నబీల పరంపరను ప్రారంభించారని, మొత్తం 1 లక్ష 24 వేల మంది ప్రవక్తలను పంపారని వివరించారు. ప్రవక్తలు మనుష్యులను అల్లాహ్‌కు దగ్గర చేయడం, వారి లోక, పరలోక జీవితాలను సుసంపన్నం చేయడమే లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. అలాగే పీరానీ పీర్ ఘౌస్-ఉల్-ఆజమ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్), ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ అజ్మీరీ (రహ్) వంటి మహనీయులు తమ జీవితాలను మానవాళి సేవకే అంకితం చేశారని అన్నారు. ప్రతి ముస్లిం ఐదు సమయాల నమాజ్‌లను క్రమంగాపాటించాలని సూచించారు.

article_13721992.webp
నిజమైన మానవతా సేవకు ప్రతిరూపం

20-12-2025

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో ఉన్న లిటిల్ స్కాలర్స్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.... మాట్లాడుతూ శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఇటువంటి కార్యక్రమాలు నిజమైన మానవతా సేవకు ప్రతిరూపమన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ స్వదేశం పట్ల మమకారం, సేవాభావంతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. దివ్యాంగులకు స్వయంగా తమ దైనందిన అవసరాలు తీర్చుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేందుకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి సహాయక పరికరాలు వారి కదలికలకే కాకుండా, వారి మనోధైర్యాన్ని పెంచి సమాజంలో సమాన అవకాశాలతో ముందుకు సాగేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

article_50740672.webp
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

20-12-2025

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లి నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, చంద్రకుమార్ గౌడ్, వినోద్ కుమార్, ప్రవీణ్ టెన్నీ, అజ్మాత్, రాములు యాదవ్ఇతర పెద్దలు పాల్గొన్నారు.