calender_icon.png 18 December, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_84806509.webp
నస్రుల్లాబాద్ లో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ అభ్యర్థి

17-12-2025

జడ్చర్ల: మూడవ విడతలో జరిగిన పంచాయితీ ఎన్నికలలో జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసిన నిర్మల బాలస్వామి ఆ గ్రామంలో గత నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఒకే కుటుంబ పాలనను అంతం చేసి ఒక కొత్త చరిత్రను సృష్టించారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ గ్రామం జడ్చర్ల పట్టణానికి చేరువలోనే ఉంటుందని, సుమారు రెండున్నర వేలు జనాభా కలిగిన ఈ గ్రామంలో దాదాపు 50 ఏళ్ల కాలంగా ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచులుగా కొనసాగుతున్నారని తెలిపారు.