కుమ్మరి కులవృత్తిని ప్రతిబింబించేలా కొలువుదీరిన గణనాథుడు
17-09-2026 | 08:47am
బాన్సువాడ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కుమ్మరి గల్లీలో టీం భగీర ఆధ్వర్యంలో శ్రీ చక్రధారి గణేష్ మండలి సభ్యులు వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కుమ్మరి కులవృత్తిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. కుమ్మరి చక్రం మధ్యలో గణనాథుడు కొలువుదీరినట్లు మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆలోచనతో మండపాన్ని రూపొందించడంతో భక్తులు ప్రత్యేకంగా సందర్శించి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. కుమ్మరి వృత్తి గొప్పతనాన్ని చాటిచెప్పేలా మండపాన్ని ఏర్పాటు చేసిన సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు.