29-07-2024 11:49:18 AM
హైదరాబాద్: శాసనసబలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. మద్యాహ్నం 3 తర్వాత డిమాండ్లపై మంత్రులు సమాధానాలు చెప్పనున్నారు. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ పద్దులను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరుఫున మంత్రులు పద్దులు ప్రవేశపెట్టారు. పద్దులపై చర్చను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.