రేపు ఇంటర్ ఫలితాలు

23-04-2024 02:23:45 AM

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఈ నెల 24న ఇంటర్మీడి యట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు వెబ్‌సైట్‌లో విద్యార్థుల ఫలితాలు అందుబాటు లో ఉంటాయని తెలిపింది. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్య దర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలను ఏపీ విడుదల చేయగా.. తెలంగాణ విషయంలో మాత్రం కొద్ది రోజులుగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.