భూకంపాలపై ప్రధాని ఆరా.. సాయం చేసేందుకు భారత్ సిద్ధమని హామీ
న్యూఢిల్లీ: మయన్మార్ను(Myanmar Earthquake) తాకిన 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం బ్యాంకాక్లో తీవ్ర నష్టాన్ని కలిగించిన పరిణామాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్, థాయ్ లాండ్ లో భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. అవసరమైతే సహాయ కార్యక్రమాలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. సహాయ చర్యలపై సంప్రదించాలని విదేశాంగశాఖను ప్రధాని మోదీ ఆదేశించారు.
శుక్రవారం ఆగ్నేయాసియాను రెండు భారీ భూకంపాలు కుదిపివేసాయి. దీనివల్ల థాయ్ లాండ్(Thailand earthquake) రాజధాని బ్యాంకాక్లో భవనాలు కుప్పకూలిపోయాయి. నగరం అంతటా, అలాగే పొరుగున ఉన్న మయన్మార్లో కూడా ప్రజలు ఇళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం భూకంపం 10 కిలోమీటర్లు (6.2 మైళ్ళు) లోతులేని ప్రదేశంలో ఉందని, మయన్మార్లో కేంద్రంగా ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే, జర్మనీ జిఎఫ్జెడ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపాయి. 6.4 తీవ్రతతో రెండవ భూకంపం 12 నిమిషాల తర్వాత ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. భూకంపం తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ భవనం కూలిపోతున్నట్లు చూపించింది. నివేదికల ప్రకారం, 43 మంది కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకున్నట్లు తెలుస్తోంది.




