అన్నా.. చనిపోతున్నా!
10-09-2026 | 01:06pm
కొడిమ్యాల,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) మల్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో దూకి మహిళతో పాటు ఆమె కుమారుడు మృతి చెందారు. మల్యాలకు చెందిన గుండేటి కవిత(36) భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గుడిపేట శివారులోని బావి వద్ద చెప్పులు,సెల్ఫోన్ గుర్తించారు. తాను చనిపోతున్నానని అన్న కొమురయ్యకు ఫోన్లో తెలిపినట్లు సమాచారం. ఘటనపై ఎస్ఐ సందీప్ దర్యాప్తు చేస్తున్నారు.