12 May, 2026 | 12:08 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం

12-05-2026 10:42 AM

నలుగురు ఉన్నట్లు సమాచారం.. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని చంద్రు తండ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి రెండు లారీలు పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. స్థానికుల సమాచారం మేరకు లారీలలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే వారి పరిస్థితిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్‌తో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఎస్సై కూచిపూడి జగదీష్ దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.