17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తాగునీటిపై ఫిర్యాదులొస్తే పంచాయతీ కార్యదర్శులపై వేటు తప్పదు..!

31-03-2025 03:46 PM

స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి,  తాడూర్,  బిజినపల్లి,  తిమ్మాజిపేట, నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలో తాగునీటి సమస్య పట్ల ఫిర్యాదులు వస్తే వెంటనే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు లేదా బదిలీబేటు తప్పదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మీడియా ద్వారా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న వేళ మిషన్ భగీరథ, ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని బోరు మోటర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఓవర్ హెడ్ ట్యాంక్ లను శుభ్రపరచాలని సూచించారు.

రాత్రిళ్ళు విషసర్పాలు సంచరించే అవకాశం ఉంటుందని విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలను సరిచేయాలన్నారు. మురుగు కాలువలు చెత్త చెదారం ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. రాజకీయ నాయకులను కాకా పట్టడం మాని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లేదంటే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతకుముందు రంజాన్ పర్వదినం సందర్భంగా శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.