చెంచు గిరిజనుల అభివృద్ధికి శాఖల సమన్వయం అవసరం
అచ్చంపేట, జూన్ 12 (విజయక్రాంతి): చెంచు గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మన్ననూ రు ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెంచు కుటుంబాలకు విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, పోషకాహారం, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
13-06-2026