2 April, 2026 | 11:41 PM

Districts - Nagarkurnool

article_70643974.webp
ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం

అచ్చంపేట ఏప్రిల్ 02: 'ఇందిరమ్మ ఇల్లు పేరుతో 5 లక్షలు ఇచ్చానని చెబుతున్నారు ఎవరికిచ్చారు ఎప్పుడు ఇచ్చారు. దాని నిరూపించాలి. చాలా మందికి తొలగించారు. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న చెబుతున్నారు. అవి ఎక్కడ అమలు చేశారు చూపించాలని' 15వ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అచ్చంపేటలోని 20 వార్డులలోనీ వివిధ ప్రాంతాలలో ప్రజాపాలన ప్రగతివేదిక వార్డు సభలను ఆయా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన నిర్వహించారు. అందులో భాగంగా అచ్చంపేటలోని 15వ వార్డు పరిధిలోని మైనార్టీ బిల్డింగ్లో నిర్వహించిన సభలో ప్రజలు పాల్గొన్నారు.

02-04-2026