గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ఊర్కొండ: మండల పరిధిలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy), జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ తాగునీటి సదుపాయాలు, అంతర్గత రహదారులు, పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
14-05-2026