30 June, 2026 | 11:15 AM

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

04-01-2025 04:42 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun) శనివారం నాడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నిన్న అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసందే. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి మేజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి ష్యూరిటీలను అల్లు అర్జున్ సమర్పించారు. పూచీకత్తు పత్రాలు సమర్పించి అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెగ్యులర్‌ బెయిల్‌(Regular bail)కు సంబంధించి పర్సనల్‌ బాండ్స్‌, రెండు ష్యూరిటీలను అల్లు అర్జున్ సమర్పించారుఅల్లు అర్జున్‌ పర్సనల్‌ మేనేజర్ మరో షూరిటీ ఇచ్చారు.