30 June, 2026 | 11:58 AM

కాసేపట్లో నాంపల్లి కోర్ట్‌కు అల్లు అర్జున్

04-01-2025 01:19 PM

హైదరాబాద్:  సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి రెగ్యులర్‌ బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్న సినీ నటుడు అల్లు అర్జున్(Film Actor Allu Arjun) కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కోర్టులో స్వయంగా మెజిస్ట్రేట్‌ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి సమర్పించనున్నారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో పుష్ప 2(Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సందర్భంగా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఫలితంగా రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.