17 April, 2026 | 2:04 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

సన్న బియ్యమే ఇస్తున్నారా..!

11-04-2025 12:00 AM

రేషన్ షాప్ తనిఖీ చేసిన కలెక్టర్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రేషన్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యమే ఇస్తున్నారా అంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం మహబూబాబాద్ నెల్లికుదురు మండలాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు.

రేషన్ షాపుల్లోని బియ్యం స్టాక్ పరిశీలించి లబ్ధిదారులను బియ్యం పంపిణీ పై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పలువురు లబ్ధిదారుల ఇంట్లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ కలిసి సహపంతి భోజనం చేశారు. అలాగే నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల అన్ లైన్ ప్రక్రియను  పరిశీలించారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎండాకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది అమలు చేస్తున్న వివిధ రకాల సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో మందులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఇండెంట్ ఇచ్చి మందులు స్టాక్ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, తాసిల్దార్లు భగవాన్ రెడ్డి, రాజు, ఎంపీడీవో రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.