ఆర్ఓబీల్లో రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రైల్వే ట్రాక్ దాటడానికి కాజీపేట, డోర్నకల్ రైల్వే సెక్షన్లో పలు చోట్ల నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జీలు కొద్ది పాటి వర్షానికే నీళ్ళు నిండి రాక పోకలకు ఆటంకంగా మారుతున్నాయి. వరంగల్, నెక్కొండ, ఇంటికన్నె, రంగాపురం, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు నీళ్లు నిలిచి వాహనాలతో పాటు ప్రజలు నడవడానికి ఇబ్బందిగా మారుతున్నాయి.
15-06-2026