6 May, 2026 | 9:58 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్

15-04-2025 01:20 AM
  1. ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహణ
  2. హాజరవనున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ 

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్-2025 నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరిద్దరు మాట్లాడా రు. భారత్ సమ్మిట్‌లో వివిధ దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్ర భుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలపై అధ్యయ నం చేసేందుకు ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ అడవులపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై మం త్రులు స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా అ డవులను నరకలేదని, జంతువులను చంపలేదని తేల్చి చెప్పారు. అడవులను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.