13 July, 2026 | 5:23 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

బ్లూస్మార్ట్ క్యాబ్ డ్రైవర్ దోపిడీ

04-12-2024 12:13 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూపీకి చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గత నెల 29న   గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ స్థానిక మాల్ నుంచి సెక్టార్ 86లోని గ్రీన్‌బర్గ్ మైక్రోటెక్‌కు వెళ్లేందుకు  బ్లూ స్మార్ట్‌లో క్యాబ్ బుక్ చేసుకుంది. మార్గ మధ్యలో క్యాబ్ డ్రైవర్ ఆమె ను గన్‌తో బెదిరించి రూ.55వేలను తన అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న వస్తువులను తీసుకుని పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అధి కారులు డిసెంబర్ 1న క్యాబ్ డ్రైవర్‌ను ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. నిందితుడిని కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఘటనపై బ్లూస్టార్ సంస్థ స్పందించింది. బాధితురాలికి క్షమాపణ తెలుపుతూ ప్రయాణికుల క్షేమం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.