15 June, 2026 | 7:34 PM

Breaking News

పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •  

దీపారాధన మంట అంటుకుని అగ్ని ప్రమాదం

22-03-2025 07:43 PM

రూ.2లక్షల మేర ఆస్తినష్టం

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేటలో శనివారం ఉదయం ఇంట్లో దీపారాధన అంటుకుని అగ్ని ప్రమాదం జరగ్గా సుమారు రూ.2లక్షల మేర నష్టం జరిగింది. బాది తుడు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పాత ఆంధ్రాబ్యాంక్ మార్గంలో కట్టా జోగారావు వీధిలో అరవ శ్రీను అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేసు కుంటూ జీవిస్తున్నాడు. ఇంట్లో ఉదయం దీపారాదన చేసిన శ్రీను కుటుంబ సభ్యులు కొంతసేపటి తరువాత సమీపంలోని బందువుల వద్దకు వెళ్లారు. దీపారాదన మంట ట్రేలకు అంటుకుని పక్కనే ఉన్న విద్యుత్ ప్లగ్ కు పాకింది. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం: వలన రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాదితుడు శ్రీను తెలిపారు.