17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కాటారంలో 7,8 న ఉచిత కంటి చికిత్స శిబిరం

04-04-2025 06:25 PM

కాటారం,(విజయక్రాంతి): స్వర్గీయ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు  26వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 07,  08 న రెండు రోజుల పాటు పుష్పగిరి కంటి ఆసుపత్రి  వారిచే కాటారం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. ఉచిత కంటి అద్దాల పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు  ప్రారంభిస్థారని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని  కాటారం, మహ ముత్తారం, మహదేవ్ పూర్, పలిమెల, మలహర్ రావు  మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.