7 August, 2026 | 9:49 PM

Breaking News

అడవిముత్తారం పోలీసుల చాకచక్యంతో దొంగల ముఠా అరెస్ట్   •   తెలంగాణ ఉద్యమకారుల సమితి కోదాడ అధ్యక్షులుగా బొలిశెట్టి కృష్ణయ్య   •   ఆలయ పునర్నిర్మాణంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు   •   యూఎస్పీసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు   •   సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేసి చెరువులు నింపాలి   •   గరిడెపల్లి న్యూ జనరేషన్ స్కూల్‌లో కనుల పండుగలా బోనాల వేడుకలు   •   బీరంగూడలో యువకుడిపై కత్తులతో దాడి   •   సీనియర్ సిటిజన్స్‌కు ఎన్ని భవనాలు?   •   ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన   •  

గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

07-08-2026 09:02 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపూర్ గ్రామ శివారులో గోదావరి నది ఒడ్డున నాలుగు రోజుల క్రితం లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహానికి పోలీసులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి వయస్సు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ నోట్లు, సోషల్ మీడియా, ఇతర సమాచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పటివరకు మృతురాలి బంధువులు లేదా సంబంధిత వ్యక్తులు ఎవరూ రాలేదు.ఈ నేపథ్యంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మెట్ పల్లి మున్సిపాలిటీ సిబ్బంది,పోలీసుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.మృతురాలికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే లేదా ఆమెను గుర్తించే అవకాశం ఉన్నట్లయితే వెంటనే మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.