2 March, 2026 | 3:22 PM

Breaking News

వ్యక్తి హత్య, ముక్కలు ముక్కలుగా చేసి యమునా నదిలో..   •   అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం   •   హైడ్రా పేరు.. పెద్దలతో ప్రభుత్వ ఒప్పందం   •   భారత్–కెనడా సంయుక్త ప్రకటన: పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఆందోళన, కీలక ఒప్పందాలు   •   తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు   •   మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత   •   చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకాష్   •   అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి   •   సమస్య లేని కాలనీలుగా మార్చడమే లక్ష్యం   •   ఫార్మా కంపెనీల అనుమతుల రద్దు కోరుతూ ప్రజావాణిలో వినతి   •  

సమస్య లేని కాలనీలుగా మార్చడమే లక్ష్యం

02-03-2026 01:43 PM

షాద్‌నగర్  ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,

షాద్‌నగర్,(విజయక్రాంతి): ప్రతి వార్డును మరింత సుందరంగా మార్చేందుకు కృషి చేస్తానని, సమస్యలేని కాలనీలుగా మార్చడమే ముందున్న లక్ష్యం అని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం కాలనీ వాసులందరూ  సహకరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapally Shankar) అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డు సాయి బాలాజీ టౌన్ షిప్ లో కాలని వాసులు ఏర్పాటు చేసిన  సమావేశానికి షాద్ నగర్  ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ , మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వవేశర్,వైస్ ఛైర్మన్ అంధే మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలని రోడ్డు, డైనేజి,తాగునీరు, వంటి అంశాలపై కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మున్సిపల్ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొస్తానని ఆయన తెలిపారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ల  ప్రవీణ్ కుమార్ , అప్పి, పెంటయ్యలను శాలువా లతో కాలనీ వాసులు సన్మానించారు.