20-06-2025 01:20:19 PM
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో(Purulia District) శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు వివాహ వేడుక నుండి తిరిగి వస్తుండగా బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారి 18పై ఈ ప్రమాదం జరిగింది. నామ్షోల్ వద్ద బొలెరో వాహనం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. బాధితులు పురులియాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్(Bara Bazaar Police Station) ప్రాంతంలోని అడబానా గ్రామం నుండి జార్ఖండ్లోని నిమ్దిహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తిలైతాండ్కు బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్నారు.
"పురులియా జిల్లాలోని బలరాంపూర్లోని జాతీయ రహదారిపై కారు, ట్రైలర్ ట్రక్కు మధ్య జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు" అని అదనపు ఎస్పీ పురులియా (ఆపరేషన్స్), జోధావర్ అవినాష్ భీమ్రావ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునేలోపే ప్రయాణికులందరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.