23-02-2026 03:35:07 PM
బంగారం ధర పెరుగుతోంది
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు మీటింగ్(RBI Central Board meeting)లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పాల్గొన్నారు. పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నాయని తెలిపారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల వల్లే బంగారం ధర పెరుగుతోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల(Gold imports) గురించి ఆందోళన అవసరం లేదని వివరించారు. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని,ఆర్బిఐ దీనిని పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .