నితీశ్ సంచలన నిర్ణయం?
- బీహార్ సీఎం పదవికి రాజీనామా!
- రాజ్యసభకు వెళ్లే అవకాశం
పాట్నా, మార్చి 4: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనా మా చేసి రాజ్యసభ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు బుధవారం పాట్నా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గురువారంతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనున్న తరుణంలో, నితీశ్కుమార్ తన స్థానాన్ని బీజేపీ నేతకు ఇచ్చి, తన కుమారుడు నిషాంత్ కుమార్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
హోలీ పండుగ రోజే జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కేంద్ర మంత్రి లాలన్ సింగ్ వంటి కీలక నేతలు నితీశ్ నివాసంలో సమావేశం కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పటికే నిషాం త్ కుమార్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని పార్టీ సీనియర్ నేతలు ప్రకటించగా, పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయనకు మద్దతుగా పోస్టర్లు కూడా వెలిశాయి.




