calender_icon.png 1 June, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకు పథకాలు.. అధికారులదే బాధ్యత

31-05-2025 01:04:08 AM

- సకల జనుల సంతోషమే ప్రజాపాలన లక్ష్యం 

- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయండి 

- నకిలీవిత్తనాలపై కఠినంగా వ్యవహరించండి 

- మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావు 

మహబూబ్ నగర్ మే 30 (విజయ క్రాంతి) : అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు దరి చేర్చవలసిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

శుక్రవారం జి ల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మ హబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవా రం నారాయణపేట, మహబూబ్ నగర్ జి ల్లాలలో వ్యవసాయ కార్యచరణ, వడ్ల కొనుగోలు, అంటువ్యాధులు, భూభారత్ రెవె న్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,సంబంధి త శాఖల అధికారులతో  మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఆయా జిల్లాల శా సనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరు ద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహ రి, డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ పై నాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబే దుల్లా కొత్వాల్, కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు హాజరయ్యా రు.

ఈ సందర్భంగా మంత్రి  దామోదర రా జనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమ లు చేస్తున పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత అ న్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ  భారతి చట్టం ప్రకారం పైలెట్ మండ లం లలో వచ్చిన దరఖాస్తులు భూ భారతి పోర్టల్ ద్వారా పరిష్కారం చేయాలన్నారు.

మహబూబ్ నగర్,నారాయణ పేట జిల్లాల్లో వానాకాలం సీజన్ కు పంటల సాగు ప్రణాళిక,విత్తనాలు ,ఎరువుల లభ్యత పై ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్ లు,పౌర సరఫరా శాఖ అధికారులు జిల్లాలో విత్తనాలు, ఎరువులు లభ్యత, పంట నష్టం జరిగిన వివరాలు,నష్ట పరిహారం వచ్చిన వివరాలను మంత్రులకు వివరించారు.

అప్పట్లో ఇండ్ల స్థలాలు మనమే ఇచ్చామని, ఇప్పుడు కూడా మనమే ఇస్తున్నామని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. అయితే మంజూరైన ఇండ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ యన సూచించారు.  ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టాల ని, ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకుంటే యజమాని బాధ్యతే అన్నారు.

బేస్ మెంట్ , లెంటల్ లెవెల్ లలో ఎన్ని ఇండ్లు ఉన్నాయ ని అడిగి తెలుసుకున్నారు. అయితే జిల్లా శా సన సభ్యుల కోరినట్లు గ్రామ సభల్లో ప్రకటించిన అర్హుల జాబితా ప్రకారం ఇండ్లు మంజూరు చేసే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. జిల్లాలో దేవాదాయ, వక్ఫ్, శిఖం, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయన్నే వివరాలను కలెక్టర్లు అందుబాటులో  ఉంచాలని మంత్రి తెలిపారు.

అలాగే రాజీవ్ యువ వి కాసం గురించి రెండు రోజుల్లో జరిగే క్యాబినెట్ మీటింగ్ లో చర్చించడం జరుగుతుంద న్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,గతేడాది వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త ల పై ముందస్తు కార్యాచరణ ను సిద్ధం చేయాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

గతేడాది మహబూబ్ నగర్ జిల్లాలో డెంగ్యూ కేసులు అధి కంగా నమోదు అయ్యాయని,  ఈ సారి అ లా జరగకుండా ముందస్తుగానే వార్డుల వా రీగా దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి మంత్రికి తెలిపారు. నారాయణపేట జిల్లాలోనూ ము న్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ లలో ఫా గింగ్ యంత్రాలు లేవని నారాయణపేట జి ల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సీజన్ ఈ సారి ముందే ప్రా రంభం అయిందని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల అధికారులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను మంత్రి వివరించారు. జూన్ మొదటి, లేదా రెండో వారంలో వైద్య ఆరోగ్యశాఖపై నారాయణపేట, మహబూబ్ నగర్ లలో ప్రత్యేక  సమీక్ష చేస్తానని తెలిపారు. కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించే రిపోర్ట్ లను ఆయా జిల్లాల శాసన సభ్యులకు కూడా పంపించాలని మంత్రి సూచించారు.

నారాయణపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా  ఆస్పత్రికి వ చ్చే రోగులను మహబూబ్ నగర్ నుంచి అం బులెన్స్ డ్రైవర్లు హైదరాబాద్ లోని వెల్ నెస్ సెంటర్ కు  తీసుకువెళ్తున్నారని మంత్రి దా మోదర రాజనర్సింహ కు నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యే లు ఫిర్యాదు చేశారు. స్పం దించిన మంత్రి అంబులెన్స్ డ్రైవర్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.

కలెక్టర్లు, జిల్లా అధికారులు పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులను రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని సూచించారు. వాటితో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను ప్రతీ నెల తనిఖీ చేసి రిపోర్టు తయారు చేయాలన్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి గతం లో ఇచ్చిన మాట ప్రకారం ఎం. ఆర్. ఐ , త్వరలో ఏర్పాటు చేయిస్తామని మంత్రి భరో సా ఇచ్చారు. అలాగే సి.టి.స్కాన్ కూడా ఏర్పాటు చేస్తామని, అలాగే జాతీయ రహదారి పై ప్రతి 35 కిలో మీటర్ల కు ఒకటి చొ ప్పున ట్రామా సెంటర్,మహబూబ్ నగర్ లో రీజియనల్ క్యాన్సర్ సెంటర్ ను, ఆర్గాన్ రిట్రివల్ సెంటర్ ను  ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

స మావేశంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల ను టా స్క్ పోర్స్ టీమ్ లు తనిఖీ లు నిర్వహించి కే సులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మన ప్రభుత్వం వచ్చాకే వరి కి బోనస్ ఇస్తున్నామని, ఇస్తున్న విషయాన్ని మరింత ప్రజలకు అవగతం చేస్తూ భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని తెలిపారు. 

అందరి సంక్షేమమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

నారాయణపేట, మహబూబ్ నగర్ జి ల్లాల్లో ఎంత మంది రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సి.ఎం.అర్ బకాయి లు ఉన్నారని జూ పల్లి అధికారులను ప్రశ్నించారు. మహబూ బ్‌నగర్‌లో 2023-24కు సంబంధించి ఒక మిల్లర్ 3.7 కోట్ల బకాయిలు ఉన్నారని, నా రాయణపేట లో 10 రైస్ మిల్లర్ల నుంచి 2019-20 నుంచి ఇప్పటిదాకా 53 కోట్ల బకాయి ఉన్నారని అధికారులు తెలపగా, వారి నుంచి కలెక్ట ర్ లు రికవరీ చేయాలని మంత్రి జూపల్లి అ ధికారులను ఆదేశించా రు.

వరి ధాన్యం కొ నుగోలు లో తరుగు లే కుండా చూడాలన్నారు.  ఈ విషయంపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మా ట్లాడుతూ.  నియోజకవర్గాల వారీగా ఈ యాసంగిలో ఎంత మంది రైతులతో ఎంత ధాన్యం కొనుగోలు చేశాం, ఎంత మంది రైతులకు బోనస్ వచ్చిందనే వివరాలను, పంట నష్టం ఎంత జరిగింది,నష్ట పరిహారం వచ్చిన వివరాలను, వరి సేకరణ నియోజకవర్గం వారీగా  వివరాలు ఎమ్మెల్యే లకు  పంపించేలా చూడాలని మంత్రులను కో రారు.

అలాగేజిల్లాల లో నకిలీ విత్తనాలపై ఎన్ని కేసులు నమోదు చేశారు.ఎన్ని కేసు లు నమోదు చేశారని అడిగి తెలుసుకున్నారు. పైలెట్ మండలంలో ఎన్నిదరఖాస్తు లు వచ్చాయి ?ఎటువంటి భూ సమస్యలు ఉన్నాయి.? భూ భారతి చ ట్టం ప్రకారం తహశీల్దార్,అర్.డి. ఓ,అదనపు కలెక్టర్ తమ దగ్గరకు వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం చేయాలన్నా రు.

ప్రభుత్వ భూములు,అన్యాక్రాంతం భూములు వివరాలు సమాచారం అందించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ ,వాట్సాప్ నెంబర్  ప్రజలకు తెలుపాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు కలెక్టర్లకు సూచించారు. అనంతరం  ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రభుత్వ భూముల పంపిణీ కి ఒ క అసైన్డ్ కమిటీ ఉండేదని, మళ్ళీ ఆ కమిటీని ఏర్పా టు చేయాలని మంత్రులను కో రారు.

కోయిల కొండలో ఉన్న సీ హెచ్ సి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే డా క్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బేస్ మెంట్ వేసుకున్న నిరుపే దలకు ఇందిరమ్మ ఇండ్ల పథ కాన్ని వర్తింప చేయాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కోరారు.

గండిడ్ మండలంలో  బీపీ, షుగర్ మాత్రలను పం పిణీ చేయడం లేదని పరిగి ఎమ్మెల్యే రా మ్మోహన్ రెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు లు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.