21 March, 2026 | 1:36 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

మెరిసిన దివ్య

17-09-2024 12:27 AM

బుడాపెస్ట్: 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు దూసుకెళ్తున్నారు. సోమవారం భారత మహిళల జట్టు ఆరో రౌండ్‌లో ఆర్మేనియాతో తలపడింది. తెల్ల పావులతో బరిలోకి దిగిన భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ 1 ఎలీనాపై 40వ ఎత్తులో విజయం సాధించింది. మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. లిలిత్‌తో గేమ్‌ను 44వ ఎత్తు వద్ద డ్రాగా ముగించుకుంది. ఇక పురుషుల జట్టు హంగేరీతో ఆడింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. సనన్‌తో గేమ్‌ను 40వ ఎత్తు వద్ద డ్రా చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన భారత్ 10 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది.