15-06-2025 01:23:56 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో కలిపి పి సాయి దివ్యన్ (రోల్ . నెo. 250410515682) 14వ ర్యాంకు, బి. ప్రియాంక (రోల్ . నెo. 250411126499) 100వ ర్యాంకు, ఎం. వినయ్ (రోల్ . నెo. 250410494057) 226వ ర్యాంకు, బి. గణేష్ (రోల్. నo. 250410067137) 671 వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్ఠలు జాతీయ స్థాయిలో నిలబెట్టినారు.
రాష్ట్రంలోని ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన 210 మందికి పైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి భవిష్యత్తులో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు.