29 April, 2026 | 10:10 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

సుల్తానాబాద్ పురపాలక సమావేశంలో 29 అంశాలపై తీర్మానం

29-04-2026 08:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక సంఘ సాధారణ సమావేశం కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించనైనది, ఈ సమావేశంలో 29 అంశాలపై చర్చించి ఏకగ్రీవముగా ఆమోదించి తీర్మానించినారు. ఇందులో భాగంగా  పట్టణములో వివిధ వార్డులలో సిసి డ్రైన్, సిసి రోడ్డుల నిర్మాణం చేయుట కొరకు, 1 వ వార్డులో గల మహిళా సంఘ భవననిర్మాణం పూర్తిచేయుటకు, పలు వార్డులలో బోర్వెల్  వేయుటకు, పట్టణములో వీధి దీపాలకు సంబంధించిన సమస్యలపై ఇట్టి సమావేశములో పాల్గొన్న విద్యుత్ శాఖ అధికారులకు పరిష్కరించుటకు గాను తెలుపనైనది,  ఇందిరమ్మ గృహ నిర్మాణముల విషయములో, బిల్లుల చెల్లింపు విషయములో సంబందిత ఎ ఇ కి తగు సూచనలు ఇచ్చుచు త్వరితగతిన బిల్లులు చెల్లింపు చేయుటకు అవసరమైన చర్యలు గైకొనుటకు ఆదేశించనైనది.