13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
11-03-2026 01:05 PM
న్యూఢిల్లీ: కారుణ్య మరణం కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న వ్యక్తి కారుణ మరణానికి కోర్టు అనుమతి ఇచ్చింది. 2013లో భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి హరీష్ రాణా(Harish Rana Case) తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ 13 ఏళ్లకుపైగా హరీశ్ కోమాలో ఉన్నాడు. హరీశ్(Harish) కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు కోర్టును అభ్యర్థించారు. వైద్యుల నివేదిక పరిశీలించి చికిత్స నిలిపివేయవచ్చని జస్టిస్ జేబీ పార్దివాలా, కేవీ విశ్వనాథన్ ఢిల్లీ ఎయిమ్స్ను ఆదేశించారు.




