ఛత్తీస్గఢ్లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు
న్యూఢిల్లీ: నక్సలిజంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో అద్భుతమైన విజయం సాధించడంలో భాగంగా ఛత్తీస్గఢ్లో(Chhattisgarh) బుధవారం 108 మంది మావోయిస్టులు(Maoists surrender) లొంగిపోయారని, వారి తలలపై రూ.3.95 కోట్ల రివార్డు ప్రకటించారని అధికారులు తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన బీజాపూర్ నుండి 37 మంది, దంతేవాడలో 30 మంది, సుక్మాలో 18 మంది, బస్తర్లో 16 మంది, నారాయణపూర్లో నలుగురు, కాంకేర్లో ముగ్గురు మావోయిస్టులు బలగాల ముందు ఆయుధాలు వదులుకున్నారని వారు తెలిపారు.
లొంగిపోయిన గెరిల్లాలలో ఆరుగురు డివిజనల్ కమాండర్లు, వీరికి ఒక్కొక్కరికి ఎనిమిది లక్షల రివార్డు ఉంటుందని అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు సమాచారం ఆధారంగా భద్రతా దళాలు భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా తొలగించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.




