23-06-2025 08:59:27 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ(Telangana Cabinet Meeting) సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అభ్యంతరాలను కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్ కు వివరించారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నారు. సంక్షేమ పథకాలను నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజీవ్ యువవికాసం, కాళేశ్వరం ప్రాజెక్టు, విజిలెన్స్ నివేదిక తదితర అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణ కేబినెట్ భేటీలో ముఖ్య అంశాలు:
▪️ కొత్త మంత్రులతో తొలి కేబినెట్ సమావేశం
▪️ పాలనా పరమైన కీలక నిర్ణయాలపై చర్చ
▪️ రైతు భరోసా నిధుల విడుదలపై సమీక్ష
▪️ వానాకాలం పంటలు, రైతాంగ సమస్యలు
▪️ తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ పై చర్చ
▪️ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ – తదుపరి కార్యాచరణ
▪️ బనకచర్ల ప్రాజెక్టు పై చర్చకు అవకాశం