23-06-2025 08:42:20 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్ల అన్ని నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణతేజ అతిథి గృహం(Krishnateja Guest House) వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 87,254 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలతో ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) పేర్కొన్నారు.