ఎల్బీ నగర్ లో మెట్రో నుంచి వాసవి గ్రూప్ స్కైవాక్ ఏర్పాటు

20-09-2026 | 05:53pm

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన వాసవి గ్రూప్(Vasavi Group), ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌ను తమ ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ టౌన్‌షిప్ అయిన 'వాసవి ఆనంద నిలయం’కు నేరుగా అనుసంధానించే హైదరాబాద్‌లోనే మొట్టమొదటి ఎలివేటెడ్ స్కైవాక్‌ను ప్రకటించింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కీలకమైన చట్టబద్ధ అనుమతులను పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, టౌన్ షిప్ లోని 3600 మంది నివాసితులకు మెట్రోను నేరుగా చేరుకునే సదుపాయం కలుగుతుంది.

ఈ ఎలివేటెడ్ స్కైవాక్ ప్రాజెక్టును గ్రూప్ అభివృద్ధి సంస్థలైన వాసవి ఎవెన్యూస్ ఎల్‌ఎల్‌పి మరియు ఎస్ఆర్ ఇన్‌ఫ్రా & డెవలపర్స్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.హైదరాబాద్‌లోనే మొట్టమొదటిదైన ఈ ఎలివేటెడ్ డైరెక్ట్-టు-హోమ్ స్కైవాక్, వాసవి ఆనంద నిలయం  నివాసితులకే కాకుండా ఎల్బీ నగర్ సాధారణ ప్రయాణికులకు కూడా సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. పాదచారులకు పెద్దగా సదుపాయాలు లేని, జాతీయ రహదారి-65 పై వేగంగా వెళ్లే ట్రాఫిక్ నుండి పాదచారులను తప్పించి, నేరుగా మెట్రో కాంకోర్స్‌కు ఈ స్కైవాక్ అనుసంధానిస్తుంది.

మెట్రో అత్యంత పొడవైన కారిడార్‌లో చివరి స్టేషన్ కావడంతో, ఈ స్టేషన్ ద్వారా నగరంలోని పశ్చిమ టెక్నాలజీ కారిడార్‌ను ఒకే ఇంటర్‌చేంజ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ప్రాంత వృద్ధి ఎప్పటినుంచో దానికి తూర్పున ఉన్న పారిశ్రామిక మరియు ఐటీ పార్కులతో ముడిపడి ఉంది. ప్రస్తుతం జాతీయ రహదారి-65 గుండా 10-12 నిమిషాల పాటు నడుస్తూ, రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఈ స్కైవాక్ పూర్తయితే, మెట్రో కాంకోర్స్ నుండి నేరుగా, సురక్షితంగా వాసవి ఆనంద నిలయం టౌన్‌షిప్‌లోకి కేవలం 2-3 నిమిషాల్లో నడిచి వెళ్లవచ్చు.

ఈ ప్రాజెక్టుకు ఎల్&టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్(L&T Metro Rail Hyderabad Limited) నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తో పాటు, మల్కాజిగిరి డీసీపీ ట్రాఫిక్-II నుండి ట్రాఫిక్ పోలీసు ఎన్ఓసి కూడా ఇటీవల లభించింది. ఏసీపీ ఎల్బీ నగర్ ట్రాఫిక్ డివిజన్ మరియు ఎస్హెచ్ఓ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అనుమతులతో సహా ఆన్-గ్రౌండ్ వర్క్-జోన్ ట్రాఫిక్ మళ్లింపు అనుమతులను, బారికేడింగ్ మరియు సైట్ పనులు ప్రారంభించడానికి ముందే ఖరారు చేయనున్నారు.

వాసవి గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ యెర్రం మాట్లాడుతూ, "ఒక దశాబ్దం తర్వాత విభిన్నంగా కనిపించబోయే హైదరాబాద్ కోసం మేము దీనిని నిర్మిస్తున్నాము. నివాసితులు తమ లాబీ నుండి బయటకు వచ్చి, పైన కవర్ చేయబడిన మార్గంలో నడిచి, హైవేపై కాలు పెట్టకుండానే నేరుగా రైలు ఎక్కగలిగేలా దీన్ని రూపొందించాము. ప్రజా రవాణా వ్యవస్థ విజయం అనేది చివరి మైలు అనుసంధానం పైనే ఆధారపడి ఉంటుంది. ఫ్యాక్టరీకి వెళ్లే కార్మికుడు, పాఠశాలకు వెళ్లే విద్యార్థి, లేదా ఆసుపత్రికి వెళ్లే కుటుంబం.. ఇలా ఎవరికైనా ఆ చివరి అనుసంధానాన్ని పూర్తి చేయడంలో ప్రైవేట్ డెవలపర్లు ఎంతో చేయగలరు. ఈ స్కైవాక్ ఆ ఆలోచనకు మా తొలి ప్రతిరూపమని అన్నారు.

మరిన్ని వార్తలు