కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలే..
బీఆర్ఎస్ పార్టీ నాయకులు
శంకర్పల్లి, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పాలనలో(Congress rule) ప్రజలకు అన్ని క ష్టాలే ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ నాయకులు(BRS party leaders) అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ వెయ్యి రో జుల విఫల పాలనపై బి ఆర్ ఎస్ పోరాట బాటలో భాగంగా మూడో రోజు శంకర్పల్లి చౌరస్తా వద్ద నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం(protest program) చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల(Congress party guarantee) పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అ న్నారు.
హామీలను ఇచ్చి అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ పార్టీ పంటలకు(crops) బోనస్(bonus) లేదు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. రెం డు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అ మలు చేయలేదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు పం పిణీ చేయకుండా ఇష్టానుసారంగా వివరిస్తు ందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గండి చెర్ల గోవర్ధన్ రెడ్డి, ము న్సిపల్ అధ్యక్షుడు బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్ధన్ రెడ్డి, మాల చిన్న నరసింహులు, మాజీ సర్పంచులు బిసోల శ్రీధర్, నరసింహారెడ్డి, నాయకులు వాసుదేవ్ కన్నా, మన్నె లింగం, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభు గౌడ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






