4 April, 2026 | 2:19 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతి

04-07-2024 01:01 AM

భద్రాచలం, జూలై 3: తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన వెంకట్ మణికంట, స్వరూప దంపతుల కుమార్తె రియాన్షిక(7) యూకేజీ చదువుతన్నది. ఈ నెల 1న రియాన్షిక మంచంపై కూర్చొని రాసుకుంటూ నిద్రలోకి జారుకొని ప్రమాదవశాత్తు కిందపడడంతో పెన్ను ఆమె తలలోకి దిగింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఖమ్మంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి తలలోని పెన్నును తొలగించారు. 48గంటల పాటు పరిశీలనలో ఉండాలని ఆమెను అక్కడే ఉంచి పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున రియాన్షిక మృతి చెందింది.